breaking news
outperformer
-
విష ప్రయోగానికి గురైన బాలుడి మృతి
సాక్షి, చెన్నై: ఓ కిరాతక తల్లి చేసిన విష ప్రయోగంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శనివారం రాత్రి మృతి చెందాడు. సరైన వైద్యం అందక పోవడంతోనే ఆ బాలుడు మరణించాడని బంధువులు ఆస్పత్రిపై దాడి చేశారు. వివరాలు.. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి పరిధిలోని కారైక్కాల్లో తన కూతురు కంటే ఎక్కువ మార్కులు సాధిస్తున్నాడనే అసూయతో 8వ తరగతి విద్యార్థి బాల మణిగండన్పై ఓ విద్యార్థిని తల్లి శీతల పానీయంతో శుక్రవారం విష ప్రయోగం చేసిన విషయం తెలిసిందే. ఆ బాలుడికి పుదుచ్చేరిలో అత్యవసర చికిత్స అందించారు. ఆ బాలుడు తన తల్లిదండ్రులు రాజేంద్రన్, మాలతి ఇచ్చిన ఫిర్యాదుతో ఆ పాఠశాల సెక్యూరిటీ సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలో విద్యార్థిని తల్లి సహాయ రాణి విక్టోరియా చేసిన కుట్ర వెలుగులోకి వచ్చింది. సరైన చికిత్స అందలేదా..? పోలీసులు కేసు దర్యాప్తుపై ప్రత్యేక దృష్టి సారించినా, వైద్యులు మాత్రం ఆ బాలుడికి సరైన చికిత్స అందించ లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తొలుత కోలుకున్నాడని భావించిన బాల మణిగండన్ ఆరోగ్యం శనివారం రాత్రి ఒక్కసారిగా క్షీణించింది. విషం శరీరంలోకి కొన్ని అవయవాలపై తీవ్ర ప్రభావం చూపడంతో ఆ బాలుడు మరణించాడు. దీంతో అతడి కుటుంబం కన్నీటి సంద్రంలో మునిగింది. అదే సమయంలో ఆస్పత్రిలో సరైన వైద్యం అందించ లేదని, నిర్లక్ష్యంగా వైద్యులు వ్యవహరించారని ఆరోపిస్తూ కుటుంబీకులు, బంధువులు దాడి చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చివరకు పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఆ విద్యార్థిపై విష ప్రయోగం చేసి హతమార్చిన సహాయ రాణి విక్టోరియాపై హత్య కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. -
నిర్మాణాత్మక సంస్కరణలతో భారత్కు తిరుగులేదు
ముంబై: ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు సంక్షోభాన్ని ఎదుర్కొంటోంటే భారత మార్కెట్లు దాని ప్రభావానికి లోనుకాకుండా స్థిరంగా ఉన్నాయని డ్యుయిష్ బ్యాంక్ సీఈవో గునిత్ చద్దా వ్యాఖ్యానించారు. నిర్మాణాత్మక సంస్కరణల సహాయంతో ఇతర ఆర్థిక వ్యవస్థలను తలదన్నే రీతిలో ఎదుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఆర్థిక క్రమశిక్షణతో, నిర్మాణాత్మక సంస్కరణలు చేపడితే భారత్ ముందున్న సవాళ్లను ఎదుర్కోవడం కష్టం కాదన్నారు. ఈ నేపథ్యంలో భారతదేశం ఆర్థికరంగ అభివృద్ధికి భారీ అవకాశాలున్నాయన్నారు. అటు పటిష్టమైన ఆర్థిక శక్తిగా ఎదగడానికి, ఇటు టీ. 20 వరల్డ్ కప్ ను గెలుచుకోవడానికి సరిపడా ధీటైన టీం ఇండియాకు ఉందని చద్దా వ్యాఖ్యానించారు. ఇక్కడి మీడియాతో మాట్లాడిన ఆయన ప్రపంచ కేంద్ర బ్యాంకులు , G- 20 అంశాల్లో డాక్టర్ రఘురామ్ రాజన్ అభిప్రాయాలతో అంగీకరిస్తున్నానన్నారు. కేంద్ర బ్యాంకుల మధ్య సమన్వయం, సహకారం అవసరం అన్నారు. ఫలితంగా కొన్ని పెద్ద మార్కెట్లలో సుదీర్గ సంక్షోభ ప్రమాదం ఉండబోదన్నారు.