-
ఔట్ సోర్సింగ్ టెండర్లు రద్దు చేయాలి
సింగరేణి(కొత్తగూడెం) : సింగరేణిలో ఖాళీగా ఉన్న క్లర్క్ పోస్టుల భర్తీకి చేపట్టిన ఔట్ సోర్సింగ్ టెండర్లను రద్దు చేయాలని ఏఐటీయూసీ అడ్వైజర్ దమ్మాలపాటి శేషయ్య డిమాండ్ చేశారు. గురువారం ఏరియా జీఎం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. జీఎం రమణమూర్తికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా శేషయ్య మాట్లాడుతూ క్లరికల్ ఖాళీలను అంతర్గత అభ్యర్థులతోనే భర్తీ చేయాలని కోరారు. గతంలో డైరెక్టర్ పా సింగరేణి వ్యాప్తంగా ఉన్న క్లరికల్ ఖాళీలను అంతర్గత అభ్యర్థులతో తాత్కలికంగా నియమించి, అనంతరం వారికి పరీక్ష నిర్వహించి ఉత్తీర్ణత పొందిన వారిని శాశ్వత పద్ధతిపై నియమిస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. గుత్తుల సత్యనారాయణ, కేంద్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి వంగా వెంకట్, బ్రాంచి కార్యదర్శి జి వీరస్వామి, కె రాములు, ఎస్ సుధాకర్, మెంగెన్ రవి, గట్టయ్య, పి చంద్రయ్య, ఎంవీ రావు, ఎస్ శ్రీనివాస్, ఎమ్ ఎ నభి,హుమాయిన్, హనీఫ్, బి సత్యనారాయణ, ఆర్ సాంభమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
అక్రమాల టెండర్
నోటిఫికేషన్ జారీ చేయకుండానే..ఔట్సోర్సింగ్ టెండర్లలో అవకతవకలు ఆదిలాబాద్ బల్దియాలో కీలక నేతల వ్యవహారం ప్రభుత్వ ఆదాయూనికి గండి ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపాల్టీలో ఔట్సోర్సింగ్ టెండర్లలో అక్రమాలకు తెరలేచింది. నోటిఫికేషన్ జారీ చేయకుండానే వ్యవహారమంతా చక్కబెట్టడం అనుమానాలకు తావిస్తోంది. బల్దియూలో కీలక నేతలకు ఈ టెండర్ అప్పగించేందుకు అధికారులు నిబంధనలు ఉల్లంఘించారనే విమర్శలు బాహాటంగానే వినిపిస్తున్నాయి. పోటీకి వచ్చిన కొంతమందిని అనర్హులుగా ప్రకటించి కీలక నేతలకే టెండర్ దక్కేలా శక్తియుక్తులు ప్రదర్శించారని తెలుస్తోంది. దీనికి తోడు స్వయంగా మున్సిపల్ అధికారి టెండర్ వేశార ని పలువురు కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. మున్సిపాల్టీలో ఔట్సోర్సింగ్ పద్ధతిలో పారిశుధ్య, వాటర్సప్లయ్ కార్మికులు, ఎలక్ట్రిసిటీ, కంప్యూటర్ విభాగం, జవాన్ల నియూమకానికి ఏజెన్సీల నుంచి టెండర్లు ఆహ్వానించారు. వీటిపై ఓ కీలక నేత కన్ను పడడంతో టెండర్ నోటిఫికేషన్ విడుదల చేయలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సోమవారమే షెడ్యూల్ ఫారాలు విక్రయించి అదే రోజు మధ్యాహ్నం వరకు దాఖలు కు నిబంధన విధించడం గమనార్హం. సాయంత్రం టెండర్లు తెరిచారు. కంప్యూటర్ ఆపరేటర్ల నియూమకం మినహాయించి మిగితా విభాగాల నియూమక టెండర్లు నిర్మల్కు చెందిన జైభీం ఎస్సీ కో ఆపరేటివ్ సొసైటీకి దక్కినట్లు తెలుస్తోంది. అంత ఉల్లంఘనే.. టెండర్ నోటిఫికేషన్ నెంబర్ ఈ1/106/109/2014-15 తేదీ 30-06-2015 ప్రకారం మున్సిపల్ ఔట్సోర్సింగ్ 10 యూనిట్ల కోసం నిర్వహించిన టెండర్ నిబంధనలకు విరుద్ధంగా ఉంది. నిబంధన ప్రకారం బైభీం సొసైటీ ఎస్సీ కో ఆపరేటివ్ సంస్థ రూ.4 కోట్ల టెండర్లను దక్కించుకుంది. కాగా నిబంధన ప్రకారం ఏపీ సహకార సంఘం 1964 ప్రకారం ఎస్సీ ఎస్టీ బడ్డెర ఎల్సీ. కో ఆపరేటివ్ సోసైటీ లిమిటెడ్ రెండు బైలా ప్రకారం సహకార సంఘం డివిజన్ పరిధిలోనే కార్యకలాపాలు జరపాలని స్థానిక సొసైటీల నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. నిబంధనల ప్రకారం రూ.50 లక్షల కాంట్రాక్ట్లను మాత్రమే ఆ సొసైటీకి ఇవ్వాలి. కానీ రూ.4 కోట్ల కాంట్రాక్టులు అప్పగించారు. సింగిల్ టెండర్లు వేయడం ఈ అక్రమాలకు నిదర్శనం. ప్రతీ టెండరుదారుడికి షెడ్యూల్ ఫారాలు ఇవ్వాలి. కానీ 20 తేదీ మధ్యాహ్నం వరకు కూడా ఇవ్వలేదు. టెండర్లు వేయకుండానే తిరస్కరణ.. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో పాలకవర్గం ఆడిందే ఆట పా డిందే పాటగా మారింది. టెండర్లు వేసిన తర్వాత తిరస్కరిం చాల్సి ఉండగా.. అధికారులు ముందుగానే తిరస్కరిస్తున్నా రు. టెండర్ దారుడి వద్ద లేబర్ సర్టిఫికేట్, ఐటీ, పాన్కార్డు, వ్యాట్, తదితర అన్ని ఉన్నా టెండర్లను తిరస్కరించి అనుకున్న వారికే అప్పగించారు. దీంతో పలువురు కాంట్రాక్టర్లు టెండర్లు రద్దు చేయాలని దుర్గం సొసైటీ, రాజీవ్గాంధీ ఎస్సీ సొసైటీ, అభ్యుదయ ఎస్సీ సొసైటీ, బాబు జగ్జీవన్రావు సొసైటీ, వైఎస్సార్ ఎస్సీ సొసైటీ సభ్యులు, నాయకులు మున్సిపల్ కమిషనర్ వెంకటేశంకు వినతిపత్రం అందజేశారు. మున్సిపల్ ఆదాయానికి గండి.. టెండర్ల నిర్వహణలో మున్సిపల్ ఆదాయానికి రూ.లక్షల్లో గండి పడుతోంది. రూ.4 కోట్ల 12 లక్షల 43 వేల టెండర్ను సింగిల్ టెండర్లతో జైభీం సొసైటీ, ఇమేజ్ కంప్యూటర్ సొసైటీ దక్కించుకున్నాయి. పోటీ లేకపోవడంతో ఆదాయానికి గండి పడింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement