Oil - Gas
-
దాపరికాలుంటే ఊరుకోం..
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ మేఘాలు ప్రపంచ ఇంధన మార్కెట్ను కలవరపెడుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశీయ ఇంధన భద్రతను పటిష్టం చేసేందుకు వీలుగా స్థానికంగాఉన్న అన్ని చమురు, సహజ వాయువు కంపెనీలు తమ నిల్వలు, ఎగుమతులు, దిగుమతుల పూర్తి వివరాలను ప్రభుత్వంతో పంచుకోవాలని కేంద్రం కఠిన ఆదేశాలు జారీ చేసింది. పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ (పీపీఏసీ)కు ఈ డేటాను క్రమం తప్పకుండా అందించాలని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.ఈ కొత్త నిబంధనల ద్వారా సమాచార సేకరణకు చట్టపరమైన బలాన్ని చేకూర్చామని మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాతా శర్మ ఓ సమావేశంలో వెల్లడించారు. ‘గతంలోనూ పీపీఏసీ సమాచారాన్ని సేకరించేది, కానీ తాజా నోటిఫికేషన్తో దీనికి పూర్తిస్థాయి చట్టపరమైన శక్తి లభించింది. ఇప్పుడు ప్రతి సంస్థ కచ్చితంగా సమాచారాన్ని వెల్లడించాల్సిందే. దీనివల్ల పర్యవేక్షణ మరింత పకడ్బందీగా అమలు అవుతుంది’ అని ఆమె పేర్కొన్నారు.ఎవరు వివరాలు వెల్లడించాలి?ప్రభుత్వ తాజా నోటిఫికేషన్ ప్రకారం, ఈ కింది కార్యకలాపాల్లో నిమగ్నమైన సంస్థలన్నీ నివేదికలు సమర్పించాల్సి ఉంటుంది.ముడి చమురు ఉత్పత్తి, రిఫైనింగ్ సంస్థలు.సహజ వాయువు ప్రాసెసింగ్, రవాణా సంస్థలు.పెట్రోలియం ఉత్పత్తుల నిల్వ, మార్కెటింగ్, పంపిణీదారులు.దిగుమతిదారులు, టెర్మినల్ ఆపరేటర్లు.ఈ సంస్థలు తమ ఉత్పత్తి, నిల్వ సామర్థ్యం, కేటాయింపులు, వినియోగానికి సంబంధించిన సమాచారాన్ని రోజువారీ, వారం లేదా నెలవారీ ప్రాతిపదికన ఎలక్ట్రానిక్ ప్లాట్ఫామ్ ద్వారా అందించాల్సి ఉంటుంది. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఇంధన వినియోగదారుగా ఉన్న భారత్ తన అవసరాల కోసం అత్యధికంగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. యుద్ధం వంటి అత్యవసర పరిస్థితుల్లో సరఫరాకు ఆటంకం కలగకుండా ఉండటమే ఈ తాజా ఆదేశాల ప్రధాన ఉద్దేశమని కొందరు చెబుతున్నారు.‘గోప్యత’ సాకు చెల్లదుచమురు సంస్థలు తాము కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాలు లేదా గోప్యతా నిబంధనలను సాకుగా చూపి సమాచారాన్ని దాచడానికి వీల్లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. సమాచారం ‘వాణిజ్యపరంగా సున్నితమైనది’ అనే కారణంతో ఏ సంస్థ కూడా నిరాకరించడానికి వీలులేదని నోటిఫికేషన్ స్పష్టం చేసింది. గతంలో ఉన్న ఇతర నిబంధనలకు అదనంగా ఈ కొత్త ఆదేశాలు అమలులో ఉంటాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.ఇదీ చదవండి: డాలర్ ఆధిపత్యానికి గండి! -
అమెరికా చమురు ఎగుమతులు పెంపు.. భారత్పై ప్రభావం ఎంతంటే..
