breaking news
PECET notification
-
31న ఎడ్సెట్, పీఈసెట్ అడ్మిషన్ నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: టీజీ ఎడ్సెట్, టీజీ పీఈసెట్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ప్రవేశాల నోటిఫికేషన్ ఈనెల 31న విడుదల కానుంది.శనివారం తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆర్.లింబాద్రి అధ్యక్షతన జరిగిన టీజీ ఎడ్సెట్, టీజీ పీఈసెట్ అడ్మిషన్ కమిటీ సమావేశంలో అడ్మిషన్లకు సంబంధించి కౌన్సెలింగ్పై అధికారులు చర్చించారు.. వేర్వేరుగా కౌన్సెలింగ్ షెడ్యూల్ను విడుదల చేశారు. టీజీ ఎడ్సెట్, టీజీ పీఈసెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్లను 31న విడుదల చేయాలని నిర్ణయించారు. పూర్తిస్థాయి షెడ్యూల్, ఇతర సమాచారాన్ని వెబ్సైట్లలో అందుబాటులో ఉంచారు. -
పరీక్షలకు వేళాయె!
సాక్షి, హైదరాబాద్: బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (బీపీఈడీ), డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (డీపీఈడీ) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న పీఈసెట్–2020 నోటిఫికేషన్ను ఈనెల 21న జారీ చేయాలని ప్రవేశాల కమిటీ నిర్ణయించింది. ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన పీఈసెట్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్లో దరఖాస్తులను ఈనెల 21వ తేదీ నుంచి ఏప్రిల్ 13వ తేదీ వరకు స్వీకరించాలని నిర్ణయించింది. బీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం పరీక్ష రాసే అభ్యర్థికి 2020 జూలై 1వ తేదీ నాటికి 19 ఏళ్లు నిండి ఉండాలి. దాంతో పాటు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదివే విద్యార్థులు, డిగ్రీ ఉత్తీర్ణులైన వారు అర్హులు. డీపీఈడీ కోర్సులకు ఇంటర్మీడియట్ సెకండియర్ చదువుతున్న వారు, ఇంటర్ పూర్తయిన వారు ప్రవేశ పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2020 జూలై 1వ తేదీ నాటికి సదరు విద్యార్థికి 16 ఏళ్లు నిండి ఉండాలి. మే 13వ తేదీ నుంచి నిర్వహించే ఈ పరీక్షకు హాజరు కావాలనుకునే విద్యార్థులు రూ.800 పరీక్ష ఫీజును, ఎస్సీ, ఎస్టీలైతే రూ.400 పరీక్ష ఫీజును ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంటుంది. పరీక్షకు సంబంధించిన మరిన్ని వివరాలను https:// pecet.tsche.ac.in వెబ్సైట్లో పొందవచ్చు. మే 28 నుంచి పీజీఈసెట్ ఎంఈ/ఎంటెక్/ఎం.ఆర్క్/ఎం.ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న పీజీఈసెట్ నోటిఫికేషన్ను మార్చి 4వ తేదీన జారీ చేయాలని ప్రవేశాల కమిటీ నిర్ణయించింది. ఆన్లైన్ దరఖాస్తులను వచ్చే నెల 12వ తేదీ నుంచి 30వ తేదీ వరకు స్వీకరించనుంది. ఆలస్య రుసుముతో మే 26వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించాలని నిర్ణయించింది. పరీక్షలను మే 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనుంది. ప్రతిరోజు ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు రెండు దఫాలుగా ఆన్లైన్లో పరీక్షలను నిర్వహించనుంది. హైదరాబాద్, వరంగల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తామని పేర్కొంది. 28న ఉదయం ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, టెక్స్టైల్ టెక్నాలజీ, మైనింగ్ ఇంజనీరింగ్లో ప్రవేశాలకు పీజీఈసెట్ను నిర్వహిస్తారు. అదేరోజు మధ్యాహ్నం ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్, బయోమెడికల్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ ఇంజనీరింగ్కు పరీక్ష ఉంటుంది. 29న ఉదయం జియో ఇంజనీరింగ్, జియో ఇన్ఫర్మాటిక్స్, ఫార్మసీకి పరీక్ష ఉంటుంది. అదేరోజు మధ్యాహ్నం కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ప్రవేశాలకు పరీక్ష ఉంటుంది. 30న ఉదయం ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, మెకానికల్ ఇంజనీరింగ్కు, అదేరోజు మధ్యాహ్నం సివిల్, ఎలక్ట్రికల్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఫుడ్ టెక్నాలజీకి పరీక్ష నిర్వహిస్తారు. 31వ తేదీన ఉదయం ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్, మధ్యాహ్నం నానో టెక్నాలజీకి ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తారు. 120 మార్కులకు నిర్వహించే ఈ పరీక్షల్లో ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు, మల్టిఫుల్ చాయిస్ జవాబులుంటాయి. ఆన్లైన్ దరఖాస్తులు, ఇతర వివరాలను https://www.pgecet.tsche.ac.in, http://www.tsche.ac.in వెబ్సైట్లో పొందవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.1,000గా సెట్ కమిటీ నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులైతే రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. -
పీఈసెట్ నోటిఫికేషన్ ఎప్పుడు?
- వారం కిందటే ఏర్పాట్లు.. ఇప్పటికీ జారీ కాని వైనం సాక్షి, హైదరాబాద్: బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (బీపీఈడీ), డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (డీపీఈడీ) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించాల్సిన ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్టు (పీఈసెట్)పై గందరగోళం నెలకొంది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఈనెల 23న నోటిఫికేషన్ జారీ చేసి, 24 నుంచి దరఖాస్తులను స్వీకరించాల్సి ఉంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మే 15 నుంచి ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్టును నిర్వహించాల్సి ఉంది. కానీ ఉస్మానియా యూనివర్సిటీలో అంతర్గంగా నెలకొన్న సమస్యల కారణంగా నోటిఫికేషన్ జారీ నిలిచిపోయింది. దీంతో వేల మంది విద్యార్థులకు ఎదురుచూపులు తప్పడం లేదు. అసలేం జరిగిందంటే... యూనివర్సిటీకి చెందిన ఓ ప్రొఫెసర్ తనకు పీఈసెట్ కన్వీనర్ బాధ్యతలు ఇవ్వలేదని ఆందోళన వ్యక్తం చేస్తూ అధికారులకు ఎస్ఎంఎస్ పంపించి, ఒక రోజంతా కనపడ కుండాపోవడంతో యూనివర్సిటీలో ఆందోళ నకర పరిస్థితి నెలకొంది. దీంతో 23న జారీ చేయాల్సిన నోటిఫికేషన్ను అధికారులు నిలిపివేశారు. ఆ తరువాత ఆయన తిరిగి రావడంతో అధికారులు ఊపిరి పీల్చుకు న్నారు. ఇది జరిగి వారం గడిచి పోయింది. అయినా ఇంతవరకు నోటిఫి కేషన్ను జారీ చేయలేదు. కాగా, ప్రస్తుతం నోటిఫికేషన్ జారీ ఆలస్యం అవుతుండటం, దరఖాస్తుల స్వీకరణ తేదీలు కూడా మారిపోయినందున ఇక వచ్చే నెలలోనే దరఖాస్తులను స్వీకరించే అవకాశాలు ఉన్నట్లు ఉన్నత విద్యా మండలి అధికారులు చెబుతున్నారు. మే 15 నుంచి ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్టు నిర్వహణ సాధ్యం కాదని, మే 25 నుంచి నిర్వహించే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు.