-
మీరు ఇల్లు కొంటున్నారా? ఇవీ తెలుసుకోకపోతే భారీ నష్టం!
స్థిరాస్థులైన ఇళ్లు, అపార్ట్మెంట్లు, వ్యవసాయ క్షేత్రాల్ని కొనుగోలు చేస్తుంటాం. ఆ కొనుగోళ్ల సమయంలో తక్కువ రేటు, మంచి ప్రాంతం, అన్నీ వసతులు ఉన్నాయా? లేవా?.. ఇప్పుడు పెట్టిన పెట్టుబడులు భవిష్యత్లో ఎంత పెరుగుతాయి’ అనే తదితర విషయాల గురించి ఆరా తీస్తుంటాం. అన్నీ బాగుంటే మన బడ్జెట్కు తగ్గట్లు సొంతం చేసుకుంటాం. అదే సమయంలో మీరో విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి. లేదంటే భారీగా నష్టపోతారని ఆర్ధిక నిపుణులు సూచిస్తున్నారు. స్థిరాస్థులపై ప్రభుత్వ పథకాలైన ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై), బ్యాంకులు ప్రత్యేక ఆఫర్లు అందిస్తుంటాయి. ముఖ్యంగా ఏదైనా ప్రాపర్టీని తల్లి లేదా భార్య, కుమార్తె పేరు మీద కొనుగోలు చేస్తే ట్యాక్స్ బెన్ఫిట్స్, స్టాంప్ డ్యూటీ, డిస్కౌంట్కే వడ్డీ రేట్లను పొందవచ్చు. ఒకవేళ ప్రాపర్టీని కొనుగోలు చేస్తే భార్య, కుమార్తె పేరుమీద కొనుగోలు చేయాలని ఆర్ధిక నిపుణులు సలహా ఇస్తున్నారు. ఆయా రాష్ట్రాల వారీగా ప్రాపర్టీ కొనుగోళ్లతో స్టాంప్ డ్యూటీ ఉంటుంది. ఉదాహరణకు హర్యానాలో స్థిరాస్థులు మహిళలపై కొంటే స్టాంప్ డ్యూటీ 2శాతం చెల్లించాలి. అదే పురుషుడి పేరుమీద ఉంటే 7 శాతం కట్టాలి. మిగిలిన రాష్ట్రాల్లో 5శాతం చెల్లించాలి. ఇద్దరి (భార్య - భర్త) పొత్తులో ఓ ప్రాపర్టీపై పెట్టుబడులు పెడితే.. స్టాంప్ డ్యూటీ 1శాతం తగ్గుతుంది. లక్షల్లో ఆదా ఢిల్లీలో రూ.50 లక్షల విలువైన ఆస్తిని కొనుగోలు చేశారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ ఆస్తిని మీ పేరు మీద రిజిస్టర్ చేసుకుంటే ఏడు శాతం రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అయితే, మీ భార్య లేదా తల్లి పేరు మీద ఆస్తిని రిజిస్టర్ చేస్తే ఐదు శాతం రిజిస్ట్రేషన్ ఫీజు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధంగా, లక్షల్లో రిజిస్ట్రేషన్ ఖర్చుల్ని ఆదా చేసుకోవచ్చు. అదే ఆస్తిని భార్య పేరు మీద మాత్రమే కాకుండా భర్త పేరుమీద జాయింట్గా కొనుగోలు చేస్తే రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఒక శాతం రాయితీ పొందవచ్చు. దీనివల్ల రూ.50,000 ఆదా అవుతుంది. త్వరగా బ్యాంక్ లోన్లు అంతేకాదు మహిళల పేరుమీద ఆస్తిని కొనుగోలు చేస్తే ఇంటి రుణాలు త్వరగా వస్తాయి. బ్యాంకులు సాధారణంగా గృహ రుణాల కోసం దరఖాస్తు చేసుకునే మహిళలకు ప్రత్యేక డిస్కౌంట్లు, ప్రోత్సాహకాలు