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత యూఎస్ కీలక ప్రకటనలు చేస్తోంది. యునైటెడ్ స్టేట్స్ తన ఇంధన ఎగుమతులను పెంచబోతున్నట్లు తెలిపింది. దాంతో ప్రపంచ చమురు, గ్యాస్ మార్కెట్ గణనీయంగా ప్రభావితం చెందుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అమెరికా తీసుకున్న ఈ చర్య ధరలను తగ్గిస్తుందని, సరఫరాను పెంచుతుందని, ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు ఉపశమనం కలిగిస్తుందని అంచనా వేస్తున్నాయి.ఇంధన ఉత్పత్తి పెంపుఅమెరికా చమురు, గ్యాస్ ఉత్పత్తిని పెంచేందుకు సిద్ధమవుతోంది. చమురు డ్రిల్లింగ్ను ప్రోత్సహించడం, గతంలో ఉన్న ఆంక్షలను ఎత్తివేయడం, ఇంధన ఎగుమతులను పెంచడం వంటి ప్రణాళికలను డొనాల్డ్ ట్రంప్ వివరించారు. ఈ వ్యూహం ప్రపంచ చమురు మార్కెట్లో అమెరికాను టాప్లో నిలిపేందుకు దోహదం చేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: రూపాయి పడినా ఇంకా విలువైనదే..అంతర్జాతీయ ధరలపై ప్రభావంయూఎస్ ఇంధన ఎగుమతుల పెరుగుదల మార్కెట్లో ‘ఒపెక్ +(ఆయిల్ ఎగుమతి చేసే దేశాల కూటమి)’ నియంత్రణను కట్టడి చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లోకి మరిన్ని చమురు, గ్యాస్ సరఫరాదారులు ప్రవేశించడంతో ధరలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ముడిచమురు ధరలు తగ్గడం వల్ల దిగుమతి ఖర్చులు తగ్గుతాయని, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించవచ్చని భారత్ వంటి దేశాలకు ఇది ప్రయోజనం చేకూరుతుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. దీర్ఘకాలంలో యూఎస్ చమురు ఉత్పత్తి ఒపెక్ +, ఇతర ఉత్పత్తిదారుల వ్యూహాల పునఃసమీక్షకు దారితీస్తుంది. పెరిగే యూఎస్ చమురు ఎగుమతులు ఇతర ప్రాంతాల సరఫరాదారులను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. ఇది ధరల స్థిరత్వానికి మరింత దోహదం చేస్తుంది. -
ఓఎన్జీసీకి చమురు లాభాలు
న్యూఢిల్లీ: ఆయిల్, గ్యాస్ అన్వేషణ ఉత్పత్తి సంస్థ ఓఎన్జీసీ మార్చి త్రైమాసికానికి రూ.8,859 కోట్ల స్టాండలోన్ లాభాన్ని ప్రకటించింది. అంతర్జాతీయ మార్కెట్లో అధిక ధరలు కంపెనీ లాభాల వృద్ధికి అనుకూలించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలం లో లాభం రూ.6,734 కోట్లతో పోల్చి చూస్తే 30 శాతానికి పైగా వృద్ధి చెందినట్టు తెలుస్తోంది. షేరు వారీ ఆర్జన మార్చి క్వార్టర్కు రూ.7.04గా ఉంది. ఆదాయం రూ.34,497 కోట్లకు దూసుకుపోయింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఆదాయం రూ.21,189 కోట్లతో పోలిస్తే 50 శాతానికి పైగా పెరిగింది. ఇక 2021–22 ఆర్థిక సంవత్సరానికి ఓఎన్జీసీ లాభం రికార్డు స్థాయిలో రూ.40,306 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో లాభం రూ.11,246 కోట్లతో పోలిస్తే మూడు రెట్లు వృద్ధి చెందింది. 2021 చివర్లో చమురు ధరలు పెరగడం మొదలు కాగా.. ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర తర్వాత ధరలు మరింత ఎగిశాయి. చమురు, గ్యాస్ ఉత్పత్తి చేసే ఓఎన్జీసీకి ఇది అనుకూలించింది. అనుబంధ సంస్థలైన హెచ్పీసీఎల్, ఓఎన్జీసీ విదేశ్ లిమిటెడ్ ఫలితాలను కూడా కలిపి చూస్తే.. కన్సాలిడేటెడ్ లాభం మార్చి త్రైమాసికంలో రూ.12,061 కోట్లు, 2021–22 పూర్తి ఆర్థిక సంవత్సరానికి రూ.49,294 కోట్లుగా ఉన్నాయి. -
