nuclear project
-
ఇరాన్పై నిప్పుల వర్షం!
దుబాయ్: పశ్చిమాసియాలో యుద్ధం మరింత భీకర రూపు దాలుస్తోంది. ఇరాన్తో పాటు లెబనాన్పైనా ఇజ్రాయెల్ బుధవారం ఐదో రోజు అక్షరాలా నిప్పుల వర్షం కురిపించింది. ఇరాన్లోని కీలక ప్రభుత్వ వ్యవస్థలను నేలమట్టం చేయడమే లక్ష్యంగా టెహ్రాన్తో పాటు కోమ్, ఉరి్మయా, కెర్మన్షా తదితర నగరాలపై కూడా రోజంతా పలు దఫాలుగా బాంబులు, క్షిపణులతో విరుచుకుపడింది. ఇస్ఫహాన్లోని క్షిపణి నిల్వల కేంద్రంపై క్షిపణుల వర్షం కురిపించింది.టెహ్రాన్ సమీపంలోని నూతన అణు ప్రాజెక్టు కేంద్రాన్ని పూర్తిగా ధ్వంసం చేసినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇరాన్కు చెందిన వైఏకే–130 యుద్ధ విమానాన్ని టెహ్రాన్ గగనతలంలో కూల్చేసినట్టు సైన్యం వెల్లడించింది. దాడుల ధాటికి తాళలేక దివంగత సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమాన్ని కూడా ఇరాన్ వాయిదా వేసుకుంది! ఇప్పటిదాకా ఇరాన్కు చెందిన 17 యుద్ధ నౌకలను పేల్చేసినట్టు అమెరికా ప్రకటించింది. ఇరాన్లో 2,000కు పైగా లక్ష్యాలను ఛేదించినట్టు అమెరికా సైన్యం సెంట్రల్ కమాండ్ చీఫ్, నేవీ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ వెల్లడించారు. ‘‘వందలాది ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు, లాంచర్లు, డ్రోన్లను నాశనం చేశాం. ఇరాన్ ఇప్పటిదాకా 500కు పైగా బాలిస్టిక్ క్షిపణులు, 2,000కు పైగా డ్రోన్లు ప్రయోగించింది’’అని తెలిపారు. ఇరాన్లో ఇప్పటిదాకా 1,045 మందికి పైగా మరణించినట్టు ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. ఇరాన్ సైనిక సామర్థ్యం బాగా క్షీణించిందని ఇజ్రాయెల్ సైన్యం అధికార ప్రతినిధి బ్రిగేడియర్ ఎఫీ డెఫ్రిన్ పేర్కొన్నారు. దాంతో దాడుల తీవ్రత కూడా తగ్గిందని చెప్పుకొచ్చారు. బుధవారం ఇరాన్ కూడా దీటుగా ప్రతి దాడులకు దిగింది. జెరూసలేం తదితర నగరాలపైకి భారీగా క్షిపణులను ప్రయోగించింది. సౌదీ అరేబియా, ఖతర్తో పాటు పలు గల్ఫ్ దేశాలపై కూడా దాడులను నిరి్నరోధంగా కొనసాగించింది. దుబాయ్లోని యూఎస్ రాయబార కార్యాలయంపై డ్రోన్లతో దాడి చేసింది. దాంతో కార్యాలయం భారీ మంటల్లో చిక్కింది. అయితే సిబ్బంది అంతా సురక్షితంగా ఉన్నట్టు అమెరికా తెలిపింది. సౌదీ అరేబియాలోని అమెరికా రాయబార కార్యాలయంతోపాటు అక్కడి రస్ అనూరా చమురు శుద్ధి కేంద్రంపై కూడా మళ్లీ డ్రోన్లతో దాడికి ప్రయత్నించింది. బహ్రెయిన్లోని యూఎస్ నేవీ ఐదో ఫ్లీట్ వ్యవస్థపైనా ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించింది. అంతేగాక తన దాడులను టరీ్కకి కూడా విస్తరించింది! ఇరాన్ నుంచి తమ గగనతలంలోకి దూసుకొచ్చిన బాలిస్టిక్ క్షిపణిని అడ్డుకున్నట్టు టర్కీ ప్రకటించింది. తమపై అకారణ దాడికి దిగిన అమెరికా, ఇజ్రాయెల్తో పాటు పశ్చిమాసియా దేశాలు కూడా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ ప్రకటించింది. పశ్చిమాసియాలోని సైనిక, ఆర్థిక వ్యవస్థలన్నింటినీ నాశనం చేసేందుకు సన్నద్ధం అవుతున్నామంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది! లెబనాన్లో... లెబనాన్పై దాడుల తీవ్రతను ఇజ్రాయెల్ బుధవారం మరింత పెంచింది. ఎడతెరిపి లేకుండా వచి్చపడుతున్న క్షిపణులు, బాంబులతో బీరూట్ దద్దరిల్లిపోతోంది. అరమౌన్, సాదియత్ తదితర నగరాలపైనా దాడులు కొనసాగుతున్నాయి. బలైనట్టు తక్షణం సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాల్సిందిగా సరిహద్దు ప్రాంతాల్లోని గ్రామవాసులను ఇజ్రాయెల్ హెచ్చరించింది. దాడుల ధాటికి దక్షిణ లెబనాన్లో ఇప్పటికే వేలాది మంది నిర్వాసితులుగా మారారు. బాల్బెక్లో ఓ నివాస సముదాయంపై జరిగిన దాడిలో కనీసం నలుగురు, సాదియత్లో ఆరుగురు మరణించినట్టు లెబనాన్ ప్రభుత్వ మీడియా పేర్కొంది. -
ఉ. కొరియాలో రహస్య అణు ఉత్పత్తి?
వాషింగ్టన్: ఉత్తర కొరియా అణ్వాయుధాలను రహస్యంగా దాచడానికి మార్గాలను పరిశీలిస్తోందని, అణ్వాయుధాల ఉత్పత్తి రహస్యంగా సాగేలా ఏర్పాట్లు చేస్తోందని మీడియాలో కథనాలు వెల్లువెత్తుతున్నాయి. తమ దేశం లో అణ్వాయుధాలను ధ్వంసం చేస్తామని సింగపూర్ సదస్సులో ట్రంప్కు ఉ.కొరియా అధినేత కిమ్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే యాంగ్బ్యాన్ అణు కేంద్రాన్ని ఆధునీకరిస్తున్నట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఉ.కొరియా అణ్వాయుధ సామగ్రిని సమకూర్చుకుంటోందని ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా అమెరికా సమాచారం సేకరించినట్టు మీడియా వెల్లడించింది. అలాగే దేశ రాజధాని ప్యాంగ్యాంగ్కు 60 మైళ్ల దూరంలో కాంగ్సాన్లో భూగర్భంలో యురేనియం నిల్వలు దాచినట్టు సమాచారం. -
అణు నిర్వాసితులకు నష్టపరిహారం జమ!
► బ్యాంక్ ఖాతాల సేకరణలో అధికారులు ► ఎకరాకు రూ.15 లక్షలు జమ చేసేందుకు సన్నాహాలు రణస్థలం: కొవ్వాడలో అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు తొలి అడుగు పడుతోంది. కొవ్వాడ నిర్వాసిత ప్రాంత ప్రజలకు నష్టపరిహారం అందించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో అదివారం విలేకరులతో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జె.సీతారామరావు మాట్లాడారు. కొవ్వా డ అణువిద్యుత్ కేంద్రం నిర్వాసితుల నుంచి బ్యాంకు ఖాతాలు సేకరిస్తున్నామని తెలిపారు. భూములసంబంధిత పత్రాలు సక్రమంగా ఉంటే.. మరో రెండు రోజుల్లో నష్టపరిహారం రైతుల బ్యాంకు ఖాతాల్లోకి జమఅవుతుందని చెప్పారు. డీ పట్టా, జిరాయితీ భూము లకు ఒకే రేటు చొప్పున నష్టపరిహారం చెల్లించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఎకరాకు రూ.15 లక్షల చొప్పున నగదు నిర్వాసితుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుందని చెప్పారు. నిర్వాసితులు ఎకరాకు రూ.18 లక్షల డిమాండ్ చేస్తున్న విషయం ప్రభుత్వం దృష్టిలో ఉందన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం నుంచి అణువిద్యుత్ అకౌంట్లో రూ. 500 కోట్లు జమైనట్లు చెప్పారు. 2016–17 ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా మార్చి 30వ తేదీ లోపు కొంత మేరకు పరిహారం ఫండ్ ఖర్చు చేయాలన్నారు. అలాంటి పక్షంలో మరో రూ.700 కోట్ల పరిహారం కేంద్ర ప్రభుత్వం నుంచి అకౌంట్లో జమ అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కె.శ్రీరాములు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు నారాయణమూర్తి, సుబ్రహ్మణ్యం,గ్రామ రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. జీఓ విడుదల: అణువిద్యుత్ కేంద్రం పార్కు నిర్మాణంలో భాగంగా కొవ్వాడలో భూములు కోల్పోతున్న వారికి నష్టపరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం జీఓ 1179 విడుదల చేసింది. మొత్తం 2,438 ఎకరాలు సేకరించాల్సి ఉండగా.. ఇందులో డీ పట్టా భూములు 1,473 ఎకరాలకు సంబంధించి నిర్వాసితులకు జీఓ 1179 ద్వారా నష్టపరిహారం చెల్లించనున్నారు. అణు నిర్వాసిత భూములకు రూ.18 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వనున్నట్లు జీఓలో పేర్కొన్నారు. -
12వ ప్రణాళికలోనే ‘కొవ్వాడ’: నారాయణస్వామి
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా కొవ్వాడ అణువిద్యుత్తు ప్రాజెక్టు పనులు 12వ పంచవర్ష ప్రణాళిక కాలంలోనే ప్రారంభమవుతాయని కేంద్ర మంత్రి వి.నారాయణస్వామి తెలిపారు. 1,500 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రెండు యూనిట్లు కొవ్వాడలో నిర్మితమవుతాయన్నారు. ఆయన బుధవారమిక్కడ ఏఐసీసీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం దేశంలో 4,780 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం గల 20 అణువిద్యుత్తు ప్లాంట్లు నడుస్తున్నాయని, మరో 5,300 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం కలిగిన ప్లాంట్లు నిర్మాణంలో ఉన్నాయని ఆయన చెప్పారు. వీటి నిర్మాణంతో 2017 నాటికి 10,080 మెగావాట్ల సామర్థ్యం గల అణు విద్యుదుత్పత్తి కేంద్రాలు అందుబాటులోకి వస్తాయన్నారు. మరోవైపు 12వ పంచవర్ష ప్రణాళిక కాలంలో మరో 17,400 మెగావాట్ల సామర్థ్యం గల ఉత్పత్తి కేంద్రాల నిర్మాణం ప్రారంభమై.. 13, 14 పంచవర్ష ప్రణాళికల కాలంలో అందుబాటులోకి వస్తాయని ఆయన వివరించారు.