అందిస్తాయి. పనిచేసే మహిళ లేదా మహిళా వ్యాపారవేత్తలు గృహ రుణం కోసం దరఖాస్తు చేస్తే, ఆమె ఆదాయాన్ని తన భర్త ఆదాయంతో కలిపి రుణాన్ని ఎక్కువగా ఇస్తారు. కలపవచ్చు, ఫలితంగా అధిక రుణ మొత్తం వస్తుంది. చివరిగా : కాబట్టి స్థిరాస్థుల కొనుగోలు చేసే సమయాల్లో సంబంధిత నిపుణులు సలహాలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఇందుకోసం జాతీయ, అంతర్జాతీయ సంస్థల నిపుణులు సలహాలు ఇస్తుంటారు. అందుకు ప్రతిఫలంగా కొద్ది మొత్తంలో ఫీజు రూపంలో చెల్లించాలి. చదవండి👉 హైదరాబాద్లో ఆ ఏరియా ఇళ్లే కావాలి.. కొనుక్కునేందుకు ఎగబడుతున్న జనం? -
బడ్జెట్ భరోసానిచ్చేనా?
సాక్షి, హైదరాబాద్: సొంతింటి కొనుగోలుదారుల్ని ఊరిస్తూ కేంద్ర బడ్జెట్ మరోసారి మన ముందుకొస్తుంది. గృహ నిర్మాణ రంగానికి ఊతమిచ్చే నిర్ణయాలు తీసుకోవాలని ఎన్నోసార్లు త మ బాధల్ని నివేదించినా.. గత ప్రభుత్వాలు కనికరించలేదు. కనీసం నేడైనా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నిజమైన అభివృద్ధికి ఊతమిచ్చే చర్యలు చేపట్టాలని మార్కెట్ నిపుణులు కోరుతున్నారు. ⇒ ఈ బడ్జెట్లోనైనా గృహ నిర్మాణ రంగానికి మౌలిక వసతుల రంగ హోదా కల్పించాలి. దీనివల్ల రాయితీలొస్తాయి. పెట్టుబడుల్ని సులువుగా ఆకర్షించవచ్చు. దేశ, విదేశీ సంస్థలు ఈ రంగంలోకి అడుగుపెట్టడానికి ఆసక్తి చూపిస్తాయి. నిర్మాణ సంస్థల పని తీరూ మెరుగవుతుంది. ఫలితంగా ఆర్థికవృద్ధి సాధ్యమయ్యే ఆస్కారముంది. అంతిమంగా కొనుగోలుదారులకు ఆధునిక సదుపాయాలతో పాటు నాణ్యమైన గృహాలు అందుతాయి. ⇒ ప్రాజెక్ట్ అనుమతుల్లో జాప్యం వల్ల కొనుగోలుదారులపై 40 శాతం వరకూ అదనపు భారం పడుతోంది. అందుకే చాలా రోజులుగా కోరుకుంటున్న ఏకగవాక్ష విధానాన్ని ప్రవేశపెట్టాలి. ప్రామాణిక తనిఖీ జాబితా ద్వారా కేంద్ర, రాష్ట్ర అనుమతులు ఒకే చోట లభించే విధంగా చూడాలి. చట్టం పరిధిలోనే మున్సిపల్ పరిపాలన, రాజకీయ నియంత్రణ వ్యవస్థలో మార్పులు చేయాలి. ⇒ ఫ్లాట్ ఒకటే అయినా రకరకాల పన్నులతో డెవలపర్లు ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం స్థిరాస్తి రంగాన్ని ద్వంద్వ పన్ను సమస్య తీవ్రంగా ఎదుర్కొంటోంది. సేవాపన్ను, వ్యాట్, రిజిస్ట్రేషన్ చార్జీలతో బాటుస్థానిక సం స్థలకు రకరకాల రుసుములు చెల్లిం చాలి. ఈసారి బడ్జెట్ పన్నుల నుంచి ఉపశమనం పొందాలని ఆశిస్తున్నారు. ⇒ ఐదేళ్ల అనుభవం ఉన్న బిల్డర్లకు ఈసీబీ (ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్)లను అనుమతించాలి. నిర్మాణాల్లో వేగం పెరగాలంటే భారీ యంత్రాలను వినియోగించాలి. మరి వీటిని కొనుగోలు చేయడానికి బ్యాంకులు విరివిగా రుణాల్ని మంజూరు చేయాలి. ⇒ ప్రస్తుతం గృహ రుణాలపై ఉన్న 10.15 నుంచి 10.40 శాతం వడ్డీ వల్ల సామాన్య, మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక ప్రణాళికలపై తీవ్ర ప్రభావం పడుతోంది. వడ్డీ రేట్లను తగ్గించి గృహ రుణాలు తీసుకున్నవారు చెల్లించే నెలసరి వాయిదాలు తగ్గించేలా చేస్తారని అంచనాలు వేస్తున్నారు. గృహరుణాలు తీసుకున్నవారు చెల్లించే వడ్డీపై ఆదాయపన్ను మినహాయింపు పరిమితిని రూ.4 లక్షలకు పెంచాలని మధ్యతరగతి వర్గాలు కోరుకుంటున్నాయి. ⇒ రహదారులకు సంబంధించి ప్రత్యేక రెగ్యులేటరీని ఏర్పాటు చేయాలి. దీంతో రోడ్డు పన్ను ద్వారా సమకూరే సొమ్మును సక్రమంగా వినియోగించే వీలుంటుంది. దీని ప్రభావం నివాస సముదాయాల మార్కెట్పైన తప్పక పడుతుంది. గ్రామీణ, పట్టణాలను అనుసంధానం చేయటం వల్ల విస్తృత స్థాయిలో స్థిరాస్తి రంగం వృద్ధి చెందుతుంది. ⇒ వినియోగదార్లు ఇళ్లు కొనేలా ప్రోత్సహించడం కోసం అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా వడ్డీ రేట్లను తగ్గించాలి. ఆ దేశాల్లో 5 శాతం ఉండగా.. ఇక్కడ 10 శాతం పైనే ఉన్నాయి. భూముల కోనుగోలు, అభివృద్ధికి బ్యాంకులు, ఆర్థిక సంస్థల ద్వారా డెవలపర్లకు రుణాలు మంజూరయ్యేలా చూడాలి. రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్లకు అన్ని పన్నులకూ ఒకే చలానా అందించే విధానం తీసుకొచ్చి పన్ను మదింపును సులువు చేయాలి. రైల్వే బడ్జెట్తోనే భారం.. రైల్వే మంత్రి సురేశ్ ప్రభు గురువారం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్తో సామాన్యుల సొంతింటి కల మరింత దూరమైంది. అదేంటి రైల్వే బడ్జెట్కు, సొంతింటికి సంబంధం ఏంటనుకుంటున్నారా? రైల్వే బడ్జెట్లో ఈసారి ప్రయాణికుల చార్జీలు పెంచలేదు కానీ, 12 రకాల సరుకులపై రవాణా చార్జీలు మాత్రం పెంచేశారు. ఇందులో సిమెంట్, బొగ్గు, ఉక్కు, ధాన్యం, వేరుశనగ నూనె, ఎల్పీజీ, కిరోసిన్ వంటివి ఉన్నాయి. వీటిపై 0.8-10 శాతం వరకూ రైలు రవాణా చార్జీలు పెరిగాయి. సిమెంట్పై 2.7 శాతం, బొగ్గుపై 6.3 శాతం రవాణా చార్జీ అధికమవుతోంది. ఈ చార్జీల పెంపు సిమెంట్, ఉక్కు పరిశ్రమపై పడనుంది. దీంతో ఆయా పరిశ్రమలు నిర్మాణ సామగ్రి ధరలు పెంచే అవకాశమూ ఉంది. ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్నామని చెప్పే నిర్మాణ సంస్థలు నిర్మాణ సామగ్రి ధరలు పెరిగాయన్న సాకుతో ఈ భారాన్ని కూడా కొనుగోలుదారులపైనే వేయనున్నాయి. అం టే మొత్తంగా చూస్తే రైల్వే బడ్జెట్తో సామాన్యుల సొంతింటి కల మరింత భారంగా మారిందన్నమాట. చ.