breaking news
parnika
-
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డికి షాక్
హైదరాబాద్: తెలంగాణ పంచాయతీ ఎన్నికల రెండో విడతలో.. తొలి విడత పలితాలే పునరావృతం అయ్యాయి. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది. అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థులే అత్యధిక స్థానాలు కైవసం చేసుకున్నారు. అయితే మహబూబ్ నగర్లో మాత్రం కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు చుక్కెదురైంది. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డికి తన సొంతూరులోనే షాక్ తగిలింది. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోయారు. రంగారెడ్డిగూడ సర్పంచ్గా బీజేపీ అభ్యర్థి రేవతి ఆనంద్ విజయం సాధించారు. మరోవైపు.. నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డికీ ఇదే తరహా అనుభవం ఎదురైంది. ఆమె ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేసిన సొంతూరు ధన్వాడలో బీజేపీ అభ్యర్థి జ్యోతి రామచంద్రయ్య ఘన విజయం సాధించారు. ధన్వాడ మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణకు కూడా సొంతూరు కావడం, పైగా పర్ణికారెడ్డికి అత్తాకోడళ్ల వరుస.. దీనికి తోడు ధన్వాడలో పోటీ పడింది కూడా అత్తాకోడళే కావడం.. ఈ ఎపిసోడ్కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇటు ఖమ్మంలోనూ కాంగ్రెస్కు ఎదురుగాలి తప్పలేదు. అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆది నారాయణ ప్రచారం చేసిన వాటిల్లో కేవలం రెండు చోట్ల (ములకలపల్లి, అన్నపురెడ్డిపల్లి) మాత్రమే కాంగ్రెస్ మద్దతుదారులు సర్పంచ్లుగా నెగ్గారు.రెండో విడత సర్పంచ్ ఎన్నికల్లో.. 55% స్థానాల్లో అధికార పార్టీ మద్దతిచ్చిన అభ్యర్థులదే విజయం సాధించారు. బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థుల్లో 29% మంది గెలుపొందగా.. తర్వాతి స్థానంలో బీజేపీ నిలిచింది. అదే సమయంలో స్వతంత్రులు కూడా సత్తా చాటారు. రెండో విడతకు సంబంధించి 416 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.తెలంగాణలోని 193 మండలాల్లోని 3911 పంచాయతీలకు ఆదివారం ఎన్నికలు నిర్వహించగా..కాంగ్రెస్-2,112 బీఆర్ఎస్-1,025 బీజేపీ-225ఇతరులు(స్వతంత్రులు.. సీపీఐ-సీపీఎం బలపర్చినవాళ్లు)-549 గెలుపొందారు. రెండో విడతలో 85.86% పోలింగ్ నమోదు కాగా.. ఇది తొలి విడత కంటే 1.58% ఎక్కువ. ఇప్పటి వరకు రెండు విడతల్లో ఇప్పటివరకు 8,567 పంచాయతీల ఎన్నికలు పూర్తైంది. రెండు విడతల్లో కలిపి కాంగ్రెస్ బలపర్చగా గెలిచిన వారి సంఖ్య 5,195, బీఆర్ఎస్ మద్దతుదారులు 2,338, బీజేపీ 440గా ఉన్నారు. బీజేపీ కంటే ఇతరులు సాధించిన స్థానాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ నెల 17వ తేదీన తుది దశ పంచాయితీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. -
ఇండస్ట్రీలో ఉదయ్ కిరణ్ చెల్లెలు ఎవరో తెలుసా..?
టాలీవుడ్లో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్ హీరోలుగా ఎదిగిన హీరోలలో ఉదయ్ కిరణ్ ఒకరు. లవర్బాయ్ ఇమేజ్తో ఎన్నో సక్సెస్ఫుల్ చిత్రల్లో నటించిన ఉదయ్కిరణ్కి యూత్లోనే కాకుండా ఫ్యామిలీ ఆడియెన్స్లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే అనుకున్నంత స్థాయిలో కెరీర్ లేకపోవడం, సరైన అవకాశాలు లేక డిప్రెషన్తో ఉదయ్కిరణ్ 2014లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ ఆయనకు సంబంధించిన విషయాలు అప్పడప్పుడు సోషల్మీడియాలో బాగా వైరల్ అవుతుంటాయి. (ఇదీ చదవండి: మెగా ఫ్యాన్స్ సపోర్ట్తో ఎంట్రీ.. ఆపై దూరం.. బన్నీ సమాధానం ఇదే) తాజాగ ఆయన చెల్లెలు టాలీవుడ్లో స్టార్ సింగర్ అంటూ నెట్టింట వైరల్ అవుతుంది. ఇంతకు ఆ అమ్మాయి ఎవరో కాదు సింగర్ పర్ణిక మాన్య.. ఆమె గురించి టాలీవుడ్లో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే బాహుబలి, భీమ్లా నాయక్ లాంటి ఎన్నో సినిమాలకు పాటలు పాడి మంచి గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్తో పాటు బాలీవుడ్లో కూడా పాటలు పాడింది. కెరియర్ ప్రారంభంలో 'జీ తెలుగు సారేగమప'తో లైమ్లైట్లోకి వచ్చిన సింగర్ పర్ణిక మాన్య.. ఆ తర్వాత తెలుగులో ప్లే బ్యాక్ సింగర్గా వరుస అవకాశాలు దక్కించుకుని మంచి గాయనిగా స్థిరపడింది. ‘అయిగిరి నందిని’ సింగిల్తో నెటిజన్లను పర్ణిక ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే పర్ణికకు ఉదయ్ కిరణ్ అన్నయ్య అవుతాడనేది నిజమే... తన పెద్దమ్మ కొడుకే ఉదయ్ కిరణ్ అని ఆమె గతంలో కూడా తెలిపింది. వీరిద్దరి మధ్య మంచి బాండింగ్ కూడా ఉండేదని పర్ణిక పలుమార్లు కూడా చెప్పుకొచ్చింది. అన్నయ్య పేరును ఇండస్ట్రీలో తాను ఎప్పుడూ ఉపయోగించుకునే ప్రయత్నం చేయలేదని కూడా ఆమె చెప్పింది. ఉదయ్ కిరణ్ ఎంతో మంచి మనసున్న వ్యక్తి అని, అలాంటి వ్యక్తి తమకు దూరం కావడం చాలా దురదృష్టకరం అంటూ గతంలో పలు ఇంటర్వ్యూలలో పర్ణిక చెప్పింది. ఆమె సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు దగ్గరగానే ఉంటుంది. పర్ణిక మాన్య పేరుతో తన వ్యక్తగత వ్లాగ్స్ చేస్తుంటుంది కూడా... దేనికైనా రెడీ, బాడీగార్డ్, రభస, కవచం సినిమాల్లోని పాటలు కూడా ఆమెకు సింగర్గా మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. -
జగన్నాయకుడు మూవీ ఆడియో లాంచ్


