-
ఆస్ట్రేలియా-భారత్ తొలి వన్డే.. రోహిత్ మూడో డబుల్ సెంచరీ ఇక్కడే! బ్యాటర్లకు పండగే
ఆసియాకప్-2023 విజయం తర్వాత టీమిండియా మరో కీలక పోరుకు సిద్దమైంది. స్వదేశంలో వరల్డ్కప్కు ముందు ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్లో భారత్ తలపడనుంది. ఈ సిరీస్లో భాగంగా తొలి వన్డే మొహాలీ వేదికగా శుక్రవారం జరగనుంది. ఇక ఈ సిరీస్లో తొలి రెండు వన్డేలకు భారత జట్టు రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్య, కుల్దీప్ యాదవ్కు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. ఈ సిరీస్లో భారత జట్టు కెప్టెన్గా కేఎల్ రాహుల్ వ్యవహరించాడు. ఇక ఇది ఇలా ఉండగా.. మొహాలీలో ఆస్ట్రేలియాపై భారత్ ఒక్క వన్డే మ్యాచ్లో కూడా గెలవలేదు. ఇప్పుడు ఆసీస్తో నాలుగు మ్యాచ్లు ఆడిన టీమిండియా.. అన్నింటిలోను ఓటమి పాలైంది. ఈ క్రమంలో నేడు జరగబోయే తొలి వన్డేల్లో ఎలాగైనా విజయం సాధించాలని రాహుల్ సేన ఉవ్విళ్లూరుతోంది. ఇక తొలి వన్డే జరగబోయే మొహాలీలోని పీసీఏ ఐఎస్ బింద్రా స్టేడియం పిచ్ రిపోర్ట్ను ఓ సారి పరిశీలిద్దాం. పిచ్ రిపోర్టు.. మొహాలీలోని పిచ్ బ్యాటర్లకు స్వర్గధామం. వికెట్ను కూడా బ్యాటింగ్కు అనుకూలించే విధంగా తాయారు చేసినట్లు తెలుస్తోంది. ఈ వేదికపై ఆడిన చివరి ఐదు మ్యాచ్లలో .. నాలుగు సార్లు మొదట బౌలింగ్ చేసిన జట్టు విజేతగా నిలిచింది. కేవలం ఒక్కసారి మాత్రమే తొలుత బ్యాటింగ్ చేసిన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకునే ఛాన్స్ ఉంది. ఈ స్టేడియంలో అత్యధిక స్కోర్ సాధించిన రికార్డు భారత్ పేరిటే ఉంది. 2017 శ్రీలంకతో జరిగిన వన్డేలో టీమిండియా ఏకంగా 392 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఈ మ్యాచ్లోనే టీమిండియా ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ(208) డబుల్ సెంచరీతో చెలరేగాడు. ఇక ఇక్కడ నాలుగేళ్లుగా వన్డే జరగలేదు. కానీ ఐపీఎల్ మ్యాచ్లు మాత్రం జరిగాయి. ప్రతీ మ్యాచ్లోనూ బ్యాటర్లే పైచేయి సాధించారు. ఇక ఈ మ్యాచ్కు ఎటువంటి వర్షసూచన లేదు. చదవండి: IND vs AUS: వన్డేల్లో భారత్పై ఆస్ట్రేలియాదే పైచేయి.. కనీసం ఒక్క మ్యాచ్లో కూడా! -
PCA కు హర్భజన్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్
-
మరో 3 బ్యాంకులు పీసీఏ నుంచి బయటకు?
న్యూఢిల్లీ: ఆర్బీఐ కచ్చితమైన దిద్దుబాటు కార్యక్రమం (పీసీఏ) నుంచి మరో మూడు బ్యాంకులు వచ్చే ఆరు నుంచి తొమ్మిది నెలల కాలంలో బయటకు వస్తాయని కేంద్ర ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. ప్రభుత్వం నుంచి నిధుల సాయం, ఎన్పీఏల తగ్గుదల వంటి అంశాలతో ఈ అంచనాలు పెట్టుకుంది. 12 ప్రభుత్వరంగ బ్యాంకులకు రూ.48,239 కోట్లు నిధులు ఇవ్వాలని ప్రభుత్వం ఇటీవలే నిర్ణయించిన విషయం తెలిసిందే. దీంతో వచ్చే కొన్ని వారాల్లోనే కార్పొరేషన్ బ్యాంకు, అలహాబాద్ బ్యాంకులను పీసీఏ నుంచి తొలగించే అంశంపై ఆర్బీఐ నిర్ణయం తీసుకుంటుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా ఈ విడత ప్రభుత్వ నిధుల సాయంలో... అత్యధికంగా రూ.9,086 కోట్లతో కార్పొరేషన్ బ్యాంకు, రూ.6,896 కోట్లతో అలహాబాద్ బ్యాంకు లబ్ధి పొందనున్నాయి. ఈ నిధులతో మూలధన నియంత్రణ ప్రమాణాలను అవి చేరుకోవడానికి అవకాశం లభిస్తుంది. గత డిసెంబర్లో ప్రభుత్వం ప్రకటించిన మూలధన నిధుల సాయం అనంతరం బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓబీసీ, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలకు పీసీఏ నుంచి విముక్తి లభించింది. దీంతో పీసీఏ పరిధిలో బ్యాంకుల సంఖ్య 11 నుంచి 8కి తగ్గింది. ఏప్రిల్ 1 నుంచి దేనా బ్యాంకు బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనం అవుతుండడంతో ఈ సంఖ్య 7కు తగ్గనుంది. -
బ్యాంకింగ్లో రికవరీ షురూ
ముంబై: పేరుకుపోయిన మొండిబకాయిలు తగ్గుతుండడంతో బ్యాంకింగ్ రంగం ఊపిరి పీల్చుకుంటోందని ఆర్బీఐ వ్యాఖ్యానించింది. బ్యాంకింగ్ రంగం రికవరీ బాట పట్టినా, పీఎస్యూ బ్యాంకుల్లో పాలనా పరంగా మరిన్ని సంస్కరణలు రావాల్సి ఉందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్దాస్ అభిప్రాయపడ్డారు. సోమవారం ఆర్బీఐ అర్ధ వార్షిక ఆర్థిక స్థిరత్వ నివేదికను (ఎఫ్ఎస్ఆర్) విడుదల చేసిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. స్థూల ఎన్పీఏలు తగ్గుముఖం పట్టాయని నివేదిక వెల్లడించింది. పదకొండు బ్యాంకులను పీసీఏ చట్రం కిందకు తీసుకురావడంతో బ్యాంకింగ్ రంగంలో క్రమశిక్షణ వచ్చినట్లయిందని తెలిపింది. ఐఎల్అండ్ఎఫ్ఎస్ సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకొని ఫైనాన్షియల్ దిగ్గజాల ఆర్థిక స్థిరత్వంపై ఎక్కువ ఫోకస్ పెడతామని సూచించింది. మొండిపద్దులు తగ్గుతున్నాయ్ ఎఫ్ఎస్ఆర్ ప్రకారం... గత మార్చిలో 11.5 శాతం ఉన్న బ్యాంకుల స్థూల ఎన్పీఏలు సెప్టెంబర్ నాటికి 10.8 శాతానికి దిగివచ్చాయి. ఇదే కాలంలో పీఎస్యూ బ్యాంకుల జీఎన్పీఏలు 15.2 నుంచి 14.8 శాతానికి తగ్గాయి. ప్రైవేట్ బ్యాంకుల జీఎన్పీఏలు 4 నుంచి 3.8 శాతానికి పరిమితమయ్యాయి. ఇదే జోరు కొనసాగితే వచ్చే మార్చినాటికి బ్యాంకులన్నింటి స్థూల ఎన్పీఏలు 10.3 శాతానికి, పీఎస్బీల జీఏన్పీఏలు 14. 6 శాతానికి, ప్రైవేట్ బ్యాంకుల జీఎన్పీఏలు 3.3 శాతానికి తగ్గవచ్చని నివేదిక అంచనా వేసింది. నికర ఎన్పీఏలు గత మార్చిలో 6.2 శాతం ఉండగా మార్చినాటికి 5.3 శాతానికి పతనమయ్యాయి. 2015 అనంతరం అటు స్థూల, నికర ఎన్పీఏల్లో అర్ధవార్షిక తరుగుదల నమోదు కావడం ఇదే తొలిసారి. రిస్ట్రక్చర్డ్ స్టాండర్డ్ అడ్వాన్సుల (ఆర్ఎస్ఏ) నిష్పత్తి సెప్టెంబర్ నాటికి 0.5 శాతానికి పతనమైందని, ప్రొవిజన్ కవరేజ్ నిష్పత్తి (పీసీఆర్) 51 శాతానికి పెరిగిందని, క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ అసెట్ నిష్పత్తి (సీఆర్ఏఆర్) 13.7 శాతానికి వచ్చిందని నివేదిక వెల్లడించింది. సెప్టెంబర్నాటికి బ్యాంకు పోర్టుఫోలియోల్లో పెద్ద రుణఖాతాలు 54.6 శాతానికి, బ్యాంకుల జీఎన్పీఏల్లో బడా బకాయిల వాటా 83.4 శాతానికి చేరాయని వివరించింది. ‘‘ప్రస్తుత ఎన్పీఏలు అధికమే. కానీ తరుగుదల రేటును పరిశీలిస్తే ఇవి మరింత దిగొస్తాయనిపిస్తోంది. నిజానికి ఎన్పీఏ అంశంలో ఈ మెరుగుదల చాలదు. పీఎస్యూ బ్యాంకుల నిర్వహణా సామర్ధ్యాన్ని మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. దీనికోసం మరిన్ని పాలనా సంస్కరణలు తీసుకురావడం, బలహీన పీఎస్బీలకు రీక్యాప్ సాయం అందించడం తదితర చర్యలు అవసరం’’ అని దాస్ చెప్పారు. ఎన్పీఏలను గుర్తించే ప్రక్రియతో పీఎస్బీల్లో రిస్క్ మేనేజ్మెంట్ మెరుగుపడిందన్నారు. క్రమశిక్షణ తెచ్చిన పీసీఏ ఇరవై పీఎస్బీల్లో 11 బ్యాంకులను పీసీఏ (స్పష్టమైన దిద్దుబాటు చర్యల) పరిధిలోకి తీసుకురావడం మంచిదయిందని దాస్ అభిప్రాయపడ్డారు. క్రెడిట్ అంచనా, మార్కెట్ రిస్కు అంచనాలకు సంబంధించి పీసీఏ కారణంగా బ్యాంకుల్లో క్రమశిక్షణ వచ్చిందన్నారు. దివాలా చట్టం కింద చేర్చిన కేసుల్లో కొంత జాప్యం జరుగుతున్నా, ఈ చట్టం కారణంగా విత్త క్రమశిక్షణ వస్తుందన్నారు. గత నాలుగు త్రైమాసికాల్లో పీసీఏ కారణంగా 11 పీఎస్బీల సాల్వెన్సీ నష్టాలు 73,500 కోట్ల రూపాయల నుంచి 34,200 కోట్ల రూపాయలకు దిగివచ్చాయిని ఆర్బీఐ నివేదిక తెలిపింది. క్రూడాయిల్ ధరలు తగ్గడం, స్థూల స్థిర మూలధన ఏర్పాటులో వృద్ధి కారణంగా ఎకానమీలో వృద్ధి ముందుకే సాగుతుందని దాస్ అంచనా వేశారు. వాణిజ్య భయాలు తగ్గుతున్నాయన్నారు. ఎఫ్సీలపై డేగ కన్ను భారీ ఆర్థిక సామ్రాజ్యాల (ఎఫ్సీ) విత్త స్థిరత్వంలో రిస్కును ఐఎల్అండ్ఎఫ్ఎస్ సంక్షోభం ఎత్తిచూపిందని ఆర్బీఐ తన నివేదికలో పేర్కొంది. వీటిపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందని తెలిపింది.ఎఫ్సీల్లో కచ్చితమైన రిస్కులుండేందుకు పలు అవకాశాలున్నాయని అభిప్రాయపడింది. ప్రస్తుతం ఎఫ్సీల స్థితిగతులను ఐఆర్ఎఫ్– ఎఫ్సీ పర్యవేక్షిస్తోంది. ఐఆర్ఎఫ్ పర్యవేక్షణ అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఉన్నా, మరింత మెరుగుదల అవసరమని నివేదిక తెలిపింది. ఇకపై అన్ని ఎఫ్సీలు త్రైమాసికానికొకసారి తమ వద్ద జరిగిన ఇంటర్గ్రూప్ లావాదేవీల డేటాను సమర్పించాలని ఆర్బీఐ ఆదేశించింది. ఎఫ్సీలకు క్రెడిట్ రేటింగ్ ఏజన్సీలు ఇచ్చే రేటింగ్ ప్రమాణాలపై సెబీ తీసుకువచ్చిన మార్పులు అవసరమని తెలిపింది. నివేదికలో మరికొన్ని ముఖ్యాంశాలు... ∙ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో భారత బహిర్గత రుణభారం 3.6 శాతం తగ్గి 52,970 కోట్ల డాలర్ల నుంచి 51,040 కోట్ల డాలర్లకు చేరింది ∙2017 సెప్టెంబర్తో పోలిస్తే గత సెప్టెంబర్ నాటికి ఎన్బీఎఫ్సీల బాలెన్స్ షీటు 17.2 శాతం పెరిగి 26 లక్షల కోట్ల రూపాయలకు చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర ప్రథమార్ధంలో ఈ రంగ నికర లాభంలో 16.2 శాతం వృద్ధి నమోదయింది. ఎన్బీఎఫ్సీ రంగ స్థూల ఎన్పీఏలు 5.8 శాతం నుంచి 6.1 శాతానికి విస్తరించాయి. లోన్సు, అడ్వాన్సుల్లో వరుసగా 16.3, 14.1 శాతం పెరుగుదల నమోదయింది. ∙విత్త వ్యవస్థలోని మొత్తం ఆర్థిక లావాదేవీల్లో(ఆర్థిక సంస్థల మధ్యన జరిగే లావాదేవీలు– బైలేటరల్ ఎక్స్పోజర్స్) బ్యాంకుల ద్వైపాక్షిక విత్త లావాదేవీల వాటా 46.5 శాతానికి చేరింది. విత్త వ్యవస్థలో ఇలాంటి ద్వైపాక్షిక విత్తలావాదేవీలు అవసరం, కానీ కొన్ని సార్లు ఈ తరహా లావాదేవీలు అనుకోని రిస్కులు వ్యాపించేందుకు కారణమవుతుంటాయి. ∙నియంత్రణా సంస్థల మధ్య మరింత సహకారం అవసరం. నియంత్రణా సంస్థలు కలిసికట్టుగా పనితీరు కనబరిస్తే చట్టాల్లోని లోపాలను అడ్డుపెట్టుకొని ఆటలాడే సంస్థల ఆట కట్టించవచ్చు. -
మిస్ యు సచిన్!
మొహాలీ: సచిన్ మ్యాచ్ ఆడినా...ఆడకున్నా మైదానంలో, అభిమానుల మనసుల్లో ఎక్కడో ఒక చోట తప్పకుండా ఉంటాడు. శనివారం మూడో వన్డే సందర్భంగా పీసీఏ స్టేడియంలోనూ అదే జరిగింది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో కొద్ది సేపు మైదానం పైన ఒక చిన్న సైజు విమానం చక్కర్లు కొట్టింది. దానికి ‘వి విల్ మిస్ యు టెండూల్కర్’ అని రాసిన ఒక బ్యానర్ కట్టి ఉండటం ప్రత్యేకాకర్షణగా కనిపించింది. ఒక ఆభరణాల బ్రాండ్కు చెందిన సంస్థ విమానాన్ని అద్దెకు తీసుకొని ఈ తరహాలో తమ అభిమానం చాటుకుంది. మరో వైపు చాలా కాలం విరామం తర్వాత సొంత గడ్డపై ఆడిన యువరాజ్ సింగ్ తొలి బంతికే వెనుదిరగడం అభిమానులను తీవ్రంగా నిరాశ పరచింది.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- Bhuma VS AV! అఖిలప్రియ బాడీ గార్డ్ పరిస్థితి విషమం
- చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చిన బీజేపీ!
- అజిత్ షాకిచ్చిన త్రిష.. ఏకంగా చిరు, కమల్ కోసం!
- గనిలో చిక్కుకున్న 14 మంది అధికారులు.. కొనసాగుతున్న సహాయక చర్యలు!
- తాడిపత్రిలో టీడీపీ శ్రేణుల విధ్వంసకాండ
- 20 వరకు వర్షాలే
- రాష్ట్రంలో 81.3% పోలింగ్!
- దేశంలో ఐఐఎం–అహ్మదాబాద్ టాప్
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
- విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం
Advertisement