breaking news
one belt one road
-
‘గ్లోబల్’ వ్యూహంలో భాగమైన కోస్తాంధ్ర
ప్రపంచీకరణ ప్రభావాన్ని సకాలంలో అంచనావేసి, ఆసియాలో ముందుగా దాన్ని అందిపుచ్చుకున్న చైనా... తన తదుపరి ఆర్థిక విస్తరణకు ‘వన్ బెల్ట్ – వన్ రోడ్’ (‘ఓబిఓఆర్’) విధానాన్ని చేపట్టింది. 2017 మేలో జరిగిన ఆ అధికారిక ప్రకటనకు 28 దేశాల అధిపతులు, వంద దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. ఆ రోజు 50కి పైగా వాణిజ్య ఒప్పందాలు అక్కడ జరి గాయి. అయితే భారత్ దీనికి హాజరు కాలేదు. మధ్య ఆసియా, యూరప్, ఇండో–పసిఫిక్ దేశాలతో–‘బెల్ట్’ ద్వారా, అలాగే ‘రోడ్’– ద్వారా ఆగ్నేయ ఆసియా దేశాల్లోకి సముద్ర జలాల ద్వారా, రైలు మార్గాల ద్వారా చైనా ప్రవేశించింది. అయితే ‘ఈ గైర్హాజరీ వల్ల మనం ఒంటరి కావడం అనే రిస్క్ (ఇదే పదం వాడారు)ను కూడా కాదనలేము’ అని మన విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికారి ఒకరు అన్నట్టు ‘ది హిందూ’ అప్పట్లో రాసింది. ఇంతకూ దీనిపై మోదీ ప్రభుత్వం అభ్యంతరం ఏమిటి?‘బెల్ట్’లో భాగంగా పాకిస్తాన్ పశ్చిమ తీరాన అరేబియా సముద్రంలో ఉన్న గ్వాదర్ పోర్టుకు ‘చైనా–పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్’ పేరుతో చైనా తన నిధులతో ఒక ప్రత్యేక రోడ్డును 3,217 కి.మీ. మేర నిర్మించింది. అది పాకిస్తాన్ భూభాగాన్ని తూర్పు నుంచి పడ మరకు ఆసాంతం దాటి గ్వాదర్ పోర్ట్ చేరుతుంది. పాక్ దాన్ని అనుమతించింది. కానీ దానిలో పాక్ ఆక్రమిత కశ్మీర్ ఉండడం మోదీ ప్రభుత్వం అభ్యంతరంగా భావించింది. నిజానికి అప్పుడే ఇండియా దాన్ని అవకాశంగా తీసుకుని ‘రికార్డు’లో అది ‘పాక్ ఆక్రమిత కశ్మీర్’ అనే ‘క్లాజ్’తో చైనా ప్రతిపాదనను అంగీకరించి ఉంటే ఎలా ఉండేదో! కానీ అది జరగలేదు. మన అభ్యంతరం గురించి అప్పట్లోనే – ‘విస్తరిస్తున్న ఆసియా మార్కెట్తో కలిసి, దాని సప్లై, తయారీ, మార్కెట్ అవసరాలతో అనుసంధానం అయితేనే 2032 నాటికి ఇండియా 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక లక్ష్యానికి చేరగలదు’ అని యూఎన్ఓ మాజీ డైరెక్టర్ ముకుల్ సన్వల్ అన్నారు.మరిప్పుడు ‘గ్లోబల్ సౌత్’ భావన ముందుకొచ్చి ఈ దేశాలు తమ మధ్య ఉండాల్సింది ‘సౌత్–సౌత్ కో–ఆపరేషన్’ అంటుంటే, మన పొరుగున ఉన్న చైనా, పాక్లతో ఇన్నాళ్లుగా ‘ఎన్డీఏ’ ప్రభుత్వం అనుసరించిన దౌత్య విధానం మాటేమిటి? ప్రస్తుతం జీ–7 దేశాల మధ్య కంటే ‘బ్రిక్స్’ దేశాల మధ్య వాణిజ్యం శరవేగంగా సాగుతోంది. గత 20 ఏళ్లలో బ్రెజిల్–చైనా మధ్య అది యాభై రెట్లు పెరిగితే, చైనా–ఇండియాల మధ్య కేవలం 28 రెట్లు మాత్రమే పెరిగింది. అంతే కాదు ఇండో– పసిఫిక్ ప్రాంతంలో చైనా ఆధిపత్యాన్ని నిలువరించడం లక్ష్యంగా 2007లో ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా ‘క్వాడ్’ కూటమిగా ఏర్పడితే... అందులో ఇండియా కలిసింది.చదవండి: ఇండియాలోనూ పదహారేళ్లకు తగ్గించాలా?కానీ ‘ఎన్డీఏ’ పాలనలో మన వేగం పెరిగి అదిప్పుడు ‘మలబార్’ పేరుతో విశాఖపట్టణం కేంద్రంగా మన సముద్ర జలాల్లో ఏటా అక్టోబర్లో అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ల నౌకాదళాలతో కలిసి విన్యాసాలు చేసే స్థాయికి చేరింది. కాకినాడ పోర్టు వద్ద ఈ ఏప్రిల్లో అమెరికా నౌకా దళాలు మన త్రివిధ దళాలతో కలిసి విపత్తు నివారణ చర్యల రిహార్సల్ చేశాయి. ఇవికాక ఈశాన్య రాష్ట్రాలలోని మణిపూర్ జాతుల సమస్య, వెస్ట్ బెంగాల్లోకి వలస వస్తున్న బంగ్లాదేశ్ పౌరుల ఓటర్ల సమస్య వంటివాటికి వ్యూహాత్మకంగా జాతీయ వార్తల స్థాయిలో ఏళ్ల తరబడి ఇస్తున్న ప్రచారాన్ని బట్టి, సరిహద్దు దేశాలతో మన దౌత్య సంబంధాలు ఎలా ఉండాలి అని మనం అను కుంటున్నదీ చెప్పక చెప్పే అంశాలు.- జాన్సన్ చోరగుడి అభివృద్ధి– సామాజిక అంశాల వ్యాఖ్యాత -
చైనాకు ఇన్వెస్టర్ల ఝలక్
బ్లూమ్బర్గ్ : చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఒన్ బెల్ట్ ఒన్ రోడ్కు (ఓబీఓఆర్) ఇన్వెస్టర్లు ఝలక్ ఇచ్చారు. ప్రధానంగా ఒన్ బెల్ట్ ఒన్ రోడ్ అత్యంత తీవ్రవాద ప్రభావిత దేశాల్లో నిర్మిస్తుండడంతో అక్కడ పెట్టుబడి పెట్టేందుకు ఇన్వెస్టర్లు, బ్యాంకులు సైతం వెనకంజ వేస్తున్నాయి. ఆసియా, ఆఫ్రికా, ఐరోపా ఖండాల్లోని 68 దేశాలను కలుపుతూ.. ఎకనమిక్ కారిడార్ నిర్మించాలని చైనా ప్రతిపాదించింది. చైనా ప్రతిపాదిత 68 దేశాల్లో 27 దేశాలకు బిలో ఇన్వెస్టిమెంట్ గ్రేడ్ (సాధారణ పెట్టుబడి)ను అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఇచ్చాయి. అలాగే ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, సిరియా, ఇరాక్ వంటి 14 దేశాలకు సున్నా రేటింగ్ను ఇచ్చాయి. మరికొన్ని దేశాలు అత్యంత అవినీతికరమైనవిగా రేటింగ్ సంస్థలు ప్రకటించాయి. ఒన్ బెల్ట్ ఒన్ రోడ్ కింద రహదారులు, రైల్వేలు, పోర్టులు, పవర్ గ్రిడ్లు, నిర్మించాలని.. ఇందుకు 1.2 ట్రిలియన్ అమెరికన్ డాలర్లు అవసరమవుతాయని మోర్గాన్ స్టాన్లీ సంస్థ అంచనా వేసింది. ఇదిలా ఉండగా.. 2050 నాటికి భూమి సరిహద్దుల వరకూ ఒన్ బెల్ట్ ఒన్ రోడ్ ద్వారా విస్తరిస్తామని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ స్పష్టం చేశారు. ఒబీఓఆర్ను తమ దేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. రేటింగ్ సంస్థలు పేర్కొన్న ఫైనాన్షియల్ రిస్క్ గురించి చైనాలోని నేషనల్ డెవలప్మెంట్ అండ్ రిఫార్మ్ కమిషన్, వాణిజ్య మంత్రిత్వ శాఖ స్పందించేందుకు నిరాకరించాయి. -
‘డ్రాగన్’ పునరాలోచించాలి
