-
టోక్యో ఒలింపిక్స్కు స్విమ్మర్ సజన్ ప్రకాశ్ అర్హత
ఒలింపిక్స్ స్విమ్మింగ్లో ‘ఎ’ అర్హత ప్రమాణాన్ని అధిగమించిన తొలి భారతీయ స్విమ్మర్గా సజన్ ప్రకాశ్ గుర్తింపు పొందాడు. రోమ్లో జరుగుతున్న సెట్టి కోలి ట్రోఫీ ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో కేరళకు చెందిన సజన్ ప్రకాశ్ 200 మీటర్ల బటర్ఫ్లయ్ ఈవెంట్లో ఈ ఘనత సాధించాడు. తద్వారా విశ్వ క్రీడలకు నేరుగా అర్హత పొందాడు. 200 మీటర్ల బటర్ఫ్లయ్ హీట్లో సజన్ 1ని:56.38 సెకన్లలో గమ్యానికి చేరి అగ్రస్థానాన్ని పొందాడు. ఈ క్రమంలో ఎట్టకేలకు టోక్యో ఒలింపిక్స్ ‘ఎ’ అర్హత ప్రమాణం 1ని:56.48 సెకన్లను అధిగమించి ఒలింపిక్ బెర్త్ సంపాదించాడు. 27 ఏళ్ల సజన్కిది వరుసగా రెండో ఒలింపిక్స్ కానుంది. 2016 రియో ఒలింపిక్స్లో సజన్ 200 మీటర్ల బటర్ఫ్లయ్ ఈవెంట్లో ఓవరాల్గా 28వ స్థానంలో నిలిచాడు. -
ఆ పూల్ ఆకుపచ్చగా ఎందుకు మారిందంటే..
బ్రెజిల్లోని రియో డి జెనీరో నగరంలో జరుగుతున్న ఒలింపిక్స్ సందర్భంగా ఓ స్విమ్మింగ్ పూల్ నీలిరంగు నుంచి హఠాత్తుగా ఆకుపచ్చ రంగులోకి మారిపోవడంపై క్రీడాకారుల నుంచి ఆందోళన వ్యక్తం అవడం తెల్సిందే. ఆల్గే (శిలీంధ్రాలు.. ఆకుపచ్చ నాచు) వల్ల నీటి రంగు మారిపోయిందని, గాలి, వెలుతురు కూడా సరిగ్గా సోకకపోవడం వల్ల అలా జరిగిందని ఒలింపిక్స్ నిర్వాహకులు చెప్పారు. నీటిని శుభ్రం చేయడానికి అధిక రసాయనాలను ఉపయోగించడం వల్ల నీటి రంగు ఆకుపచ్చగా మారిందని, ఈ రంగు నీటి వల్ల క్రీడాకారులకు ఎలాంటి హాని లేదని నీటిని పరీక్షించిన ఈత ఈవెంట్లను నిర్వహించే అంతర్జాతీయ సంఘం 'ఫినా' ప్రకటించి ఈ అంశానికి తెరదించాలని భావించింది. కానీ ఏ రసాయనం వల్ల రంగు మారిందనే విషయానికి విజ్ఞానపరమైన కారణాలను మాత్రం ఇంతవరకు ఎవరూ వెల్లడించలేదు. యూనివర్సిటీలో వాటర్ కెమిస్ట్రీ చదువుకోవడంతో పాటు స్విమ్మింగ్ పూల్ బాయ్గా పనిచేసిన అనుభవం కలిగిన 'జీఆర్ఆర్ఎల్ సైంటిస్ట్' స్విమ్మింగ్పూల్లో నీటి రంగు మారడానికి వివరణ ఇచ్చారు. ఆల్గే కారణంగా నీటిరంగు మారలేదని, నీటిలో ఆల్గే పెరగడానికి కొన్ని రోజులు పడుతుందని ఆయన చెప్పారు. సరైన గాలి, వెలుతురు లేకపోవడం కూడా కారణం కాదన్నారు. నీలిరంగులో ఉండే కాపర్ సల్ఫేట్ లేదా కాపర్ సల్ఫేట్ పెంటా హైడ్రేట్ను అధిక మొత్తంలో ఉపయోగించడం వల్ల నీళ్లు ఆకుపచ్చ రంగులోకి మారిపోయి ఉంటాయని ఆయన చెప్పారు. నీటిలో ఆల్గే పెరగకుండా నిరోధించేందుకు పెద్ద స్విమ్మింగ్ పూల్స్లో, మున్సిపల్ వాటర్ ట్యాంకుల్లో కాపర్ సల్ఫేట్ను ఉపయోగిస్తారని, ఈ సల్ఫేట్ను తగిన మోతాదులో ఉపయోగిస్తే మానవుల ఆరోగ్యానికి ఎలాంటి హాని ఉండదని, చేపల లాంటి జలచరాలు మాత్రం పెరగవని ఆయన తెలిపారు. ఎక్కువ మోతాదులో ఉపయోగిస్తే మాత్రం మనుషులకు చర్మంపై దురదలు లేస్తాయని, కళ్లు మండుతాయని చెప్పారు. ఒలింపిక్స్ క్రీడాకారులు కూడా కళ్లు మండుతున్నాయని, చర్మంపై దురద పెడుతోందని ఫిర్యాదుచేసిన విషయం ఇక్కడ గమనార్హం. కాపర్ సల్ఫేట్ను ఎక్కువ మొత్తంలో నీటిలో కలపడం వల్ల నీలిరంగులో ఉండే కాపర్ అయాన్లు నీటిలోని నాలుగు క్లోరిన్ అయాన్లతో కలసిపోయి కాపర్ (2) టెట్రాక్లోరో కాంప్లెక్స్గా మారుతుందని, అది ఆకుపచ్చగా ఉంటుందని, అప్పుడు నీరంతా ఆకుపచ్చగా మారుతుందని ఆయన పేర్కొన్నారు. స్విమ్మింగ్ ఫూల్ ఆవరణ అంతా కుళ్లిన కోడిగుడ్ల వాసన వచ్చిందన్న వార్తలు కూడా వచ్చాయని, నీటిలోపల సల్ఫేట్ అయాన్లు హైడ్రోజన్ సల్ఫైడ్గా మారిపోతాయని, అప్పుడు నీటి నుంచి కుళ్లిన కోడిగుడ్ల వాసన పరిసర ప్రాంతాలకు వ్యాపిస్తుందని జీఆర్ఆర్ఎల్ సైంటిస్ట్ వివరించారు. ఒలింపిక్స్లో ఆకుపచ్చగా మారిన నీటిని పూర్తిగా తొలగించి కొత్త నీటితో నింపి ఈత ఈవెంట్లను నిర్వహిస్తున్న విషయం తెల్సిందే.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హోమ్ ఓటింగ్ ప్రక్రియ వేగవంతం చేయండి
మోదీని ఆపే దమ్ము కేసీఆర్కే ఉంది
కాలవ అండ .. కరిగిన కొండ!
వైఎస్ జగన్తోనే సంక్షేమం
ప్రమాదంలో ఒకరి మృతి
ఐస్క్రీం తిని 100 మందికి అస్వస్థత
పాండవపురలోనూ అబార్షన్ దందా
స్టీరింగ్ విరిగి.. వరి మడిలోకి
కస్టడీలో రేవణ్ణ విచారణ
వీడియో బాధితుల కోసం సిట్ సహాయవాణి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement