-
TS: రాష్ట్రానికి జ్వరం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. డెంగీ, మలేరియా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గత రెండు నెలల్లో రాష్ట్రంలో 5 లక్షల మంది జ్వరాల బారినపడినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ అంచనా. జూలైలో 2 లక్షలు, ఆగస్టులో 3 లక్షల మంది జ్వరం బారినపడ్డారు. తరచూ వర్షాలు పడటం, వాతావరణం చల్లబడటం, పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేక.. తదితర కారణాలతో దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. రాత్రీ పగలూ అనే తేడా లేకుండా దోమలు కుడుతున్నాయి. దీంతో పట్టణం, పల్లె అనే తేడా లేకుండా విషజ్వరాలతో బాధపడుతున్నవారి సంఖ్య ఒక్కసారిగా గణ నీయంగా పెరిగినట్లుగా వైద్య యంత్రాంగం అంచనా. ఈ నెలంతా కూడా జ్వరాలు కొనసాగే పరిస్థితి ఉందని హెచ్చరిస్తున్నారు. డెంగీ, మలేరియా కేసులు మరింత అధికంగా నమోదయ్యే పరిస్థితులున్నాయి. ఒకవైపు కరోనా అనుమానం... మరోవైపు వైరల్ ఫీవర్లతో జనం హడలిపోతున్నారు. కొన్నిచోట్ల వైద్య, ఆరోగ్యశాఖ నిర్లక్ష్యం బాధితులకు శాపంగా మారింది. అనేక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్లు రావడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆగస్టులో డెంగీ కోరలు... రాష్ట్రంలో డెంగీ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఆగస్టులోనే అత్యధికం వెలుగుచూశాయి. ముఖ్యంగా హైదరాబాద్లో ఎక్కువ కేసులున్నాయి. ఇక మలేరియా కేసులు కూడా భారీగానే నమోదువుతున్నాయి. ఒక్క ఆగస్టులోనే 116 కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది. మలేరియా జ్వరాలు ఎక్కువగా గిరిజన ప్రాంతాల్లో నమోదవుతున్నాయి. ప్రభుత్వ అంచనాకు మించి జ్వరాలు, డెంగీ, మలేరియా వంటి కేసులు ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం... అధికారికంగా ఒక కేసును గుర్తిస్తే, గుర్తింపునకు నోచుకోకుండా సమాజంలో పదింతలు అధికంగా కేసులున్నట్లుగా భావించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆ ప్రకారం రాష్ట్రంలో కేసుల పరిస్థితిని అర్థం చేసుకోవచ్చని అంటున్నారు. ఈ జ్వరాలతో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు తాకిడి పెరిగింది. ప్రైవేట్ ఆసుపత్రులు బాధితులను పీల్చి పిప్పిచేస్తున్నాయి. 50 వేల వరకు ప్లేట్లెట్లు ఉన్నా, ప్లేట్లెట్ రక్తం ఎక్కిస్తూ లక్ష వరకు వసూలు చేస్తున్నాయి. అయితే 10 వేల వరకు తగ్గినా, వెంటనే ప్లేట్లెట్లు ఎక్కించాల్సిన అవసరంలేదని వైద్య నిపుణులు అంటున్నారు. పగటిపూట కుట్టే దోమతో డెంగీ... డెంగీ కారక ఈడిస్ ఈజిప్ట్ దోమ పగటిపూటే కుడుతుంది. ఇళ్లు, కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలల్లో నిల్వ ఉంచే మంచినీటిలోనే పుట్టి పెరుగుతుంది. పగిలిన చిన్నముంతలో ఒక వారం రోజులు కదపకుండా దోసెడు నీరున్నా చాలు. అందులో పునరుత్పత్తి కొనసాగిస్తుంది. ఎయిర్ కూలర్లలో, డ్రమ్ముల్లో నిల్వ ఉంచిన మంచినీటిలో, వాడకుండా పక్కన పడేసిన పాత టైర్లు, రేకు డబ్బాల్లోని నీటిలో జీవనం సాగిస్తుంది. ఇక మలేరియా దోమ మురుగునీటిలో వృద్ధి చెందుతుంది. అందుకే పరిసరాల్లో మురుగు నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. డెంగీని నిర్లక్ష్యం చేయొద్దు – డాక్టర్ బి.సౌమ్య, జనరల్ పిజీషియన్, కాంటినెంటల్ ఆసుపత్రి, హైదరాబాద్ ప్రస్తుతం జ్వరాల కేసులు భారీగానే నమోదవుతున్నాయి. గొంతునొప్పి, జ్వరంతో అనేకమంది ఆసుపత్రులకు వస్తున్నారు. డెంగీ, కరోనా కలిపి గతంలో అధికంగా కేసులు రాగా, ఇప్పుడు డెంగీ కేసులే ఎక్కువగా వస్తున్నాయి. డెంగీలో 102–103 జ్వరం కూడా వస్తుంది. పారసిటమాల్ మాత్ర వేసినా తగ్గే పరిస్థితి ఉండదు. కరోనాలో మాత్ర వేశాక తగ్గుముఖం పడుతుంది. డెంగీ లక్షణాలున్న తర్వాత నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం సంభవిస్తుంది. మాకు వస్తున్న కేసుల్లో 90 శాతం వరకు ఇళ్లలోనే ఉంచి చికిత్స చేస్తున్నాం. 50 వేల వరకు ప్లేట్లెట్లు తగ్గినప్పుడే ఆసుపత్రిలో చేరాల్సి ఉంటుంది. 10 వేల వరకు తగ్గినా కూడా ఒక్కోసారి ప్లేట్లెట్లు ఎక్కించాల్సిన అవసరంలేదు. రక్తస్రావం జరగడం ఇతరత్రా ప్రమాదకర లక్షణాలుంటేనే ప్లేట్లెట్లు ఎక్కించాలి. సోమవారం ఆదిలాబాద్లోని రిమ్స్లో ఒకే బెడ్పై చికిత్స పొందుతున్న ఇద్దరు చిన్నారులు -
వ్యాధుల కాలం
– ముందు జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు – పరిసరాలు, వ్యక్తిగత శుభ్రత ప్రధానం – తాగునీటి కలుషితంపై అప్రమత్తం – వ్యాధి నిర్ధారణ పరీక్షలు తప్పనిసరి వర్షాలు ప్రారంభమయ్యాయి.. వాతావరణంలో మార్పులూ చోటు చేసుకుంటున్నాయి. చిన్నపాటి జల్లులకే పట్టణాల్లో పారిశుద్ధ్యం పడకేస్తోంది. ఇక గ్రామాల్లో పరిస్థితి మరీ ఘోరం. ఈ క్రమంలో దోమలు వ్యాప్తి చెంది రోగాల తీవ్రత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే అనంతపై డెంగీ పంజా విసురుతోంది. ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ బాధితుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చని వైద్యులు చెబుతున్నారు. ప్రధానంగా వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని సూచిస్తున్నారు. వర్షాకాలంలో వచ్చే వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ‘సాక్షి’ కథనం. - అనంతపురం మెడికల్ పరిశుభ్రతే ‘డెంగీ’కి మందు! ఇంటిలోను, పరిసరాల్లోనూ పరిశుభ్రత చర్యలు చేపడితే ‘డెంగీ’కి దూరంగా ఉండొచ్చు. ఉన్నట్టుండి జ్వరం ఎక్కువగా రావడం, తలనొప్పి, కంటి లోపల నొప్పి వచ్చి కంటి కదలికలు తగ్గడం డెంగీ లక్షణాలు. కండరాలు, కీళ్లనొప్పులు అధికమవుతాయి. వాంతి అయినట్లు అనిపిస్తుంది. నోరు ఎండిపోయి దాహం ఎక్కువ వేస్తుంది. ఈ లక్షణాలు ఉన్న వెంటనే సమీపంలోని ఆస్పత్రిలో చూపించుకుంటే మంచిది. దోమతెరలు తప్పకుండా వాడాలి. శరీరంలోని అన్ని భాగాలను కప్పి ఉంచే విధంగా దుస్తులు ధరించాలి. చిన్న పిల్లలయితే వారి శరీర భాగాలు పూర్తిగా కప్పివేసేలా చూసుకోవాలి. నీటి నిల్వ మంచిది కాదు డెంగీ వ్యాధి కారక క్రిమి ఆర్బోవైరస్ జాతికి చెందినది. ఈ వైరస్ అతి సూక్ష్మమైనది. ఏయిడిస్ ఈజిప్ట్ జాతి దోమ నుంచి, రోగగ్రస్తుల నుంచి ఆరోగ్యవంతులకు సంక్రమిస్తుంది. ఈ టైగర్ దోమ సాధారణంగా పగటి పూట మాత్రమే కుడుతుంది. దోమ కుట్టిన తర్వాత ఐదు రోజుల నుంచి 8 రోజుల వ్యవధిలో వ్యాధి లక్షణాలు కన్పిస్తాయి. ఎయిర్ కూలర్లు, రిఫ్రిజిరేటర్లలోని డ్రిప్ ఫ్యాన్, పూలకుండీల కింద ఉన్న సాసర్లు, బయట పెట్టిన టైర్లు, మూతలు పెట్టని..నీరు నిల్వ చేసే తొట్టెలు, కుండీలు, ఖాళీ డ్రమ్ములు, సన్షేడ్స్, బిల్డింగ్స్పై నీరు నిలిచిన చోట టైగర్ దోమలు గుడ్లు పెట్టి పెరుగుతాయి. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండే అవకాశం ఉన్నా.. ఆ నీరు వారం పాటు నిల్వ ఉంటే ఈ రకమైన దోమలు వృద్ధి చెందుతాయి. చిన్నారులకు ‘న్యుమోనియా’ శాపం వాతావరణంలోని మార్పులతో న్యుమోనియా కేసులు పెరిగే అవకాశం ఉంది. ఈ వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే పిల్లలను సాధ్యమైనంత వరకు చల్లని వాతావరణానికి దూరంగా ఉంచాలి. కిటీకీలు, వెంటిలేషన్ ఉన్న చోట పడుకోనివొద్దు. వెచ్చని దుస్తులు ధరించాలి. డబ్బా పాలు తాగేవారిలో, రక్తహీనత, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో, కుటుంబ పరంగా ఆస్తమా, అలర్జీ ఉంటే న్యూమోనియా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కలుషిత నీటితో ‘అతిసార’ కలుషిత నీరు తాగడం, ఆహార పదార్థాలు తినడం వల్ల అతిసార సోకుతుంది. నిలువ ఉన్న ఆహార పదార్థాలు తినడం మంచిది కాదు. మంచి నీరు సరఫరా చేసే పైపులు పగిలిపోయి అందులో కలుషిత నీరు కలవడం వల్ల ఈ వ్యాధి ప్రబలే అవకాశం ఉంది. ఇటీవల కురిసిన వర్షాలతో గ్రామీణ ప్రాంతాల్లో మంచినీరు కలుషితమవుతోంది. ఆ నీటిని తాగడం వల్ల అతిసార ప్రబలే అవకాశం ఉంది. వాంతుల, విరేచనాలు, కడుపునొప్పి, దాహం, నోరు ఎండిపోవడం, మూత్ర విసర్జన తగ్గిపోవడం అతిసార లక్షణాలు. ఈ వ్యాధి రాకముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. ప్రధానంగా క్లోరిన్ కలిపిన నీరు సరఫరా అవుతోందా? లేదా? పరిశీలించాలి. గ్రామాల్లోని వాటర్ ట్యాంకుల్లో సరిగ్గా బ్లీచింగ్ అవుతోందా పరిశీలించాలి. ఒకవేళ ఏదైనా లోపం ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పగిలిన పైపులను మరమ్మతు చేయించుకోవాలి. ఓఆర్ఎస్ పాకెట్లను నిలువ ఉంచుకోవాలి. ఇంట్లో నీటిని కాచి..చల్లార్చి.. తాగే అలవాటు చేసుకోవాలి ప్రాథమిక దశలో గుర్తిస్తే ‘మలేరియా’కు చెక్ సీజనల్గా వచ్చే మలేరియాను ప్రాథమిక దశలోనే గుర్తించి సమీపంలోని ఆరోగ్య కేంద్రాలు, ఆస్పత్రుల్లో పరీక్ష చేయించుకోవాలి. జూన్ నుంచి అక్టోబర్ మధ్యలో ఎక్కువగా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. రోజు విడిచి రోజు జ్వరం రావడం, తలనొప్పి, ఒంటి నొప్పులు, వణుకుతో కూడిన జ్వరం, చెమటలు పట్టడం, రక్తహీనత వంటి లక్షణాలతో బాధపడుతున్న వారు వెంటనే వ్యాధి నిర్ధారణ కోసం రక్తపరీక్షలు చేయించుకోవాలి. ముందస్తు జాగ్రత్తగా దోమకాటుకు గురికాకుండా దోమతెరలు వాడాలి. ఇంటి లోపల, బయట నీటి నిల్వలు లేకుండా జాగ్రత్త వహించాలి. నీటి తొట్టెలను వారానికి ఒకసారి శుభ్రం చేసుకోవాలి. కాంపౌండ్లో తాగేసిన కొబ్బరి బోండాలు, వాడిన టైర్లు, వాడకంలో లేని రోళ్లు ఉంచకూడదు. ఇంటిపై వాటర్ ట్యాంకులకు మూతలు బిగించాలి. సెప్టిక్ ట్యాక్ గాలిగొట్టాలకు ఇనుప జాలీ బిగించాలి ఇంటికీ ‘చికిత్స’ అవసరం : రోగాలు ప్రబలడానికి ఇంటిలోపల, పరిసరాలు కూడా ఓ కారణమే. అందుకే వాటిని శుభ్రం చేసుకోవడం ఉత్తమం. ఇంట్లోని పాత్రలన్నీ వాడుకున్న తర్వాత ఎప్పుడూ పొడిగా ఉంచాలి. నీరు నిల్వ ఉండే పాత్రల్ని వాటితో పని అయిన తర్వాత బోర్లించాలి. కూలర్లో నీరు మార్చడం వీలు కానప్పుడు కొన్ని చుక్కల కిరోసిన్ వేయాలి. పెరటి, అటక మీద ఉన్న అనవసరమైన పాత్రలన్నీ తీసివేయాలి. ఇళ్లలోని చెత్తను మురుగు కాల్వల్లో వేయకూడదు. చిన్న పిల్లల పట్ల నిర్లక్ష్యం వద్దు చిన్నపిల్లలకు జ్వరం వచ్చిన వెంటనే వైద్యుల్ని సంప్రదించటం తప్పనిసరి. 100.4 డిగ్రీల కంటే ఎక్కువగా జ్వరం ఉన్నపుడు కాళ్లు, చేతులు నీలం రంగులోకి మారటం, పక్కలు ఎత్తేయటం చేస్తే తప్పనిసరిగా న్యుమోనియా ఉన్నట్లు గుర్తించాలి. చికిత్సలో ఆలస్యం జరిగితే మూర్ఛ వచ్చే అవకాశం ఉంది. జలుబు, దగ్గు ఉంటే తల్లిదండ్రులు ఏ మాత్రం నిర్లక్ష్యం చేయద్దు. వంట చేసే ముందు.. భోజనం వడ్డించే సమయంలో..భోజనం చేసే ముందు..మల విసర్జనకు వెళ్లి వచ్చిన తర్వాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. పరిశుభ్రమైన నీటిని తాగాలి. – డాక్టర్ ప్రవీణ్దీన్కుమార్, చిన్న పిల్లల వైద్యుడు, సర్వజనాస్పత్రి, అనంతపురం అప్రమత్తంగా ఉన్నాం వ్యాధుల నియంత్రణకు అప్రమత్తంగా ఉన్నాం. ఇప్పటికే వైద్యులందరికీ ప్రత్యేక ఆదేశాలు జారీ చేశాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాల్సిందే. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడతాం. జిల్లా వ్యాప్తంగా ఎక్కడా మందుల కొరత లేదు. అలాంటి పరిస్థితి ఉంటే తక్షణం మా దృష్టికి తీసుకురండి. - డాక్టర్ వెంకటరమణ, డీఎంహెచ్ఓ
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement