breaking news
port test stadium
-
జోల్, నాయర్ సెంచరీలు
విశాఖపట్నం, న్యూస్లైన్: విజయ్ జోల్ (153 బంతుల్లో 110, 19 ఫోర్లు) జోరు అప్రతిహాతంగా కొనసాగుతోంది. అరంగేట్రం చేసిన తొలి దేశవాళీ మ్యాచ్లోనే అతను సెంచరీతో అదరగొట్టాడు. కెప్టెన్ అభిషేక్ నాయర్ (110 బంతుల్లో 102 నాటౌట్, 14 ఫోర్లు, సిక్స్) కూడా సెంచరీతో కదంతొక్కడంతో భారత్, న్యూజిలాండ్ ‘ఎ’ జట్ల మధ్య జరిగిన అనధికారిక టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇక్కడి పోర్ట్ ట్రస్ట్ స్టేడియంలో శుక్రవారం 6/1 ఓవర్నైట్ స్కోరుతో ఆట ప్రారంభించిన భారత్ ‘ఎ’ 93.5 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 388 పరుగులు చేసింది. ఇటీవలి కాలంలో ఇంటా బయటా విశేషంగా రాణిస్తున్న జోల్ తన ఫస్ట్క్లాస్ కెరీర్కు ఘనమైన ఆరంభమిచ్చాడు. ఇప్పటిదాకా ఆస్ట్రేలియా, శ్రీలంక పర్యటనలు కలుపుకొని అండర్-19, 23 స్థాయిలో పది మ్యాచ్లే ఆడిన జోల్ 4 సెంచరీలు, 3 అర్ధసెంచరీలు సాధించడం విశేషం. మూడో రోజు ఆటలో జోల్... ఓపెనర్ జీవన్జోత్ సింగ్ (48)తో కలిసి మూడో వికెట్కు 77 పరుగులు, మన్ప్రీత్ జునేజా (43)తో నాలుగో వికెట్కు 97 పరుగులు, కెప్టెన్ నాయర్తో కలిసి ఐదో వికెట్కు 60 పరుగులు జోడించాడు. కివీస్ బౌలర్లలో టాడ్ అస్టిల్ 3, ఇశ్ సోధి 2 వికెట్లు తీశారు. సుదీర్ఘ ఇన్నింగ్సే లక్ష్యంగా బరిలోకి దిగానని, తొలి మ్యాచ్లోనే సెంచరీ సాధించడం ఆనందంగా ఉందని విజయ్ జోల్ అన్నాడు. సోమవారం నుంచి రెండో టెస్టు జరుగుతుంది. -
జలజ్కు 6 వికెట్లు
సాక్షి, విశాఖపట్నం: భారత పర్యటనలో న్యూజిలాండ్ ‘ఎ’ జట్టు శుభారంభం చేసింది. ఇక్కటి పోర్ట్ ట్రస్ట్ స్టేడియంలో గురువారం భారత్ ‘ఎ’తో ప్రారంభమైన మొదటి అనధికారిక టెస్టులో ఆ జట్టు తొలి ఇన్నింగ్స్లో 77.3 ఓవర్లలో 310 పరుగులకు ఆలౌటైంది. లూక్ రాంచి (110 బంతుల్లో 125; 16 ఫోర్లు, 4 సిక్స్లు) సెంచరీతో చెలరేగగా... టాడ్ ఆస్టల్ (157 బంతుల్లో 63; 7 ఫోర్లు) అతనికి అండగా నిలిచాడు. భారత్ ‘ఎ’ బౌలర్లలో ఆఫ్స్పిన్నర్ జలజ్ సక్సేనా చక్కటి బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. 106 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టిన అతను తన ఫస్ట్క్లాస్ కెరీర్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేశాడు. అనంతరం భారత్ ‘ఎ’ జట్టు తొలి రోజు ఆట ముగిసే సరికి 3 ఓవర్లలో వికెట్ నష్టానికి 6 పరుగులు చేసింది. ఉన్ముక్త్ చంద్ (4) అవుట్ కాగా, జీవన్జోత్ సింగ్ (1), సరబ్జిత్ సింగ్ లడ్డా (1) క్రీజ్లో ఉన్నారు.