breaking news
One minute late rule
-
ఇంటర్మీడియెట్కూ నిమిషం నిబంధన
-
ఇంటర్మీడియెట్కూ నిమిషం నిబంధన
- మార్చి 1 నుంచి ఇంటర్ పరీక్షలు - ఏర్పాట్లు పూర్తి చేసిన బోర్డు - నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ - హాజరుకానున్న 9,76,631 మంది విద్యార్థులు - ఇంటర్బోర్డు కార్యదర్శి అశోక్ వెల్లడి సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలను మార్చి 1 నుంచి 19 వరకు నిర్వహించేందుకు ఇంటర్మీడియెట్ బోర్డు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎంసెట్ తరహాలో ఈ పరీక్షల్లోనూ నిమిషం నిబంధనను అమలు చేయనున్నట్లు బోర్డు కార్యదర్శి అశోక్ తెలిపారు. బోర్డు కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులను పరీక్ష హాల్లోకి ఉదయం 8 గంటల నుంచే అనుమతిస్తామన్నారు. ప్రతి రోజు పరీక్ష 9 గంటల నుంచి 12 గంటల వరకు ఉంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,291 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించే ఈ పరీక్షలకు 9,76,631 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు తెలిపారు. హాల్టికెట్లు ఇవ్వకపోతే చర్యలు... ఫీజులు కట్టలేదనో మరే కారణంతోనైనా విద్యార్థులకు హాల్టికెట్లను ఇవ్వని యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకొంటామని అశోక్ చెప్పారు. ఎస్ఎంఎస్ పంపించినా యాజమాన్యాలపై చర్యలు తీసుకొంటామన్నారు. అలాగే తమ వెబ్సైట్ నుంచి (bietelangana.cgg.gov.in, tsbie.cgg.gov. in) హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. వాటిపై ప్రిన్సిపాల్ సంతకం అవసరం లేదన్నారు. ఆదివారం నుంచే హాల్టికెట్లు అందుబాటులో ఉంచామన్నారు. హాల్ టికెట్లలో పొరపాట్లు ఉంటే ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లి మార్పు చేయించుకోవాలని సూచించారు. జవాబుల బుక్లెట్లో 24 పేజీలు ఉన్నాయా.. లేదా చూసుకోవాలని, అడిషనల్ షీట్స్ ఇవ్వరని తెలిపారు. కొత్త సిలబస్, పాత సిలబస్ను జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. మొదటిసారి హాజరయ్యేవారు న్యూ సిలబస్ ప్రశ్నాపత్రంతోనే పరీక్ష రాయాలన్నారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సు సదుపాయం కల్పించేలా చర్యలు చేపట్టామన్నారు. సెల్ఫోన్లపై జీపీఎస్ నిఘా... ‘పరీక్ష కేంద్రాల్లోకి సెల్ఫోన్ సహా ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరు. చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు కూడా సెల్ ఫోన్లు వినియోగించకూడదు. సెల్ వాడితే చర్యలు తప్పవు. మాల్ ప్రాక్టీస్కు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు. జీపీఎస్ సహాయంతో పోలీసులు సెల్ ఫోన్ల వినియోగంపై నిఘా పెడతారు. మాస్ కాపీయింగ్ను అరికట్టేందుకు 50 ఫ్లయింగ్, 200 సిట్టింగ్ స్క్వాడ్లను పోలీసు, రెవెన్యూ బృందాలతో ఏర్పాటు చేశాం. ఇన్విజిలేషన్ విధుల్లో 26,170 మంది పాల్గొంటారు’అని అశోక్ వెల్లడించారు. సెంటర్ లొకేటర్ యాప్.. స్మార్ట్ ఫోన్ ద్వారా పరీక్షా కేంద్రాన్ని కనుక్కునేలా బోర్డు చర్యలు చేపట్టింది. విద్యార్థులు తమ మొబైల్లో సెంటర్ లొకేటర్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని, హాల్ టికెట్ నెంబరు ఎంటర్ చేయగానే రూట్ మ్యాప్తోపాటు ఎంత సమయంలో అక్కడికి చేరుకోవచ్చన్నది అందులో చూపిస్తుంది. సెంటర్ లొకేటర్ యాప్ను సోమవారం ఉప ముఖ్యమంత్రి కడియంశ్రీహరి ప్రారంభించునున్నారు. 9 నాటి పరీక్ష 19న... ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో 9వ తేదీ పరీక్షను 19న నిర్వహిస్తున్నారు. 19న మ్యాథ్స్ పేపరు–2బీ, జువాలజీ పేపరు–2, హిస్టరీ పేపరు–2 పరీక్షలు ఉంటాయి. ఏప్రిల్ 24న ఫలితాలు... పరీక్షల మూల్యాకనం మార్చి 8న ప్రారంభం అవుతుంది. ఫలితాలను ఏప్రిల్ 24న విడుదల చేస్తారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల వివరాలు... మొత్తం విద్యార్థులు: 9,76,631 ప్రథమ సంవత్సరం: 4,75,832 ద్వితీయ సంవత్సరం: 5,00,799 24 గంటలు పని చేసే కంట్రోల్రూమ్ నెంబర్లు... ఫోన్: 040–24601010/24732369, ఫ్యాక్స్: 040–24655027 -
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
-
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
పరీక్ష హాల్లోకి అనుమతించబోమన్న ఇంటర్ బోర్డు తొలిసారిగా ఈ పరీక్షల్లో ‘నిమిషం’ నిబంధన అమలు ఉదయం 8.30 గంటల కల్లా పరీక్ష కేంద్రం వద్దకు చేరుకోవాలని విద్యార్థులకు సూచన నేటి నుంచి ప్రారంభమవుతున్న ఇంటర్మీడియెట్ పరీక్షలు సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం ఇంటర్ ప్రథమ సంవత్సరం ద్వితీయ భాష పేపర్-1 పరీక్షతో ఈ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 1వ తేదీ వరకు ఇవి కొనసాగుతాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలను నిర్వహిస్తారు. నిమిషం నిబంధన అమలు చేయడం ఈసారి ఇంటర్ పరీక్షల ప్రత్యేకత. ఎంసెట్ తరహాలో ఇంటర్ బోర్డు కూడా మొదటిసారిగా నిమిషం నిబంధనను అమల్లోకి తెచ్చింది. అంటే నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను పరీక్ష హాలులోకి అనుమతించరు. విద్యార్థులు అరగంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని బోర్డు సూచించింది. విద్యార్థులను ఉదయం 8:30 గంటలనుంచే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తామని, ఆలస్యంగా వచ్చి ఇబ్బంది పడొద్దని స్పష్టం చేసింది. గతంలో పరీక్ష ప్రారంభమైన 15 నిమిషాల వరకు పరీక్ష హాల్లోకి అనుమతించేవారు. ఈసారి అలా కుదరదు. అరగంట ముందుగానే కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతిస్తున్నందున ఆ వెసులుబాటును తొలగించినట్లు బోర్డు అధికారులు చెప్పారు. విద్యార్థుల్ని సాధారణంగా 8:45 గంటలవరకు పరీక్ష హాల్లోకి పంపుతారు. అయితే 8:45 గంటల నుంచి 9 గంటల వరకూ అనుమతిస్తారు. అయితే ఆలస్యానికి గల కారణాల్ని విద్యార్థులు రాతపూర్వకంగా తెలపాలి. రాష్ట్రవ్యాప్తంగా 2,661 కేంద్రాల్లో నిర్వహించే ఇంటర్ పరీక్షలకు 19.78 లక్షలమంది హాజరు కానున్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు పేర్లు, మీడియం, పరీక్ష రాసే సబ్జెక్టు వివరాలు, హాల్టికెట్లో ఇతర వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. విద్యార్థులు సంతకాలు చేసేముందు ఓఎంఆర్ బార్కోడ్ షీట్పైనా రిజిస్టర్ నంబరు, పేర్లు, సబ్జెక్టు వివరాలను చూసుకోవాలి. కొత్త సిలబస్, పాత సిలబస్ వివరాలను సరిచూసుకోవాలి. విద్యార్థులు, ఇన్విజిలేటర్లు పరీక్షా కేంద్రం లోకి సెల్ఫోన్లు తేరాదు. సెల్ఫోన్లు తెచ్చుకునేందుకు అనుమతి ఉన్న డిపార్టుమెంటల్ ఆఫీసర్లు, చీఫ్ సూపరిం టెండెంట్ల ఫోన్లపై ట్యాపింగ్ తరహా నిఘా ఉంటుంది. పరీక్షలపై సీఎస్ సమీక్ష: ఇంటర్ పరీక్షల నిర్వహణపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి మంగళవారం సెకండరీవిద్య ముఖ్య కార్యదర్శి(ఇన్చార్జి) పూనం మాల కొండయ్య, ఇంటర్ బోర్డు కార్యదర్శి రామ్శంకర్ నాయక్లతో సమీక్షించారు. పరీక్షలను సజావుగా నిర్వహించేం దుకవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.