breaking news
poor peoples welfare
-
‘జగనన్న అమ్మ ఒడి’తో.. పేదల ఇంట విద్యా క్రాంతి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పేద తల్లుల ఇళ్ల ముంగిటకు ‘జగనన్న అమ్మ ఒడి’ పథకం విద్యా సంక్రాంతిని తెచ్చింది. తమ పిల్లల చదువుల కోసం ప్రతీ పేద తల్లికి ఏటా రూ.15వేలు అందిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలుచేస్తున్న ‘అమ్మ ఒడి’ పథకంపట్ల వారు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. ఆర్థిక స్థోమతలేని తాము పిల్లలను చదివించుకోవడానికి ఈ సాయం ఎంతో అండగా నిలుస్తుందంటున్నారు. ఈనెల 9న పథకాన్ని ప్రారంభించిన దగ్గర నుంచి సోమవారం వరకు 41 లక్షల మంది తల్లుల బ్యాంకు ఖాతాల్లోకి ఈ మొత్తాన్ని జమచేయించారు. మిగిలిన వారి ఖాతాల్లో మంగళవారం జమచేశారు. ఈ నేపథ్యంలో.. అమ్మఒడి సాయం అందుకున్న తల్లులు సీఎం వైఎస్ జగన్కు కృతజ్ఞతలు చెబుతున్నారు. తమకు ఈ ఏడాది సంక్రాంతి ముందే వచ్చిందంటూ సంతోషం వ్యక్తంచేస్తున్నారు. ఆ తల్లుల అభిప్రాయాలు వారి మాటల్లోనే.. పిల్లల చదువులపై భరోసా వచ్చింది కూలి పనులు చేసుకుని మిషన్ కుట్టుకుని జీవనం చేస్తున్న మాకు ‘అమ్మ ఒడి’ ద్వారా వచ్చిన డబ్బులతో పిల్లల చదువులకు ఆసరా దొరికినట్లయింది. మా పిల్లలను చదివించుకోగలమన్న భరోసాను ప్రభుత్వం కల్పించింది. జగనన్నకు మేమంతా రుణపడి ఉంటాం. – చుండూరి కోటేశ్వరమ్మ, కొండెపి, ప్రకాశం జిల్లా పిల్లల చదువుకు ఆటంకం లేదు ఆర్థిక స్థోమతలేక పిల్లల చదువులకు నానా అవస్థలు పడుతున్నాం. ఇంతకు మించి మాకు అండ ఇంకేముంటుంది? పిల్లల చదువులకు ఇక ఎలాంటి ఆటంకం ఉండదు. ప్రభుత్వం ఇలా అండగా నిలిస్తే పేద కుటుంబాల్లోని పిల్లలంతా విద్యాపరంగా అభివృద్ధి సాధిస్తారు. – షేక్ హసీనా, త్రిపురాంతకం, ప్రకాశం జిల్లా మా పిల్లల భవిష్యత్తుపై ఇక బెంగలేదు ఇప్పటివరకు ఏ సీఎం కూడా పిల్లల చదువుకు ఈ విధంగా సాయం చేసిందిలేదు. పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఈ పథకం చాలా ఉపయోగకరం. మా పిల్లల భవిష్యత్పై ఇక మాకు ఎలాంటి బెంగలేదు. – జి. లక్ష్మి, త్రిపురాంతకం, ప్రకాశం జిల్లా జగనే ఎప్పటికీ సీఎంగా ఉండాలి సంక్రాంతి పండుగ వారం ముందే వచ్చిందనిపిస్తోంది. అమ్మ ఒడి సాయంతో మా ఇద్దరు పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తా. అందరి జీవితాల్లో వెలుగులు నింపుతున్న వైఎస్ జగన్ జీవితకాలం సీఎంగా ఉండాలి. – వెంకటమహాలక్ష్మి, దేశాయిపేట, ప్రకాశం జిల్లా సొంత మేనమామలా పిల్లలకు సాయం మా కష్టాలను తీర్చడానికి ఆ దేవుడు మాకు ఇచ్చిన అన్న సీఎం జగనన్న. సొంత మేనమామలా పిల్లల చదువుల కోసం రూ.15 వేలు ఆర్థిక సహాయం చేశారు. సీఎం వైఎస్ జగన్కు ప్రజలంతా రుణపడి ఉంటారు. ఈ ప్రభుత్వం కలకాలం ఉండాలి. – మీరా జాస్మిన్, వట్లూరు, ప.గో.జిల్లా పిల్లల చదువులు ఇక సాఫీగా.. మా పిల్లల చదువుల కోసం ఏటా రూ.15వేలు ఇచ్చేలా అమ్మ ఒడి పథకాన్ని పెట్టడం, ఈ ఏడాది సాయాన్నీ వెంటనే అందించడం మాకు ఎంతో ధైర్యాన్నిచ్చింది. మా పిల్లల చదువులు ఇక సాఫీగా సాగుతాయన్న నమ్మకం ఏర్పడింది. సీఎం వైఎస్ పథకాలు పేదలకు ఎంతగానో ఆసరాగా నిలుస్తున్నాయి. – ఎం. అపర్ణ, వట్లూరు, పశ్చిమగోదావరి జిల్లా ముందే మా ఇంట సంక్రాంతి మా పాప చదువు కోసం ఇబ్బందులు పడుతున్నాం. ఈ సమయంలోనే అమ్మఒడి మమ్మల్ని ఆదుకుంది. ఇక మా పాప చదువుకు ఆటంకం ఉండదు. మాకు ఇంత ఆనందాన్ని కలిగించిన సీఎంకు కృతజ్ఞతలు. – గుత్తుల చంద్ర, రావులపాడు, తూర్పుగోదావరి జిల్లా -
పేదల సంక్షేమమే ఏకైక లక్ష్యం
పెద్దశంకరంపేట, న్యూస్లైన్: పేదల సంక్షేమమే వైఎస్సార్ సీపీ ఏకైక లక్ష్యమని, ఇందుకు తమ పార్టీ రూపొందించిన మేనిఫెస్టోనే నిదర్శనమని ఆ పార్టీ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి మహ్మద్ మొహియొద్దీన్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే అభ్యర్థి అప్పారావు షె ట్కార్ పేర్కొన్నారు. గురువారం వారు పెద్దశంకరంపేటలో ఇంటింటా ప్రచా రం నిర్వహించారు. అనంతరం స్థానిక భగత్సింగ్ చౌక్ వద్ద ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉ న్న సమయంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు నేడు అమలు కాలేదన్నారు. రాజన్న మరణం తరువాత ఆ సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేసే నాయకుడే కరువయ్యారని పేర్కొన్నారు. పథకాల అమలు సత్తా ఒక్క జగన్మోహన్రెడ్డికి మాత్రమే ఉందని వారు పేర్కొన్నారు. తమ పార్టీ రూపొందిం చిన మేనిఫెస్టో అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంటోందని వారు తెలిపారు. 108, 104 వైద్య సేవలను మరింత మె రుగు పరచడానికి కొత్తగా 101, 102 సేవలను అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామ ని వైఎస్ జగన్ ప్రకటించారని ప్రజలకు వివరించారు. అలాగే రేషన్ కార్డులోని ఒక్కొక్కరికి 6 కిలోల బియ్యం చొప్పున, ఉచిత విద్యుత్, ఏడాదికి 12 సిలిండర్లు, ప్రతి సిలిండర్పై రూ. 100 సబ్సిడీ, వికలాంగులకు రూ. వెయ్యి, వృద్ధులకు రూ. 700 పింఛను, డ్వాక్రా రుణాల మాఫీ, అమ్మ ఒడి తదితర పథకాలు ప్రవేశపెట్టనున్నట్లు వారు పేర్కొన్నారు. స్థానికంగా ఉండే వారినే గెలిపించాలని వారు ఓటర్లను కోరారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ స్వాతీసత్యనారాయణ పాల్గొన్నారు.