NSDC
-
మారుమూల గ్రామాల్లోని యువతకు టెక్ శిక్షణ.. నెక్స్ట్ వేవ్ & ఎన్ఎస్డిసి కృషితో కొత్త అధ్యాయం
ఉత్తరప్రదేశ్ బాగ్పత్ జిల్లాలోని ఛప్రాలి అనే గ్రామంలో యువతకు కొత్త భవిష్యత్తు చూపిస్తూ ఒక పెనుమార్చు తెచ్చే విద్యా కార్యక్రమం మొదలైంది. నెక్స్ట్ వేవ్, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (NSDC) కలసి గ్రామీణ ఉత్తరప్రదేశ్లో టెక్ స్కిల్స్ నేర్పే ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించాయి. కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ అఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఆంట్రప్రైన్యూర్షిప్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో గ్రామీణ మహిళా యువతకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు.ఈ కార్యక్రమాన్ని చప్పాలిలోని చౌదరి చరణ్ సింగ్ ప్రభుత్వ మహావిద్యాలయంలో కేంద్ర మంత్రి శ్రీ జయంత్ చౌదరి గారు ప్రారంభించారు. అక్కడే “ఫ్యూచర్ స్కిల్ ల్యాబ్” పేరుతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్కిల్ ఇండియా సెంటర్లో ఆధునిక టెక్నాలజీలపై ప్రాక్టికల్ శిక్షణ ఇస్తున్నారు. అక్కడి యువతలో మార్చు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అక్కడ జాయిన్ అయిన విద్యార్థుల్లో చాలా మంది కంప్యూటర్ ఎప్పుడూ వాడలేదు. మొదటి రోజు ల్యాప్ టాప్ ఆన్ చేయడం, కీబోర్డ్ ఎలా వాడాలో నేర్పించారు. ఇప్పుడు చూస్తే వారు వెబ్ యాప్స్ రూపొందించడం మొదలు పెట్టి టెక్ రంగంలో కెరీర్ దిశగా అడుగులు వేస్తున్నారు.ఇక్కడ గమనించాల్సిన ఒక గొప్ప విషయం ఈ విద్యార్థుల పరిస్థితులు. వీళ్లంతా రైతు కుటుంబాల నుంచి వచ్చారు. ఉదయం 4 గంటలకే లేచి ఇంటి పనులు, పొలంలో పనులు పూర్తి చేసి, 5నుంచి 10 కిలోమీటర్లు నడిచి స్కిల్ సెంటర్కు వస్తారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు క్లాసులు అటెండ్ అవుతారు. తర్వాత మళ్లీ ఇంటికి వెళ్లి వంట పనులు, ఇల్లు చూసుకోవాలి. అయినా 4.0 టెక్నాలజీస్ ను పట్టుదలతో నేర్చుకుంటున్నారు.ఒకప్పుడు బిడియంగా ఉంటూ ఎవరితోనైనా మాట్లాడాలంటే ఇబ్బంది పడే స్వాతి ఖోకర్ ఇప్పుడు కెరీర్ వైపు ధైర్యంగా ముందుకు అడుగులేస్తోంది. తండ్రిని కోల్పోయిన తర్వాత కుటుంబ బాధ్యతను తన భుజాలపై వేసుకుంది. ప్రస్తుతం కోడింగ్ నేర్చుకుంటూ, తాను మాత్రమే కాదు, తన వయసు అమ్మాయిలందరికీ ఆదర్శంగా మారింది.నెక్స్ట్ వేవ్ సీఈవో రాహుల్ అత్తులూరి మాట్లాడుతూ, “లక్షలాది మంది విద్యార్థులకు టెక్నాలజీ స్కిల్స్ నేర్పించడమే మా లక్ష్యం. వాళ్లు చక్కగా స్కిల్స్ నేర్చుకుని, మంచి కెరీర్ నిర్మించుకోవాలి. తమ కుటుంబాలు, దేశానికి ఉపయోగపడేలా ఎదగాలి. ఈ రోజు టెక్నాలజీలకే కాదు, రేపటి భవిష్యత్తుకి కూడా సిద్ధంగా ఉండేలా మేము తయారుచేస్తున్నాం” అన్నారు.మొదట్లో వాళ్ళ పిల్లలు నేర్చుకోగలరా అని ఈ ప్రోగ్రాం పట్ల సందేహంగా ఉన్నతల్లిదండ్రులే ఇప్పుడు పెద్ద ఎత్తులో మద్దతు ఇస్తున్నారు. తమ పిల్లలు కోడ్ రాయటం, వెబ్ యాప్లు రూపొందించటం, నేర్చుకున్న విషయాల గురించి ధైర్యంగా మాట్లాడటం చూసి వాళ్ల నమ్మకాలే మారిపోయాయి. ఈ స్కిల్ సెంటర్ పై చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటికే తదుపరి బ్యాచ్లో చేర్చుకోమని 25 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.చౌదరి చరణ్ సింగ్ ప్రభుత్వ మహావిద్యాలయం ప్రిన్సిపాల్ డా. ప్రతీత్ దహియాకు ఇది ఒక పెద్ద లక్ష్యానికి మొదటి అడుగులాగా కనిపిస్తోంది. “ఈ కళాశాల భారత రత్న చౌదరి చరణ్ సింగ్ గారి పేరు మీద ఉంది,” అని చెప్పారు. “ఆయన ఎప్పుడూ దేశం అభివృద్ధి బాటలో సాగాలంటే అది గ్రామాల నుంచి జరగాలి” అని చెప్పేవారు. గ్రామీణ పిల్లలకు టెక్నాలజీ స్కిల్స్ ఉండాలన్నది ఆయన కల. ఇప్పుడు ఆ కల నిజమవుతుండడం ఆనందంగా ఉంది.”గ్రామీణ భారతంలో పాత పద్ధతుల విద్యపై ఆదరణ తగ్గుతూ, స్కిల్స్తో కూడిన ప్రాక్టికల్ లెర్నింగ్ పట్ల ఆసక్తి పెరుగుతోంది. ఆ మార్పునే ఈ ప్రోగ్రామ్ ప్రతిబింబిస్తోంది. నెక్స్ట్ వేవ్ లెర్నింగ్ ప్లాట్ ఫామ్ విద్యార్థులకు కోడింగ్ మాత్రమే కాకుండా, కమ్యూనికేషన్, టీం వర్క్, సమస్యల పరిష్కారం, ప్రాజెక్ట్ ప్రాక్టీస్ ఇలా ఇండస్ట్రీ కి అవసరమైన అనేక నైపుణ్యాలు నేర్పిస్తోంది. భాష సమస్యను ఎదుర్కొంటున్న విద్యార్థులకు మెంటర్లు ఏఐ టూల్స్ ద్వారా వర్ణాక్యులర్ సపోర్ట్ ఇవ్వడమూ ఓ పెద్ద ముందడుగు.కేవలం 6 నెలల్లోనే ముగ్గురు విద్యార్థులు ఉద్యోగాలు పొందడం వల్ల, గ్రామీణ యువతలో ఎంత వేగంగా టాలెంట్ వెలికి తీయవచ్చో స్పష్టమవుతోంది. మొదట్లో కేవలం 30 మంది విద్యార్థులతో ప్రారంభమైన ప్రోగ్రాం, ఇప్పుడు చుట్టుపక్కల గ్రామాలనంతా తాకుతోంది. NSDC, స్థానిక నేతల మద్దతుతో నగరాల్లో మాత్రమే ఉండే అవకాశాల్ని గ్రామీణ యువతకు అందించేందుకు నెక్స్ట్ వేవ్ వేగంగా ముందుకెళ్తోంది. అవకాశం దరిచేరదు అనిపించిన గ్రామాల్లో ఇప్పుడు కొత్త ఉద్యమం మొదలైంది. ఈ కార్యక్రమం కేవలం శిక్షణ ఇవ్వడం మాత్రమే కాదు, విద్యార్థులలో, కుటుంబాల్లో, గ్రామీణ భారత్ భవిష్యత్తు నిర్మాణం చేయగలదు అన్న విశ్వాసాన్ని మళ్లీ చేకూర్చడం దీని అసలైన లక్ష్యం.NxtWave Institute of Advanced Technologiesకపిల్ కావురి హబ్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్రామ్గూడ, తెలంగాణ, 500032 -
ఏటా లక్ష మందికి విదేశాల్లో ఉపాధి
న్యూఢిల్లీ: భారత్ నుంచి ఏటా లక్ష మందికి అంతర్జాతీయంగా సంరక్షణ కార్యకలాపాల్లో ఉపాధి కల్పించనున్నట్లు జాతీయ నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ సీఈవో 'వేద్ మణి తివారీ' ప్రకటించారు. మరో రెండేళ్ల తర్వాత నుంచి నియామకాలు మొదలవుతాయన్నారు. వృద్ధ జనాభా పెరుగుతున్న దేశాల్లో వారి సంరక్షణ సేవల్లో నియమించనున్నట్టు చెప్పారు.దేశంలో నిరుద్యోగం గురించి ప్రస్తావించగా.. అధికారిక లెక్కల ప్రకారం ఇది 6.5 శాతంగా ఉందని, అమెరికాలోనూ 4.5 శాతం మంది నిరుద్యోగులు ఉన్నట్టు గుర్తు చేశారు. గడిచిన ఏడాది కాలంలో భారత్ నుంచి 20,000 మంది నిర్మాణ రంగ కార్మికులు ఇజ్రాయెల్కు వెళ్లారని చెప్పారు. దేశవ్యాప్తంగా 100 నైపుణ్య మదింపు కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తివారీ తెలిపారు.‘‘ఇజ్రాయెల్ లేదా జపాన్ లేదా జర్మనీ వెళ్లాలనుకునే వారు ఈ కేంద్రాల వద్ద హాజరు కావాలి. అక్కడ నైపుణ్యాలను పరీక్షించి సరి్టఫికెట్ ఇస్తారు. అప్పుడు వర్క్వీసా కోసం దరఖాస్తు పెట్టుకోవచ్చు’’అని వివరించారు. ఎన్ఎస్డీసీ 4 కోట్ల మందికి శిక్షణ ఇవ్వగా, మూడు నెలల్లోనే 94 లక్షల మందికి ఉపాధి లభించినట్టు తివారీ వెల్లడించారు.అత్యాధునిక నైపుణ్యాల అభివృద్ధి, శిక్షణ కోసం దేశవ్యాప్తంగా కొత్తగా 50 భవిష్యత్ నైపుణ్య కల్పన కేంద్రాలను, 10 ఎన్ఎస్డీసీ ఇంటర్నేషనల్ అకాడమీలను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. పరిశ్రమల అనుసంధానతతో కూడిన శిక్షణా కార్యక్రమాలు 300కు మించగా, 13 ప్రముఖ టెక్నాలజీలు వీటి పరిధిలో ఉన్నట్టు చెప్పారు. ఏటా 2 లక్షల మందికి శిక్షణ ఇవ్వాలన్నది తమ లక్ష్యంగా పేర్కొన్నారు. -
ఫ్లిప్కార్ట్ కొత్త వ్యూహం.. వేలాదిమందికి ఉద్యోగాలు!
దేశీయ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ (Flipkart) తాజాగా 'నేషనల్ స్కిల్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్' (NSDC)తో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దీని ద్వారా విద్యార్థులకు, ఔత్సాహికులకు ఈ-కామర్స్ సెక్టార్లో మాత్రమే కాకుండా బిజినెస్, రిటైల్, వేర్హౌసింగ్ రంగాలలో నైపుణ్యాలను పెంపొందించడానికి యోచిస్తోంది. ఈ ఒప్పంద కార్యక్రమంలో ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ మినిష్టర్ 'అతుల్ కుమార్ తివారీ', NSDC COO వేద్ మణి తివారీ పాల్గొన్నారు. భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ కామర్స్ రంగంలో వృత్తిని కొనసాగించాలనుకుని వారికి ఉచిత ఆన్లైన్ కోర్సులను అందించడమే ప్రధాన ఉద్దేశ్యంగా ఈ ఒప్పందం జరిగింది. ఫ్రీ ఆన్లైన్ కోర్సులను నైపుణ్యాలను పెంచుకుంటే.. ఈ కామర్స్ అండ్ రిటైల్ రంగాలలో ఉద్యోగాలు తెచ్చుకోవడం సులభతరం అవుతుంది. ఈ కామర్స్ రంగంలో ఫ్లిప్కార్ట్ నిబద్ధతను బలపరుస్తూ.. వేర్హౌసింగ్ రంగంలో అభ్యర్థులకు ఫ్లిప్కార్ట్ సప్లై చైన్ అకాడమీ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వడం ద్వారా వారికి కోర్స్ విజయవంతంగా పూర్తి చేసినట్లు సర్టిఫికెట్ కూడా అందిస్తుంది. ఎంఓయూపై సంతకం చేసిన సందర్భంగా ఎన్ఎస్డీసీ డైరెక్టర్ వేద్ మణి తివారీ మాట్లాడుతూ.. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా పౌరులను ఉద్యోగ నైపుణ్యాలతో సన్నద్ధం చేసేందుకు ఎన్ఎస్డీసీ చేస్తున్న ప్రయత్నాల్లో ఇది ఓ ముఖ్యమైన మైలురాయి. ఫ్లిప్కార్ట్తో కలిసి ఈ-కామర్స్, రిటైల్ అండ్ లాజిస్టిక్స్ రంగాలలో విజయం సాధించడానికి అవసరమైన నైపుణ్యం కల్పించడం మా లక్ష్యం. ఉద్యోగార్ధులు వారి ఎంపికకు తగిన ఉద్యోగాన్ని పొందటంలో సహాయపడటానికి మేము ఈ కూటమిని దేశం అంతటా తీసుకెళ్లడానికి ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇదీ చదవండి: టాటాతో రిలయన్స్ డీల్! అంబానీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఈ సందర్భంగా ఫ్లిప్కార్ట్ గ్రూప్ చీఫ్ కార్పోరేట్ అఫైర్స్ ఆఫీసర్ 'రజనీష్ కుమార్' మాట్లాడుతూ.. ఫ్లిప్కార్ట్ ఈ-కామర్స్ ప్రయాణంలో మిలియన్ల కొద్దీ స్థానిక వ్యాపారాలకు మద్దతు ఇవ్వడానికి, దేశంలో ఆర్థిక వృద్ధి తోడ్పాటుకు కట్టుబడి ఉంది. నేషనల్ స్కిల్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (NSDC)తో కామర్స్ అండ్ రిటైల్ రంగాలలో నైపుణ్యాలను అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. -
శామ్సంగ్ గ్రూప్ భారీ పెట్టుబడులు, వేల సంఖ్యలో ఉద్యోగాలు
దక్షిణ కొరియాకు చెందిన టెక్ దిగ్గజం శామ్సంగ్ గ్రూప్ తన సెమీకండక్టర్, బయోఫార్మాస్యూటికల్స్, టెలికమ్యూనికేషన్స్ యూనిట్లలో 205 బిలియన్ డాలర్లు(సుమారు రూ.15 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ పెట్టుబడుల ద్వారా రాబోయే మూడు ఏళ్లలో 40,000 మందికి ఉపాది కల్పించనున్నట్లు శామ్సంగ్ తెలిపింది. "ప్రత్యక్ష ఉపాధిని పెంచడం, విద్యా అవకాశాలను అందించడం, యువత సృజనాత్మక సామర్థ్యాలు వ్యాపారాలు & సమాజానికి ఎక్కువ దోహదపడేలా చూడటానికి స్టార్ట్-అప్ లకు మద్దతు ఇవ్వడమే ఈ ప్రణాళిక ఉద్దేశ్యం" అని అధికారిక ప్రకటనలో తెలిపింది. శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్, శామ్సంగ్ బయోలాజిక్స్ వంటి ప్రధాన అనుబంధ సంస్థలు టెలికమ్యూనికేషన్స్, రోబోటిక్స్, ఏఐ వంటి రంగాలలో పరిశోధనలను & ఖర్చులను చూస్తాయి. దక్షిణ కొరియా కేంద్రంగా సెమీకండక్టర్ల తయారీపై దృష్టి సారించడానికి 2030 నాటికి $151 బిలియన్లను పెట్టుబడి పెట్టాలనే శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ దీర్ఘకాలిక లక్ష్యం. దేశీయ ఎస్ఎంఈల తయారీ సామర్థ్యాలను అప్ గ్రేడ్ చేసే లక్ష్యంతో శామ్సంగ్ తన 'స్మార్ట్ ఫ్యాక్టరీ ప్రోగ్రామ్'ను కూడా ప్రారంభించింది. ఇక మన దేశవ్యాప్తంగా సీఎస్ఆర్ కింద ఎలక్ట్రానిక్స్ రిటైల్ రంగానికి అవసరమైన మానవ వనరులను అందించేందుకు నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎన్ఎస్డీసీ)తో చేతులు కలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న ఎన్ఎస్డీసీ 120 కేంద్రాల్లో శామ్సంగ్ దోస్త్(డిజిటల్, ఆఫ్లైన్ స్కిల్స్ ట్రైనింగ్) ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపడతారు. ఇందులో భాగంగా 50,000 మంది యువతకు శామ్సంగ్ శిక్షణ ఇవ్వనుంది. (చదవండి: మస్తు ఫీచర్లతో మడత ఫోన్లు.. ఇరగదీస్తున్నాయిగా) -
శామ్సంగ్ గుడ్న్యూస్, 50వేల మందికి శిక్షణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెక్నాలజీ దిగ్గజం శామ్సంగ్.. ఎలక్ట్రానిక్స్ రిటైల్ రంగానికి అవసరమైన మానవ వనరులను అందించేందుకు నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో (ఎన్ఎస్డీసీ) చేతులు కలిపింది. ఇందులో భాగంగా 50,000 మంది యువతకు శామ్సంగ్ శిక్షణ ఇవ్వనుంది. దేశవ్యాప్తంగా ఎన్ఎస్డీసీకి చెందిన 120 కేంద్రాల్లో శామ్సంగ్ దోస్త్ (డిజిటల్, ఆఫ్లైన్ స్కిల్స్ ట్రైనింగ్) ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపడతారు. 10వ తరగతి ఉత్తీర్ణులైనవారు అర్హులు. 200 గంటలపాటు తరగతి గది, ఆన్లైన్ పాఠాలు ఉంటాయి. ఆ తర్వాత అయిదు నెలలపాటు శామ్సంగ్ రిటైల్ స్టోర్లో శిక్షణ ఉంటుంది. ఈ కాలంలో పరిశ్రమ ప్రమాణాల ప్రకారం అభ్యర్థులకు భత్యం చెల్లిస్తారు చదవండి : పెరిగిన గ్యాస్ ధరలు, బంపర్ ఆఫర్ ప్రకటించిన పేటీఎం -
మారుతి, ఎన్ఎస్డీసీతో ఉబెర్ భారీ ప్రణాళిక
న్యూఢిల్లీ: ప్రముఖ టాక్సీ అగ్రిగేటర్ ఉబెర్ ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆటో మేజర్ మారుతి సుజుకి, నేషనల్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ భాగస్వామ్యంతో క్యాబ్ డ్రైవర్ల శిక్షణ, మరియు సంక్షేమం కోసం ఒక పథకాన్ని ప్రకటించింది. సుమారు నాలుగు లక్షలమంది డ్రైవర్లతో అమెరికా తరువాత దేశంలో రెండవ అతిపెద్ద క్యాబ్ ప్రొవైడర్ గా ఉన్న ఉబెర్ డ్రైవర్లకు మెరుగైన శిక్షణ, సదుపాయాలకోసం కృషి చేస్తోంది. 2018 నాటికి పది లక్షల మందికి జీవనోపాధి అవకాశాలు సృష్టించే యోచనలో మారుతీ, ఎన్ఎస్డీసీ భాగస్వామ్యంతో 'ఉబెర్ షాన్ ' అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, మారుతీ సుజుకి భాగస్వామ్యంతో 2018 నాటికి సుమారు పదిలక్షలమందికి జీవనోపాధి అవకాశాలను కల్పించాలనే తమ లక్ష్యం నెరవేరనుందని ఉబెర్ తెలిపింది. ఈ కార్యక్రమం కింద 30,000 డ్రైవర్లకు శిక్షణ అందించాలని భావిస్తున్నామని మారుతి సుజుకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) ఆర్ ఎస్ కల్సి తెలిపారు. నైపుణ్యం లేని డ్రైవర్లకు శిక్షణ అందించి తీర్చిదిద్దేందుకు ఈ పథకం ఉద్దేశించిందని ఉబెర్ భారతదేశం అధ్యక్షుడు అమిత్ జైన్ పీటీఐకి తెలిపారు. అలాగే డ్రైవర్లు వాణిజ్య లైసెన్సుల, వాహనం ఫైనాన్సింగ్, లీజింగ్ పరిష్కారాల్లో ఈ ప్రణాళిక సహాయాన్నంది స్తుందన్నారు. ఢిల్లీ / ఎన్సీఆర్, హైదరాబాద్, చెన్నైలలో 4నెలల పైలట్ ప్రోగ్రాంను నిర్వహించనున్నామన్నారు. ఇది పూర్తయ్యాక దీని ఆధారంగా భారతదేశం అంతటా ఇతర నగరాలకు విస్తరిస్తామని జైన్ ప్రకటించారు. ఈ భాగస్వామ్యం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ఎన్ఎస్డీసీ శిక్షణా కేంద్రాల ద్వారా కొత్త, పాత డ్రైవర్లకు నైపుణ్య శిక్షణ అందిస్తామని, ఆటోమొబైల్ సెక్టార్ లో స్కిల్ బిల్డింగ్ కు ఇది ప్రోత్సాహాన్నందిస్తుందని పేర్కొన్నారు. -
కడపలో ఎన్ఎస్డీసీ-దాల్మియా భారత్ నైపుణ్య శిక్షణా కేంద్రం!
న్యూఢిల్లీ: కడపలో వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రం ఏర్పాటు కానున్నది. నిరుద్యోగ యువతకు శిక్షణనిచ్చే నిమిత్తం నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎస్డీసీ), దాల్మియా భారత్ ఫౌండేషన్లు పరస్పరం ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఒప్పందంలో భాగంగా రానున్న పదేళ్లలో దాదాపు 60,000 మంది నిరుద్యోగ యువతకు శిక్షణనిస్తామని ఎన్ఎస్డీసీ తెలిపింది. వస్త్రాలు, రిటైల్, ఆటో, హెల్త్కేర్, రియల్టీ, వ్యవసాయం తదితర రంగాల్లో శిక్షణ ఉంటుందని పేర్కొంది. శిక్షణ అనంతరం ధ్రువీకరణ పత్రాలు పొందిన వారిలో 70 శాతం మందికి తప్పక ఉపాధి కల్పిస్తామని ఎన్ఎస్డీసీ సీఈవో జయంత్ కృష్ణా తెలిపారు. మొత్తంగా తమిళనాడు (తిరుచ్చి), ఆంధ్రప్రదేశ్ (కడప), కర్నాటక (బెల్గామ్), ఉత్తరప్రదేశ్ (సీతాపూర్), అస్సాం (గువాహటి), ఒడిస్సా (రూర్కెలా, కటక్), జార్ఖండ్ (బొకారొ) ప్రాంతాల్లో శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేస్తామని దాల్మియా భారత్ గ్రూప్ మేనేజింగ్ డెరైక్టర్ గౌతమ్ దాల్మియా తెలిపారు. -
నైపుణ్యాల పెంపునకు రూ.1,000 కోట్లు
శివగంగ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 10 లక్షల మంది యువజనులకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమానికి గాను ప్రభుత్వం రూ.1,000 కోట్లు కేటాయించింది. ఇక్కడకు సమీపంలోని అమరావతిపుత్తూర్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభిస్తూ ఆర్థిక మంత్రి పి. చిదంబరం ఈ విషయం చెప్పారు. ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. మొత్తం విద్యార్ధుల్లో 15 శాతం మంది మాత్రమే తమ నైపుణ్యాలను మెరుగుపరచుకొని విదేశాల్లో ఉద్యోగాలు పొందగలుగుతున్నారని చిదంబరం పేర్కొన్నారు. ప్రతి లోక్సభ నియోజకవర్గంలో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన పేర్కొన్నారు.