పడకేసిన ప్రభుత్వ షేర్లు
ముంబై: స్టాక్ మార్కెట్లో ప్రభుత్వ రంగ కంపెనీ(పీఎస్యూ)ల షేర్లు కుదేలవుతున్నాయి. మార్కెట్లో పరిస్థితులతో సంబంధం లేకుండా కేంద్రం పలు పీఎస్యూల్లో వాటాలను విక్రయిస్తుండటం... దీనికితోడు వాటివద్దనున్న మిగులు నిధులను ఎలాగైనా ఖజానాకు తరలించే పనిలోపడటం వంటివి ఇన్వెస్టర్లలో గుబులు రేపుతున్నాయి. దీంతో ఈ స్టాక్ను ఎడాపెడా అమ్మేసి వదిలించుకుంటున్నారని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. గడిచిన రెండు నెలల్లో మొత్తం లిస్టెడ్ పీఎస్యూల మార్కెట్ విలువలో సుమారు రూ.3.9 లక్షల కోట్లు ఆవిరికావడం దీనికి నిదర్శనం. బ్యాంకింగ్, చమురు-గ్యాస్, మెటల్స్ క్రాష్... కేంద్ర ప్రభుత్వ యాజమాన్యంలోని, ప్రమోట్ చేసిన కంపెనీలకు సంబంధించినవే పీఎస్యూ లిస్టెడ్ స్టాక్స్లో అత్యధికంగా ఉన్నాయి. ఇటీవలి స్టాక్స్క్రాష్లో కూడా 98 శాతం ఇవే కావడం గమనార్హం. ముఖ్యంగా బ్యాంకింగ్, చమురు-గ్యాస్, మెటల్, మైనింగ్ రంగాలకు చెందిన కంపెనీల షేర్లు గత కొన్నాళ్లుగా తుక్కుతుక్కు అవుతున్నాయి. మొండిబకాయిల భయంతో పీఎస్యూ బ్యాంకుల షేర్లు కుదేలవుతున్నాయి. ప్రభుత్వ అనుమతుల్లో జాప్యం, స్కామ్ల ప్రభావంతో మెటల్, మైనింగ్ స్టాక్స్ ఆవిరయ్యేందుకు దారితీస్తోంది. ఈ రెండునెలల్లో సెన్సెక్స్ 5.5 శాతం, నిఫ్టీ 7.5 శాతం మేర క్షీణించాయి. దీనికికూడా పీఎస్యూ షేర్ల పతనమే ప్రధాన కారణం. జూలై ఆరంభంనుంచి మార్కెట్లో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ క్షీణతలో 90% పీఎస్యూలదే కావడం వీటి పతనం ఎలా తీవ్రంగా ఉందనేందుకు నిదర్శనం. కాగా, పీఎస్యూల షేర్ల పతనంలో అత్యధికంగా నష్టపోతున్నది ప్రభుత్వమే. జూన్ చివరినాటికి మొత్తం 73 లిస్టెడ్ కేంద్ర పీఎస్యూల్లో ప్రభుత్వానికి సగటున 72.3% వాటా ఉంది. ప్రభుత్వ స్వయంకృతాపరాధమే...! పీఎస్యూ షేర్లు ఇంత ఘోరంగా కుప్పకూలుతుండటానికి ప్రభుత్వం చేపడుతున్న డిజిన్వెస్ట్మెంటే కారణమని విశ్లేషకులు తప్పుబడుతున్నారు. ముఖ్యంగా ద్రవ్యలోటు లక్ష్యాన్ని చేరుకోవడానికి, ఎలాగైనా నిధులను సమీకరించాలని ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఒకపక్క, వాటా అమ్మే పీఎస్యూల షేరు ధరలు సగానికిపైగా పడిపోయినా... దీనికంటే తక్కువ ధరకే కేంద్రం వాటాను విక్రయిస్తుండటం మొత్తం పీఎస్యూ స్టాక్స్పై ప్రభావం చూపుతోందని వారు అంటున్నారు. హిందుస్థాన్ కాపర్ ఇష్యూ ధరతో పోలిస్తే(రూ.160) ఇప్పుడు 63% పైగానే కరిగిపోయి రూ.57కు కుప్పకూలింది. ఇక ఎంఎంటీసీ ఇష్యూకు రెండు నెలల ముందు రూ.300 స్థాయి నుంచి వాటా విక్రయ సమయానికి రూ.70కి పడిపోయింది. అయినాసరే ప్రభుత్వం రూ.60 ధరకు వాటా విక్రయించింది. ఇప్పుడు ఈ షేరు రూ.45కు జారిపోయింది. మిగులు నిధులతో పుష్టిగాఉన్న కంపెనీల నుంచి డివిడెండ్లు ఇతరత్రా మార్గాల్లో సొమ్మును ప్రభుత్వం ఖజానాకు తరలించొచ్చనే భయాలూ పీఎస్యూ షేర్లలో అమ్మకానికి పురిగొల్పుతున్నాయని నిపుణులు అంటున్నారు. తాజాగా పవర్గ్రిడ్ కార్పొరేషన్లో వాటా విక్రయానికి ఆ కంపెనీ బోర్డు ఆమోదించడంతో ఆ షేరు ఒక్కరోజే 15 శాతంపైగా కుప్పకూలింది. మరోపక్క, భెల్ షేరూ అదేపనిగా పడుతూవస్తోంది. మూడు రోజుల క్రితం 20 శాతం క్షీణించింది. నెల రోజుల క్రితం రూ.180 స్థాయి నుంచి అడుగంటిపోయింది. .


