-
ఆర్ఐఎల్ చేతికి శుభలక్ష్మీ పాలి
న్యూఢిల్లీ: పాలియెస్టర్ చిప్స్, యార్న్ తయారీ కంపెనీ శుభలక్ష్మీ పాలియెస్టర్స్(ఎస్పీఎల్)ను కొనుగోలు చేసినట్లు డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) తాజాగా పేర్కొంది. ఇందుకు సొంత అనుబంధ సంస్థ రిలయన్స్ పాలియెస్టర్ లిమిటెడ్ ద్వారా తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. దీనిలో భాగంగా శుభలక్ష్మీ పాలియెస్టర్స్, శుభలక్ష్మీ పాలిటెక్స్ లిమిటెడ్కు చెందిన పాలియెస్టర్ బిజినెస్లను కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించింది. వీటికి రూ. 1,522 కోట్లు, రూ. 70 కోట్లు చొప్పున చెల్లించనున్నట్లు తెలియజేసింది. ఈ డీల్కు కాంపిటీషన్ కమిషన్(సీసీఐ)తోపాటు రెండు సంస్థల రుణదాతల నుంచి అనుమతులు లభించవలసి ఉన్నట్లు పేర్కొంది. తాజా కొనుగోలు ద్వారా టెక్స్టైల్ తయారీ బిజినెస్ మరింత పటిష్టంకానున్నట్లు తెలియజేసింది. ఎస్పీఎల్ పాలియెస్టర్ ఫైబర్, యార్స్, టెక్స్టైల్ గ్రేడ్ చిప్స్ తయారు చేస్తోంది. ఏడాదికి 2,52,000 టన్నుల పాలిమరైజేషన్ తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. కంపెనీ గుజరాత్లోని దహేజ్, దాద్రానగర్ హవేలీలోని సిల్వస్సాలో ప్లాంట్లను నిర్వహిస్తోంది. ఇదీ చదవండి: ఐటీ జాబ్ పొందడమే మీ లక్ష్యమా? రెజ్యూమ్లో ఈ తప్పులు చేయకండి! -
దేశం కోసం ఖాదీ... జాతీయ జెండా కోసం చైనీస్ పాలిస్టర్
న్యూఢిల్లీ: దేశం కోసం ఖాదీ కానీ జాతీయ జెండా కోసం చైనీస్ పాలిస్టర్ అని కాంగ్రెస్ నాయకుడు ప్రధాని నరేంద్ర మోదీ పై విమర్శలు ఎక్కుపెట్టారు. ఎప్పటిలాగే ఆయన పనులుకు మాటలకు పొంతన ఉండదంటూ మోదీ పై మండిపడ్డారు. ఈ మేరకు ప్రధాని మోదీ అహ్మదా బాద్లో సబర్మతి రివర్ఫ్రంట్ లో ఖాదీ ఉత్తవం సందర్భంగా ఖాదీ గురించి మాట్లాడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ మోదీ పై ఈ విమర్శల దాడి చేశారు. మోదీ ఆ ఉత్సవంలో అభివృద్ధి చెందిన స్వావలంబనతో కూడిన భారతదేశ కలను సాధించడానికి ఖాదీ ఒక ప్రేరణగా మారుతుందని అన్నారు. దీందో రాహుల్గాంధీ ఫ్లాగ్ కోడ్ విషయాన్ని ప్రస్తావిస్తూ ...కేంద్రం ఫ్లాగ్ కోడ్ని సవరించడాన్ని కూడా తప్పుపట్టారు. జాతీయ జెండాను చేతితో చేసే నూలు లేదా యంత్రంతో తయారు చేసిన పత్తి /పాలిస్టర్/ ఉన్ని/ పట్టు ఖాదీని వినియోగించవచ్చని కేంద్రం సవరించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐతే గతంలో మిషన్తో చేసే పాలిస్టర్ జెండాలను ఉపయోగించేందుకు అనుమతించలేదనే విషయాన్ని గుర్తు చేశారు. పైగా మోదీ ఆ ఖాదీ ఉత్సవంలో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆత్మగౌరవానికి ప్రతీక అయిన ఖాదీ లేదా హోమ్స్పన్ నాసిరంకంగా ఉత్పత్తిగా పరిగణించారని చెప్పారు. అంతేకాదు రానున్న పండుగలో గ్రామీణ పరిశ్రమల ఉత్పత్తులైన ఖాదీ మాత్రమే బహుమతిగా ఇవ్వాలని ప్రజలను కోరారు కూడా. దీంతో రాహుల్ గాంధీ మోదీపై విమర్శలతో విరుచుకుపడ్డారు. (చదవండి: స్వావలంబనకు స్ఫూర్తి ఖాదీ) -
పాలిస్టర్ జాతీయ జెండా అమ్మకాలపై జీఎస్టీ మినహాయింపు
న్యూఢిల్లీ: పాలిస్టర్ లేదా యంత్రంపై తయారైన భారత జాతీయ జెండా అమ్మకంపైనా ఇకపై వస్తు సేవల పన్ను (జీఎస్టీ) మినహాయింపు లభించనుంది. ఆర్థికశాఖ శుక్రవారం ఒక ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపింది. చేతితో నేసిన లేదా అల్లిన పత్తి, పట్టు, ఉన్ని లేదా ఖాదీ జాతీయ జెండాలు ఇప్పటికే జీఎస్టీ నుండి మినహాయింపు పొందుతున్నాయి. అయితే పాలిస్టర్, యంత్రంపై తయారైన జాతీయ పతాకాన్నీ జీఎస్టీ నుంచి తాజాగా మినహాయిస్తున్నట్లు తెలిపింది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ కింద నిర్వహిస్తున్న ‘హర్ ఘర్ తిరంగ’ కార్యక్రమం నేపథ్యంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ నుండి తాజా వివరణ వెలువడింది. -
సంక్షోభం!
► సంక్షోభంలో సిరిసిల్ల వస్త్రపరిశ్రమ ► యాభై మందికిపైగా దివాళా తీసిన వ్యాపారులు ► పేరుకుపోయిన కోటి మీటర్ల వస్త్రం ► సర్కారు పైనే భారం సిరిసిల్ల : ‘సిరి’శాలగా పేరున్న సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. వస్త్రాన్ని నమ్ముకున్న వ్యాపారులు గడ్డు పరిస్థితులను అనుభవిస్తున్నారు. వస్త్రం ఉత్పత్తి వ్యయానికి, మార్కెట్ ధరలకు మధ్య వ్యత్యాసం ఉండడం, కొంతమంది బడా వ్యాపారుల చేతుల్లో వస్త్రవ్యాపారం బందీకావడం, గుత్తాధిపత్యం కోసం పథకం ప్రకారం చిన్న వ్యాపారులను దెబ్బతీయడంతో ఈ దుస్థితి ఏర్పడింది. దీంతో వ్యాపారం మందగిస్తూ పలువురు వ్యాపారులు దివాళా తీస్తున్నారు. సిరిసిల్లలో రాష్ట్రంలోనే ఎక్కడా లేనివిధంగా 34 వేల మరమగ్గాలున్నాయి. ఇందులో 27 వేల మరమగ్గాలపై పాలిస్టర్ వస్త్రం, ఏడువేల మగ్గాలపై కాటన్ వస్త్రం ఉత్పత్తి అవుతుంది. ఒక్కో మగ్గంపై నిత్యం వంద మీటర్ల పాలిస్టర్ వస్త్రం ఉత్పత్తి జరుగుతుంది. నిత్యం 27లక్షల మీటర్ల గుడ్డ ఉత్పత్తి అవుతుంది. పాలిస్టర్ వస్త్రానికి వినియోగించే నూలు కిలో ధర రూ.102 ఉంది. ఇరవై రోజుల కిందట కిలో ధర రూ.92 ఉంది. ప్రతి కిలో నూలుకు రూ.10 ధర పెరగ్గా ఉత్పత్తి అయిన వస్త్రానికి ఆ మేరకు ధర పెరగడం లేదు. మీటరు పాలిస్టర్ వస్త్రాన్ని సిరిసిల్ల మగ్గాలపై ఉత్పత్తి చేసేందుకు రూ.7.30 ఖర్చు అవుతుంది. కానీ మీటరు వస్త్రానికి రూ.6.70 ధర లభిస్తుంది. ప్రతి మీటర్ వస్త్రంపై వ్యాపారులు 60పైసలు నష్టాలను చవిచూస్తున్నారు. బట్టకు ధరలేదని అమ్మడం ఆపేయడంతో సిరిసిల్లలో వస్త్రం నిల్వ లు పేరుకుపోతున్నాయి. ప్రస్తుతం సిరిసిల్లలో కోటి మీటర్ల వస్త్రం నిల్వలున్నాయి. సిరిసిల్లకు నూలు సరఫరా చేసే హైదరాబాద్ పెద్ద సేట్లే మళ్లీ వస్త్రం కొనుగోలు చేస్తున్నారు. సిరిసిల్లకు నూలు ఇవ్వడం, గుడ్డ కొనడం వారిచేతుల్లోనే ఉంది. దీంతో పెద్ద సేట్ల కనుసన్నల్లోనే సిరిసిల్ల వస్త్ర వ్యాపారం ఆధారపడి ఉంది. యాభై మంది హైదరాబాద్ సేట్లు సిరిసిల్లను గుప్పిట్లో పెట్టుకుని నడిపిస్తున్నారు. నిజానికి ఇతర ప్రాంతాల్లోనూ పాలిస్టర్ వస్త్రానికి ధర లేకపోవడంతో అనివార్యంగా సిరిసిల్ల వస్త్ర వ్యాపారులు హైదరాబాద్ సేట్లకు బట్ట ఇవ్వాల్సి వస్తుంది. దీంతో నష్టాలను మూటగట్టుకుంటున్నారు. దివాళా తీసిన వ్యాపారులు సిరిసిల్లలో ఎంతో నమ్మకంగా వస్త్ర వ్యాపారం సాగిస్తున్న పలువురు వ్యాపారులు ప్రస్తుతం దివాళా తీసినట్లు చర్చసాగుతోంది. మంత్రి రవీందర్ వాట్సప్ మెసేజ్ ఉదంతంతో దివాళా వ్యాపారుల దైన్యస్థితి వెలుగులోకి వస్తున్నాయి. చాలామంది మధ్య తరగతి వ్యాపారులు పాలిస్టర్ వ్యాపారం చేయలేక ఇబ్బం దులు పడుతున్నారు. సిరిసిల్లలో పెద్ద సేట్లుగా పేరున్న ఓ నలుగురు వ్యాపారులు చిన్న వ్యాపారులను పూర్తిగా ఇబ్బంది పెట్టేందుకు వస్త్రం ధరలను మరింత తగ్గించి, ఆసాములకు ఇచ్చే కూలిని తగ్గిస్తూ.. చిన్న వ్యాపారులను మానసికంగా, ఆర్థికంగా దెబ్బతీస్తున్నారనే ఆరోపణలున్నాయి. భవిష్యత్లో పోటీ లేకుండా చేసుకునే లక్ష్యంతో సిరిసిల్ల పెద్దసేట్లు మైండ్ గేమ్ ఆడుతున్నట్లు సమాచారం. సిరిసిల్లలోని వ్యాపారులకు హైదరాబాద్ సేట్లు నూలు ఇవ్వకుండా అడ్డుపడుతూ అపనమ్మకాన్ని కలిగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. హైదరాబాద్ వ్యాపారులు సైతం గతంలో నూలు ఉద్దెర ఇస్తూ.. నెల రోజులకు డబ్బులు తీసుకునే వారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వారం రోజుల్లో డబ్బులిస్తేనే నూలు ఇస్తాం... గుడ్డ అమ్మినా.. అమ్మకపోయినా డబ్బులిస్తామంటేనే పాలి స్టర్ నూలు ఇస్తామని తెగేసి చెబుతున్నట్లు తెలిసింది. దీంతో నష్టపోయిన సిరిసిల్ల వ్యాపారులు అప్పుల వేటలో పడగా కొత్తగా అప్పు పుట్టని పరిస్థితి నెలకొంది. గుడ్డ అమ్మక, నూలు నమ్మక వస్త్రవ్యాపారం సంక్షోభం ఉంది. ఇప్పటికిప్పుడు యాభై మంది వస్త్ర వ్యాపారులు నష్టాల్లో ఉన్నట్లు సమాచారం. దీంతో సిరిసిల్ల ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. మరోవైపు కరువు పరిస్థితులు, రియల్ ఎస్టేట్ వ్యాపారం క్షీణించడంతో ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. దీని ప్రభావం సిరిసిల్లలోని ఇతర రంగాల్లోనూ ప్రబలంగా ఉంది. ప్రత్యామ్నాయం ఏమిటి..? ► సిరిసిల్లలో ఇప్పుడున్న మరమగ్గాలపై అనేక రకాల వస్త్రాలను ఉత్పత్తి చేయవచ్చు. ► మార్కెట్లో డిమాండ్ లేని పాలిస్టర్ను వదిలిపెట్టి, డిమాండ్ ఉన్న వస్త్రాలను ఉత్పత్తి చేయాలి. ► కొద్ది మంది వస్త్రవ్యాపారులు డిమాండ్ ఉన్న వస్త్రాలను ఉత్పత్తి చేస్తూ.. సంక్షోభాలకు దూరంగా ఉంటూ ఆర్థికంగా స్థిరపడ్డారు. ► హైదరాబాద్లోని బడా సేట్లపై ఆధారపడకుండా సొంతగా బ్యాంకు రుణాలు పొంది పెట్టుబడులు సమకూర్చుకోవాలి. ► సిరిసిల్లలో ముద్రవంటి పథకాల్లో రుణాలిచ్చేందుకు బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయి. ► ఇప్పటికే కొద్ది మంది ప్రయోగాలను చేస్తూ నమ్మకమైన ఉపాధి పొందుతున్నారు. ► చేనేత, జౌళిశాఖ అధికారులను సంప్రదించి దేశవ్యాప్తంగా డిమాండ్ ఉన్న వస్త్ర వివరాలను సేకరించాలి. ► సిరిసిల్ల మరమగ్గాలపై పట్టు వస్త్రాలను ఉత్పత్తి చేసే నైపుణ్యం కార్మికుల్లో ఉంది. ► సిరిసిల్ల బ్రాండ్ ఇమేజ్ని సృష్టిస్తేనే ఆర్థిక సంక్షోభాలను అధిగమించవచ్చు. -
సిరిసిల్లలో మరమగ్గాలు బంద్
కరీంనగర్ : కరీంనగర్ జిల్లా సిరిసిల్లలోని మరమగ్గాల యజమానులు సోమవారం నుంచి బంద్ ప్రకటించారు. వారం పాటు ఉత్పత్తి నిలిపివేయాలని భావిస్తున్నారు. వస్త్ర నిల్వలు పెద్ద ఎత్తున పేరుకుపోవటంతో మగ్గాలు నడపలేమంటూ ఈ మేరకు తీర్మానించారు. ఈ విషయమై ప్రభుత్వం జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కాగా, మగ్గాలు మూతబడటంతో వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోనున్నారు. (సిరిసిల్ల)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
Advertisement