breaking news
offices bandh
-
సీబీఎఫ్సీ కార్యాలయాలు మూసివేత
కోవిడ్ 19 (కరోనావైరస్) ప్రభావంతో తమ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చైర్మన్ ప్రసూన్ జోషి ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటన సారాంశం ఇలా.... ‘‘సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ)కు సంబంధించిన మా క్లయింట్స్, ప్యానెల్ సభ్యులు, అధికారులు, ఉద్యోగులు, మిగతా సిబ్బంది ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకుని దేశంలోని తొమ్మిది సీబీఎఫ్సీ కార్యాలయాలను మూసివేస్తున్నాం. ఈ కార్యాలయాల్లో ఇకపై సినిమాలు స్క్రీనింగ్ కావు. కరోనా ప్రభావం తగ్గగానే తిరిగి మా సేవలను ప్రారంభిస్తాం. సందేహాలకోసం ఆయా కార్యాలయాల్లో హెల్ప్లైన్ నెంబర్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే కొందరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయనున్నారు. తద్వారా ఆన్ లైన్ అప్లికేషన్స్, ఫిల్మ్ అప్లికేషన్స్ వంటి వాటిని పరిశీలించే ప్రయత్నం చేస్తాం. మనందరి సమిష్టి పోరాటంతో ఈ విపత్కర పరిస్థితుల నుంచి త్వరలోనే బయట పడతామనే నమ్మకం నాకు ఉంది’’ అని జోషి పేర్కొన్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్లు బంద్ అయిన విషయం తెలిసిందే. -
టి-బిల్లుకు నిరసనగా కార్యాలయాలు బంద్
గుంటూరుసిటీ, న్యూస్లైన్ :రాష్ట్ర విభనను వ్యతిరేకిస్తూ ఏపీఎన్జీవో సంఘం ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలోని వివిధ శాఖల ఉద్యోగులు గురువారం సమ్మెలో పాల్గొన్నారు. ఏపీఎన్జీవో, రెవెన్యూ అసోసియేషన్ నాయకులు జిల్లా కలెక్టర్ కార్యాలయం, జిల్లా పరిషత్, డీఆర్డీఏ, సాంఘిక సంక్షేమం, మెప్మా, గృహనిర్మాణ శాఖ కార్యాలయాలను మూయించివేశారు. సిబ్బంది సహకారించాలని కోరారు. జైసమైకాంధ్ర నినాదాలు, డప్పు వాయిద్యాలతో తమ నిరసనను తెలియజేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఎన్జీవో జిల్లా అధ్యక్షులు రామిరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని విభజిస్తుందని దుయ్యబట్టారు. రాష్ర్టం విడిపోతే ఇరు ప్రాంతాల ప్రజలు నష్టపోతారన్నారు. తెలుగు వారంతా ఐక్యమత్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమన్నారు. తెలంగాణ బిల్లును ఉపసంహరించేవరకు పోరాటాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. జిల్లా రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షులు పెరికల చిన వెంకయ్య మాట్లాడుతూ రాష్ట్రం విడిపోతే విద్యా, ఉద్యోగ, విద్యుత్, సాగునీటి విషయాలలో తీవ్ర ఇబ్బందులు పడ తామన్నారు. కార్యక్రమంలో ఏపీ రెవెన్యూ అసోసియేషన్ కార్యదర్శి బాస్కరరావు, రెవెన్యూ అసోసియేషన్ గుంటూరు డివిజన్ కార్యదర్శి శ్రీనివాసరావు, నాయకులు ప్రతాప్, బాజీ, దయానందరాజు తదితరులు పాల్గొన్నారు.