అ. ధరలు పెరుగుతాయ్.. కొంతకాలం క్రితం రూ.275-280 ఉన్న సిమెంట్ బస్తా ధరను రూ.350-370 వరకూ పెంచేశారు. ఇప్పుడు రైలు రవాణా చార్జీలు పెరిగిన కారణంతో ఆ మేరకు సిమెంట్, స్టీలు ధరలు కూడా పెరుగుతాయి. వీటి భారాన్ని మోయలేక నిర్మాణ సంస్థలు చ.అ. ధరలను పెంచే అవకాశముందని తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్ వెంకట్రెడ్డి చెప్పారు. భవన నిర్మాణాల్లో సిమెంట్, ఉక్కు వాటా 40 శాతంగా ఉంటుంది. అంటే చ.అ. నిర్మాణానికి రూ.1,350 అనుకుంటే ఇందులో సిమెంట్, ఉక్కు వాటా రూ.550 పైనే ఉంటుంది. ఈ లెక్కన చూస్తే ప్రస్తుతం 1,000 చ.అ. 2 బీహెచ్కే ఫ్లాట్ ధర రూ.32 లక్షలుగా ఉంటే.. ఇకపై దీని ధర రూ.33 లక్షలకు పెరిగే అవకాశముంది. (ట్యాక్స్, వ్యాట్, ఇతరత్రా చార్జీలు కలుపుకుంటే)
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
పోలీస్ ఫెయిల్యూర్.. బాబు, పురందేశ్వరి మేనేజ్..
'ఇడియట్ సిండ్రోమ్' అంటే ఏంటీ..? ప్రమాదకరమా..?
సోషల్ మీడియాలో వైరల్గా మారిన టీడీపీ, జనసేన వీడియో
తెలంగాణలో బీజేపీకి బ్రహ్మాండమైన ఫలితాలు: కిషన్ రెడ్డి
రోహిత్ శర్మతో పాటు షకీబ్!.. ఎవరికీ సాధ్యం కాని రికార్డు!
టీడీపీతో కుమ్మక్కు.. ఏపీ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రాపై వైఎస్సార్సీపీ ఫిర్యాదు
ఈసీ బదిలీ చేసిన చోటే ఈ దారుణాలు
రాజశ్యామల సహస్ర చండీయాగం వేద ఆశీర్వచనం ఇచ్చిన వేద పండితులు
కొంతమంది పోలీసులు టీడీపీ వాళ్ళతో కుమ్మక్కై: అంబటి
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (15-05-2024)
తప్పక చదవండి
- పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
- సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య!
- అమ్ముడుపోని లక్షలాది ఇళ్లు.. చైనా కీలక ప్రతిపాదన!
- నాన్స్టిక్ పాత్రలు వినియోగిస్తున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!
- ఆంధ్రాలో చిన్న ఆలయానికి జూ.ఎన్టీఆర్ భారీ విరాళం
- ‘ఆ దేవాలయాలు నిర్మించాలంటే 400కుపైగా సీట్లు కావాల్సిందే’
- అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్ను అంటారా?
- పల్నాడు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
- BCCI: టీమిండియా హెడ్కోచ్గా వాళ్లిద్దరిలో ఒకరు?
- NewsClick Row: ప్రబీర్ తక్షణ రిలీజ్కు సుప్రీం కోర్టు ఆదేశం
Advertisement