-
రియోత్సవం ముగిసింది
ఒలింపిక్స్ ప్రారంభోత్సవానికి ముందు ఎన్నో సందేహాలు... ఆర్థికంగా చితికిపోయిన దేశం ఇంత పెద్ద క్రీడలను ఎలా నిర్వహిస్తుందనే అనుమానాలు... జికా వైరస్, దోపిడిలతో అవాంతరాలు... కానీ బ్రెజిల్ వీటన్నింటినీ అధిగమించింది. దక్షిణ అమెరికా ఖండంలో తొలిసారి ఒలింపిక్స్ క్రీడా సంబరాన్ని అత్యంత ఘనంగా నిర్వహించింది. ప్రారంభవేడుకలను మరిపించేలా ముగింపు వేడుకలు కూడా అదిరిపోయాయి. తమ దేశ చరిత్ర, భిన్నత్వంలో ఏకత్వాన్ని కళ్లకు కట్టినట్టుగా కళాకారులు తమ ప్రదర్శన ద్వారా చూపారు. రియో ఒలింపిక్ పతాకాన్ని 2020లో గేమ్స్ జరిగే టోక్యో గవర్నర్కు అందివ్వడంతో అధికారికంగా ఒలింపిక్స్ ముగిశాయి. ≈ అట్టహాసంగా ఒలింపిక్స్ ముగింపు వేడుకలు ≈ 2020లో టోక్యోలో క్రీడలు రియో డి జనీరో: పదిహేడు రోజుల పాటు దిగ్గజ ఆటగాళ్ల విన్యాసాలతో పాటు కొత్తచాంపియన్లను అందించిన ఒలింపిక్స్ క్రీడలు ఘనంగా ముగిశాయి. భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ 31వ గేమ్స్ ముగింపు వేడుకలు విశ్వ క్రీడాభిమానులను మరోసారి ఆకట్టుకున్నాయి. దాదాపు మూడు గంటల పాటు జరిగిన ఈ షోలో కళ్లు మిరుమిట్లు గొలిపే బాణసంచా వెలుగులకు తోడు కళాకారుల అబ్బుర పరిచే విన్యాసాలతో ప్రఖ్యాత మరకానా స్టేడియంలో ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు. ఓ వైపు వర్షం కురుస్తున్నా ఎలాంటి ఇబ్బంది లేకుండా వేడుకలు కొనసాగాయి. అథ్లెట్లు కూడా రెయిన్కోట్స్, గొడుగులు పట్టుకుని స్టేడియంలో కనిపించారు. నృత్యాలు చేస్తూ సెల్ఫీస్ తీసుకుంటూ సందడి చేశారు. అయితే స్టేడియంలో ప్రేక్షకులు మాత్రం 70 శాతం మాత్రమే హాజరయ్యారు. 42 విభాగాల్లో 207 దేశాల నుంచి 11,544 మంది అథ్లెట్లు పాల్గొన్న రియో గేమ్స్ ముగిసినట్టుగా అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అధ్యక్షుడు థామస్ బాచ్ అధికారికంగా ప్రకటించారు. 2020లో 32వ క్రీడా సంబరాలు జపాన్ రాజధాని టోక్యోలో జరుగుతాయి. ఈమేరకు ఒలింపిక్ పతాకాన్ని టోక్యో గవర్నర్ యురికో కొయికేకు అందించారు. ముగింపు ఉత్సవం హైలైట్స్ ♦ మకావు చిలుక తరహాలో కళాకారులు దుస్తులు ధరించి స్టేడియంలోకి ప్రవేశించారు. రియోలోని ప్రఖ్యాత దర్శనీయ స్థలాలను ఏరియల్ ద్వారా వీక్షిస్తే ఎలా ఉంటుందో ప్రేక్షకులకు చూపించారు. చివర్లో ఒలింపిక్ రింగ్స్గా మారి ఆకట్టుకున్నారు. ♦ రియో సాంబా పితామహుడు మార్టిన్హో డా సిల్వా తన ముగ్గుకు కుమార్తెలు, మనవరాళ్లతో కలిసి ఆల్టైమ్ పాపులర్ సాంగ్స్ను ఆలపించాడు. అనంతరం 26 రాష్ట్రాలకు చెందిన 27 మంది పిల్లలు బ్రెజిల్ జాతీయ గీతాన్ని ఆలపించారు ♦ భారత్ తరఫున రెజ్లర్ సాక్షి మలిక్ త్రివర్ణ పతాకాన్ని చేతబట్టుకుని ముందు నడవగా దాదాపు 50 మంది అథ్లెట్లు తనను అనుసరించారు. ఇందులో భారత హాకీ జట్లు, బాక్సర్లు, రెజ్లర్లు ఉన్నారు. ♦ ఆ తర్వాత 11 నిమిషాల పాటు టోక్యో 2020కి కేటాయించారు. రాబోయే ఒలింపిక్స్ను తాము ఏవిధంగా నిర్వహించబోతున్నామో చిత్రరూపకంగా తెలిపారు. సూపర్ మరియో వస్త్ర ధారణలో జపాన్ ప్రధాని షింజో అబే స్టేడియంలో ప్రత్యక్షమయ్యారు. ♦ అనంతరం అధికారికంగా గేమ్స్ ముగిసినట్టు ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాచ్ ప్రకటించారు. 16 రోజులు మొత్తం ప్రపంచాన్ని బ్రెజిల్ ఆనందడోలికల్లో ముంచెత్తాయని, రాబోయే తరాలకు ఈ గేమ్స్ ఓ మధుర జ్ఞాపకంగా మిగులుతాయని ఆయన అన్నారు. ♦ రియో గేమ్స్ పతాకాన్ని కిందికి దించి టోక్యో మేయర్కు అప్పగించారు. ♦ చివర్లో కార్నివాల్ పరేడ్ అందరినీ ఉర్రూతలూగించింది. ప్రసిద్ధ సాంబా సాంగ్స్తో పాటు బ్రెజిల్ టాప్ మోడల్ ఇజబెల్ గౌలర్ట్ ప్రవేశంతో స్టేడియంలో జోష్ పెరిగింది. వందలాది సాంబా నృత్యకారులు రియో సిటీ థీమ్ సాంగ్ అయిన ‘సిడాడే మరివిల్హోసా’కు దుమ్మ రేపే రీతిలో చిందులు వేశారు. ♦ ఇక గేమ్స్ ముగింపు సూచకంగా మరకానా స్టేడియం పైకప్పు నుంచి భారీగా బాణసంచా కాల్చడంతో రియో ధగధగలాడింది. -
సమాఖ్య రాజకీయాల్లో పావులు కావద్దు
► సుశీల్, నర్సింగ్లకు కోర్టు సూచన ► రేపటికి విచారణ వాయిదా న్యూఢిల్లీ: ఒలింపిక్స్ క్రీడల్లో ఎవరు పాల్గొనాలనే కారణంతో భారత స్టార్ రెజ్లర్లు సుశీల్ కుమార్, నర్సింగ్ యాదవ్ రచ్చకెక్కడం విచారించదగ్గ విషయమని ఢిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది. వీరిద్దరు భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యుఎఫ్ఐ) రాజకీయంలో పావులు కాకూడదని హితవు పలికింది. దేశానికి గౌరవ ప్రతిష్టలు అందించిన ఈ రెజ్లర్లకు అసలు తామేం చేస్తున్నామో అర్థమవుతోందా? అని జస్టిస్ మన్మోహన్ ప్రశ్నించారు. ‘ఈ పరిస్థితికి సమాఖ్యలో నెలకొన్న రాజకీయాలే కారణం. అందుకే వీరిద్దరు అధికారుల చేతిలో పావులు కారాదు. సుశీల్, నర్సింగ్ అంతర్జాతీయ స్థాయి రెజ్లర్లు. వీరి విషయంలోనే ఇలా జరగడం షాకింగ్గా అనిపిస్తోంది’ అని జస్టిస్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అంతకుముందు జరిగిన విచారణలో... దేశానికి ఒలింపిక్ బెర్త్ అందించిన అథ్లెటే పోటీలకు వెళతాడని, గతంలో కూడా ఇలాగే జరిగిందని నర్సింగ్ కౌన్సిల్ వాదించారు. అయితే 74 కేజీ విభాగంలో సెలక్షన్ ట్రయల్స్ను గతేడాది ఎందుకు నిర్వహించారని, ప్రపంచ చాంపియన్షిప్ సెప్టెంబర్లో జరిగిందని, ఆ నెలలోపు జరపాల్సిందని సుశీల్ కూమార్ తరపు న్యాయవాది వాదించారు. మరోవైపు తదుపరి విచారణను కోర్టు బుధవారానికి వాయిదా వేసింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హోం ఓటింగ్ పరిశీలన
నిప్పుతో చెలగాటమా!
మాదిగలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ
‘రాహుల్ పేరు చెబితే ఓట్లు పడవు’
కాంగ్రెస్తోనే అన్నివర్గాలకు సముచిత న్యాయం
హామీలు నెరవేర్చడంలో రేవంత్ విఫలం
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
పార్లమెంట్ ఎన్నికలు బహిష్కరిస్తాం..
మూడోసారి మోదీ సర్కారే..
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement