breaking news
postmortem test
-
60 ముక్కలుగా శరీరం, పరిశీలించేందుకు రెండు రోజులు
పురుషులు మాత్రమే పనిచేయగలరనే ఫోరెన్సిక్ విభాగంలో మహిళగా ఆమె రికార్డు సాధించింది. ఎంచుకున్న పనిని ఏళ్లుగా సమర్థంగా నిర్వర్తించడంతో పాటు అందమైన ప్రకృతిని తన కెమరా కన్నుతో పట్టేస్తోంది డాక్టర్ గీతారాణి గుప్తా. మధ్యప్రదేశ్ ఫోరెన్సింగ్ విభాగంలో పనిచేస్తున్న ఏకైక మహిళగానే కాదు, 32 ఏళ్ల వైద్య వృత్తిలో 9,500 మృతదేహాలకు పోస్టుమార్టం చేసిన రికార్డు కూడా డాక్టర్ గీతారాణి గుప్తా సొంతం. 63 ఏళ్ల వయసులోనూ భోపాల్లోని మెడికో లీగల్ ఇనిస్టిట్యూట్లో సీనియర్ ఫోరెన్సిక్ స్పెషలిస్ట్గా విధులను నిర్వహిస్తున్నారు. మగవాళ్లే చేయగలరు అనే విభాగంలో పనిచేయడంతో పాటు, రికార్డు సృష్టించిన గీతారాణి గుప్తా ఇన్నేళ్ల వైద్యవృత్తిలో తన అనుభవాలను ఆమె ఇటీవల పంచుకున్నారు. ఇప్పటికీ మధ్యప్రదేశ్లో ఫోరెన్సిక్ మెడిసిన్లో ఎం.డి చేసిన ఏకైక మహిళగా గీతారాణి పేరే ఉంటుంది. తను పుట్టి పెరిగిన వాతావరణం, ఎంచుకున్న మెడికల్ విభాగం, వృత్తి అనుభవాలతో పాటు, అభిరుచులనూ తెలియజేశారు. కళ్ల ముందు కదలాడే కథలు ‘‘ఎనిమిదేళ్ల క్రితం జరిగిన సంఘటనే అయినా ఇప్పటికీ కళ్ల ముందు కదలాడుతుంది. అది అంత దారుణమైనది. 60 ముక్కలుగా కట్ అయి ఉన్న ఉన్న ఒక శరీరం పోస్ట్ మార్టం కోసం షాజాపూర్ నుండి వచ్చింది. మృతదేహాన్ని ముక్కలుగా చేసి, బోర్వెల్లో వేశారు హంతకులు. పోలీసులు మృతదేహాన్ని, వెలికి తీసి తరలించడానికే మూడు రోజులు పట్టింది. దీన్ని పరీక్షించడానికి నాకు రెండు రోజులు పట్టింది. నాలుగేళ్ల క్రితం, మూడు నాలుగు ముక్కలు చేసిన పుర్రె, అస్థిపంజరం తీసుకొచ్చారు. ఇది పరీక్షించడం ఓ సవాల్ అయ్యింది. పుర్రెను పరీక్షించినప్పుడు, బుల్లెట్ పుర్రెలో చిక్కుకున్నట్లు కనుక్కున్నాను. అతని కుటుంబ సభ్యులే ఈ హత్యకు పాల్పడినట్లు తెలిసింది. ఎన్ని కేసులు... ప్రతీ రోజూ మృతదేహాల మీద పరీక్షలే. ఏకైక మహిళగా తొలి అడుగు మా నాన్నగారు ఉపాధ్యాయుడు. నేను కూడా మెడికల్ కాలేజీలో లెక్చరర్ కావాలనుకున్నాను. అంతే పట్టుదలగా చదివాను. ఫోరెన్సిక్ విభాగంలో లెక్చరర్ షిప్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది. దానికి నా వయస్సు రెండు నెలల 8 రోజులు ఎక్కువ. లెక్చరర్గా వెళ్లకుండా ఈ విభాగంలో చేరిపోయాను. అలా ఫోరెన్సిక్ మెడిసి¯Œ లో ఎమ్డి చేసిన రాష్ట్రంలో తొలి మహిళా వైద్యురాలిని అయ్యాను. పీహెచ్డి చేయాలనుకున్నాను. కానీ, ప్రభుత్వ పనికి అంతరాయం కలిగించడం నాకిష్టం లేదు. అందుకే, ఎంచుకున్న వృత్తిలో అలాగే కొనసాగాను. మాటలు రాని క్షణాలు నా మొదటి రోజు ఉద్యోగంలో నేను గమనించిన విషయం.. నోరు, ముక్కుపై క్లాత్ అడ్డుపెట్టుకొని మృతదేహాన్ని చూడటానికి ఆ కుటుంబసభ్యులు వచ్చినప్పుడు మనిషి చనిపోయాక ఇక విలువ లేదని అర్ధం చేసుకున్నాను. ఆ క్షణంలో మాటలు రాకుండా అలాగే ఉండిపోయాను. మొదటిరోజే 20 మృతదేహాలను చూశాను. ఆ రోజు రాత్రంతా నిద్రపోలేకపోయాను. కాని నా మనస్సుకు తెల్లవార్లు బలంగా ఉండాలంటూ నాకు నేను నచ్చజెప్పుకుంటూ గడిపాను. ఇది నాకు అంతర్గత ధైర్యాన్ని ఇచ్చింది. ఆ తరువాత ఇక నేను నా విధిని నిర్వర్తిస్తున్నాను అనే అనుకున్నాను. అలా ఆ ఏడాది 20 మృతదేహాలకు పోస్టుమార్టం చేశాను. ఎంపీ మెడికల్ లీగల్ ఇన్స్టిట్యూట్లో మెడికల్ ఆఫీసర్గా 1989లో ఎంపి పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎంపిపిఎస్సి) నుంచి ఎంపిక చేశారు. నాటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ నా పని శవపరీక్ష. ఇదే కాకుండా మెడికో లీగల్ కేసుల పరిష్కారానికి కోర్టుకు హాజరు కావడం. ఖాళీ సమయంలో ఫోటోగ్రఫీ.. ఫోరెన్సిక్ విభాగంలో శవపరీక్ష ఛాయాచిత్రాలను తీయిస్తూ ఉండేవాళ్లం. ఆ ఫొటోలను పరిశీలించడానికి ఫోటోగ్రఫీ నేర్చుకున్నాను. ప్రముఖ ఫోటోగ్రాఫర్స్ రాకేశ్ జైమిని, ప్రశాంత్ సక్సేనా ఫోటోగ్రఫీని నేర్పించారు. అలా ఫొటోగ్రఫీ నా అభిరుచిగా మారిపోయింది. నేను ఒంటరిగా ఉంటాను. కానీ, నాకు నచ్చిన అన్ని పనులు చేస్తాను. మరో నచ్చిన పని లాంగ్ డ్రైవింగ్. నా దగ్గర కారు, ల్యాప్టాప్, కెమెరా ఉన్నాయి. జంతువులు, పక్షుల ఫోటోలు తీయడానికి సిటీ నుంచి అడవుల వరకు దూరంగా వెళ్లిపోతాను. ఎంపిక మనది అవ్వాలి.. నేను ప్రతి రంగంలో అమ్మాయిలు రాణిస్తున్నారు. పురుషు ఆధిపత్య సమాజంలో మహిళలు చోటు సంపాదిస్తున్నారు. అమ్మాయిలూ ధైర్యంగా ఉండండి. సవాళ్లను స్వీకరించి ముందుకు సాగండి. మీరు ఏ రంగంలో రాణించాలనుకుంటున్నారో ఈ ఎంపికను మీరే చేసుకోండి. ఏదో ఒక అభిరుచిని మీలో ఎప్పుడూ ఉంచుకోండి. అది మిమ్మల్ని నిరంతరం జీవించేలా చేస్తుంది’’ అని నవతరం అమ్మాయిలకు వివరిస్తారు డాక్టర్ గీతారాణి గుప్తా. -
మరో ఐదు శవాలకు మళ్లీ పరీక్ష
శేషాచలం ‘ఎన్కౌంటర్’పై హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: శేషాచలం అడవుల్లో తమిళనాడు కూలీల ఎన్కౌంటర్పై దాఖలైన వ్యాజ్యానికి సంబంధించి హైకోర్టులో శుక్రవారం కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అంతిమ సంస్కారాలు జరగకుండా ఇంకా మార్చురీలోనే ఉన్న మరో ఐదుగురి కూలీల మృతదేహాలకు కూడా మళ్లీ శవపరీక్ష (రీ పోస్టుమార్టం) నిర్వహించాలని ఉమ్మడి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాల్పుల్లో చనిపోయిన కూలీ శశికుమార్ మృత దేహానికి మళ్లీ శవ పరీక్ష చేయాలని కోర్టు ఇప్పటికే ఆదేశించటం తెలిసిందే. అయితే తమ ఆసుపత్రిలో పోస్టుమార్టం చేసేందుకు ఫోరెన్సిక్ విభాగంలో నిపుణులైన డాక్టర్లు లేరని నిమ్స్ తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించటంతో గురువారం జారీ చేసిన ఉత్తర్వులను న్యాయస్థానం కొద్దిగా సవరించింది. ఈ బాధ్యతలను ఉస్మానియా మెడికల్ కాలేజీ వైద్యులకు అప్పగించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్జ్యోతి సేన్గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్కుమార్లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.పోలీస్ కాల్పుల పై మృతుడు శశికుమార్ భార్య మునియమ్మాళ్ హైకోర్టును ఆశ్రయించటం తెలిసిందే. మునియమ్మాళ్ ఒక్కరే హైకోర్టును ఆశ్రయించినందున శశికుమార్ మృతదేహానికి మాత్రమే మళ్లీ శవపరీక్ష నిర్వహించాలని న్యాయస్థానం గురువారం ఆదేశాలు జారీ చేయటం తెలిసిందే. లంచ్ మోషన్లో... పోలీస్ కాల్పుల్లో మృతి చెందిన కూలీలు మురుగన్, మూర్తి, శివాజీ, పెరుమాళ్, మునుస్వామిల మృతదేహాలకూ మళ్లీ శవపరీక్ష నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ అభ్యర్థిస్తూ వారి భార్యలు హైకోర్టులో శుక్రవారం అత్యవసరంగా లంచ్మోషన్ దాఖలు చేశారు. దీన్ని ధర్మాసనం స్వీకరించింది. ఇలాగైతే అందరూ వస్తారు: అదనపు ఏజీ దీంతో ఆ ఐదుగురి కూలీల మృతదేహాలకు సైతం రీపోస్టుమార్టం నిర్వహించేలా ఆదేశాలు జారీ చేస్తామని ధర్మాసనం శుక్రవారం అదనపు అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్కు తెలిపింది. ఆయన ఇందుకు అభ్యంతరం తెలిపారు. ఒకరి పట్ల ఒకరకంగా మిగిలిన వారి పట్ల మరో రకంగా వ్యవహరించడం సాధ్యం కాదని ధర్మాసనం తేల్చి చెప్పింది. హైదరాబాద్ డాక్టర్ల చేత మాత్రమే రీ పోస్టుమార్టం చేయిస్తామని పేర్కొంటూ ఈ బాధ్యతను ఉస్మానియా వైద్య కళాశాల డాక్టర్ల బృందానికి అప్పగించింది. నిపుణులైన డాక్టర్లతో బృందాన్ని ఏర్పాటు చేయాలని కాలేజీ ప్రిన్సిపాల్ను ఆదేశించింది.