-
అబార్షన్ల అడ్డా.. ఖలీల్వాడి!
నిజామాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలోని ఖలీల్వాడి అబార్షన్లకు అడ్డాగా మారింది! ప్రైవేట్ వైద్యుల కాసుల కక్కుర్తి యువతుల ప్రాణాల మీదకు తెస్తోంది. కనీస నిబంధనలు పాటించకుండా అబార్షన్లు చేస్తుండడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఖలీల్వాడిలోని వివిధ ఆస్పత్రుల్లో రోజూ పది వరకు అబార్షన్లు చేస్తున్నారు. కానీ, ఎక్కడా ఎలాంటి నిబంధనలు పాటించరు. ఎవరు, ఎందుకు ఆస్పత్రికి వచ్చారో, వారికి ఏ చికిత్స చేశారో కూడా రికార్డులు నిర్వహించరు. ప్రైవేట్ ఆస్పత్రులపై వైద్యశాఖ పరిశీలన లేకపోవడంతో ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. సాధారణ చికిత్సలే కాదు, అబార్షన్ల పేరిట విచ్చలవిడిగా దండుకుంటున్నారు. కాసుల కక్కుర్తి.. ఖలీల్వాడిలో సుమారు 40 వరకు ప్రసవ ఆసుపత్రులు ఉన్నాయి. ఇందులో కొన్ని ఆస్పత్రుల్లో నిబంధనలకు విరుద్ధంగా, విచ్చలవిడిగా అబార్షన్లు చేస్తున్నారు. వైద్యారోగ్యశాఖ పరిశీలన లేకపోవడంతో ఈ తతంగం యథేచ్ఛగా కొనసాగుతోంది. గతంలో ఆర్మూర్ డివిజన్కు చెందిన ఓ యువతికి అబార్షన్ చేయగా అది వికటించి మృతి చెందింది. ఇలాంటి ఘటనలు రెండు, మూడు వెలుగు చూసినా అధికారులు పెద్దగా స్పందించలేదు. దీంతో ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు డబ్బుల కోసం ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. మోసపోయి.. ప్రేమ పేరుతోనో, మరే కారణంతోనో వలలో పడి చాలా మంది అమాయక యువతులు మోసపోతున్నారు. ఎదుటి వారిని పూర్తిగా సర్వస్వం అప్పగించేస్తున్నారు. ఈ క్రమంలో గర్భం దాల్చుతున్నారు. మరోవైపు, భర్తకు దూరంగా ఉన్న మహిళలు, అలాగే, అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్న వారు అవాంఛిత గర్భం దాల్చుతున్నారు. అక్రమ సంబంధాలతో పాటు ప్రేమ పేరుతో మోసానికి గురైన వారు అబార్షన్ల కోసం ఎక్కువగా వస్తున్నారు. ఇలాంటి కేసులు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోనే చోటు చేసుకుంటున్నాయి. అక్కడి మహిళలు, యువతులు పెద్దగా చదువుకోక పోవడం, అలాగే, ఆధునిక గర్భనిరోధక పద్ధతులు తెలియక పోవడంతో ఈజీగా మోసపోతున్నారు. జిల్లా కేంద్రంలోనే ఎక్కువగా.. అవాంఛిత గర్భం దాల్చిన యువతులు, మహిళలు తొలుత ఆర్ఎంపీలను ఆశ్రయిస్తున్నారు. వారు కమీషన్లకు కక్కుర్తి పడి మాయమాటలు చెప్పి జిల్లా కేంద్రంలోని ఆస్పత్రులకు తీసుకొస్తున్నారు. ఇలా వచ్చిన యువతులకు కనీస నిబంధనలు, ప్రమాణాలు పాటించకుండా ఇష్టమొచ్చినట్లు అబార్షన్లు చేస్తున్నారు. అవి వికటించి ప్రాణాల మీదకు వస్తున్నాయి. కేసులు తగ్గడంతో.. ప్రభుత్వం సర్కారు ఆస్పత్రులను బలోపేతం చేయడం, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించే వారికి పలు ప్రయోజనాలు కల్పిస్తుండడంతో ప్రైవేట్ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య బాగా పడిపోయింది. ఈ నేపథ్యంలో కొందరు ప్రైవేట్ డాక్టర్లు అబార్షన్లను ఆదాయ మార్గంగా ఎంచుకున్నారు. ఎంత రిస్క్ కేసు అయినా సరే అబార్షన్లు చేసేస్తున్నారు. యువతుల బలహీనతలను ఆధారంగా చేసుకొని ఒక్కో అబార్షన్కు రూ.15 వేల నుంచి రూ.30 వేల వరకు తీసుకుంటున్నట్లు తెలిసింది. పట్టించుకోని వైద్యారోగ్య శాఖ ప్రైవేట్ ఆస్పత్రుల్లో విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నా, అనవసరమైన పరీక్షలు, చికిత్సల పేరుతో దండుకుంటున్నా వైద్యారోగ్య శాఖ స్పందించడం లేదు. ఇక గుట్టుచప్పుడు కాకుండా సాగే అబార్షన్ల విషయంలో అసలే మాత్రం పట్టించుకోవడం లేదు. అబార్షన్లకు సంబంధించి లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు వచ్చినా వాటిపై వైద్యారోగ్యశాఖ విచారణ చేపట్టలేదు. ముఖ్యంగా ఖలీల్వాడిలోని ఓ ఆస్పత్రి, అలాగే, పక్కనే గల సరస్వతినగర్లో రెండు ఆస్పత్రులు, ప్రధాన రోడ్డుకు ఉన్న మరో ప్రైవేట్ ఆస్పత్రిలో ఎక్కువగా అబార్షన్లు జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒక్కో ఆస్పత్రిలో వారం వ్యవధిలో 15 వరకు అబార్షన్ కేసులు నమోదవుతున్నా పెద్దగా స్పందించిందీ లేదు. వాస్తవానికి ప్రైవేట్ ఆస్పత్రుల్లో తరచూ తనిఖీలు నిర్వహించాల్సిన వైద్యారోగ్య శాఖ అధికారులు ఎక్కడా తనిఖీలు చేసిన దాఖలాల్లేవు. పైగా కనీసం పరిశీలన కూడా చేయకుండా ఎంతో కొంత తీసుకుంటూ ఆస్పత్రులకు అనుమతులు ఇచ్చేస్తున్నారు. ‘మచ్చ’తునకలెన్నో.. గతంలో ఆర్మూర్ డివిజన్కు చెందిన ఓ యువతికి అబార్షన్ చేయగా, అది వికటించి ఆమె మృతి చెందింది. నిర్మల్కు చెందిన మరో మహిళకు సరస్వతినగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి నిర్వాహకులు అబార్షన్ చేశారు. అది వికటించి ఆమె ప్రాణాల మీదకు వచ్చింది. డిచ్పల్లి మండలానికి చెందిన మరో మహిళ ఆస్పత్రికి రాగా, అబార్షన్ చేసేశారు. దీంతో బాధితురాలు కలెక్టర్కు ఫిర్యాదు చేసింది. కఠిన చర్యలు తీసుకుంటాం.. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో అబార్షన్లు చేపడితే కఠిన చర్యలు చేపడుతాం. ఆస్పత్రులు నిబంధనల ప్రకారం నడుచుకోవాలి. త్వరలోనే ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాం. లోపాలు ఉన్నట్లు తేలితే చర్యలు తీసుకుంటాం. – సుదర్శనం, డీఎంహెచ్వో -
ఎదురు‘చూపు’
కరీంనగర్హెల్త్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటివెలుగు కార్యక్రమం అభాసుపాలవుతోంది. దృష్టి లోపం, కళ్ల సమస్యలపై పరీక్షలు నిర్వహించి కొందరికి కళ్లద్దాలు పంపిణీ చేసింది. కానీ శస్త్రచికిత్స అవసరమని గుర్తించిన వారిపై పట్టింపు కరువైంది. ఆపరేషన్ ఎప్పుడు చేస్తారో తెలియక బాధితులు ఎదురు చూడాల్సి వస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం 16శాతం మంది కంటిచూపు మందగించి కళ్లజోళ్లు వాడుతున్నారు. రాష్ట్రంలో జరిపిన సర్వే ప్రకారం 40శాతం మంది కళ్లద్దాలు వాడుతున్నట్లు తేలింది. అందరికీ చూపు ఇవ్వాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో లక్షలాదిమంది ప్రజలు వివిధ రకాల కంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని వెల్లడైంది. కంటి వెలుగుకు సంబంధించిన కార్యక్రమం ద్వారా వైద్య, ఆరోగ్యశాఖ తాజాగా సర్కారుకు పంపిన నివేదికలో అనేక అంశాలను వెల్లడించింది. గత యేడాది ఆగస్టు నుంచి అందరికీ కంటి పరీక్షలు నిర్వహించి కళ్లద్దాలు అందజేయడంతోపాటు అవసరమైన వారందరికీ కంటి శస్త్రచికిత్సలు నిర్వహించాలని సకల్పించింది. జిల్లాలో 24 బృందాలు కంటిపరీక్షలు నిర్వహిస్తున్నాయి. కంటి వెలుగు పథకం ద్వారా జిల్లాలో ఇప్పటివరకు 5,88,339 మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు పోగ్రాం అధికారులు తెలిపారు. 22,689 మందికి ఆపరేషన్లు అవసరం ఉన్నట్లు నిర్ధారించి కేసులను సంబంధిత ఆస్పత్రులకు రెఫర్ చేశారు. రెఫర్ చేసినవారికి ఇంతవరకు ఆపరేషన్లు చేయకపోవడంతో ఎదురుచూస్తున్నారు. ఈ ఉద్దేశం మంచిదే అయినప్పటికీ ఇప్పటివరకు ఒక శస్త్రచికిత్స కూడా నిర్వహించలేదు. ప్రభుత్వం అందజేస్తున్న కళ్లద్దాల్లో నాణ్యతలేదని, వృద్ధులకు ఇచ్చే కళ్లద్దాల ఫ్రేములు పిల్లలకు, పిల్లలవి వృద్ధులకు ఇస్తుండడంతో ధరించడం ఇబ్బందికరంగా మారిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్ష్యం చేరని కంటివెలుగు.. అందరిలోనూ కంటి చూపు సమస్యలు నివారించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కంటి వెలుగు పథకం జిల్లాలో కొనసాగుతున్నా లక్ష్యం చేరడం లేదు. ఈ కార్యక్రమం ద్వారా విధిగా పరీక్షలు నిర్వహిస్తున్నా ఇప్పటివరకు ఒక్కరికి కూడా శస్త్రచికిత్స జరుపలేదు. ఆరంభంలో పరీక్షలు నిర్వహించి శస్త్రచికిత్సలు అవసరమైన వారికి ఆపరేషన్లు నిర్వహించింది. వరంగల్, నాగర్కర్నూల్తోపాటు మరికొన్ని ప్రాంతాల్లో ఇన్ఫెక్షన్ కారణంగా ఆపరేషన్లు ఫెయిలై బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో వెంటనే ప్రభుత్వం ఆపరేషన్లు నిలిపివేసింది. ప్రత్యేక కంటి వైద్యశాలల్లోనే ఆపరేషన్లు నిర్వహిస్తామని అప్పటి వరకు కేసులను గుర్తించి జాబితా తయారు చేసుకోవాలని సూచించింది. శస్త్రచికిత్సల నిర్వహణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆపరేషన్లు చేయడానికి కావాల్సిన ఆస్పత్రులను సమకూర్చుకునేందుకు సిద్ధం అవుతోంది. ఈ కార్యక్రమం చేపట్టి ఆరు నెలలు కావస్తున్నా అవసరమైన వారికి శస్త్రచికిత్సలు నిర్వహించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుండడంతోపాటు బాధితుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపణలు వినవస్తున్నాయి. ప్రభుత్వం ఇస్తున్న కళ్లద్దాలలో నాణ్యత లేదని, మొక్కుబడిగా అందజేస్తున్నారని, సరైన సైజుల్లో అద్దాలు లేక వాటిని ధరించలేకపోతున్నట్లు ప్రజలు పేర్కొంటున్నారు. ఆదేశాలు రాగానే ఆపరేషన్లు.. ప్రభుత్వం అదేశాలు రాగానే కంటి వెలుగు పథకంతో కంటి ఆపరేషన్లు నిర్వహిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా కంటివెలుగు ద్వారా ఎంతమందికి ఆపరేషన్లు అవసరం ఉందో డేటా అంతా ప్రభుత్వం వద్ద ఉంది. కంటి ఆపరేషన్లు నిర్వహించడానికి కావాల్సిన సౌకర్యాలు అన్ని సమకూర్చేందుకు ప్రయత్నం చేస్తోంది. ఆపరేషన్లు అవసరమైన వారందరికీ త్వరలోనే అనుమతిరాగానే తప్పకుండా శస్త్రచికిత్సలు నిర్వహించడం జరుగుతుంది. – డీఎంహెచ్ఓ డాక్టర్ రాంమనోహర్రావు -
దాతలు ఆదుకోవాలని వినతి
తూర్పుగోదావరి, అముజూరు (కె.గంగవరం): అప్పటి వరకు సంతోషంగా ఉన్న ఆ కుటంబం విషాదంలోకి వెళ్లింది. గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన పాము వీర వెంకట సత్యనారాయణ(40) హిందీ మాస్టారుగా రామచంద్రపురం పట్టణంలోని ఓ ప్రైవేటు స్కూల్లో పనిచేస్తున్నారు. ఆయనకు వచ్చే జీతంతో భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులతో సంతోషంగా ఇప్పటి వరకు కడిపారు. హిందీ మాస్టారుగా ఎంతో మంది విద్యార్థులను హిందీ భాషలో ప్రావీణ్యులను చేశారు. నెల రోజుల క్రితం సత్యనారాయణ అనార్యోగానికి గురైతే కుటుంబ సభ్యులు కాకినాడ ఆసుపత్రికి తరలించారు. వారు పరీక్షలు చేసి రెండు కిడ్నీలు పాడైపోయాయని చెప్పడంతో ఒక్కసారిగా వారి పరిస్థితి తల్లకిందులైంది. ఆయన చెల్లి కిడ్నీని దానం చేయడంతో కాకినాడలోని ట్రస్టు ఆసుపత్రిలో ఆరోగ్య శ్రీ ద్వారా రూ.ఐదు లక్షలతో ఆపరేషన్ ఇటీవల చేయించారు. ఆపరేషన్ అనంతరం చేయాల్సిన చికిత్స కొనసాగాలంటే మరో రూ.మూడు నుంచి నాలుగు లక్షల వరకు ఖర్చవుతుందని ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. కూలిపనులు చేసుకునే తాము ఇంత డబ్బు తేలేక, ఆరోగ్య బాగుంటే చాలని వారు ఆవేదన చెందుతున్నారు. ఉన్నదంతా పోగేసి ఆపరేషన్ చేయించామని, మిగతా చికిత్స కోసం కావల్సిన సొమ్ములు ఎలా అని వారు సతమతమవుతున్నారు. దాతలు సాయం చేస్తే చికిత్స చేయడానికి వీలుగా ఉంటుందని దాతలు ఎవరైనా సాయం చేయాలని వారు కోరుతున్నారు. సాయం అందించాల్సిన దాతలు ఆంధ్రాబ్యాంకు అకౌంట్ నంబర్ 044010100135297, ఐఎఫ్సీ కోడ్ ఏఎన్డీబీ0000440 నంబర్కు సాయం అందించాలని వారు కోరుతున్నారు. నేరుగా సాయం అందించాలనే దాతలు సెల్: 98485 42811కు సంప్రదించాలని వారు కోరుతున్నారు. -
సేవా హస్తాలు..!
అనారోగ్యంతో బాధపడుతున్న ఓ అభాగ్యుడికి ఆపరేషన్ కోసం రూ.లక్షలు అవసరమయ్యాయి. కానీ ఎవరిస్తారు? చదువుకునేందుకు డబ్బులు లేక సాయం చేసే దాతలు లేక చదువు మానేసి ఇంటిబాట పట్టిన వారూ ఉన్నారు. ఇటువంటి కష్టాలకు, సమస్యలకు చెక్ పెట్టే దిశగా సేవాహస్తాలు ముందుకొచ్చాయి. కష్టం ఏదైనా.. సమస్య ఎంత పెద్దదైనా సరే.. తాము నిధులు సేకరించి ఆదుకుంటున్నారు ‘గుడ్క్లాప్’ నిర్వాహకులు. వెబ్సైట్ రూపొందించి దాతలు ఇచ్చిన డబ్బులతో ఆపన్నహస్తం అందిస్తున్నారు. హిమాయత్నగర్: నిజాంపేటకు చెందిన గండ్రపు శశాంక్ సీఏ చదువుకున్నారు. ఆర్థిక సమస్యలు, ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న వారికి సాయం చేసేవారు లేక, చదువుకునే వారికి ఆర్థిక సాయం చేసేవారు లేక ఇబ్బందుల పాలవుతున్నవారిని గుర్తించి ఆదుకుంటున్నారు. సమస్యల్లో ఉన్న వారి కోసం నిధుల సేకరణ చేయాలనే ఆలోచనకు 2017లో శ్రీకారం చుట్టారు. స్నేహితుడు డాక్టర్ రాజ్కు విషయాన్ని వివరించారు శశాంక్. రాజ్ ప్రోత్సాహంతో 2018 మార్చిలో క్రౌండ్ ఫండింగ్ను మొదలుపెట్టారు. దీని కోసం ‘గుడ్క్లాప్’ పేరుతో కంపెనీని స్థాపించి అదే పేరుతో వెబ్సైట్ను రూపొందించారు. క్లిక్ చేస్తే చాలు సాయం.. మీ ఇంట్లోని వారు ప్రాణాపాయ స్థితిలో ఉన్నా.. చదువు కోసం ఫండింగ్ కావాలన్నా.. సమాజానికి ఉపయోగపడే మంచి పని చేయాలన్నా.. డబ్బు కావాల్సిందే. మనవద్ద ఉన్న డబ్బు సరిపోని పరిస్థితుల్లో దాతల కోసం ఎదురు చూస్తుంటాం. ఇటువంటి వారు తమ ‘గుడ్క్లాప్’ని ఆశ్రయిస్తే తాము మధ్యవర్తిత్వం వహిస్తూ మీకు కావాల్సిన డబ్బును ఇస్తామంటున్నారు ఫౌండర్ శంశాంక్. వెబ్సైట్లోకి వెళ్లి ‘స్టార్ట్ క్యాంపెయిన్’ అనే బటన్ క్లిక్ చేస్తే చాలు. ‘గుడ్క్లాప్’ నిర్వాహకులు మీకు కాంటాక్ట్లోకి వచ్చేస్తారు. ఇప్పటివరకు వీరు ఎంతో మందిని ఆదుకున్నారు ‘గుడ్క్లాప్’ సభ్యులు భార్గవ, పావని, రాజు, నితిన్, ఫణి. మనల్ని కాంటాక్ట్ చేస్తారు. ఆ తరువాత ఎక్కడైతే చికిత్స జరుగుతుందో..ఆ హాస్పిటల్కు వస్తారు. సంబంధిత డాక్టర్తో సంప్రదింపులు జరుపుతారు. మెడికల్ రిపోర్ట్స్ అన్నీ పరిశీస్తారు. వాస్తవమని నిర్ధారించుకున్న తర్వాత.. దీనికి సంబ«ంధించిన స్క్రిప్ట్ని తయారు చేస్తారు. స్క్రిప్ట్ చదివే వారికి నమ్మకాన్ని, కంటతడి పెట్టించేలా రాస్తారు. ఆ తర్వాత వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. దీనిద్వారా వచ్చిన డబ్బులను హాస్పిటల్కే వెళ్లి చెల్లిస్తారు. కమీషన్ 6శాతం.. ఇంత కష్టపడి టీం వర్క్ చేస్తూ ఫండ్ కలెక్ట్ చేస్తున్న వీరు వచ్చిన ఫండింగ్లో నుంచి 6శాతం కమీషన్ తీసుకుంటారు. ఈ కమీషన్తో సంస్థ ఉద్యోగుల జీతాలు, మెయింట్నెన్స్, స్క్రిప్ట్ సిద్ధం చేసిందుకు వాడతారు. సాయం చేసిన వారి వివరాలు ఫొటోతో సహా వెబ్సైట్లో ప్రచురిస్తారు. తమకు ఈ విధమైన ప్రచారం వద్దనుకుంటే ఆప్షన్ హైడ్ చేస్తే సరిపోతుంది. మీరు సాయం చేసినా.. పబ్లిగ్గా మీ ఫొటో, మీ వివరాలు కనిపించవు. మీరు మాత్రమే చూసుకునే వెసులుబాటు ఉంటుంది. వీరిని ఆదుకున్నారు.. ♦ తమిళనాడు వేలూరులోని ‘సీఎంసీ’ హాస్పిటల్లో ‘రేర్ బ్లడ్ డిజార్డర్’తో బాధపడుతున్న స్రవంతి అనే యువతి రూ.15 లక్షలు అవసరమయ్యాయి. గుడ్క్లాప్ వెబ్సైట్ ద్వారా ఇప్పటి వరకు రూ.2.41లక్షలు హాస్పిటల్కు చెల్లించారు. ♦ ఇండోసోల్ అనే కర్ణాటక వాళ్లు ఓ ఆల్బమ్ కోసం ఫండ్ కావాల్సి వచ్చింది. దీంతో గుడ్క్లాప్ను సంప్రదించారు. వారికి రూ.2.8 లక్షలు ముట్టాయి. దీనిద్వారా వాళ్ల ఆల్బమ్ రెడీ అయ్యింది. ♦ బెంగళూరుకు చెందిన నటరాజ్ అనే యువకుడు ఇంటర్నల్ బ్లీడింగ్తో చికిత్సలో ఉన్నాడు. దీనికి గాను రూ.10లక్షలు అవసరం. ఇప్పటి వరకు రూ.2లక్షలు నేరుగా హాస్పిటల్కు ఇచ్చారు. ♦ కేరళ వరదల్లో చిక్కుకున్న వారికి సాయం చేయాలనే దృక్పథంతో ‘ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్’ వాళ్లు ఫండ్కు రేజ్ చేశారు. ఇలా రూ.5.66 లక్షలను కేరళ వరద బాధితులకు ఇవ్వగలిగారు. ♦ హైదరాబాద్కు చెందిన వేణుకుమార్ భార్య ప్రసవించింది. పాప ఏడో నెలలో పుట్టడంతో ఇంక్యుబెటర్లో ఉంచాల్సి వచ్చింది. వైద్య ఖర్చుల కోసం రూ.4 లక్షల వరకు అవసరమయ్యాయి. ఆమెకు రూ.3.9లక్షలు అందించారు. ♦ అన్నపూర్ణ స్టూడియోకు చెందిన కొందరు యువకులు ‘నాన్దెవ్రూ’ అనే షార్ట్ఫిల్మ్ తీయడానికి రూ.2.20లక్షల సాయం కావాల్సి వచ్చింది. వీరికి రూ.2.23లక్షలు వచ్చాయి. ఇదే స్టూడియోలో మరో టీం ‘అంతర్గత’ ‘ఫేక్ ప్రెగ్నెన్సీ’ పై షార్ట్ ఫిల్మ్ తీసేందుకు రూ.1.49లక్షలు అవసరం కాగా..రూ.1.50లక్షలు వచ్చాయి. ♦ నగరానికి చెందిన రాజు తండ్రి రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతిచెందారు. రాజు తలకు తీవ్రగాయాలయ్యాయి. రిబ్స్ విరిగిపోయాయి. ఇప్పుడు ఇతని చికిత్స కోసం రూ.7లక్షలు కావాలి. ప్రస్తుతం రూ.1.46లక్షలు అందాయి. -
మందగించిన ‘కంటివెలుగు’
ఆదిలాబాద్టౌన్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘కంటి వెలుగు’ కార్యక్రమం ముందుకు సాగుతున్నా.. వైద్య పరీక్షలు చేయించుకున్న వారు శస్త్ర చికిత్సల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. దీంతో వారిచూపు మందగిస్తోంది. కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆగస్టు 15న ప్రారంభించారు. నాలుగు నెలలు గడిచినా ఇంతవరకు జిల్లాలో ఒక్కరికి కూడా కంటి ఆపరేషన్ చేసిన దాఖలాలు లేవు. దీంతో బాధితులు ఆపరేషన్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. కాగా ఈ కార్యక్రమం ఫిబ్రవరిలో ముగియనుంది. జిల్లాలో 7లక్షల 8వేల మందికి కంటి పరీక్షలు చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు 2లక్షల 49వేల మందికి మాత్రమే పరీక్షలు జరిపారు. గడువులోగా పరీక్షలు పూర్తవ్వడం గగనంగానే కనిపిస్తోంది. జిల్లాలోని 18 మండలాల్లో 18 బృందాలతో కంటి వెలుగు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మొత్తం 7లక్షల 8వేల మంది ఉండగా, ఇప్పటి వరకు 2లక్షల 49వేల 88 మందికి కంటి పరీక్షలు చేశారు. ఇందులో పురుషులు 1లక్ష 12వేల 120 మంది ఉండగా, మహిళలు 1లక్ష 36వేల 950 ఉన్నారు. దాదాపు 40 శాతం వరకు మాత్రమే లక్ష్యం పూర్తయినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. అప్పటిలోగా అందరికి కంటి పరీక్షలు జరిగేనా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకా 4లక్షల 50వేల మంది వరకు కంటి పరీక్షలు చేయాల్సి ఉంది. అయితే అధికారుల లెక్కల ప్రకారం మరో లక్ష మంది వరకు మాత్రమే కంటి సమస్యలతో బాధపడుతున్నట్లు అంచనా వేస్తున్నారు. కళ్లాద్దాల పంపిణీలోనూ జాప్యమే.. పరీక్షలు పూర్తిచేశాక కంటి సమస్యతో బాధపడుతున్న వారికి కంటి అద్దాలు పంపిణీ చేయాల్సి ఉంటుంది. అయితే జిల్లాలో బాధితులకు అద్దాల పంపిణీలోనూ తీవ్ర జాప్యం జరుగుతోంది. ఇప్ప టి వరకు 44,035 మందికి రీడింగ్ అద్దాలు పంపి ణీ చేశారు. అలాగే దూరపు, దగ్గరి చూపునకు సంబంధించిన కంటి అద్దాలు 27,428 పంపిణీ చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు 7,215 మందికి మాత్రమే పంపిణీ చేశారు. దాదాపు 20వేల మందికి ఇంకా పంపిణీ కావాల్సి ఉంది. కంటి పరీక్షలు చేయించుకున్న వీరు కంటి అద్దాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. శస్త్రచికిత్స సంగతేంటి? పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కంటి వెలుగు కార్యక్రమం ద్వారా కంటి పరీక్షలు చేయించుకున్న వారిలో కొంత మందికి శస్త్ర చికిత్సలు అవసరం కాగా, ఇప్పటివరకు ఏ ఒక్కరికి సైతం శస్త్ర చికిత్స చేసిన దాఖలాలు లేవు. కేవలం కంటి పరీక్షలకే పరిమితమవుతున్నట్లు తెలుస్తోంది. కంటి సమస్యతో బాధపడుతున్న 25,447 మందిని శస్త్ర చికిత్సల కోసం వివిధ ఆస్పత్రులకు రిఫర్ చేయగా, ఎక్కడ కూడా ఇప్పటివరకు ఆపరేషన్ చేయలేదు. కంటి సమస్యతో బాధపడుతున్న వారు అధికారులను ఆపరేషన్ ఎప్పుడు చేస్తారని అడిగితే దాటవేస్తున్నారని చెబుతున్నారు. లక్ష్యం పూర్తయ్యేనా.. ఫిబ్రవరిలోగా కంటి వెలుగు కార్యక్రమ లక్ష్యం పూర్తవ్వడం అనుమానంగానే కనిపిస్తుంది. ఈ కార్యక్రమాన్ని ఆగస్టులో ప్రారంభించగా జిల్లాలో 50 శాతానికి కూడా లక్ష్యం చేరుకోలేదు. మరో 60 రోజుల్లో వంద శాతం కంటి పరీక్షలు చేసేలా పరిస్థితులు కనిపించడం లేదు. ప్రభుత్వ సెలవులు, పండుగ రోజుల్లో ఈ శిబిరాలకు సెలవు ఉండడంతో ప్రక్రియ ముందుకు సాగడం లేదు. కాగా గడిచిన నాలుగు నెలల్లో 2లక్షల 49వేల మందికి పరీక్షలు జరిపారు. ఇంకా 4లక్షల 50వేల వరకు పరీక్షలు చేయాల్సి ఉంది. మార్చిలో కంటి ఆపరేషన్లు కంటి వెలుగు కార్యక్రమం ద్వారా జిల్లాలో 2.60లక్షల మందికి కంటి పరీక్షలు చేశాం. శస్త్ర చికిత్సలు అవసరమైన వారికి 2019 మార్చి మొదటి వారంలో చేయిస్తాం. ఫిబ్రవరి చివరి వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. 80 శాతం వరకు స్క్రీనింగ్ పూర్తవుతుంది. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలి. – రాజీవ్రాజ్, డీఎంహెచ్వో, ఆదిలాబాద్
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- మహామహులకూ తప్పని... ఓటమి
- 22 మంది బిలియనీర్లయ్యారు
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement