breaking news
Poor country
-
Zambia: నిరుపేద దేశం...సమున్నత లక్ష్యం!
జాంబియా. ఆఫ్రికా ఖండ దక్షిణ భాగంలో ఉండే అత్యంత నిరుపేద దేశం. మూడేళ్ల క్రితం ఓ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. అదే... బాల బాలికలందరికీ ఉచిత విద్య. అందులో భాగంగా ప్రాథమిక, ప్రాథమికోన్నత స్థాయి దాకా విద్యా వ్యయమంతటినీ ప్రభుత్వమే భరిస్తుంది. జాంబియా వంటి దేశానికి ఇది ఒకరకంగా తలకు మించిన భారమే. మిగతా రంగాల మాదిరిగానే జాంబియాలో విద్యా రంగాన్ని కూడా మౌలిక సదుపాయాల తీవ్ర లేమి పట్టి పీడిస్తోంది. మరోవైపు కాసులకు కటకట. అయినా ఉచిత విద్యా పథకం అమలు విషయంలో అక్కడి ప్రభుత్వం వెనక్కు తగ్గడం లేదు. పదో తరగతి స్థాయిని దాటినా సజావుగా చదువను, రాయను రాని దుస్థితి నుంచి తమ కాబోయే పౌరులను బయట పడేసి తీరాలని కృతనిశ్చయంతో ఉంది. ఆ లక్ష్యసాధన కోసం గత మూడేళ్లలో విద్యా రంగంపై ఏకంగా 100 కోట్ల డాలర్లకు పైగా వెచి్చంచింది!సమయం ఇంకా ఉదయం ఏడు గంటలే. పైగా చలికాలపు ఈదురుగాలులు ఈడ్చి కొడుతున్నాయి. అయినా సరే, ఆ విద్యార్థులంతా అప్పటికే స్కూలుకు చేరుకున్నారు. తమ క్లాసురూముల వైపు పరుగులు తీస్తున్నారు. అవును మరి. ఏమాత్రం ఆలస్యమైనా బెంచీలపై కూర్చోవడానికి చోటు దొరకదు. రోజంతా చల్లటి చలిలో కింద కూర్చోవాల్సిందే! జాంబియా రాజధాని లుసాకాకు 60 కి.మీ దూరంలోని చన్యన్యా ప్రభుత్వ ప్రైమరీ, సెకండరీ స్కూల్లో మూడేళ్లుగా రోజూ ఇదే దృశ్యం. ఉచిత విద్యా పథకం మొదలై నాటినుంచీ దేశంలో స్కూళ్లన్నీ విద్యార్థులతో కిటకిటలాడిపోతున్నాయి. గరిష్టంగా 40 మంది ఉండాల్సిన క్లాసురూముల్లో కనీసం 90 నుంచి 100 మందికి పైగా కని్పస్తున్నారు. 30 మంది మాత్రమే పట్టే ఒక క్లాస్రూములోనైతే ఏకంగా 75 మంది బాలలు, 85 మంది బాలికలు కిక్కిరిసిపోయారు! ఈ మూడేళ్లలో దేశవ్యాప్తంగా ఏకంగా 20 లక్షల మందికి పైగా విద్యార్థులు కొత్తగా బడిబాట పట్టారు మరి! మంచి సమస్యే! ఇంతమందికి విద్యార్థులకు తగిన స్థాయిలో దేవుడెరుగు, కనీస స్థాయిలో కూడా మౌలిక వసతులు లేకపోవడం జాంబియా ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. 2019లో ఒక్కో క్లాసులో 40 మంది పిల్లల కంటే ఉండేవారు కాదని, ఇప్పుడు మాత్రం కనీసం 100కు పైగానే ఉంటున్నారని క్లియోపాత్రా జులు అనే టీచర్ వాపోయారు. వీళ్లు చాలరన్నట్టు దాదాపు రోజూ కొత్త విద్యార్థులు జాయినవుతున్నారని చెప్పుకొచ్చారు. ప్రభుత్వమిచ్చే ఒక్కో పుస్తకాల సెట్టు కోసం కనీసం ఆరేడు మంది పిల్లలు కొట్టుకునే పరిస్థితి! అయితే ఇవన్నీ ‘మంచి సమస్య’లేనంటారు దేశ విద్యా మంత్రి డగ్లస్ స్యకలిమా. ‘‘క్లాసురూముల్లో ఇరుక్కుని కూర్చునైనా సరే, ఈ బాలలంతా మూడేళ్లుగా తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకుంటున్నారు. వారంతా మరో దిక్కు లేక నిస్సహాయంగా వీధులపాలైన రోజులతో పోలిస్తే ఇదెంతో మెరుగు కదా’’ అన్నది ఆయన పాయింటు. ‘‘మౌలిక సదుపాయాలు కూడా త్వరలో మెరుగవుతాయి. ఎందుకంటే విద్యా రంగంపై చేసే పెట్టుబడి నిజానికి అత్యుత్తమ పెట్టుబడి’’ అని వివరించారు. ఆయన వాదన నిజమేనని 18 ఏళ్ల మరియానా చిర్వా వంటి ఎందరో విద్యార్థుల అనుభవం చెబుతోంది. ‘‘2016లో నాలుగో తరగతిలో ఉండగా స్కూలు మానేశాను. ఉచిత విద్యా పథకం పుణ్యాన మూడేళ్లుగా మళ్లీ చదువుకోగలుగుతున్నా. మా అమ్మానాన్నా ఏ పనీ చేయకుండా ఇంట్లోనే ఉంటారు. ఉచిత పథకం లేకుంటే స్కూలు ఫీజు కట్టడం అసాధ్యం మాకు’’ అని చెప్పుకొచి్చందామె. 2026 నాటికి కనీసం 55 వేల మంది కొత్త టీచర్ల నియామకం చేపట్టాలన్నది లక్ష్యం కాగా ఇప్పటికే 37 వేల మంది నియామకం జరిగిపోయింది. తమకిచ్చిన ప్రభుత్వ నివాసాల్లో అత్యంత దుర్భరమైన పరిస్థితులున్నాయని టీచర్లు వాపోతున్న నేపథ్యంలో ఆ సమస్యపైనా దృష్టి సారించారు. దీనికి తోడు దేశవ్యాప్తంగా యుద్ధ ప్రాతిపదికన కనీసం మరో 170 స్కూళ్లు నిర్మించనున్నారు. 2020లో రుణ ఊబిలో చిక్కి దివాళా తీసిన దేశానికి ఇది నిజంగా గొప్ప ఘనతేనని ఐరాస బాల సంస్థ యునిసెఫ్ కూడా ప్రశంసిస్తోంది. చదువు అందని ద్రాక్షే ఆఫ్రికాలో జాంబియా వంటి సబ్ సహారా ప్రాంత దేశాల్లో అందరికీ విద్య ఇప్పటికీ అందని ద్రాక్షే. అక్కడి దేశాల్లో సగటున ప్రతి 10 మంది విద్యార్థుల్లో ఏకంగా 9 మందికి నాలుగు ముక్కలు తప్పుల్లేకుండా చదవడం, అర్థం చేసుకోవడం ఇప్పటికీ తలకు మించిన వ్యవహారమేనని ఐరాస బాల సంస్థ యునిసెఫ్ అధ్యయనం చెబుతోంది. అయితే కొంతకాలంగా ఆ దేశాలన్నీ జాంబియా బాటలోనే నాణ్యమైన విద్యపై దృష్టి సారిస్తుండటం హర్షణీయమంది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఉక్రెయిన్లో ఏం జరుగుతోంది?! ఈ సంక్షోభం ఎందుకు?
యూరప్లో అత్యంత పేద దేశం ప్రస్తుతం కొత్త కోల్డ్వార్కు వేదికగా మారింది. ఒకప్పుడు తమతో కలిసున్న ఉక్రెయిన్ను ఎలాగైనా మళ్లీ స్వాధీనం చేసుకోవాలని రష్యా ప్రయత్నిస్తుండగా, ఈ ప్రయత్నాలను అడ్డుకునేందుకు అమెరికా, మిత్రపక్షాలు రెడీగా ఉన్నాయి. సింహాల మధ్య పోరులో జింకలు బలైనట్లు అగ్రరాజ్యాల ఆటలో పేదదేశం నలిగిపోతోంది. అసలేంటి ఈ ఉక్రెయిన్ సంక్షోభం? చూద్దాం.. నూతన సంవత్సరం ఆరంభంతో ఉక్రెయిన్పై అమెరికా, రష్యాల మధ్య వార్నింగుల పర్వం కూడా ఆరంభమైంది. ఆ దేశాన్ని ఆక్రమించాలని పుతిన్ యత్నిస్తే మూల్యం తప్పదని అమెరికా ప్రెసిడెంట్ జోబైడెన్ హెచ్చరించారు. ఈ వార్నింగులను లెక్కచేయకుండా రష్యా దాదాపు లక్షమంది సైనికులను ఉక్రెయిన్ సరిహద్దుకు తరలించింది. ఉక్రెయిన్ విషయంలో తాము తొందరపడకూడదంటే అమెరికా, మిత్రపక్షాలు కొన్ని హామీలివ్వాలని రష్యా డిమాండ్ చేస్తోంది. ముఖ్యంగా నాటోలో ఉక్రెయిన్కు సభ్యత్వం ఇవ్వకుండా ఉండడం, తూర్పు యూరప్లో నాటో బలగాల ఉపసంహరణ లాంటి డిమాండ్లకు అమెరికా అంగీకరించడంలేదు. ఈ నేపథ్యంలో నాటోదేశాలు సోమవారం యుద్ధనౌకలను బరిలోకి దింపడం మరింత ఉద్రిక్తతలకు కారణమైంది. ఏక్షణమైనా యుద్ధం మొదలుకావచ్చన్న భయాలున్నాయి. 2014లో బీజాలు 30 ఏళ్ల క్రితం రష్యా నుంచి విడిపోయిన తర్వాత ఉక్రెయిన్ విజయవంతంగా మనుగడ సాగించడంలో తడబడుతూ వచ్చింది. యూరప్తో ఒప్పందాలను తెంచుకొని రష్యాతో బంధం బలపరుచుకోవాలని 2014లో అప్పటి ఉక్రెయిన్ అధ్యక్షుడు విక్టర్ నిర్ణయించడం దేశంలో విప్లవానికి దారితీసింది. దీంతో విక్టర్ పదవి నుంచి దిగిపోవాల్సివచ్చింది. దీనిపై ఆగ్రహించిన రష్యా ఆ సంవత్సరం ఉక్రెయిన్లోని క్రిమియాను ఆక్రమించింది. ఆ సమయంలో జరిగిన హింసాకాండ దేశంలో రష్యాపై విముఖతను, పాశ్చాత్య దేశాలపై సుముఖతను పెంచింది. ఈ నేపథ్యంలో 2024లో యూరోపియన్ యూనియన్లో సభ్యత్వానికి దరఖాస్తు చేసుకుంటామని తాజాగా ఉక్రెయిన్ ప్రభుత్వం ప్రకటించింది. అలాగే నాటోలో చేరాలన్న కోరికను కూడా వ్యక్తం చేసింది. ఇది రష్యాకు మరింత కోపం తెప్పించింది. ఉక్రెయిన్ నాటోలో చేరితే సరిహద్దుల్లో బలమైన శత్రువుకు అవకాశం కల్పించినట్లవుతుందని పుతిన్ యోచన. ఉత్తుత్తి బెదిరింపులే.. సాంస్కృతికంగా రష్యాతోనే ఉక్రెయిన్కు సంబంధాలు అధికమని పుతిన్ చెబుతుంటారు. అందుకే నాటో, ఈయూలో చేరడం కన్నా తమతో కలిసిపోవడం మేలంటారు. అలాగే పలు సందర్భాల్లో రష్యాపై విధించిన ఆంక్షలు తొలగించేందుకు ఉక్రెయిన్ అంశాన్ని పావుగా వాడుకోవాలన్నది పుతిన్ ఆలోచనగా నిపుణులు భావిస్తున్నారు. ఉక్రెయిన్పై దాడి చేస్తే మరిన్ని ఆంక్షలు రష్యాపై పడతాయి, అందుకే పూర్తి స్థాయి యుద్ధం చేసి ఉక్రెయిన్ను ఆక్రమించే కన్నా ఆక్రమిస్తామన్నంత హడావుడి చేయడం ద్వారా ఆంక్షలను తొలగించుకోవాలని పుతిన్ భావిస్తున్నారు. ఈ మొత్తం అంశంలో అమెరికాకు ఆసక్తి ఎందుకంటే.. సమాధానం చాలా సింపుల్. ప్రపంచంలో ఎక్కడ సమస్య కనిపించినా పెద్దన్న పాత్ర పోషించాలని యూఎస్ భావిస్తుంటుంది. పైగా ఈ సమస్యలో రష్యా కూడా ఉండడంతో అమెరికా మరింత చురుగ్గా పావులు కదుపుతోంది. అవసరమైతే ఉక్రెయిన్కు మిలటరీ సాయం కూడా చేస్తామని ప్రకటిస్తోంది. అటు రష్యా, ఇటు అమెరికా మధ్యలో ఉక్రెయిన్ సమాజం నలిగిపోతోంది. -
పశ్చిమ యూరప్లో పేదదేశం పోర్చుగల్
నైసర్గిక స్వరూపం వైశాల్యం: 92082 చదరపు కిలోమీటర్లు. జనాభా: 1,05,84,037 (తాజా అంచనాల ప్రకారం) రాజధాని: లిస్బన్ ప్రభుత్వం: యునిటరీ సెమీ ప్రెసిడెన్షియల్ కాన్స్టిట్యూషనల్ రిపబ్లిక్ కరెన్సీ: ఎస్కూడో అధికార భాష: పోర్చుగీస్ మతం: 96% క్రైస్తవులు వాతావరణం: జనవరిలో 8-14 డిగ్రీలు, ఆగస్టులో 17-28 డిగ్రీలు. పంటలు: చిరు ధాన్యాలు, ఆలివ్, వరి, ద్రాక్ష, నిమ్మ, కూరగాయలు. పరిశ్రమలు: వ్యవసాయ ఆధార పరిశ్రమలు, దుస్తులు, యంత్ర పరికరాలు, ఫుడ్ ప్రాసెసింగ్, కలప, రసాయనాలు, సారాయి, చే పలు, గనులు, పర్యాటక ం. స్వాతంత్య్రం: 1910 అక్టోబర్ 5న గణతంత్ర దేశంగా ఆవిర్భవించింది. సరిహద్దులు: ఓ వైపు అట్లాంటిక్ మహా సముద్రం, మరోవైపు స్పెయిన్ దేశం. పశ్చిమ యూరోపు ఖండంలో పోర్చుగల్ ఒక బీదదేశం. 15వ శతాబ్దంలో ఈ దేశాన్ని మొట్టమొదటగా ప్రపంచానికి పరిచయం చేసింది ప్రిన్స్హెన్రీ. వాస్కోడిగామా తన సముద్ర ప్రయాణం ఈ దేశం నుండే ప్రారంభించాడు. ఆ తరువాత ఆయన భారతదేశం వచ్చారు. దేశంలోని డ్యూరో లోయలో ద్రాక్ష పంట విస్తారంగా పండుతుంది. ఇక్కడ తయారు చేసిన ద్రాక్ష సారాయి నాలుగు వందల ఏళ్ల క్రితం నాటిదని ప్రసిద్ధి. 1999 వరకు ఈ దేశాన్ని పోర్చుగీసు రాజు కుటుంబం దాదాపు 600 సంవత్సరాలు పరిపాలించింది. క్రీ.శ.1139లోనే ఈ దేశంలో రాజరిక వ్యవ స్థ ప్రారంభమైంది. అయితే 1910 అక్టోబర్ 5న దేశాన్ని ఒక గణతంత్ర దేశంగా ప్రకటించారు. క్రీ.శ.868 లో ఈ దేశం మొదట ఏర్పడిందని చరిత్ర చెబుతోంది. క్రీస్తు పూర్వం 219 లో రోమన్లు పాలించారు. క్రీస్తు శకం 5వ శతాబ్దంలో రోచిల్లా రాజులు ఈ దేశాన్ని ఆక్రమించుకున్నారు. 6వ శతాబ్దంలో రోచిల్లా రాజులు ఈ దేశాన్ని పాలించారు. 10వ శతాబ్దంలో దేశం అంతా బదాజోజ్ తైఫ్రా అనే ముస్లిం రాజుల వశమైంది. అయితే 11వ శతాబ్దం ప్రారంభంలో అల్మోరా విన్లు దేశాన్ని తమ వశం చేసుకున్నారు. కాలక్రమంలో ముస్లింలను ఈ దేశం నుండి పారదోలారు. ప్రజలు - సంస్కృతి - ఆహారం పోర్చుగల్ దేశంలో జనాభాలో అధిక భాగం క్రైస్తవులే అయినా వీరిలో అనేక తెగల వారు ఉన్నారు. దేశంలో దాదాపు 27 తెగల ప్రజలు ఉన్నారు. వీరి భాషలు కూడా విచిత్రంగానే ఉంటాయి. దేశంలోని ప్రజలు వివిధ దేశాలలో కోట్లాది మంది ఉన్నారు. వీరు బ్రెజిల్ దేశంలో అధికంగా ఉన్నారు. వీరి ఆహారం ప్రదేశాన్ని బట్టి మారుతూ ఉంటుంది. దేశం ఉత్తర భాగంలో ఉండేవారు తినే ఆహారాన్ని ‘కాల్డోవైర్డ్’ అంటారు. మొక్కజొన్న పిండితో, గోధుమ పిండితో చేసిన బ్రెడ్డు సాధారణంగా తింటారు. బంగాళ దుంపలతో సూప్ తయారు చేస్తారు. వీళ్లు పంది మాంసం ఎక్కువగా తింటారు. దక్షిణభాగ ప్రజలు వరి అన్నం, రొట్టెలు, పందిమాంసం, బంగాళ దుంపలు ద్రాక్ష సారాయి ఇలా అనేక వంటకాలను తయారు చేస్తాయి. ఇక్కడి ప్రజలు అతిథులకు ఎక్కువ ఆదరిస్తారు. గ్రామీణ ప్రాంతాలలో మహిళలు ఎక్కువగా నల్లని దుస్తులు ధరిస్తారు. మగవాళ్లు కూడా నల్లని షర్టులు ధరిస్తారు. పరిపాలనా రీతులు పరిపాలనా సౌలభ్యం కోసం దేశాన్ని 308 మున్సిపాలిటీలుగా విభజించారు. దేశంలో 18 జిల్లాలు, ఏడు రీజియన్లు ఉన్నాయి. దేశంలో బాగా జనాభా కలిగిన నగరాలు ఏడు ఉన్నాయి. అవి లిస్బన్, పోర్టో విలానోవాడి గాయియా, అమడోరా, బ్రాగా, పుంచల్, కోయింబ్రా, సేటుబల్, అల్మాడాలు వీటిలో లిస్బన్, పోర్టో నగరాలు మెట్రో నగరాలుగా చలామణి అవుతున్నాయి. అన్ని నగరాలలో ఆధునిక వసతులు ఉన్నాయి. రాజధాని లిస్బన్ నగరం అత్యధిక జనాభాతో కిక్కిరిసి ఉంటుంది. దేశంలోని జనాభాలో 52% మహిళలు 48% పురుషులు ఉన్నారు. దేశానికి ప్రధానమంత్రి, రాష్ట్రపతి ఇద్దరూ ఉంటారు. ఇద్దరికీ దేశ పరిపాలన మీద సమాన హక్కులు ఉంటాయి. అయితే రాష్ట్రపతికి కొన్ని ప్రత్యేక అధికారాలు ఉంటాయి. లిస్బన్: దేశ రాజధాని లిస్బన్, యూరోపు ఖండంలో ఏధెన్స్ నగరం తరువాత రెండో పురాతన నగరం. వాస్కోడిగామా, మెగాలన్, ప్రిన్స్హెన్రీ లాంటి గొప్పవ్యక్తులకు మాతృనగరం. ఈ దేశ రాజులు ఈ భూమి మీద ఉన్న అన్ని ఖండాలలో తమ రాజ్యాలను స్థాపించారు. సముద్ర తీరంలో బ్యాక్ వాటర్ను ఆనుకొని నగరం నిర్మితమైంది. ఈ నగరం రెండు భాగాలుగా ఉంటుంది. ఒకటి పాత నగరం, రెండవది కొత్త నగరం. పాత నగరంలో రాజమహలులు, పురాతన కట్టడాలు అనేకం ఉన్నాయి. కొత్త నగరంలో ఆధునిక భవనాలు, పరిపాలనా భవనాలు అనేకం ఉన్నాయి. ఈ నగరంలో చూడవలసినవి ఎన్నో ఉన్నాయి. వాటిల్లో ప్రపంచ వారసత్వ కట్టడం బెలెమ్ టవర్ ఒకటి. ఇది పారిస్లోని ఈఫెల్ టవర్తో సమాన ఆకర్షణ కలిగి ఉంది. బెరోని మోస్ మోనాస్టరీ, సెయింట్ జార్జి కాజల్, కలోస్టె గుల్ బెన్కియన్ మ్యూజియం, పార్క్ డాస్ నకోస్, బెరాడ్గో మ్యూజియం, మడ్రె డిడూస్ కాన్వెంట్, సావో రోచ్ చర్చి, సాంటా కాటరినా చర్చి, కోచెస్ మ్యూజియం, పురాతన ఆర్ట్ మ్యూజియం ఫాషన్ మ్యూజియం... ఇలా ఎన్నో అద్భుతమైన కట్టడాలు నగరంలో ఉన్నాయి. చూడదగిన ప్రదేశాలు పోర్చ్గల్ దేశంలో పోర్టో రెండో పెద్ద నగరం.యూరోపు ఖండంలో అందమైన నగరాలలో ఇది ఒకటి. దీనిని ఓపోర్టో నగరంగా పిలుస్తారు. పోర్ట్వైన్ నుండి పోర్టో అనే పదాన్ని ఈ నగరానికి పేరుగా పెట్టారు. ఈ నగరం మధ్య గుండా వెళ్లే నది. నదికి ఇరు వైపులా అద్భుత పురాతన కట్టడాలు పక్కనే సముద్రం. ఇలా ఈ నగరం ఎంతో సహజ సుందరంగా కనిపిస్తుంది. నగరంలో చూడవలసిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. గొప్ప శిల్పకళా నైపుణ్యం కలిగిన భవనాలు పురాతన కాల మానవ మేధస్సును ప్రజలకు ప్రస్ఫుటం చేస్తాయి. హారీ పోటర్ పుస్తక రచయిత జె.కె. రోలింగ్ యొక్క స్వంత ఊరు ఈ నగరమే. గుస్తావ్ ఈఫిల్స్ డోనా మారియా బ్రిడ్జి, నికొలాల్ నసోనిస్ క్లెరిగోస్ టవర్, రెమ్ కూల్వాస్ కాసాడి మ్యూజియం, సీజా వియెరా సెర్రాల్వెస్ మ్యూజియం నగరంలో గొప్ప ఆకర్షణలు. సావోప్రాన్సిస్కో చ ర్చి, కెయిస్ డా రిబీరా, ప్రిన్స్ హెన్రీ కాథడ్రల్, పక్కనే డ్యూరో వాలీ ఎంతో అందంగా దర్శనమిస్తుంది. నగరంలోని ఏ భవనాన్ని చూసినా అద్భుతంగా కనబడుతుంది. అట్లాంటిక్ మహా సముద్రతీరంలో పోర్టోనది సముద్రంలో కలిసే ముఖ ద్వారంలో ఉన్న ఈ నగరంలో ఉన్న 90% ఇళ్ల పైకప్పులు ఎర్రగా కనిపిస్తాయి. నగరంలో మొత్తం అయిదు మ్యూజియంలు పదికి పైగా చర్చిలు ఉన్నాయి. నగరంలోని ఏ వీధిని చూసినా గొప్ప అనుభూతి కలుగుతుంది. తోమర్ నగరం నబారో నది ఒడ్డున నిర్మితమైన శతాబ్దాల క్రితం నాటి నగరం తోమార్. 12వ శతాబ్దంలో నిర్మించిన ఈ నగరంలో క్రీస్తు కాన్వెంట్ భవనాన్ని యునెస్కో సంస్థ ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది. సావో జోవా బాప్టిస్ట్ట్ చ ర్చి, భవనం, ఒక గొప్ప ఆకర్షణ. శతాబ్దాల క్రితం నాటి అద్భుత శిల్పకళా నైపుణ్యం కలిగిన భవనాలను చూస్తుంటే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. నగరం మధ్యలో ఉన్న సినగాగ్ను 1430లో నిర్మించారు. సావో ఫ్రాన్సిస్కో మ్యూజియంలో 104 దేశాల నుండి సేకరించిన 43 వేల అగ్గిపెట్టెల రకాలు ఉన్నాయి. 1530లో నిర్మించిన నోసా సెన్వోరాడా కాన్సీకో చర్చి, సాంటా ఇరియా చర్చి, 1418లో ప్రిన్స్ హెన్రీ నిర్మించిన చారోలా చర్చి భవనం... ఇలా నగరమంతా గొప్ప గొప్ప కట్టడాలు, శతాబ్దాల క్రితానివి... ఇంకా చెక్కు చెదరకుండా నిలిచి ఉండి, చూపరులకు ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. దేశంలో సముద్రతీర ప్రాంతంలో అనేక అందమైన బీచ్లు ఉన్నాయి. సుందరమైన ద్వీపాలు అట్లాంటిక్ సముద్రంలో ఉన్నాయి. బతాల్హా అద్భుత శిల్ప నగరం 13వ శతాబ్దంలో నిర్మితమైన అద్భుత కళా ఖండాల సముదాయం ఈ నగరం. దీన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించింది. 1388లో మొదటి జావోరాజు నిర్మించిన ఈ రాజప్రాసాదం ఈ నాటికీ గొప్ప కట్టడంగా నిలిచి ఉంది. పర్యాటకులను ఆశ్చర్యానందాలకు గురిచేసే ఈ భవన నిర్మాణ శైలి అత్యద్భుతం. ఎంతసేపు చూసినా తనివి తీరదు. ఈ భవన ముఖద్వారమే 15 మీటర్ల ఎత్తు ఉందంటే ఇక ఆ భవనం ఎంత ఎత్తు, ఎంత అద్భుతంగా ఉంటుందో ఊహించండి. ఈ భవనం సమీపంలో అద్భుతమైన గుహలు నిర్మించారు. దీనిని పోర్టో డి మోస్ అంటారు. 13వ శతాబ్దంలో నిర్మించిన గుహలు, పై నుండి కిందికి జారుతున్నట్లు అనిపించే రాళ్లు, జారి పడుతున్న నీటి బిందువులు, కింద కోనేరులో రకరకాల చేపలు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఈ కోనేరు 110 మీటర్ల లోతులో ఉండడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం.