-
ఓయూసెట్ నోటిఫికేషన్ విడుదల
హైదరాబాద్ : ఉస్మానియాతో పాటు రాష్ట్రంలోని మరో నాలుగు వర్సిటీల్లో వివిధ పీజీ కోర్సులకు నిర్వహించే ప్రవేశ పరీక్షలకు సంబంధించిన ఓయూసెట్–2018 నోటిఫికేషన్ను శుక్రవారం విడుదల చేశారు. అనంతరం ఓయూ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ కిషన్ వివ రాలు వెల్లడించారు. ఓయూతో పాటు పాలమూరు, తెలంగాణ, మహాత్మాగాంధీ వర్సిటీల్లోని పీజీ కోర్సులకు ఈ ఉమ్మడి ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఈసారి కొత్తగా పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీలోని ఎం.ఎ. తెలుగు లిటరేచర్, ఎం.ఎ. మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం, ఎం.ఎ. లింగ్విస్టిక్స్ కోర్సులకు కూడా ఓయూ సెట్ ద్వారా ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 21 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని, అపరాధ రుసుము లేకుండా మే 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. రూ.200ల అపరాధ రుసుముతో మే 26 వరకు, వేయి రూపాయల అపరాధ రుసుముతో జూన్ 1 వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఒక్కో కోర్సుకు ఓసీ, బీసీ విద్యార్థులు రూ.700లు, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ విద్యార్థులు రూ.575లు చెల్లించాల్సి ఉంటుందన్నారు. మొదటిసారిగా ప్రవేశ పరీక్షల్లో ఆన్లైన్ పద్ధతిని ప్రవేశపెడుతున్నామన్నారు. వి ద్యార్థులు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) పద్ధతిలో పరీక్షలు రాయాల్సి ఉంటుందన్నారు. జూన్ 4 నుంచి 13 వరకు ప్రవేశ పరీక్షలు నిర్వí ßæంచి వారం రోజుల్లో ఫలితాలు ప్రకటిస్తామన్నారు. జూలై చివరికల్లా రెండు పర్యా యాలు అడ్మిషన్ కౌన్సిలింగ్ నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో ఓయూ అడ్మిషన్స్ జాయింట్ డైరెక్టర్లు ప్రొఫెసర్ సంపత్కుమార్, ప్రొఫెసర్ నిర్మలా బాబూరావు, డాక్టర్ గంగాధర్, డాక్టర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
రేపటి నుంచి ఓయూసెట్ వెరిఫికేషన్
హైదరాబాద్: ఓయూసెట్–2017 రెండో విడత కౌన్సెలింగ్లో భాగంగా బుధవారం నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రారంభం కానున్నట్లు ఓయూ పీజీ అడ్మిషన్స్ జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ కిషన్ తెలిపారు. రెండో విడత వెబ్ ఆప్షన్స్లో సీటు పొందిన విద్యార్థులు తమ సర్టిఫికెట్లను ఓయూ క్యాంపస్లోని పీజీ అడ్మిషన్స్ కార్యాలయంలో ఈ నెల 23, 24, 27, 28 తేదీల్లో వెరిఫికేషన్ చేయించుకోవాలన్నారు. వివరాలను www.osmania.ac.inలో చూడవచ్చు. -
రేపు ఓయూసెట్ రెండో జాబితా వెల్లడి
హైదరాబాద్ : ఓయూసెట్– 2017లో సీట్లు సాధించిన విద్యార్థుల రెండో జాబితా ను గురువారం(17న) వెల్లడించనున్నట్లు పీజీ అడ్మిషన్స్ జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ కిషన్ తెలిపారు. ఓయూతో పాటు తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు వర్సిటీల పరిధిలో వివిధ పీజీ, పీజీ డిప్లొమా, ఐదేళ్ల పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు రెండో విడత కౌన్సెలింగ్లో ఆయా కళాశాలలకు ఆప్షన్లు ఇచ్చిన విద్యార్థులు http://www. osmania.ac.in/ వెబ్సైట్లో చూడవచ్చు. -
వెల్గొండ విద్యార్థికి 3వ ర్యాంకు..
బిజినేపల్లి (నాగర్కర్నూల్): మండలంలోని వెల్గొండ గ్రామానికి చెందిన జి.మల్లేష్గౌడ్ ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓయూసెట్లో రాష్ట్రస్థాయిలో 3వ ర్యాంకు సాధించాడు. ఎంఈడీ చేసేందుకు నిర్వహించిన పరీక్షల్లో విద్యార్థి మల్లేష్గౌడ్ 3వ ర్యాంకు సాధించడం పట్ల గ్రామస్తులు, తోటి మిత్రులు అభినందనలు తెలిపారు. హన్వాడ: మండల కేంద్రానికి చెందిన విజయ్కుమార్కు రాష్ట్రస్థాయిలో 76వ ర్యాంకు సాధించాడు. మండల ఎంట్రెన్స్ ఫలితాల్లో 76 ర్యాంకు సాధించడం పట్ల మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. -
జూన్ 5 నుంచి ఓయూ సెట్
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో వివిధ పీజీ కోర్సులలో ప్రవేశాలకు నిర్వహించే ఓయూసెట్ 2017 పరీక్ష తేదీలు ఖరారయ్యాయి. వచ్చే నెల 5వ తేదీ నుంచి 13 వరకు రోజుకు మూడు పరీక్షల చొప్పున నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ అధికారులు పేర్కొన్నారు. దీని ద్వారా ఓయూతోపాటు పాలమూరు, మహాత్మాగాంధీ, తెలంగాణ యూనివర్సిటీల పీజీ కోర్సులలో ప్రవేశాలు నిర్వహిస్తారు. హాల్టికెట్లను అభ్యర్థులు వచ్చే నెల 1 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు సూచించారు. 30 నుంచి సెల్ట్ తరగతులు ఉస్మానియా వర్సిటీలోని సెంటర్ ఫర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ (సెల్ట్)లో ఈ నెల 30 నుంచి తరగతులు నిర్వహించనున్నట్లు సెల్ట్ డైరెక్టర్ డాక్టర్ జె.సావిత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎ కోర్స్ ఇన్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్గా పిలిచే ఈ కోర్సుకు ఉదయం, సాయంత్రం వేర్వేరుగా తరగతులు నిర్వహిస్తామన్నారు. రెండు నెలల కాల వ్యవధి గల ఈ కోర్సుకు ఫీజు రూ.4000 గా నిర్ణయించినట్లు ఓయూ విద్యార్థులు, ఉద్యోగుల, అనుబంధ కళాశాలల విద్యార్థులకు ఫీజులో రాయితీ ఉంటుందని వివరించారు. ఇతర వివరాలకు 9652856107, 040-64575575, 27682354 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- Prajwal Revanna: ఏ గదిలో ఏం జరిగింది?
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement