breaking news
Peoples War Naxalites
-
నంబాల ఎన్కౌంటర్.. 27 మంది మృతి
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఛత్తీస్గఢ్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ సుప్రీం కమాండర్, జాతీయ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు (71) మృతి చెందారు. ఈ ఎదురుకాల్పుల్లో పలువురు కీలక నేతలు సహా మొత్తం 27 మంది మావోయిస్టులు కూడా మరణించారు. ఛత్తీస్గఢ్ లోని నారాయణపూర్–బీజాపూర్ జిల్లా సరిహద్దు అబూ జ్మఢ్ అడవుల్లో ఇంద్రావతి నది పరీవాహక ప్రాంతంలో బుధవారం ఉదయం ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ డీఆర్జీ జవాను కూడా మృతి చెందగా పలువురు గాయపడినట్లు ఛత్తీస్గఢ్ సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. కేశవరావు మరణాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా ధ్రువీకరించారు. జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న ఓ మావోయిస్టు నేత ఎదురుకాల్పుల్లో మరణించడం ఇదే మొదటిసారని తెలిపారు. ప్రధాని మోదీ కూడా ఎన్కౌంటర్పై స్పందించారు. ‘ఇదో అసాధారణ విజయం’ అని పేర్కొన్నారు. కేశవరావు తలపై కోటిన్నర రూపాయల రివార్డు ఉన్నట్లు సమాచారం. కాగా మావోయిస్టు ఉద్యమానికి వెన్నెముక గా ఉన్న నంబాల మృతి మావోయిస్టు పారీ్టకి పెద్ద ఎదురుదెబ్బని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జి ల్లాలో జని్మంచిన కేశవరావు వరంగల్ ఆర్ఈసీ (ఇప్పటి నిట్)లో ఎంటెక్ చదువుతూ అజ్ఞాతంలోకి వెళ్లారు. పక్కా సమాచారంతో.. అబూజ్మఢ్ అడవుల్లో ఇంద్రావతి నది సమీపాన మావోయిస్టు అగ్రనేత షెల్టర్ తీసుకున్నారని, పార్టీ కేంద్ర కమిటీ, పొలిట్బ్యూరో సభ్యులతో పాటు మాడ్ డివిజన్ సీనియర్ కేడర్, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్జీఏ) సభ్యులు సైతం ఉన్నారని పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో సీఆర్పీఎఫ్, కోబ్రా బలగాలకు తోడు నారాయణపూర్, దంతెవాడ, బీజాపూర్, కొండగావ్ జిల్లాల డీఆర్జీ దళాలు మంగళవారం రాత్రి సెర్చ్ ఆపరేషన్ మొదలెట్టాయి. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున ఇరువర్గాల మధ్య మొదలైన కాల్పులు ఉదయం 11గంటల వరకు కొనసాగాయి. ఈ కాల్పుల్లో మధు, నవీన్ అనే డివిజన్ స్థాయిæ నేతలు కూడా మరణించినట్లు తెలుస్తోంది. మధు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు కాగా, నవీన్ మావోయిస్టు పార్టీ పత్రిక ‘జంగ్’ బాధ్యతలు చూస్తున్నట్లు సమాచారం. ఆపరేషన్ జరిగిన తీరుతెన్నులు, ఇతర మృతుల వివరాలను పోలీసులు ప్రకటించలేదు. అయితే 27 మంది మావోయిస్టుల మృతదేహాలతో పాటు పెద్ద సంఖ్యలో ఆయుధాలు స్వా«దీనం చేసుకున్నట్లు సమాచారం. కాగా మావోయిస్టుల కోసం గాలింపు ఇంకా కొనసాగుతోందని పోలీసులు చెప్పారు. ల్యాప్టాప్లు, కీలక డాక్యుమెంట్లు ఆధారంగా.. గతనెల 18న నారాయణ్పూర్ జిల్లాలో జరిగిన ఆపరేషన్లో మావోయిస్టులకు సంబంధించిన డంప్ను భద్రతా దళాలు కనుగొన్నాయి. ఇందులో కీలక డాక్యుమెంట్లు, పుస్తకాలతో పాటు 11 ల్యాప్టాప్లు లభించాయి. వాటిలో లభించిన వివరాల ఆధారంగానే ఏప్రిల్ 21న తెలంగాణ – ఛత్తీస్గఢ్ సరిహద్దులోని కర్రిగుట్టల్లో ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ భారీ స్థాయిలో మొదలైందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే కర్రిగుట్టల ఆపరేషన్తో భారీ ఫలితం రాబోతుందని ఛత్తీస్గఢ్ పోలీసులు ప్రకటించారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. ఆపరేషన్ ముగిసేసరికి వేర్వేరు ఎన్కౌంటర్లలో 31 మంది సాధారణ స్థాయి మావోయిస్టులు చనిపోగా డంప్లు, ఆయుధ తయారీ పనిముట్లను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. మళ్లీ విశ్లేషించుకుని..‘వారి’ నుంచి సమాచారం తెప్పించుని.. డంప్లో లభించిన ల్యాప్టాప్లు, డాక్యుమెంట్లలో లభించిన సమాచారాన్ని విశ్లేషించుకోవడంలో జరిగిన పొరపాటు కారణంగానే కర్రిగుట్టలో ఆశించిన విజయం దక్కలేదని భావించిన దళాలు మరింత జాగ్రత్తగా సమాచారాన్ని విశ్లేషించుకున్నట్లు సమాచారం. అందులో భాగంగా నంబాల కేశవరావుకు రక్షణ కల్పించే 7వ నంబర్ కంపెనీలో పనిచేసి లొంగిపోయిన కొందరు మావోయిస్టుల నుంచి మరోసారి సమాచారం తెప్పించుకున్నట్టు తెలుస్తోంది. ఈ రెండింటినీ కచ్చితత్వంతో డీకోడ్ చేయడం ద్వారా నంబాల ఎక్కడున్నాడనే అంశాన్ని భద్రతా దళాలు పసిగట్టి మెరుపుదాడి చేసినట్టు తెలుస్తోంది. అంత ఈజీగా ఎలా? సాధారణంగా కేంద్ర కమిటీ సభ్యులకు మూడంచెల భద్రతా వ్యవస్థ ఉంటుంది. ఈ వలయాన్ని ఛేదించుకుని వారి దగ్గరికి చేరుకోవడం చాలా కష్టంతో కూడుకున్న పని. అయినా స్వల్ప నష్టంతోనే పోలీసులు నంబాల దగ్గరికి ఎలా చేరుకున్నారనేది మిస్టరీగా మారింది. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం.. ఏడాది క్రితం వరకు నంబాల కేశవరావుకు 70 మందితో కూడిన కంపెనీ రక్షణ కల్పించేది. ఇందులో కనీసం 40 మంది వద్ద ఏకే 47 లాంటి అత్యాధునిక ఆయుధాలు ఉంటాయని, తన చుట్టూ ఉన్న బృందం ఆధునిక ఆయుధాలతో ఉంటే నంబాల తన చేతిలో ఎప్పుడూ ల్యాప్టాప్తో ముందుకు సాగుతారని తెలుస్తోంది. తాగునీరు, ఆహారం విషయంలోనూ ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తారని, రాత్రి వేళ సైతం రెండు, మూడు గంటల కంటే ఎక్కువ నిద్రించరని సమాచారం. అయితే ఇటీవల పెరిగిన నిర్బంధం కారణంగా భద్రతను 28 మందికి కుదించినట్టు తెలుస్తోంది. -
