-
సచివాలయానికి నీడ
సాక్షి, అమరావతి: రాజధాని ప్రాంతమైన వెలగపూడిలో తాత్కాలిక భవనాల పేరు చెప్పి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన గత ప్రభుత్వం.. మొక్కలను సైతం తాత్కాలికంగానే బతికేలా చేసింది. ఆ మొక్కలన్నీ కనుమరుగైపోయి, నీడ కరువైపోయింది. ఆ ప్రాంతమంతా ఎడారిలా మంటెక్కిపోతోంది. దీంతో సచివాలయ సిబ్బంది, పోలీసులు, సందర్శకులు నరకాన్ని చవిచూస్తున్నారు. ఈ పరిస్థితిని గుర్తించిన ప్రస్తుత ప్రభుత్వం ఆ ప్రాంతంలో మళ్లీ పచ్చదనం పరిచి, నీడ కల్పించే చర్యలు చేపట్టింది. సచివాలయ భవనాల పరిసరాల్లో ఇక్కడి మట్టిలో బతికేవి, నీడనిచ్చే 12 వేలకు పైగా మొక్కలను ఈ వర్షాకాలంలో నాటేందుకు సిద్ధం చేస్తోంది. ఇవి కాక అందాన్నిచ్చే మరికొన్ని రకాల మొక్కలూ నాటనున్నారు. భవిష్యత్ అవసరాలను మరిచి నిర్మాణాలు తెలుగుదేశం పార్టీ హయాంలో రాజధాని కోసం 29 గ్రామాలకు చెందిన భూములు తీసుకున్నారు. అప్పటివరకు పచ్చటి తోటలు, పూల వనాలతో ఆహ్లాదకరంగా ఉండే ఈ ప్రాంతం 2016 నాటికి పంటలకు దూరమైపోయింది. వెలగపూడి సమీపంలో అసెంబ్లీ, సచివాయాల భవనాలను దాదాపు 45 ఎకరాల్లో నిర్మించారు. సింగపూర్, మలేసియా, జపాన్ అంటూ అందానికి ప్రాధాన్యం ఇస్తూ ఈ నేలకు సరిపోని మొక్కలను తెచ్చి నాటారు. గత ఆరేళ్లుగా అవి మొక్కలుగానే ఉండిపోగా, చాలావరకు చనిపోయాయి. దాంతో భవనాల పరిసరాల్లో నీడే కరువైపోయింది. వేసవిలో ఎప్పుడూ లేనంతగా ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. గడిచిన మే నెలలో విజయవాడ, గుంటూరులో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా, సచివాలయ ప్రాంగణంలో 43.5 డిగ్రీలకు పైగా నమోదైంది. అంటే ఉష్ణోగ్రతలు సహజంగానే ఎక్కువగా ఉండే ఈ రెండు నగరాలకంటే సచివాలయం వద్ద 1.5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత ఉంటోంది. నిత్యం ఇదే పరిస్థితి. నీడనిచ్చే మొక్కలు సిద్ధం గత పాలకుల తప్పులను గుర్తించిన ప్రస్తుత ప్రభుత్వం వెలగపూడి పరిసరాల్లో నీడనిచ్చేవి, ఇక్కడి మట్టిలో బతికే మొక్కలను నాటాలని సీఆర్డీఏను ఆదేశించింది. గతేడాది సీడ్ యాక్సెస్ రోడ్డుకు ఇరువైపులా, రోడ్డు మధ్యన నీడనిచ్చే బాదం జాతి మొక్కలను నాటారు. అవి ఎనిమిది నెలల్లోనే అనుకున్న స్థాయిలో పెరిగాయి. దీంతో అసెంబ్లీ, సచివాలయ భవనాలు ఉన్న ప్రాంతంలోనూ నీడనిచ్చే వేప, రావి, మామిడి, మహాగని వంటి జాతులకు చెందిన మొక్కలను నాటాలని నిర్ణయించారు. ఉద్దండరాయునిపాలెం, సచివాలయంలో రెండు నర్సరీలు ఏర్పాటు చేసి సుమారు 12 వేలకు పైగా నీడనిచ్చే మొక్కలను, పూల మొక్కలను సిద్ధం చేశారు. జూన్, జూలై నెలల్లో వర్షాకాలంలో వీటిని నాటనున్నారు. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం ఉన్న ప్రాంతంలో చల్లదనం పెరగాలంటే భవనాలకు చుట్టూ కనీసం కిలోమీటర్ పరిధిలో పూర్తిస్థాయిలో నీడనిచ్చే చెట్లు పెంచాలని పర్యావరణవేత్తలు అభిప్రాయపడుతున్నారు. నల్ల ఎడారి నల్ల సముద్రం, ఎర్ర సముద్రం.. ఇలా కొన్ని సముద్రాలకు రంగుల పేర్లు ఉన్నాయి. ఎడారికి..? ప్రశ్నే లేదు. ఎడారి అంటే ఒకటే. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబేయేది కొత్తది. ఇది నల్ల ఎడారి. ఎక్కడుంది అంటారా..? మన దగ్గరే.. అమరావతి ప్రాంతంలో. గత తెలుగుదేశం పార్టీ సృష్టి. దానిపేరే తాత్కాలిక సచివాలయం. గత ప్రభుత్వం ఇక్కడి నేల స్వభావానికి సరిపోని విదేశీ మొక్కలు నాటింది. అవి చనిపోవడంతో ఈ ప్రాంతం ఎడారిలా మారింది. నల్ల రేగడి నేలలో ఆ ప్రభుత్వం సృష్టించిన ఎడారి అయినందున దీనిని నల్ల ఎడారి అని అంటున్నారు. -
ముక్కోటి వృక్షార్చనకు ఏర్పాట్లు పూర్తి
సాక్షి, హైదరాబాద్: శనివారం మున్సిపల్, ఐటీశాఖల మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా తలపెట్టిన ముక్కోటి వృక్షార్చనకు ఏర్పాట్లు పూర్తి అయినట్లు గ్రీన్ ఇండియా చాలెంజ్ నిర్వాహకులు ప్రకటించారు. వివిధ జిల్లాల్లో నమోదవుతున్న వర్షాలను దృష్టిలో పెట్టుకుని ఒక్క గంటలో నాటాలన్న నియమాన్ని సడలించినట్టు తెలిపారు. వర్షాల తెరిపి, వీలును బట్టి రోజంతా తమతమ ప్రాంతాల్లో మొక్కలు నాటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీ సంతోష్ కుమార్ పిలుపు నిచ్చారు. కేటీఆర్కు ఈ మొక్కలు నాటడాన్నే పుట్టినరోజు కానుకగా ఇస్తున్నట్లు ప్రకటించారు. అన్ని స్థాయిల్లోని ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు తమ పరిధిలో వీలైనన్ని మొక్కలు నాట డం ద్వారా హరిత తెలంగాణ సాధనలో భాగస్వాములు కావాలని కోరారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ స్ఫూర్తిని దేశవ్యాప్తం చేయాలన్న తమ సంకల్పానికి ప్రజలు ఇచ్చే ఈ మద్దతు చాలా కీలకమని సంతోష్ పేర్కొన్నారు. ఒక్కరోజే 3.30 కోట్ల మొక్కలునాటేలా కార్యాచరణ... రాష్ట్రవ్యాప్తంగా శనివారం ఒక్కరోజే 3.30 కోట్ల మొక్కలు నాటేందుకు వీలుగా ఏర్పాట్లు చేసినట్టు నిర్వాహకులు వెల్లడించారు. రాష్ట్రంలోని సర్పంచులు 2.5 కోట్ల మొక్కలు, జీహెచ్ఎంసీ మేయర్, కార్పొరేటర్లు కలిపి హైదరాబాద్ వ్యాప్తంగా 10 లక్షల మొక్కలు. 142 మున్సిపాలిటీలలో చైర్మన్లు, కౌన్సిలర్ల సహకారంతో 25 లక్షలు మొక్కలు నాటేలా కార్యాచరణ రూపొందించామన్నారు. అన్ని కాలనీ సంఘాలు, ఇతరులు కలిసి 20 లక్షల మొక్కలు, అటవీ శాఖ పరిధిలోని ఖాళీ స్థలాల్లో స్థానిక ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో 50 లక్షల మొక్కలు, హెచ్ఎండీఏ పరిధిలో ప్రజాప్రతినిధులతో 20 లక్షలు మొక్కలు నాటేలా చర్యలు చేపడుతున్నామన్నారు. ముక్కోటి వృక్షార్చనలో పాల్గొని మొక్కలు నాటేవారు తాము నాటిన మొక్కతో ఫొటో దిగి 9000365000 నంబర్కు వాట్సాప్ ద్వారా పంపాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. మొక్కల కోసం గ్రామాల్లోని పంచాయతీ నర్సరీలు, అటవీ, మున్సిపల్ నర్సరీలను ఇప్పటికే అనుసంధానించినట్టు తెలియజేశారు. -
అనసూయకు చాలెంజ్ విసిరిన రష్మీ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో మొదలైన 'గ్రీన్ ఇండియా చాలెంజ్' ఇప్పుడు అనేక ప్రాంతాలకు విస్తరించింది. ఈ కార్యక్రమంలో ఇప్పటికే చాలా మంది ప్రముఖులు పాల్గొని, ఒక్కొక్కరు మూడు మొక్కలు చొప్పున నాటుతూ.. మరో ముగ్గురిని మొక్కలు నాటాలని నామినేట్ చేస్తున్నారు. సవాలును స్వీకరించిన అనేక మంది ప్రముఖులు, సామాన్యులు సైతం మొక్కలు నాటుతూ.. పర్యావరణ పరిరక్షణలో భాగమవుతున్నారు. ఈ చాలెంజ్ స్ఫూర్తిగా తీసుకున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా తన పేరిట 'రోజా వనం' అనే చాలెంజ్ ప్రారంభించారు. దీనిలో భాగంగా ప్రముఖులకు గ్రీన్ ఇండియ ఛాలెంజ్ విసిరి వారితో మొక్కలు నాటిస్తున్నారు. రోజా విసిరిన చాలెంజ్ను స్వీకరించి ఇటీవల హీరో అర్జున్, నటి ఖుబ్బూ మొక్కలు నాటిన విషయం తెలిసిందే. తాజాగా ప్రముఖ యాంకర్ రష్మి గౌతమ్ కూడా రోజా విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్కు స్పందించారు. గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా నానక్రాంగూడలోని రామానాయుడు స్టూడియోలో మొక్కలు నాటారు. (చదవండి : గ్రీన్ చాలెంజ్: మొక్కలు నాటిన రాహుల్) ఈ సందర్భంగా రష్మి మాట్లాడుతూ.. ‘మానవునికి కావాల్సిన ప్రాణ వాయువైన ఆక్సిజన్ను ఇచ్చి కార్బన్ డైఆక్సైడ్ ను పీల్చుకుంటాయి. అంతే కాక పరిసరాలలో వున్న కుళ్ళు వాసనలను, కలుషితమైన గాలిని గ్రహించుకొని స్వచ్చపరుస్తాయి.రోజురోజుకు పెరుగుతున్న ఎండ తీవ్రతను, వాతావరణ లో హెచ్చుతగ్గులను సమతుల్యత చేయడానికి మొక్కలు తప్పకుండా పెంచాలి’ అని కోరారు. అలాగే తన గ్రీన్ ఇండియా చాలెంజ్ను హీరో సత్యదేవ్, ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్, ప్రముఖ యాంకర్ అనసూయకు విసిరారు. తన చాలెంజ్ను స్వీకరించి మొక్కలు నాటాలని కోరారు. -
25 కోట్ల మొక్కలు నాటాలని సీఎం జగన్ లక్ష్యం
-
అదే సీఎం జగన్ ఆశయం : విజయసాయిరెడ్డి
సాక్షి, విశాఖపట్నం : రాష్ట్రంలోని ప్రతి పౌరుడు మూడు మొక్కలు నాటాలని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన విశాఖపట్నంలో ప్రగతి భారతి ఫౌండేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. అన్ని రంగాల్లో ప్రగతి సాధించేందుకే ప్రగతి భారతి పౌండేషన్ ప్రారంభించామని వెల్లడించారు. కాలుష్యాన్ని అరికట్టాలిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిపై ఉందన్నారు. ఏపీని హరితాంధ్రప్రదేశ్గా మార్చేందుకే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. ప్రతి ఒక్కరు మూడు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని ఆరు కోట్ల మంది మొక్కలు నాటాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో 25 కోట్ల మొక్కలు నాటాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయమని, దానికి ప్రతి పౌరుడు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. విశాఖపట్నం అందమైన నగరమని, పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టాల్సిన బాధ్యత నగర పౌరులదే అన్నారు. ఏపీ అభివృద్ధి చెందాలంటే విశాఖపట్నం కేంద్ర బిందువుగా మారాలన్నారు. అభివృద్ధిలో అందరూ భాగస్వామ్యులు కావాలని కోరారు. విశాఖ నగరానికి ఎంతో చరిత్ర ఉందని, 1926లో తొలి విశ్యవిద్యాలయం (ఆంధ్రా యూనివర్శిటీ) ఇక్కడే ఏర్పడిందని గుర్తు చేశారు. దేశంలోనే తొమ్మిదవ పెద్ద నగరంగా ఉన్న విశాఖను ప్రకృతి, పర్యావరణానికి కేరాఫ్గా తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత అందిరిపై ఉందని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. అది తప్పకుండా అమలు అవుతుంది విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా సీఎం జగన్ ప్రకటించారని, అది తప్పకుండా అమలు అవుతుందని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. కొందరు అడ్డంకులు సృష్టించినా.. విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ఉంటుందని తెలిపారు. ప్రపంచంలో ఎవరు అడ్డొచ్చినా మూడు రాజధానుల ప్రతిపాదన ఆగదని చెప్పారు. మూడు రాజధానులకు బీజేపీ వ్యతిరేకమో కాదో తనకు తెలియదన్నారు. భూములు పోతాయనే భయంతో రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరికి మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు, సుజనా కలిసి ఎన్ని కుట్రలు చేసినా.. విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధానిగా అవతరించి తీరుతుందని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
కేజ్రీవాల్కు మరో షాక్.. ‘ఎల్జీ’ సంచలన నిర్ణయం
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement