-
మార్మోగిన శివనామ స్మరణ
నేరడిగొండ(బోథ్) : ఓం నమఃశివాయ.. శంభో శంకర.. హరహర మహాదేవా.. అంటూ భక్తుల శివనామస్మరణతో ఆలయాలు మార్మోగాయి. మహా శివరాత్రి పర్వదినం పురస్కరించుకుని మండలంలోని శివాలయాల్లో భక్తులు మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వడూర్ గ్రామంలోని శివలింగాయనం, మహాదేవుని ఆలయం, కుమారి, సవర్గాం గ్రామాల్లో రాజరాజేశ్వర ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రంలోనే ఎత్తయిన జలపాతంగా పేరొందిన కుంటాల జలపాతం వద్ద సహజ సిద్ధంగా ఏర్పడిన సోమేశ్వర ఆలయంలో శివలింగం, నందీశ్వర విగ్రహాలకు అభిషేకంతోపాటు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాలతోపాటు మహారాష్ట్ర, తదితర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి గుహలోని శివలింగం, నందీశ్వర విగ్రహాలకు మొక్కులు చెల్లించారు. శివరాత్రికి మాత్రమే దర్శనం.. కుంటాల జలపాతం వద్ద సహజ సిద్ధంగా ఏర్పడిన గుహలో శివలింగం, నందీశ్వరుడిని దర్శించుకోవాలంటే మహా శివరాత్రి సందర్భంగా రెండు రోజులపాటు దర్శనానికి వీలుంటుంది. దీంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు దర్శనం కోసం ఆతృతగా ఎదురు చూస్తుంటారు. కనిపించని వసతులు.. కుంటాల జలపాతం వద్ద మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏటా ఇక్కడ జాతర నిర్వహిస్తారు. ఈసారి జాతరలో కనీస వసతులు కల్పించకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దర్శనానికి వెళ్లే భక్తులకు నీటి సౌకర్యం కల్పించకపోవడంతో ఇక్కట్లు ఎదుర్కొన్నారు. నేరడిగొండ, సిరికొండ ఎస్సైలు వెంకన్న, రాముగౌడ్ కుటుంబ సభ్యులు సోమేశ్వరుని దర్శించుకున్నారు. పోలీసులు, అటవీ శాఖ అధికారులు బందోబస్తు ఏర్పాటు చేశారు. -
భక్తి ఎగసె.. గోదారి మురిసె
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఎగసింది.. తన చెంతకొచ్చిన బిడ్డల తన్మయత్వాన్ని చూసి గోదారమ్మ మురిసింది. అందుకేనేమో.. ఆ తల్లి గోదారి ఉరకలెత్తి ప్రవహిస్తోంది. అంత్య పుష్కరాలు ముగింపు దశకు చేరుకుంటున్న నేపథ్యంలో జిల్లాలోని ఘాట్లన్నీ భక్తజన సందోహంతో కిక్కిరిశాయి. ఓ వైపు వరద గోదారి ఉధృతంగా ప్రవహిస్తోంది. మరోవైపు భక్తులు సైతం వరదలా తరలివస్తున్నారు. అంత్య పుష్కరాల్లో తొమ్మిదో రోజైన సోమవారం నదీ తీరమంతా జన సందోహంతో కిటకిటలాడింది. కొవ్వూరు గోష్పాద క్షేత్రానికి ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు వచ్చారు. సోమవారం ఇక్కడ 60 వేల మందికి పైగా పుష్కర స్నానాలు ఆచరించారు. వరద పోటెత్తడంతో గోష్పాద క్షేత్రంలోని మొదటి రెండు ఘాట్లను పూర్తిగా మూసివేశారు. మరో మూడు రోజుల్లో గోదావరి అంత్య పుష్కరాలు ముగియనుండటంతో భక్తుల సంఖ్య పెరుగుతోంది. పట్టిసీమ పుష్కర ఘాట్లో భక్తులు స్నానాలు చేసి భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామిని దర్శించుకున్నారు. పోలవరం, గూటాల ఘాట్లలో వరద ఎక్కువగా ఉన్నప్పటికీ భక్తుల సంఖ్య తగ్గలేదు. సిద్ధాంతంలో కేదారేశ్వరుడు కొలువుతీరడం, సోమవారం కావడంతో భక్తులు పోటెత్తారు. 13 వేలకు పైగా భక్తులు ఇక్కడ పుష్కర స్నానాలు చేసినట్టు అంచనా. పోలీసులు కృష్ణా పుష్కరాలకు తరలివెళ్లడంతో ఘాట్ల వద్ద ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారింది. భక్తులు తీవ్ర ఇబ్బం దులకు గురయ్యారు. కేదారీఘాట్లో గల మూడు రేవుల్లో ఒక రేవును మూసివేశారు. పెరవలి మండలంలో గోదావరి తీరం భక్తులతో నిండిపోయింది. మహిళలు గోదారమ్మకు పసుపు, కుంకుమ చీరసారెలతో పూజలు నిర్వహించారు. ఎనిమిది పుష్కర ఘాట్లలో వేలాది మంది పుణ్యస్నానాలు ఆచరిం చారు. నరసాపురంలోని ఘాట్లకు పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వలంధర రేవు, అమరేశ్వర ఘాట్ల వద్ద రద్దీ నెలకొంది. స్నానాల అనంతరం శివాలయాలను దర్శించుకుని పూజలు చేశారు. పోలీస్ యంత్రాంగం, ఇతర శాఖల సిబ్బంది కృష్ణా పుష్కరాలకు వెళ్లిపోవడంతో మొత్తం భారం ఎన్ఎస్ఎస్ వలంటీర్లపై భారం పడింది. ఉదయం సముద్రంలో పాటు కారణంగా ఘాట్లలో నీటిమట్టం లేక భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆచంట మండలం కరుగోరుమిల్లి పుష్కర ఘాట్ పూర్తిగా నీట మునిగింది. ఘాట్కు వెళ్లే రహదారిపైకి వరద నీరు చేరింది. దీంతో ఇక్కడ పుష్కర స్నానాలను నిలుపుదల చేశారు
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తాతా.. నీకు టాటా..
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- Daily Horoscope: ఈ రాశివారు చేపట్టిన పనులు పూర్తి చేసుకుంటారు
- వైఎస్సార్సీపీ దూకుడు
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- కళ్లు చల్లబడ్డాయా బాబూ!
Advertisement