breaking news
phil haughes
-
మైదానంలోనే ప్రాణాలు విడిచిన భారత క్రికెటర్.. ఆయన గురించి తెలుసా?
క్రికెట్ మైదానంలో చోటు చేసుకున్న అత్యంత విషాదకర సంఘటనలలో ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ మరణం ఒకటి. 2014లో దేశవాళీ టోర్నీ ఆడుతున్న 25 ఏళ్ల హ్యూస్... పేసర్ సీన్ అబాట్ బౌన్సర్కు బలయ్యాడు. బుల్లెట్లా దూసుకొచ్చిన బౌన్సర్ అంతే వేగంతో తల వెనుకవైపు బలంగా తాకింది. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన హ్యూస్.. మూడు రోజుల తర్వాత అస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. అయితే ఓ భారత క్రికెటర్ కూడా మైదానంలో బంతి తగిలి ప్రాణాలు విడిచారన్న విషయం మీకు తెలుసా? భారత ప్లేయర్ రమన్ లాంబా సైతం మైదానంలో క్రికెట్ ఆడుతూ మరణించాడు.లాంబాకు ఏమైంది?ఫిబ్రవరి 23, 1998న భారత క్రికెట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. 38 ఏళ్ల వయస్సులో టీమిండియా కీలక ఆటగాడు రామన్ లాంబా ప్రాణాలు విడిచారు. 1998లో బంగ్లాదేశ్లోని ఢాకాలో జరిగిన క్లబ్ మ్యాచ్ యావత్తు క్రికెట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.అప్పటిలో చాలా మంది భారత క్రికెటర్లు బంగ్లాదేశ్ దేశవాళీ క్రికెట్లో ఆడేవారు. ఈ క్రమంలో ఢాకా ప్రీమియర్ డివిజన్ లీగ్లో అబహానీ క్రిరా చక్రకు ప్రాతినిధ్యం వహించిన లాంబా.. మహమ్మదన్ స్పోర్టింగ్ క్లబ్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో అకాల మరణం చెందారు. రామన్ లాంబా సిల్లీ పాయింట్ వద్ద ఫీల్డింగ్ చేస్తుండగా.. ప్రత్యర్ధి జట్టు బ్యాటర్ మెహ్రబ్ హుస్సేన్ భారీ షాట్ కొట్టాడు. ఈ క్రమంలో బంతి బలంగా సిల్లీ పాయింట్లో ఉన్న లాంబాకు తాకి వికెట్ కీపర్ వైపు వెళ్లింది. అయితే బంతి తాకిన వెంటనే గాయం అంత తీవ్రమైనదిగా అన్పించలేదు. అతడు ఫీల్డ్లో కొనసాగాలని నిర్ణయించుకున్నాడు. కానీ అంతరంగా గాయం కావడంతో అతడు కాస్త ఆసౌకర్యంగా కన్పించాడు. వెంటనే అతడిని ఫీల్డ్ నుంచి బయటకు తీసుకువెళ్లి దగ్గరలో ఉన్న అస్పత్రికి తరలించారు. ఆ తర్వాత పలు పరీక్షలు తర్వాత బంతి తలకు బలంగా తాకడంతో మెదడులో తీవ్రమైన రక్తస్రావం జరిగిందని డాక్టర్లు నిర్ధారించారు. అస్పత్రిలో చేరిన మూడు రోజుల తర్వాత లాంబా తుది శ్వాస విడిచారు. లాంబా భారత తరుపున 4 టెస్టులు, 32 వన్డేలు ఆడారు. మొత్తంగా ఆయన పేరిట 885 అంతర్జాతీయ పరుగులు ఉన్నాయి.దేశవాళీ క్రికెట్లో అదుర్స్..ఫస్ట్ క్లాస్ క్రికెట్లో లాంబాకు అద్బుతమైన రికార్డు ఉంది. ఉత్తర ప్రదేశ్లోని మీరట్లో జన్మించిన రమన్ లాంబా 1996-97 రంజీ సీజన్లో పరుగుల వరద పారించాడు. మొత్తంగా 87 మ్యాచ్లాడి 53.91 యావరేజితో 6362 పరుగులు సాధించాడు. ఇందులో 22 సెంచరీలు, 5 డబుల్ సెంచరీలు ఉన్నాయి.చదవండి: Asia Cup 2025: భారత స్టార్ ప్లేయర్కు ఊహించని షాక్.. శుబ్మన్ గిల్కు ప్రమోషన్..! -
అదిరిపడ్డ వాట్సన్
హెల్మెట్కు బలంగా తాకిన ప్యాటిన్సన్ బంతి మెల్బోర్న్: రాకాసి బౌన్సర్కు ఫిల్ హ్యూస్ ప్రాణాలు విడిచిన సంఘటన ఆస్ట్రేలియా ఆటగాళ్ల కళ్ల ముందు మరోసారి మెదిలింది. మంగళవారం నెట్ ప్రాక్టీస్లో ప్యాటిన్సన్ వేసిన బౌన్సర్... ఆల్రౌండర్ వాట్సన్ హెల్మెట్ను బలంగా తాకడంతో ఒక్కసారిగా అందరూ షాక్కు గురయ్యారు. ఇక వాట్సన్ అయితే కొన్ని క్షణాల పాటు తేరుకోలేకపోయాడు. మోకాళ్లపై కూర్చొని హెల్మెట్ను తీసి పరిశీలించుకున్నాడు. కొన్ని నిమిషాల పాటు చేతులతో తలను పదేపదే రుద్దుకుంటూ కనిపించాడు. ఇక ప్రాక్టీస్ను ఆపేసి టీమ్ డాక్టర్ పీటర్ బ్రూక్నెర్తో కలిసి డ్రెస్సింగ్ రూమ్కు వెళ్లిపోయాడు. ఈ సంఘటనకు నిర్ఘాంతపోయిన ప్యాటిన్సన్ కూడా మధ్యలోనే వైదొలిగాడు. ఆటగాళ్లు, అధికారులు వాట్సన్ను చూసేందుకు వెళ్లిపోవడంతో ప్రాక్టీస్ సెషన్ ముందుగానే ముగిసింది. బంతి తగలడంతో షాక్కు గురైన వాట్సన్ పరిస్థితి బాగానే ఉందని ఆసీస్ జట్టు అధికార ప్రతినిధి తెలిపారు. తర్వాత ఎంసీజీలో ఆసీస్ జట్టుకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనకుండా వాట్సన్ హోటల్ రూమ్కు వెళ్లిపోయాడు. అంతకుముందు బ్యాటింగ్ ప్రాక్టీస్లో స్టార్క్ మోకాలికి గాయం చేసుకున్నాడు. ఇన్సైడ్ బంతులను ఎదుర్కొనే క్రమంలో అతను పదేపదే బ్యాట్ను మోకాలికి తగిలించుకున్నాడు. దీంతో నొప్పి రావడంతో ప్రాక్టీస్ను ఆపేసి వెళ్లిపోయాడు.