breaking news
Patangi
-
టోల్ప్లాజా వద్ద ఆర్టీసీ బస్సు బీభత్సం
సాక్షి, యాదాద్రి: ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా అదుపు కోల్పోయిన బస్సు టోల్ప్లాజా వద్ద ఆగిన వరుస వెంబడి కార్లను ఢీకొట్టింది. ఈ ఘటనలో మూడు కార్లు ధ్వంసమయ్యాయి. అయితే, అదృష్టవశాత్తు ఎవరూ ఈ ఘటనలో గాయపడలేదు. యాదాద్రి జిల్లాలోని పతంగి టోల్ప్లాజా వద్ద ఈ ఘటన జరిగింది. మణుగూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఒక్కసారిగా అదుపు కోల్పోయి.. ముందువరుసలో ఉన్న మూడు కార్లను ధ్వంసం చేసింది. ఈ ఘటనలో ప్రయాణికులెవరికీ గాయాలు కాలేదు. ఒక్కసారిగా బస్సు బ్రేక్ ఫెయిలవ్వడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని ఆర్టీసీ బస్సు డ్రైవర్ చెప్తున్నారు. -
పతంగ్ మేడిన్ ధూల్పేట్
-
దారమే కదా అనుకుంటే.. పీక తెగ్గోస్తోంది!
ఇక్కడి మాంజా... కోల్కతాలో పంజా.. సిటీ నుంచి భారీగా స్మగ్లింగ్ తక్కువ ధరకు విక్రయిస్తున్న వ్యాపారులు.. పతంగ్లకు వాడుతున్న అక్కడి యువత ఎగరేస్తుండటంతో పలువురికి గాయాలు.. కట్టడి కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు హైదరాబాద్లో తయారవుతున్న గాజు రజనుతో కూడిన మాంజా పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో పంజా విసురుతోంది. అక్కడి కరయ ప్రాంతంలో ఉన్న మా ఫ్లైఓవర్ వద్ద దీన్ని వినియోగించి అనేక మంది పతంగులు ఎగరేస్తున్నారు. ఫలితంగా ఫ్లైఓవర్ పై ప్రయాణిస్తున్న వాహనచోదకులు గాయపడుతున్నారు. గత ఏడాది డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు దాదాపు 46 మంది మాంజా కారణంగా తీవ్రంగా గాయపడ్డారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న కరయ పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. మరోపక్క హైదరాబాద్ నుంచి అక్రమ రవాణా అవుతున్న మాంజాను అడ్డుకోవడానికీ దాడులు ప్రారంభించారు. – సాక్షి, హైదరాబాద్ ఆ ఫ్లైఓవర్ వద్ద దారుణంగా.. ఈ అక్రమ మాంజా వినియోగిస్తుండటం కోల్కతాలోని కొన్ని ప్రాంతాలను రెడ్ జోన్స్గా మార్చేసింది. ప్రధా నంగా కరయ–టాప్సియ ప్రాంతాల మధ్య ఉన్న మా ఫ్లైఓవర్ వద్ద పరిస్థితి మరీ దారుణం. ఈ ఫ్లైఓవర్ చుట్టు పక్కల ఉన్న నివాస ప్రాంతాల్లోని ఇళ్ల పైకి ఎక్కు తున్న యువత ప్రమాదకరమైన మాంజాతో గాలి పటాలు ఎగరేస్తున్నారు. అనేక సందర్భాల్లో దీనితో ఫ్లైఓవర్పై ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనచోదకులు క్షతగాత్రులుగా మారుతున్నారు. ఈ మధ్య ఓ వైద్యుడి పీక కోసుకుపోయినంత పనైంది. ఇలా దాదాపు 46 మంది తీవ్రంగా గాయపడటంతో కరయ పోలీసులు అప్రమత్తమయ్యారు. పతంగులను ఎగరవేసే వారిని పట్టుకోవడానికి ప్రత్యేక బృం దాలను రంగంలోకి దింపారు. ఒక్కోటీమ్లో ఏఎస్సై, కానిస్టేబుల్, వాలంటీర్ గ్రీన్ పోలీసు కూడా ఉంటున్నారు. 38 మందిని పట్టుకున్న బృందాలు.. ఈ ప్రత్యేక బృందాలు గడిచిన నెల రోజుల్లో మా ఫ్లైఓవర్ చుట్టు పక్కల పతంగులు ఎగరేస్తున్న 38 మందిని పట్టుకున్నారు. వీరంతా 13 నుంచి 20 ఏళ్ల మధ్య వయస్కులే కావడంతో వారిని గుర్తించినా ఎలాంటి కేసులూ నమోదు చేయలేదు. పోలీసుస్టేషన్లకు తరలించి వారికి కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు హెచ్చరికలు జారీ చేసి విడిచిపెట్టారు. మరోపక్క ఈ తరహా మాంజాలు విక్రయిస్తున్న దుకాణాల పైనా కోల్కతా పోలీసులు దాడులు చేస్తున్నారు. హైదరాబాద్లో ఈ తరహా మాంజా తయారీని ఆపాలని కోరుతూ కోల్కతా పోలీసులు లేఖ రాయాలనీ అక్కడి అధికారులు భావిస్తున్నారు. ఇక్కడ తగ్గిన బెడద... నగరంలో ఏటా జరిగే సంక్రాంతి వేడుకల్లో జరిగే పతంగుల ఎగురవేత పోటీలు ప్రతిష్టాత్మకంగా ఉంటాయి. దాదాపు ప్రతీ వ్యక్తీ తన పతంగే ఎక్కువ ఎత్తుకు వెళ్లాలని ఆశించడంతో పాటు ఎదుటి వారి గాలిపటాలకు చెందిన దారాలు తెంపాలని యత్నిస్తుంటారు. దీనికోసం గతంలో గాజు రజనుతో కూడిన మాంజాలు వాడేవారు. ఇవి కరెంటు వైర్లు, చెట్లకు చుట్టుకుపోవడంతో పాటు రోడ్ల పైనా ఎగురుతూ ఉండేవి. ఫలితంగా వాహనచోదకులు, పక్షులు తీవ్రంగా గాయపడిన ఉదంతాలు నమోదయ్యాయి.దీంతో పెద్ద స్థాయిలో దుమారం రేగి ప్రభుత్వ యంత్రాంగాలు, పోలీసులు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఫలితంగా ఇక్కడ ఈ మాంజా వాడకం గణనీయంగా తగ్గినా తయారీ మాత్రం ఆగలేదు. ఈ మాంజాకే డిమాండ్ ఎక్కువ.. కోల్కతాలోని వివిధ ప్రాంతాల్లో లభిస్తున్న సురక్షిత మాంజా కంటే హైదరాబాద్ నుంచి తరలుతున్న మాంజాకే డిమాండ్ ఎక్కువ. అక్కడి మాంజా కట్ట ఖరీదు రూ.70 నుంచి రూ.100 వరకు ఉంటోంది. హైదరాబాద్ నుంచి అక్రమ రవాణా చేసింది కేవలం రూ.25 నుంచి రూ.35లకే విక్రయిస్తున్నారు. దీంతో యువత దీనిపైనే మక్కువ చూపుతున్నారు. కోల్కతాకు ఢిల్లీ, సూరత్, బెంగళూరుల నుంచీ మాంజా స్మగ్లింగ్ అవుతున్నప్పటికీ హైదరాబాద్ నుంచి వెళ్తున్నది నైలాన్ తాడుకు పై పూతగా గాజు, లోహపు రజను ఉంటోంది. ఫలితంగా ఇది అత్యంత ప్రమాదకరమైందిగా మారుతోంది. ఈ తరహా మాంజాల క్రయవిక్రయాలపై కోల్కతాలో నిషేధం విధించినా రైళ్లు, బస్సులతో పాటు పార్సిళ్ల ద్వారా అక్రమంగా తరలి వెళ్తుండటంతో అక్కడ ఈ వ్యాపారం జోరుగా సాగుతోంది. -
‘పతంగి’ సర్దుబాటు!
సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి నేతలతో మజ్లిస్ మంతనాలు.. తాము పోటీ చేయని చోట వేరే వారికి ‘పతంగి’ ఇస్తే అభ్యంతరం లేదని ఈసీకి లేఖ సాక్షి, హైదరాబాద్: ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) పార్టీకి ఈ సారి లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ‘పతంగి’ చిహ్నం సర్దుబాటు కానుంది. ఇటీవల రాష్ట్రంలోని 294 అసెంబ్లీ, 42 లోక్సభ స్థానాలకు పతంగి చిహ్నాన్ని పొందిన సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి.. తాము పోటీ చేయని స్థానాల్లో మజ్లిస్ పార్టీకి పతంగి గుర్తు కేటాయిస్తే అభ్యంతరం లేదని ఎన్నికల కమిషన్కు లేఖ అందించింది. దీంతో రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్సభ స్థానాలకు పోటీ చేసే మజ్లిస్ అభ్యర్థులకు ఈసారి ఎన్నికల్లో పతంగి చిహ్నాన్ని కేటాయించేందుకు ఎన్నికల కమిషన్ కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఎంఐఎంకు ప్రతిఎన్నికల్లో ‘ఎవ్వరికీ కేటాయించని’ చిహ్నాల్లో (ఫ్రీ సింబల్స్) పతంగిని ఎన్నికల కమిషన్ కేటాయిస్తూ వచ్చేది. సాధారణ ఎన్నికల్లో మొత్తం పోలైన ఓట్లలో ఆరు శాతం గానీ, లేదా అసెంబ్లీ స్థానాల్లో మూడు శాతం సీట్లను గానీ నెగ్గి ఉంటేనే.. ఒకసారి కేటాయించిన చిహ్నాన్ని శాశ్వతంగా ఆ పార్టీకే ఉంచుతారు. అయితే అసెంబ్లీ స్థానాల్లో మూడు శాతం సీట్లు అంటే.. కనీసం 9 అసెంబ్లీ స్థానాలు గెలిచి ఉండాలి. ఎంఐఎం ఏడు అసెంబ్లీ స్థానాలకే పరిమితమైనందున శాశ్వత చిహ్నం కేటాయించటానికి అవకాశం లేకపోయింది. ఈసారి లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల విషయంలో మజ్లిస్ పార్టీకన్నా ముందుగా.. ఇటీవలే కొత్త పార్టీగా నమోదైన సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి పతంగి ఎన్నికల చిహ్నంపై అసక్తి కనబరుస్తూ ఎన్నికల కమిషన్కు దరఖాస్తు చేసుకుంది. దీంతో రాష్ట్రంలోని అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ కోరిన చిహ్నాన్ని కేటాయిస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. అనంతరం ఈ విషయం తెలిసిన మజ్లిస్ నేతలు సమైకాంధ్ర సమితి పార్టీ ప్రతినిధులతో సంప్రదింపులు జరిపారు. సమైకాంధ్ర సమితి ప్రతినిధులు ఎన్నికల కమిషన్ అధికారులను కలిసి తాము పోటీ చేయని స్థానాల్లో మజ్లిస్కు కూడా తమకు కేటాయించిన చిహ్నం కేటాయిస్తే అభ్యంతరం లేదని చెప్పారు. అసద్తో సమితి నేతలు భేటీ: అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఒకే గుర్తుపై పోటీ చేసే అవకాశం ఉన్న కారణంగా పరస్పర సహకారంపై చర్చించేందుకు మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీతో సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.శ్రీనివాస్ మరో ఇద్దరు బాధ్యులు శనివారం దారుస్సలాంలో భేటీ అయ్యారు. మజ్లిస్ పోటీ చేసే స్థానాల్లో పూర్తి సహకారం అందిస్తామని.. తాము బరిలో దిగే స్థానాల్లో కూడా సహకారం అందించాలని కోరారు. అందుకు అసద్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.