breaking news
PK Jha
-
అటవీ సంరక్షణలో ఝా సేవలు భేష్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అటవీ భూముల రక్షణ, వన్యప్రాణుల సంరక్షణకు పీసీసీఎఫ్ ప్రశాంత్కుమార్ ఝా ఎంతో కృషి చేశారని అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రశంసించారు. ఝా పదవీ విరమణ సందర్భంగా బుధవారం అరణ్యభవన్లో ఏర్పాటుచేసిన వీడ్కోలు సభకు మంత్రి ఇంద్రకరణ్, సీఎస్ ఎస్కే జోషి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పీకే ఝాకు మంత్రి, సీఎస్, ఇతర అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. శాలువాలు, జ్ఞాపికలతో సన్మానించారు. కొత్త పీసీసీఎఫ్(ఇన్చార్జ్) ఆర్.శోభకు అభినందనలు తెలిపారు. మంత్రి మాట్లాడుతూ మూడేళ్లకుపైగా అటవీ సంరక్షణ ప్రధాన అధికారి హోదాలో పనిచేసిన అతి కొద్ది మం ది ఐఎఫ్ఎస్లలో ఝా ఒకరని అన్నారు. అటవీ సంరక్షణ విషయంలో ఆయన అంకితభావంతో పని చేశారని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరంతోసహా అనేక ప్రాజెక్టులకు అటవీ, పర్యావరణ అనుమతులు రికార్డు వేగంతో సాధించేలా తన బృందంతో కలిసి కృషి చేశారని చెప్పారు. హరితహారం సమర్థవంతంగా అమలయ్యేలా పర్యవేక్షించారన్నారు. పీకే ఝా సేవల వల్ల అటవీ శాఖకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని, ఇదేస్ఫూర్తితో హరితహారం, అటవీరక్షణకు అటవీ అధికారులు కృషి కొనసాగించాలని సూచించారు. ఝా నేతృత్వంలో అటవీ శాఖ సమర్ధవంతంగా పనిచేసిందని సీఎస్ ఎస్కే జోషి అన్నారు.రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల శివార్లలోని అటవీ భూముల్లో అర్బన్ ఫారెస్ట్ పార్కులను అద్భుతంగా తీర్చిదిద్దారని ప్రశంసిం చారు. పీకే ఝా మాట్లాడుతూ ప్రతి ఒక్కరి సహకారం వల్లే తాను విజయవంతంగా పనిచేయగలిగానని, çసహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీఎఫ్ పృథ్వీరాజ్, అడిషనల్ పీసీసీఎఫ్లు మునీంద్ర, డోబ్రియల్, స్వర్గం శ్రీనివాస్, ఫర్గేన్ లోకేష్ జైస్వాల్, సీఎఫ్వోలు, డీఎఫ్వోలు పాల్గొన్నారు. -
నవంబర్ కల్లా అటవీ శాఖలో నియామకాలు
అటవీ సంరక్షణ ప్రధానాధికారి పీకే ఝా సాక్షి, హైదరాబాద్: అటవీ శాఖ లో కొత్త పోస్టుల నియామక ప్రక్రియ వచ్చే నవంబర్ నాటికి పూర్తి అవుతుందని, ఈ మేరకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) కసరత్తు చేస్తోందని అటవీ సంరక్షణ శాఖ ప్రధానాధికారి పీకే ఝా తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన అదనపు అటవీ సంరక్షణ అధికారులు పృథ్వీరాజ్, లోకేశ్ జైస్వాల్, ఆర్ శోభ, మునీంద్ర ఆర్ఎం డోబ్రియాల్, స్వర్గం శ్రీనివాస్ తది తరులతో కలసి జిల్లా అటవీ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.అటవీశాఖలో దాదాపు 18,057 పోస్టులను భర్తీ చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఝా మాట్లాడుతూ హరితహారం వంటి కార్యక్ర మాలతో ఒకవైపు పచ్చదనం పెంచే ప్రయ త్నం చేస్తుంటే, మరోవైపు అడవులు అంతరిం చి పోతున్నాయన్నారు. అడవుల ఆక్రమణకు పాల్పడే వారిపట్ల కఠినంగా ఉండాలని, అన్యక్రాంతమైన ప్రతి ఇంచు భూమిని తిరిగి స్వాధీనం చేసుకొని మళ్లీ అడవిగా మార్చాలని అధికారులను ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం అటవీ అనుమతుల ను వేగంగా సాధించటంతో రాష్ట్ర అటవీ శాఖ ప్రతిష్ట పెరిగిందని అన్నారు. ఆక్రమణకు గురైన అటవీ భూములను తిరిగి శాఖ పరిథిలోకి తీసుకొచ్చి సామాజిక వనాలను పెంచుతున్న తీరును మహబూబాబాద్ డీఎఫ్వో కృష్ణాగౌడ్ వివరించగా ఈ విధానాన్ని మిగతా జిల్లాల్లోనూ అమలు చేయాలని డీఎఫ్వోలకు సూచించారు. గొర్రెల కోసం గడ్డి పెంపకాలను అన్ని జిల్లాల్లో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు.