breaking news
Orissa coast
-
అగ్ని-4 పరీక్ష సక్సెస్
బాలాసోర్(ఒడిశా): అగ్ని-4 అణ్వస్త్ర క్షిపణి మరోసారి సత్తా చాటింది. మంగళవారం ఉదయం 10:20 గంటలకు ఒడిశా తీరంలోని వీలర్ ఐలండ్ నుంచి అగ్ని-4 క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో)వర్గాలు వెల్లడించాయి. సైన్యానికి చెందిన వ్యూహాత్మక బలగాల విభాగం ప్రయోగాత్మకంగా ఈ పరీక్షను నిర్వహించినట్లు పేర్కొన్నాయి. అధునాతన పరిజ్ఞానంతో రూపొందించిన ఈ బాలిస్టిక్ క్షిపణి 4 వేల కి.మీ. పరిధిలోని లక్ష్యాలను ఛేదిస్తుంది. ఈ క్షిపణిని పరీక్షించడం ఇది నాలుగోసారి. -
పృథ్వీ-2, ధనుష్ క్షిపణుల పరీక్షలు సక్సెస్
బాలాసోర్(ఒడిశా): అణ్వాయుధాలను మోసుకెళ్లే సామర్థ్యమున్న పృథ్వీ-2, ధనుష్ క్షిపణులను భారత సైన్యం మరోసారి విజయవంతంగా పరీక్షించింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన వీటిని సాధారణ పరీక్షల్లో భాగంగా శుక్రవారం ఒడిశా తీరంలో వేర్వేరుగా ప్రయోగించారు. ఉపరితలం నుంచి ఉపరితల లక్ష్యాలను ఛేదించే ఈ క్షిపణుల పరీక్షలు విజయవంతం కావడంతో భారత బలగాల రక్షణ సన్నద్ధత బలోపేతమైంది. పృథ్వీ-2ను చాందీపూర్ దగ్గర్లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్లోని మొబైల్ లాంచర్ నుంచి ఉదయం 10.45 గంటలకు ప్రయోగించారు. వెయ్యి కిలోల పేలుడు పదార్థాలు మోసుకెళ్లే ఈ క్షిపణి 350 కి.మీ దూరంలోని లక్ష్యాలను ఛేదిస్తుంది. పృథ్వీకి నేవీ వెర్షన్ అయిన ధనుష్ను రాత్రి 7.40కు బంగాళాఖాతంలో ఓ నౌకపై నుంచి ప్రయోగించి, లక్ష్యాన్ని ఛేదించారు. వెయ్యి కిలోల పేలుడు పదార్థాలను మోసుకెళ్లే ధనుష్ కూడా 350 కి.మీ దూరంలోని లక్ష్యాలను చేదిస్తుంది.