breaking news
numonia
-
యూరోపియన్ పార్లమెంట్ అధ్యక్షుడి కన్నుమూత
యూరోపియన్ పార్లమెంట్ అధ్యక్షుడు డేవిడ్ ససోలి మంగళవారం కన్నుమూశారు. 65 ఏళ్ల ససోలి.. రోగ నిరోధక శక్తి క్షీణించడంతో గత కొంతకాలంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించి ఆయన కన్నుమూశారు. ససోలి గతేడాది సెప్టెంబర్ నుంచి న్యూమోనియా సంబంధిత జబ్బు కారణంగా ఇటలీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరిన విషయం తెలిసిందే. ఇటాలియన్ జర్నలిస్ట్గా కెరియర్ ప్రారంభించిన ససోలి ఆ తర్వాత టెలివిజన్ యాంకర్గా జాతీయ స్థాయిలో పేరు సంపాదించారు. 2009లో యూరోపియన్ యూనియన్ పార్లమెంట్లో సభ్యుడిగా, 2019లో స్పీకర్గా సేవలందించారు. డేవిడ్ ససోలి మరణంపై పలువురు ప్రముఖులు నివాళి అర్పిస్తున్నారు. తర్వాతి పార్లమెంట్ అధ్యక్షుడి కోసం వచ్చే వారం ఓటింగ్ నిర్వహించనున్నట్లు సమాచారం. (చదవండి: నిందితుడికి బెయిల్.. అతన్ని రాత్రి గృహనిర్బంధం చేయాల్సిందే!) (చదవండి: కెమెరామెన్ అమ్మతో చిట్టితల్లి.. ఏం చెప్పిందో వింటే ఫిదా అవుతారు) -
న్యుమోనియాతో చిన్నారి మృతి
చెన్నేకొత్తపల్లి(రామగిరి): చెన్నేకొత్తపల్లి మండలం చందమూరు గ్రామానికి చెందిన ఈశ్వరయ్య కుమారుడు నవీన్ (9) న్యుమోనియాతో గురువారం రాత్రి మృతి చెందాడు. బంధువుల కథనం మేరకు.. ధర్మవరంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న నవీన్ ఐదు రోజులుగా జ్వరంతో బాధపడుతుండటంతో తల్లిదండ్రులు చెన్నేకొత్తపల్లి, ధర్మవరం ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స చేయించారు. అయినా తగ్గకపోవడంతో బెంగుళూరుకు తరలించారు. వైద్యపరీక్షల్లో న్యుమోనియాతో బాధపడుతున్నట్లు తేలింది. చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.