బీ అలర్ట్
- జిల్లాలో మావోల కదలికలు - వరుసగా వెలుస్తున్న పోస్టర్లు - నిశ్శబ్దం తర్వాత కలవరం - సానుభూతిపరుల పనేనన్న ఓఎస్డీ - సమాచార వ్యవస్థను బలపర్చుకోవాలని ఆదేశం చౌటుప్పల్: జిల్లాలో రోజుకోచోట మావోయిస్టు పార్టీ పేరు తో పోస్టర్లు వెలుస్తుండడంతో జిల్లా పోలీస్శాఖ అప్రమత్తమైంది. ఓఎస్డీ రాధాకిషన్రావు బీఅలర్ట్ అంటూ జిల్లా పోలీసులకు ఆదేశాలిచ్చారు. దశాబ్ద కాలం తర్వాత మావోయిస్టుల కదలికలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాచకొండ ఒకప్పటి పీపుల్స్వార్ నక్సలైట్లకు సేఫ్జోన్గా ఉండేది. కాలక్రమేణా జరిగిన ఎన్కౌంటర్లలో చాలా మంది చనిపోగా, మిగిలిన వారు సేఫ్జోన్గా ఉన్న ఛత్తీస్గఢ్ దండకారణ్యానికి వెళ్లిపోయారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడంతో, మళ్లీ ఈ ప్రాంతంలో పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. పోస్టర్ల ద్వారా దళంలో చేరమని పిలువునివ్వడం చూస్తుంటే, రిక్రూట్మెంట్ల ద్వారా బలపడాలనే ఆలోచనలో ఉన్నట్టు అవగతమవుతోంది. ఓఎస్డీ సందర్శన.. చౌటుప్పల్ మండలంలో రెండు రోజులుగా మావోయిస్టు పార్టీ పేరుతో పోస్టర్లు వెలువడడంతో శుక్రవారం ఓఎస్డీ రాధాకిషన్రావు పోస్టర్లు వెలిసిన గ్రామాలకు వెళ్లి పరిశీలించారు. పోస్టర్లపై ఆరా తీశారు. అనంతరం పోలీస్స్టేషన్కు వచ్చి, పోస్టర్లను పరిశీలించారు. పోలీసు సిబ్బందితో సమావేశమయ్యారు. మావోయిస్టులు మొదట పోస్టర్లు వేసి బల పడతారని, ఆ తర్వాత కొందరినీ చితక్కొట్టి పాగా వేసి, అనంతరం తుపాకులు చేతపట్టి గ్రామాలలో తిరుగుతారని వివరించారు. మొదట పోలీసులంతా గత రికార్డులను తిరగేసి, ఎక్కడెక్కడ విధ్వంసాలకు పాల్పడ్డారు, ఎలా పాల్పడతారు, వారి పనితీరు ఎలా ఉంటుందో తెలుసుకోవాలని సూచించారు. గ్రామాల్లో నె ట్వర్క్ వ్యవస్థను బలోపేతం చేసుకోవాలని, గతంలో మావోయిస్టుల నేపథ్యం ఉన్న వారి పేర్లు సేకరించాలని ఆదేశించారు. జిల్లాకు చెందిన మావోయిస్టులు ఆరుగురు.. జిల్లాకు చెందిన ఆరుగురు వ్యక్తులు వివిధ ప్రాంతాల లో మావోయిస్టులుగా పనిచేస్తున్నారని ఓఎస్డీ రాధాకిషన్రావు విలేకరులకు తెలిపారు. జిల్లాలో మాత్రం ప్రస్తుతం నక్సలైట్లు లేరని స్పష్టం చేశారు. ఇటీవలి ప్రాంతంలో వెలుస్తున్న పోస్టర్లు సానుభూతి పరుల పనిగా భావిస్తున్నామన్నారు. అలా అని మావోయిస్టుల కదలికలు లేవని కూడా చెప్పలేమన్నారు. పోస్టర్లు వేసిన వారు దొరికితే నే వాస్తవాలు తెలుస్తాయని పేర్కొన్నారు. ఆయన వెంట సీఐలు భూపతి గట్టుమల్లు, కె.శివరాంరెడ్డి, ఎస్ఐ హరిబాబు తదితరులు ఉన్నారు.