-
అమెరికాలో జనగణనపై జగడం
వాషింగ్టన్: అమెరికాలో 2020లో చేపట్టనున్న తదుపరి జనాభా లెక్కలపై అప్పుడే వివాదం రేగింది. జనాభా లెక్కల సందర్భంగా అధికారులు.. పౌరసత్వానికి సంబంధించి ప్రశ్నించవచ్చని వస్తున్న వార్తలు వివాదాస్పదమవుతున్నాయి. ఈ ప్రశ్న వల్ల మైనారిటీలు సెన్సస్లో పాలుపంచుకోకపోవచ్చని, దీని వల్ల జనాభా గణాంకాల ప్రామాణికత తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెపుతున్నారు. సెప్టెంబర్లో జరిగిన తాజా సర్వేల్లో పాల్గొన్న ప్రజలు ప్రస్తుతం అమెరికా ప్రభుత్వం గురించి తీవ్ర ఆందోళన చెందుతున్నట్టు వ్యక్తమైందని ఎన్ఏఎల్ఈఓ ఎడ్యుకేషనల్ ఫండ్ హెడ్ ఆర్టురో వర్గాస్ పేర్కొన్నారు. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారాన్ని చేపట్టిన తర్వాత వలసలను, విదేశీయులను.. ఉగ్రవాదం, నేరాలు, ఉద్యోగాలు కోల్పోవడానికి సంబంధం కల్పిస్తూ యాంటీ ఇమిగ్రేషన్ ఎజెండాను చేపట్టారు. గత నెలలో ట్రంప్ స్టేట్ ఆఫ్ యూనియన్ ప్రసంగంలో కూడా లీగల్ ఇమిగ్రేషన్ను తగ్గిస్తామని ప్రతిజ్ఞ చేసిన సంగతి తెలిసిందే. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో వలసదారులను, వారి కుటుంబాల నుంచి వేరు చేసి స్వదేశం పంపేస్తున్నారనే వార్తలు కలకలం రేపుతున్నాయి. దీంతో సెన్సస్ సమాచారాన్ని తమకు వ్యతిరేకంగా అధికారులు వినియోగించే అవకాశం ఉందనే ఆందోళనతో జనాభాలో ఎక్కువ శాతం మంది జన గణనలో పాల్గొనేందుకు అసక్తి చూపకపోవచ్చని నిçపుణులు పేర్కొం టున్నారు. డిసెంబర్లో జాతీయతకు సంబంధించిన ప్రశ్నను కూడా సర్వేలో చేర్చాలని న్యాయ శాఖ సెన్సస్ బ్యూరోకు సూచించడం వివాదం రేపింది. అయితే ఓటింగ్ హక్కుల చట్టాన్ని పరిరక్షించేందుకు పౌరుల సమాచారం ఉపయోగపడుతుందని న్యాయ శాఖ వాదించింది. కాగా, ప్రశ్నావళిపై తాము కసరత్తు చేస్తున్నామని, ప్రశ్నావళి తుది జాబితాను మార్చి 31 నాటికి కాంగ్రెస్కు సమర్పిస్తామని సెన్సస్ ప్రోగ్రామ్ డైరెక్టర్ అల్ ఫాంటెనాట్ స్పష్టం చేశారు. 32.7 కోట్లకు..! అమెరికా రాజ్యాంగం ప్రకారం.. ప్రతినిధుల సభలో ప్రతి రాష్ట్రానికి ఎన్ని సీట్లు కేటాయిస్తారనేది సెన్సస్ లెక్కలపైనే ఆధారపడి ఉంటుంది. అలాగే స్కూళ్లు, ఆస్పత్రులు, ప్రజాసేవకు సంబంధించి నిధుల పంపకానికి కూడా జనాభా లెక్కలే కీలకం. సెన్సస్కు కొన్ని వర్గాలు దూరంగా ఉండటం పాత సమస్యే. 2010 జనాభా లెక్కల్లో లాటినోస్ సంఖ్యను 7,75,000 తక్కువగా లెక్కించినట్టు అంచనా. అయితే ఈసారి ఈ సమస్య మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. 2010 గణనలో 30.88 కోట్ల అమెరికన్లు ఉన్నట్టు తేలగా, ప్రస్తుతం ఈ సంఖ్య 5.8% పెరుగుదలతో 32.7 కోట్లకు చేరుతుందని అంచనా. -
టెన్షన్...టెన్షన్
- భయం గుప్పెట్లో మారేడుపల్లి - దాడులపై తీవ్రంగా స్పందించిన పోలీసులు - నిందితుల వివరాలు సేకరణ - హడలిపోతున్న స్థానికులు మారేడుపల్లి: నిన్నటి వరకూ ప్రశాంతంగా ఉన్న ఆ ప్రాంతం ప్రస్తుతం నివురుగప్పిన నిప్పులా మారింది. ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియని భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడు ఏమవుతుందోనని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఇదీ సికింద్రాబాద్ మారేడుపల్లిలోని దృశ్యం. బన్నప్ప అనే యువకుడి మృతి... పోలీస్ స్టేషన్లో బస్తీవాసుల విధ్వంసంతోస్థానికంగా భయానక వాతావరణం నెలకొంది. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, టాస్క్ఫోర్స్ పోలీసులతో ఆ ప్రాంతం నిండిపోయింది. వచ్చే ఆదివారం బోనాలకు మారేడుపల్లి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి చోటు చేసుకున్న సంఘటన ఇటు పోలీసులనూ...అటు స్థానికులనూ కలవరానికి గురి చేస్తోంది. మారేడుపల్లి పోలీస్ స్టేషన్ పూర్తి స్థాయిలో ధ్వంసం కావడాన్ని పోలీసులు జీర్ణించుకోలేకపోతున్నారు. పోలీస్ స్టేషన్ సీసీ కెమెరాలు, కంట్రోల్ బాక్స్లను ధ్వంసం చేసినప్పటికీ ఒక సీసీ కెమెరా పుటేజ్లు పోలీసుల చేతికి చిక్కాయి. దాడులకు పాల్పడిన సమయంలో స్టేషన్లో ఎస్ఐలు రవికుమార్, మధుతో పాటు మరో ముగ్గురు కానిస్టేబుళ్లు మాత్రమే ఉన్నారు. పెద్ద సంఖ్యలో జనం దూసుకు రావడంతో వారు నిస్సహాయంగా నిలవాల్సి వచ్చింది. సిబ్బంది తమను తాము రక్షించుకునేందుకు పడరాని పాట్లు పడ్డారు. దాడికి పాల్పడిన వారి వివరాలను ఎస్ఐలు, కానిస్టేబుళ్లు పోలీసు ఉన్నతాధికారులకు తెలియజేశారు. బన్నప్ప అంత్యక్రియలు ముగిసే వరకు పోలీసులు ఆచితూచి వ్యవహరించారు. వివరాల సేకరణ... పోలీస్ స్టేషన్పై దాడికి పాల్పడిన వారి వివరాలను పోలీసులు సేకరిస్తుండడంతో మహాత్మాగాంధీ నగర్ వాసులు హడలిపోతున్నారు. ఇంటి వద్ద ఉండకుండా ఇతర ప్రాంతాల్లో ఆశ్రయం పొందుతున్నారు. ఏ క్షణాన పోలీసులు తమ ఇళ్లపైకి వస్తారోననే భయంతో కొన్ని కుటుంబాల వారు భయం భయంగా గడుపుతున్నారు. మంత్రి పద్మారావుతో చర్చలు జరిపిన బస్తీవాసులు బన్నప్ప కుటుంబాన్ని ఆదుకోవడంతో పాటు తమపై కేసులు లేకుండా చూడాలని కోరారు. ఈ విషయంపై మంత్రి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో బస్తీవాసుల్లో మరింత టెన్షన్ నెలకొంది. ఈ దాడిలో స్థానికులతో పాటు కొందరు పాత నేరస్థుల హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా ఆరా తీస్తున్నారు. మరోవైపు పోలీసుల మోహరింపుతో మారేడుపల్లి పరిసర ప్రాంతాల్లో కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
తప్పక చదవండి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement