సీబీఐ వలలో ఐటీ చీఫ్ కమిషనర్
రాజస్థాన్: భారీ మొత్తంలో లంచం తీసుకుంటూ జోధ్పూర్ ఐటీ చీఫ్ కమిషనర్ పీకే శర్మ సీబీఐ వలకు చిక్కారు. దాదాపూ రూ. 15 లక్షలు లంచం తీసుకుంటున్న సమయంలో ఆయన్ని సీబీఐ అరెస్ట్ చేసింది. ఇదే కేసులో మాజీ ఐటీ ఉన్నతాధికారి శైలేంద్ర బండారిని కూడా సీబీఐ అరెస్ట్ చేసింది. అనంతరం వారిని సీబీఐ కార్యాలయానికి తరలించింది.