-
సమస్యలు పరిష్కరించకుంటే ప్రాజెక్ట్ల నిలిపివేత
ముత్తుకూరు(సర్వేపల్లి): పేదల సమస్యలు పరిష్కరించని పక్షంలో థర్మల్ విద్యుత్ ప్రాజెక్ట్ల్లో పనులు నిలిపివేస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు హెచ్చరించారు. ముత్తుకూరు మండలంలోని నేలటూరు దళితవాడలో ఆదివారం జరిగిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. ఏపీజెన్కో ప్రాజెక్ట్లో 300 ఉద్యోగాలు భర్తీ చేయకుండా కాంట్రాక్ట్ ఉద్యోగాలు కొనసాగిస్తూ, స్థానికులతో చప్రాసీ పనులు చేయిస్తున్నారన్నారు. థర్మల్ ప్రాజెక్ట్ల కాలుష్యం వల్ల పచ్చదనం మాడిపోయిందన్నారు. పంటలు దెబ్బతిన్నాయన్నారు. బతకడమే కష్టమైపోయిందని తెలిపారు. పబ్లిక్ హియరింగ్లో ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు కనుక ఎన్సీసీ, టీపీసీఐఎల్, జెన్కో ప్రాజెక్ట్ల్లో పనులు నిలిపివేస్తామని హెచ్చరించారు. ఇందుకోసం సెప్టెంబర్లో ప్రాజెక్ట్ల ప్రభావిత గ్రామాల్లో 10 రోజులు పాదయాత్ర చేస్తామన్నారు. అప్పటిలోపు సమస్యలు పరిష్కరించకుంటే జెన్కో ప్రాజెక్ట్ మూసివేసేందుకు తేదీ ప్రకటిస్తామని స్ప ష్టం చేశారు. ప్రాజెక్ట్లపై ఆందోళనలు చేయనీయకుండా కొంతమందిని ప్రలోభాలకు గురిచేయ డం విచారకరమన్నారు. పేదలు ప్రలోభాలకు లొంగవద్దని సూచించారు. నాలుగు రెట్ల పరిహారం ఇవ్వాలి నేలటూరు గ్రామంతో పాటు దళి తవాడను కూడా ఒకేసారి తరలిం చాలని మధు డిమాండ్ చేశారు. గుండ్లపాళెంలోనే పునరావాసం కల్పించాలన్నారు. తరలించే ముందు 2013 పార్లమెంట్ చట్టం ప్రకారం ఇళ్లు, భూములు, చెట్లకు నాలుగు రెట్ల పరిహారం ఇవ్వాలన్నారు. ఈ సభలో సీపీఎం జిల్లా కార్యదర్శి చండ్ర రాజగోపాల్, నాయకులు గోగుల శ్రీనివాసులు, గడ్డం అంకయ్య, పెడకాల శ్రీని వాసులు పాల్గొన్నారు. -
పెద్ద నోట్ల రద్దుతో పేదలకు ఇబ్బందులు
ప్రధానికి లేఖ రాసిన రఘువీరా సాక్షి, హైదరాబాద్: నల్లధనం పేరుతో పెద్ద నోట్లను రద్దు చేయడం వల్ల క్షేత్ర స్థాయిలో పేదలు ఇబ్బందులు పడుతున్నారని, వాస్తవాలను ప్రజలకు అందించాలని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ప్రధాని మోదీకి లేఖ రాశారు. లేఖలోని అంశాలను ఇందిరభవన్లో గురువారం విలేకరులకు వెల్లడించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు కావలసిన వారికి, బీజేపీకి ఎన్నికల్లో ఆర్థికంగా ఉపయోగపడిన నల్ల కుబేరులకు సంబంధించి రూ.1.20 లక్షల కోట్ల బ్యాంకు అప్పులను రద్దు చేసింది నిజం కాదా.. ఆ మొత్తాన్ని రద్దు చేసిన నల్లకుబేరుల పేర్లను బహిరంగంగా ప్రకటించగలరా? అని ప్రశ్నించారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- రాహుల్ విరామం తీసుకోవడమే మేలు: పీకే
- హార్దిక్ తప్పేం లేదు.. అంతా సీనియర్ల వల్లే: ముంబై మాజీ కెప్టెన్
- లవ్ ఫర్ లగ్జరీ కార్ : నాగ చైతన్య కొత్త కారు, ధర తెలిస్తే!
- మాజీ జడ్జి గంగోపాధ్యాయ ప్రచారంపై ‘ఈసీ’ బ్యాన్
- 2030 నాటికి భారత్ 11.5 కోట్ల ఉద్యోగాలను సృష్టించాలి.. లేకుంటే?
- ఎల్లో మీడియాకు చెప్పకుండా బాబు ఎక్కడికి వెళ్లారు? జోగి రమేష్
- జూన్ 1 నుంచి డ్రైవింగ్ లెసెన్స్లు జారీ చేయనున్న ప్రైవేట్ కంపెనీలు
- అంతర్జాతీయ 'టీ' దినోత్సవం! ఈ వెరై'టీ'లు ట్రై చేశారా?
- వైఎస్సార్సీపీ గెలుపును ఖరారు చేసిన ఎల్లో మీడియా!.. ఈ రాతలు అందుకేనా?
- బంగారం కొనుగోలు దారులకు భారీ ఊరట
Advertisement