అమెరికాతోసహా ఎవరికి వారు స్వీయ మార్కెట్ల రక్షణకు మార్గాలు వెదుక్కుంటూ ప్రపంచీకరణను నీరుగారుస్తున్న తరుణంలో చైనా అందుకు భిన్నమైన ‘వన్ బెల్ట్ వన్ రోడ్’ (ఓబీఓఆర్) ప్రాజెక్టుకు తుది మెరుగులు దిద్దేందుకు రెండు రోజుల సదస్సు నిర్వహించింది. ప్రపంచంలోనే అతి పెద్ద ఉమ్మడి మార్కెట్కు ఈ బృహత్తర ప్రాజెక్టు ద్వారాలు తెరుస్తుందని, దీనికి అనుసంధానంగా ఉండే దేశాలన్నిటినీ సంపన్నవంతం చేస్తుందని చైనా చెబుతోంది. తూర్పు, పడమరలను అనుసంధానించిన పురాతన సిల్క్ రోడ్ను తలపించే ఈ ప్రాజెక్టు అనేకవిధాల విస్తృతమైనది. ప్రపంచ జనాభాలో 64 శాతం అంటే... సుమారు 450 కోట్లమంది నివసించే వివిధ ఖండాల్లోని 65 దేశాలను నేరుగా కలిపే ఈ ప్రాజెక్టు భూత లంతోపాటు సముద్ర జలాల్లోనూ సాగుతుంది. అనేకచోట్ల భారీయెత్తున రహ దార్లు, రైలు మార్గాలు, ఓడ రేవులు నిర్మించాల్సి ఉంటుంది. ఆసియా, యూరప్, ఆఫ్రికా ఖండాల్లోని దేశాలన్నీ ఈ ప్రాజెక్టు సాకారమైతే అపారంగా లాభపడ తాయని, ఆర్ధిక, వాణిజ్య రంగాల్లో బలోపేతమవుతాయని ఆర్థిక నిపుణుల అంచనా. ఈ ప్రాజెక్టు పూర్తయ్యేనాటికి మొత్తం లక్షా 70 వేల కోట్ల డాలర్ల వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నారు. రెండో ప్రపంచ యుద్ధం ముగిశాక పశ్చిమ యూరప్ దేశాల పునర్నిర్మాణం కోసం ‘మార్షల్ ప్లాన్’ కింద అమెరికా వెచ్చించిన మొత్తాన్ని ఇప్పటి మారక విలువతో పోల్చినా ఇది ఎన్నో రెట్లు అధికం. ఇంత భారీ ప్రాజెక్టుకు మన పొరుగునున్న చైనా రూపకల్పన చేయడంతోపాటు నాయకత్వం వహిస్తూ మనల్ని కూడా ఆహ్వానించింది. అయినా మన దేశం అనేక కారణాల వల్ల దూరంగా ఉండక తప్పలేదు. గత కొన్నేళ్లుగా ప్రపంచ తయారీ రంగంలోనూ, ఎగుమతుల్లోనూ నంబర్ వన్గా ఉన్న చైనా 2008 ఆర్థిక మాంద్యం తర్వాత అంతర్జాతీయంగా సమస్యలను ఎదుర్కొంటున్నది. ఆనాటి మాంద్యం చైనాను పెద్దగా ప్రభావితం చేయకపోవచ్చు గానీ... దానిపట్ల ప్రపంచ దేశాల వైఖరిని మార్చేసింది. అగ్రరాజ్యాలు స్వీయ రక్షణ విధానాల అమలును ప్రారంభించాయి. చైనా నుంచి వచ్చే సరుకులపై భారీ యెత్తున సుంకాలు విధించడంసహా అనేక ఆంక్షలను అమలు చేయడం మొద లెట్టాయి. 2008లోనే అమెరికాకు 12.5 శాతంమేరా, యూరప్కు 19.4 శాతంమేరా చైనా ఎగుమతులు కోత పడ్డాయి. ఇది సహజంగానే కరెంట్ అకౌంట్ లోటుకు దారితీసింది. మరోపక్క ద్రవ్యోల్బణం పెరిగింది. అన్నిటి ధరలూ పెరిగి దేశ ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో పడే ఛాయలు కనిపించడంతో ఆ దేశం ఆగ్నేయాసియా, ఆఫ్రికా దేశాల్లో భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించింది. మయ న్మార్, వియత్నాం, థాయ్లాండ్, కంబోడియా, లావోస్ వియత్నాంలాంటిచోట్ల జలవిద్యుత్, థర్మల్ విద్యుత్, ఓడరేవులు, రహదారులు తదితర ప్రాజెక్టుల్ని చేప ట్టింది. ఇవన్నీ ఆ దేశాలతో సంబంధబాంధవ్యాలు పెంచడంతోపాటు... దాని ఆర్థిక వ్యవస్థకు అమెరికా, యూరప్ దేశాలనుంచి ఎదురైన సవాళ్లను అధిగమిం చడానికి కూడా తోడ్పడ్డాయి. పర్యవసానంగా తన కార్యక్షేత్రాన్ని మరింత విస్తరించి ప్రపంచంలో తిరుగులేని శక్తిగా ఆవిర్భవించడానికి చైనా ప్రయత్నాలు ప్రారంభించింది. తయారీ రంగంపై ఆధారపడటం క్రమేపీ తగ్గించుకుంటూ తనకున్న పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ) సామర్థ్యంతో రూపకల్పన, నవీకరణ రంగాల్లో సత్తా చాటే దిశగా దృష్టి పెట్టా లని నిర్ణయించింది. ఇదంతా నెరవేరాలంటే చైనా మరింత బలోపేతం కావాలి. దాని వార్షిక వృద్ధి రేటు 2021 వరకూ కనీసం 6.3 శాతానికి తగ్గకుండా ఉండాలి. అటు మౌలిక సదుపాయాల రంగంలో తనకున్న అపారమైన అను భవాన్ని విని యోగించుకోవడానికీ... దేశీయంగా సిమెంటు, ఉక్కు రంగాల్లో పేరు కుపోయిన నిల్వలను వదుల్చుకోవడానికీ ఈ ఓబీఓఆర్ ప్రాజెక్టు దానికి అక్కర కొస్తుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా చైనా 81,000 కిలోమీటర్ల హైస్పీడ్ రైల్వే లైన్లను నిర్మించాల్సి ఉంటుంది. ఇక రహదార్లు, పైప్లైన్ల ఏర్పాటు సరేసరి. అయితే ప్రాజెక్టు నిర్మాణంలో సంబంధిత దేశాలన్నీ సమర్ధవంతంగా పాలుపంచుకో గలగాలి. ప్రాజెక్టు సాగే పలు దేశాల్లో రాజకీయ అస్థిరతలు రివాజు. ఉగ్రవాదం బెడద అధికం. చాలా దేశాలకు అప్పు తీర్చడంలో ఏమంత మంచి పేరు లేదు. దానికితోడు అవినీతి చీడ ఎక్కువ. ఆచరణలో ఇలాంటి సమస్యలెన్నో ఉంటాయి. ఇవి ప్రాజెక్టు సకాలంలో పూర్తి కావడానికి అవరోధాలుగా నిలుస్తాయి. ఆగ్నేయాసియా దేశాల్లో మౌలిక సదుపాయాల రంగం ప్రాజెక్టుల్లో గడించిన అనుభవాలతో వీటన్నిటినీ సునాయాసంగా ఎదుర్కొనగలనని చైనా విశ్వసిస్తోంది. ప్రాజెక్టు అనుకున్నట్టు పూర్తయితే మన దేశానికి సైతం ఎన్నో ఉపయోగాలుం టాయనడంలో సందేహం లేదు. ఆగ్నేయాసియా, యూరప్ దేశాలతో నేరుగా సంబంధాలు ఏర్పటానికి, మన మార్కెట్ విస్తరణకు సహజంగానే ఇది దోహద పడుతుంది. ప్రాజెక్టులో పాలుపంచుకుంటే మన ముంబై నుంచి ఇరాన్లోని బందర్ అబ్బాస్ మీదుగా రష్యాలోని మాస్కో వరకూ వాణిజ్య బంధం ఏర్పడు తుంది. అయితే మన దేశ సార్వభౌమత్వాన్ని గుర్తించని ఏ ప్రాజెక్టులోనైనా పాలుపంచుకోవడం మనకు సాధ్యం కాదు. ఓబీఓఆర్లో భాగమైన చైనా పాకిస్తాన్ కారిడార్ (సీపీఈసీ) తీరూ తెన్నూ ఎలా ఉంటాయో చైనా ఇంకా చెప్పడం లేదు. అది వివాదాస్పద కారకోరం రహదారి, ఆక్రమిత కశ్మీర్లోని గిల్గిత్–బాల్టిస్తాన్ల మీదుగా ఉంటుందన్నది అర్ధమవుతూనే ఉంది. ఈ ప్రాజెక్టును ఆమోదించడమంటే పరోక్షంగా దురాక్రమణలకు సాధికారత కల్పించినట్టవుతుందని మన దేశం చేస్తున్న వాదన సహేతుకమైనదే. ఖండాంతరాల్లోని దేశాలను అను సంధానిస్తామంటూ ఇరుగు పొరుగు దేశాల సార్వభౌమత్వాన్ని విస్మరించడం ఎంతవరకూ సరైందో చైనాయే ఆలోచించుకోవాలి. అతి పెద్ద మార్కెట్ భారత్ను విస్మరించి నిర్మించే ఏ ప్రాజెక్టు అయినా ఆచరణలో మెరుగైన ఫలితాన్నివ్వదు. ఈ సంగతి గుర్తించి మనతో ఉన్న సమస్యల పరిష్కారానికి చొరవ చూపడం చైనాకు తప్పనిసరి. -
భారత్ ఉన్నా.. లేకున్నా పర్లేదు: చైనా
చైనా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'వన్ బెల్ట్ వన్ రోడ్' కార్యక్రమానికి భారత్ హాజరుకాకపోవడంపై ఆ దేశ మీడియా స్పందించింది. వన్ బెల్ట్ వన్ రోడ్లో భారత్ పాలుపంచుకున్నా.. లేకున్నా.. మిగిలిన భాగస్వామ్య దేశాలకు ఎలాంటి నష్టం ఉండదని పేర్కొంది. రెండు రోజుల పాటు జరిగిన వన్ బెల్ట్ వన్ రోడ్ కార్యక్రమానికి 29 దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. భారతదేశ సార్వభౌమత్వాన్ని ప్రశ్నిస్తూ చైనా పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్(సీపెక్) కశ్మీర్లోని గిల్గిత్ బాల్టిస్తాన్ నుంచి వెళ్తుండటంతో వన్ బెల్ట్ వన్ రోడ్ కార్యక్రమానికి వెళ్లకూడదని భారత్ నిర్ణయించుకుంది. అన్నట్లుగానే కార్యక్రమానికి హాజరుకాకపోవడంపై చైనా జాతీయ పత్రిక గ్లోబల్ టైమ్స్ ఓ కాలమ్ను ప్రచురించింది. భారత్ రాకపోవడం వల్ల కలిగే నష్టమేమి లేదని చెప్పింది. ఒక దేశ సార్వభౌమత్వాన్ని ప్రశ్నించే పనులను చైనా చేయదని ఆ దేశ అధ్యక్షుడు జిన్ పింగ్ చేసిన వ్యాఖ్యలను కాలమ్లో పునరుద్ఘాటించింది. -
చైనా కీలక భేటీకి భారత్ దూరం?
న్యూఢిల్లీ: ‘ఒకే కారిడార్.. ఒకే రహదారి’ అనే అంశంపై చైనా నిర్వహించనున్న శిఖరాగ్ర సదస్సుకు భారత్ వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా ఆ విధానం తమకు ఏమాత్రం సమ్మతం కాదనే విషయం చైనాకు తెలియజేయనుంది. సరిహద్దు వెంట రైల్వేలు, విమానాయానం, రోడ్డు మార్గాల ద్వారా ఉమ్మడి కారిడార్ను ఏర్పాటు చేసుకునేందుకు పాక్తో కలిసి చైనా ముందుకు వెళ్లాలనుకుంటోంది. సీపెక్(ది చైనా పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్)గా పిలవబడే ఈ ప్రాజెక్టును పాక్ ఆక్రమిత కశ్మీర్ గుండా నిర్మించనున్నారు. దీనిని భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ సదస్సుకు చైనా పాకిస్థాన్ను, శ్రీలంకను, భారత్ను, అమెరికాను, నేపాల్ను తదితర దేశాలను ఆహ్వానించింది. అయితే, ఈ సదస్సుకు వెళుతున్నట్లు శ్రీలంక, పాక్ స్పష్టం చేయగా తాను కూడా వెళుతున్నట్లు శుక్రవారం నేపాల్, అమెరికా కూడా ప్రకటించింది. ఆసియా ఖండంలో తనకు ఎంతో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా చైనా దీనిని భావిస్తున్నప్పటికీ దానిని పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించడాన్ని భారత్ జీర్ణించుకోలేకపోతుంది. ఈ నేపథ్యంలో భారత్ మాత్రం తన ప్రతినిధిని ఈ సదస్సుకు పంపకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. అయితే, విదేశాంగ శాఖ నుంచి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. -
వన్బెల్ట్ - వన్రోడ్ కోసం చైనా తహ తహ