కీచక గురువుకు దేహశుద్ధి
గదిలో బంధించిన విద్యార్థినుల తల్లిదండ్రులు
కోటవురట్ల: తల్లిలా ప్రేమను పంచుతూ...తండ్రిలా విద్యాబుద్ధులు నేర్పుతూ కంటికిరెప్పలా కాపాడవలసిన టీచర్లే కాటేయడానికి ప్రయత్నిస్తుండడంతో పిల్లలు తల్లడిల్లిపోతున్నారు. ఇటీవల నక్కపల్లి మండలంలో జరిగిన దుశ్చర్యను మరవకముందే పాములవాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైన్సు ఉపాధ్యాయుడు బరితెగించాడు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులకు అతనికి బుధవారం దేహ శుద్ధి చేశారు.
పాములవాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైన్సు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న గాదె గణేష్కు చాలా రోజు లుగా విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవరిస్తున్నాడు. పిల్లల శరీరంపై చేతులు వేస్తూ పాఠాలు చెబుతున్నాడు. రెండు రోజుల క్రితం పి.కె.పల్లికి చెందిన 9వ తరగతి విద్యార్థి శరీరారాన్ని తాకుతూ వెకిలి చేష్టలకు పాల్పడ్డాడు. ఉపాధ్యాయుని ప్రవర్తన గురించి ఆ విద్యార్థిని తన తల్లిదండ్రులకు చెప్పింది. ఆగ్రహంతో రగిలిపోయిన వారు పాఠశాలకు చేరుకుని దేహశుద్ధి చేశారు. గ్రామస్తులకు కూడా ఈ విషయం తెలియడంతో పెద్ద సంఖ్యలో చేరుకుని ఉపాధ్యాయుడిని చుట్టుముట్టారు. కొట్టుకుంటూ తీసుకెళ్లి గదిలో బంధించారు. తమ పట్ల కూడా అలాగే ప్రవర్తించాడని ఈ సందర్భంగా ఎనిమిది మంది విద్యార్థిలను తల్లిదండ్రులకు చెప్పారు. ఉపాధ్యాయుని ప్రవర్తనకు భయపడిన కొంతమంది విద్యార్థినులు పాఠశాలకు వెళ్లడానికి ససేమిరా అంటున్నారు.
ఆరేళ్లుగా విధులు :ఉపాధ్యాయుడు గణేష్ మండలంలోని బి.కె.పల్లిలో నివా సం ఉంటున్నాడు. ఇతనికి వివాహమైం ది. భార్యా పిల్లలున్నారు. పాములవాకలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైన్సు ఉపాధ్యాయుడిగా ఆరేళ్లుగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ ఉదంతంతో తోటి ఉపాధ్యాయుల్లో ఆందోళన నెలకొంది. తమకేమీ తెలియదంటూ వారు మిన్నుకుంటున్నారు. ఈ సంఘటనకు సంబంధించి ఎటువంటి కేసు నమోదు కాలేదు.
విచారణ చేస్తాను : ఈ సంఘటనపై ప్రదానోపాధ్యాయురాలు జ్యోతిని వివరణ కోరగా తాను అనకాపల్లిలోని ఓ సమావేశానికి వెళ్ళానని, విచారణ చేసి చర్యలు తీసుకుంటామని చెప్పారు.