-
కర్ణాటకలో హంగ్!
హోరాహోరీ ప్రచార హోరు కొనసాగుతున్న కర్ణాటకలో.. ఓటరు తుది తీర్పు ఎలా ఉండబోతోంది? ప్రభుత్వ వ్యతిరేకతను కాదని కాంగ్రెస్ మళ్లీ అధికార పీఠం అధిరోహిస్తుందా? లేక బీజేపీ చీఫ్ అమిత్ షా మంత్రాంగం ఫలించి దక్షిణ భారతావనిలోనూ బీజేపీ హవా ప్రారంభమవుతుందా? సీఎంగా సిద్దరామయ్య ఓకేనా? యడ్యూరప్పకు లభిస్తున్న మద్దతెంత?.. తదితర ప్రశ్నలకు ఇండియాటుడే–కార్వీ నిర్వహించిన ఒపీనియన్ పోల్లో కొంతవరకు సమాధానాలు లభించాయి. రాష్ట్రంలో హంగ్ రాబోతోందని, కాంగ్రెస్(90–101 సీట్లలో గెలుపు) అతిపెద్ద పార్టీగా అవతరించబోతోందని, జేడీఎస్(34–43 సీట్లు) కింగ్ మేకర్ పాత్ర పోషించబోతోందని ఈ సర్వేలో వెల్లడైంది. అలాగే, బీజేపీ(78–86 సీట్లు)కి ఓట్ల శాతం పెరుగుతుంది కానీ, మెజారిటీకి మాత్రం దూరంగానే ఉంటుందని తేలింది. బీజేపీ సీఎం అభ్యర్థి యడ్యూరప్ప కన్నా సీఎంగా సిద్దరామయ్యకే ఎక్కువ మద్దతు లభించడం విశేషం. బెంగళూరు: కన్నడనాట హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశం ఉందని ఇండియాటుడే–కార్వీ ఒపీనియన్ పోల్లో వెల్లడైంది. అధికార కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని అందుకోకపోయినా అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని సర్వే తెలిపింది. 225 మంది ఎమ్మెల్యే (ఒక నామినేటెడ్ ఆంగ్లో సాక్సన్)లున్న కన్నడ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు 113 సీట్లు కావాలి. అయితే కాంగ్రెస్ 90–101 స్థానాల్లో, బీజేపీ 78–96 చోట్ల గెలిచే అవకాశం ఉందని సర్వే పేర్కొంది. బీఎస్పీతో చేతులు కలిపిన జేడీ (ఎస్) 34–43 స్థానాల్లో గెలిచి ప్రభుత్వ ఏర్పాటులో కీలకం కానుందని సర్వేలో తేలింది. అటు సీఎంగా సిద్దరామయ్యకే 33 శాతం మంది ఓకే చెప్పగా.. యడ్యూరప్పకు 26 శాతం, కుమారస్వామికి 21 శాతం మంది మద్దతిచ్చారు. తగ్గనున్న కాంగ్రెస్ సీట్లు ఐదేళ్లుగా అధికారంలో ఉన్న సిద్దరామయ్య ప్రభుత్వంపై భారీగా వ్యతిరేకత లేకపోయినా అధికారానికి అవసరమైన సీట్లు రావని సర్వేలో తేలింది. ఉపాధి కల్పన, స్వచ్ఛమైన తాగునీరు సహా పలు అంశాలు కాంగ్రెస్కు ఇబ్బందికరంగా మారాయి. కాంగ్రెస్ కోల్పోనున్న సీట్లలో బీజేపీ పాగా వేయనుంది. అయితే కమలదళం కూడా సంపూర్ణంగా ప్రజల మద్దతు సంపాదించలేదని తేలింది. లింగాయత్ల మైనారిటీ హోదా రిజర్వేషన్ల అంశం బీజేపీకి భారీగా గండికొట్టనుందని తెలుస్తోంది. ప్రస్తుతం అసెంబ్లీలో 40 సీట్లున్న జేడీఎస్ తన సీట్లను కాపాడుకోనుంది. కన్నడ ఎన్నికల్లో ఈసారి బీజేపీ ఓటు బ్యాంకు గత ఎన్నికల కన్నా గణనీయంగా పెరగనున్నట్లు ఇండియాటుడే–కార్వీ సర్వేలో వెల్లడయింది. అయితే ఈ పార్టీ ప్రభుత్వాన్ని మాత్రం ఏర్పాటుచేయలేదని సర్వే తెలిపింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 20 శాతం ఓట్లు సాధించిన బీజేపీ.. ఈసారి 35 శాతం ఓట్లను సాధించొచ్చని వెల్లడించింది. కాంగ్రెస్ గత ఎన్నికల్లో లాగే 37 శాతం ఓట్లను గెలుచుకోనుండగా.. జేడీఎస్–బీఎస్పీ కూటమి 19 శాతం ఓట్లను గెలవొచ్చని సర్వే పేర్కొంది. ప్రజాభిప్రాయం కాంగ్రెస్+జేడీఎస్ ఈ నేపథ్యంలో ఒకవేళ హంగ్ ఏర్పడితే కాంగ్రెస్, బీజేపీల్లో ఎవరికి జేడీఎస్ మద్దతుండాలనే ప్రశ్నకు.. కాంగ్రెస్కే జేడీఎస్–బీఎస్పీ కూటమి మద్దతివ్వాలని సర్వేలో పాల్గొన్న వారిలో 39 శాతం మంది కన్నడిగులు అభిప్రాయపడ్డారు. కేవలం 29 శాతం మందే కుమారస్వామి బీజేపీతో వెళ్తే బాగుంటుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 224 నియోజకవర్గాల్లో 27,919 మందిని ఈ సర్వే బృందం ఇంటర్వ్యూ చేసింది. మార్చి 17 నుంచి ఏప్రిల్ 5 వరకు జరిపిన ఈ సర్వేలో 62 శాతం సర్వే శాంపుల్స్ గ్రామీణ కర్ణాటకలో.. మిగిలింది పట్టణ ప్రాంతాల్లో తీసుకున్నారు. 45 శాతం మంది సిద్దరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి రెండోసారి అవకాశం ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. 65 శాతం ముస్లింలు, 44 శాతం హిందువులు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కులాల వారిగా చూస్తే.. 55 శాతం మంది కురుబ గౌడ(సిద్దరామయ్య సామాజిక వర్గం)లు, 53 శాతం మంది దళితులు, 37 శాతం మంది లింగాయత్లు, 36 శాతం మంది బ్రాహ్మణులు ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు. ఎన్నికల్లో కీలకాంశాలు కన్నడ ఎన్నికల్లో ఉపాధికల్పన ప్రధాన అజెండాగా మారింది. 56 శాతం మంది ఉద్యోగాల్లేకపోవటం.. చాలా తీవ్రమైన సమస్యగా పేర్కొన్నారు. ఐదేళ్లలో ఈ విషయంలో పరిస్థితి అధ్వాన్నంగా తయారైందని అభిప్రాయపడ్డారు. ధరల పెరుగుదల, అవినీతి, సరైన తాగునీరు అందుబాటులో లేకపోవటం మొదలైన అంశాలపైనా ప్రజల్లో ఆందోళన నెలకొంది. సిద్దరామయ్యపైనే మెజారిటీ కన్నడిగులు సానుకూలంగా ఉన్నారు. 38 శాతం మంది సిద్దరామయ్య పనితీరు బాగుంది, చాలా బాగుందని తెలపగా..31 శాతం మంది పర్వాలేదన్నారు. 29 శాతం మంది మాత్రమే అసంతృప్తి వ్యక్తం చేశారు. భాష, జెండా, టిప్పు సుల్తాన్.. కర్ణాటకలో కొంతకాలంగా వివాదాస్పదమవుతున్న అంశాలపైనా రాష్ట్ర ప్రజలు స్పష్టంగానే ఉన్నారు. అన్ని పాఠశాలల్లో కన్నడ భాషను తప్పనిసరి చేయటాన్ని 73 శాతం మంది అంగీకరించారు. రాష్ట్రానికి ప్రత్యేక జెండా ఉండే అంశంలోనూ 59 శాతం మంది సిద్దరామయ్యకు మద్దతుగా నిలిచారు. కేవలం 29 శాతం మంది మాత్రమే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. టిప్పు సుల్తాన్ జయంతిని అధికారికంగా నిర్వహించటంపై మాత్రం 33 శాతం మందే సానుకూలంగా స్పందించగా.. 44 శాతం మంది వ్యతిరేకించారు. ముస్లింల్లోనూ 58 శాతం మంది మాత్రమే టిప్పు జయంతికి మద్దతు తెలిపారు. లింగాయత్లకు రిజర్వేషన్లపై మాత్రం ఆచితూచి స్పందించారు. 52 శాతం మంది ఈ ఎన్నికల్లో లింగాయత్ల అంశం కీలకం కానుందని అభిప్రాయపడ్డారు. -
నా అంతరాత్మ చెబుతోంది.‘300’ వస్తాయ్
న్యూఢిల్లీ: ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీయే)కి కచ్చితంగా 300 స్థానాలు వస్తాయంటూ బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ ఢిల్లీ వ్యాపారికి లేఖ రాశారు. తన అంతరాత్మ ఈ విషయం చెబుతోందంటూ రోహిణిలో స్థిరాస్తుల వ్యాపారం చేసే విజయ్ బన్సల్కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఎన్నికల గురించి మార్చి మూడున బన్సల్ రాసిన లేఖకు ప్రత్యుత్తరంగా మోడీ అదే నెల 20న లేఖ రాశారు. విశేషమేమంటే బన్సల్ కూడా ఎన్నికలపై జోరుగా విశ్లేషణలు చేస్తుంటారు. ఇదే విషయమై ఆయన మోడీకి లేఖ రాస్తూ ‘1984 పార్లమెంటరీ ఎన్నికలకు రెండు నెలల ముందు నేను రాజీవ్గాంధీకి లేఖ రాశాను. మీకు 365 సీట్లు వస్తాయని చెప్పాను. అప్పుడు జ్యోతిష్కులు, ఒపీనియన్ పోల్స్ కాంగ్రెస్కు 225 సీట్లు మాత్రమే వస్తాయని చెప్పాయి’ అని పేర్కొన్నారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్కు 400 సీట్లు రావడంతో సంతోషించిన రాజీవ్గాంధీ.. బన్సల్ను టీకి ఆహ్వానించారు. మరో విషయమేమంటే బన్సల్ ఆప్ అగ్రనేత అరవింద్ కేజ్రీవాల్కు కూడా పరిచయస్తుడు. ఆప్కు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 28 వరకు సీట్లు వస్తాయని ఆయన లెక్కగట్టారు. అయితే ఒపీనియన్ పోల్స్ అన్నీ ఆప్కు ఆరు సీట్లు వరకు రావొచ్చని ప్రకటించాయి. చివరికి బన్సల్ అంచనా నిజం కావడంతో సచివాలయానికి వెళ్లి కేజ్రీవాల్తో టీ తాగి వచ్చారు. ఇక ఈసారి ఎన్డీయేకు 292 సీట్లు వస్తాయని ఈ రాజకీయ విశ్లేషకుడు అంచనా వేస్తున్నారు. ఎన్డీయేకు మరో 28 మంది ఇతర ఎంపీలు మద్దతు ఇస్తారని మోడీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. బన్సల్ అద్వానీ, సుష్మాస్వరాజ్ వంటి సీనియర్ నేతలకూ తన అంచనాలను పంపినా, మోడీ మాత్రమే జవాబివ్వడం విశేషం.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
వారణాసి.. రాజకీయ చరిత్ర ఇదే!
ఉప్పెనలా ఏపీలో ఓటింగ్.. రాబోయేది 'ఫ్యాన్' టాస్టిక్ రిజల్ట్స్
మనీష్ సిసోడియా జ్యుడిషీయల్ కస్టడీ పొడగింపు
ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై బీజేపీ ఫుల్ ఫోకస్.. మరో కొత్త ప్లాన్!
NewsClick Row: ప్రబీర్ తక్షణ రిలీజ్కు సుప్రీం కోర్టు ఆదేశం
Love Marriage: లేటు వయసులో ఘాటు ప్రేమ
తాడిపత్రిలో టెన్షన్ టెన్షన్..!
కెనడాలో ఘనంగా పదేళ్ల తెలంగాణ ఉత్సవాలు!
పల్నాడులో టీడీపీ విధ్వంసకాండ
మే 17 నుంచి సినిమా థియేటర్లు మూత
తప్పక చదవండి
- మనీష్ సిసోడియా జ్యుడిషీయల్ కస్టడీ పొడగింపు
- పాడెపై వెళ్లి నామినేషన్! గోరఖ్పూర్లో విచిత్రం
- కిడ్నాప్ చేసి పక్కింట్లోనే 26 ఏళ్లుగా..
- NOTA: నోటా.. కోరల్లేని పులి!
- Anasuya Bharadwaj: అందానికే కాదు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అనసూయ.. బర్త్డే స్పెషల్ (ఫోటోలు)
- Bhuma VS AV! అఖిలప్రియ బాడీ గార్డ్ పరిస్థితి విషమం
- టాలీవుడ్ హీరోయిన్కి అరుదైన వ్యాధి.. ఆస్పత్రిలో బెడ్పై అలా
- పదేళ్ల తర్వాత.. చాట్జీపీటీ కంపెనీ కోఫౌండర్ సంచలన నిర్ణయం!
- చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చిన బీజేపీ!
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
Advertisement