-
వివక్ష, వివాదం ఉంటేనే జోక్యం
న్యూఢిల్లీ: ప్రభుత్వ పాలనా విధానాల్లో స్పష్టంగా వివక్ష, వివాదకర అంశాలు ఉన్న సందర్భాల్లోనే కోర్టులు కలగజేసుకోవాలని, విధానాలు సవ్యంగా ఉన్నపుడు జోక్యం అనవసరమని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. బోనస్ మార్కుల విషయంలో హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఎన్హెచ్ఎం, ఎన్ఆర్హెచ్ఎం సిబ్బంది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ను గురువారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎల్.నాగేశ్వర రావు, జస్టిస్ బీఆర్ గవాయ్ల ధర్మాసనం విచారించింది. ‘ రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థ అవసరాలకు తగ్గట్లుగా శిక్షణ పూర్తిచేసుకుని రాజస్తాన్ గ్రామీణ, ఎడారి ప్రాంతాల్లో పనిచేసిన ఆ సిబ్బందికి అదనపు పరిజ్ఞానం, అనుభవం ఉంటుంది. అందుకే వారికి అదనంగా బోనస్ మార్కులు ఇవ్వడం సబబే. ఇలాంటి పరిపాలనా విధానాల్లో కలగజేసుకోవడంలో కోర్టులు తొందరపాటు పనికిరాదు. వివాదాలు ఉంటేనే న్యాయం అందించేందుకు నెమ్మదిగా జోక్యం చేసుకోవాలి’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అనవసర వ్యాఖ్యలొద్దు న్యూఢిల్లీ: ఏదైనా కేసుపై విచారణ జరిపేటప్పుడు దానితో సంబంధం లేని అనవసర వ్యాఖ్యలు చేయద్దని హైకోర్టులకు సుప్రీంకోర్టు సూచించింది. హైకోర్టులు పరిధులను అతిక్రమించరాదని, వాద, ప్రతివాదుల మధ్య వివాదాలకు తలెత్తేలా వ్యవహరించరాదని, అనవసర వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని జస్టిస్ ఎం.ఆర్.షా, జస్టిస్ బి.వి.నాగరత్నతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఓ టెండర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ భారత్ ఫ్రిట్జ్ వెర్నర్ లిమిటెడ్ అనే సంస్థ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ విషయంలో హైకోర్టు వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. ఢిల్లీ హైకోర్టు కనీసం రిట్ పిటిషన్ అర్హతను కూడా నిర్ణయించలేదని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆక్షేపించింది. కేసుతో సంబంధం లేని అనవసర వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని హితవు పలికింది. -
ఎన్ఆర్హెచ్ఎం నిధుల గోల్మాల్ !
రిమ్స్క్యాంపస్: జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (ఎన్.ఆర్.హెచ్.ఎం) నిధులంటే చాలు కోట్లాది రూపాయలు కళ్ల ముందు కనిపిస్తాయి. మరి ఆ సొమ్ము ఖర్చు మన చేతుల్లో ఉండడంతోపాటు ఉన్నతాధికారుల అండ ఉంటే...ఇంకేముంది ఎచెక్కా కొల్లగొట్టడం ఖాయం. ఇదే ఆలోచన వైద్య ఆరోగ్యశాఖలోని కొంతమంది అధికారులకు కలిగింది. ఎన్.ఆర్.హెచ్.ఎం నిధుల్లో పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగినట్టు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలే చెబుతున్నాయి. ఈ నిధులు సక్రమంగా సద్వినియోగం చేశారా అని తెలుసుకోవడం కోసం ఈ నెల 19 నుంచి 27వ తేదీ వరకూ జరిగిన స్టాటిట్యురీ టీమ్ ఆడిట్ కూడా అంతా మాయాజాలంగానే సాగినట్టు సమాచారం. చేయని ఆడిట్ను చేసినట్టు చూపేందుకు పీహెచ్సీకి రూ. 2,000 చొప్పున, అసలు ఆడిట్ చేయకుండా ఉండేందుకు పలు పీహెచ్సీలకు రూ. 2,500 చొప్పున వసూలు చేశారు. ప్రస్తుతం వైద్యశాఖలో దీనిపై సర్వత్రా చర్చించుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే.. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో 75 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. వీటన్నింటికీ ఏటా ఎన్.ఆర్.హెచ్.ఎం నిధులు వివిధ రకాలుగా కోట్లాది రూపాయలు వస్తుంటాయి. హెచ్డీఎస్ నిధులు, ఎన్యూవల్ మెంటేనన్స్ గ్రాంట్ (ఏఎంజీ), ఆర్సీహెచ్-2 ఏఎన్ఎమ్ల వేతనాలు, డీఎంహెచ్వో కార్యాలయానికి మౌలిక వసతుల కల్పనకు, సబ్ సెంటరు అన్టైడ్ ఫండ్, శానిటేషన్ ఫండ్ ఇలా వివిధ రకాల నిధులు ఎన్.ఆర్.హెచ్.ఎం కింద విడుదల అవుతుంటారుు. ఈ ఏడాది కూడా సుమారు రూ. ఐదు కోట్లు వరకు నిధులు వచ్చినట్టు సమాచారం. అయితే ఈ నిధుల ఖర్చులో కోట్ల రూపాయల గోల్మాల్ జరిగినట్టు తెలిసింది. అన్నీ నకిలీ బిల్లులు, నకిలీ ఆడిట్తోనే ఈ మాయజాలం సాగినట్టు సమాచారం. ఆర్సీహెచ్-2 ఏఎన్ఎంల వేతనాలకు సంబంధించి విడుదలయ్యే నిధుల మినహా మిగిలిన నిధులన్నింటిలో కూడా అవకతవకలు చోటుచేసుకున్నట్టు భోగట్టా. నిధుల దుర్వినియోగమిలా.. ఎన్.ఆర్.హెచ్.ఎం నిధులకు సంబంధించి ముఖ్యంగా హెచ్డీఎస్ నిధులు, ఎన్యూవల్ మెంటేనన్స్ నిధులు, సబ్సెంటరు అన్టైడ్ ఫండ్, శానిటేషన్ ఫండ్లో ఎక్కువ అవకతవకలు చోటుచేసుకుంటున్నాయి. హెచ్డీఎస్ నిధులకు మెడికల్ ఆఫీసర్, సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్లకు (ఎస్పీహెచ్వో) డ్రాయింగ్ పవర్ ఉంటుంది. ఎస్పీహెచ్వోలకు కొంత కమీషన్ ఇచ్చి ఈ నిధుల్లో మరికొంత మొత్తాన్ని కొందరు మెడికల్ ఆఫీసర్లు గోల్మాల్ చేస్తుంటారు. ఎన్యూవల్ మెంటేనన్స్ గ్రాంట్కు సంబంధించి కేవలం మెడికల్ ఆఫీసర్ ఒక్కరికే డ్రాయింగ్ పవర్ ఉంటుంది. కొంతమంది మెడికల్ ఆఫీసర్లు ఈ నిధుల్లో దర్జాగ తమ చేతివాటాన్ని చూపిస్తుంటారు. సబ్ సెంటర్ అన్టైడ్ ఫండ్కు సంబంధించి ఏఎన్ఎం, పీహెచ్ఎన్లకు డ్రాయింగ్ పవర్ ఉంటుంది. అయితే కొంతమంది మెడికల్ అధికారులు వీరితో కుమ్మకై ఈ నిధుల్లో కూడా కొంత మొత్తాన్ని గోల్మాల్ చేస్తుంటారు. శానిటేషన్ ఫండ్ పరిస్థితి కూడా అంతే. దీనికి పంచాయతీ సెక్రటరీ, ఏఎన్ఎంలకు డ్రాయింగ్ పవర్ ఉంటుంది. దీంట్లో కూడా చేతివాటం తప్పటం లేదు. హెచ్డీఎస్ కమిటీ అమోదం లేకుండానే... హెచ్డీఎస్ నిధులకు సంబంధించి మెడికల్ ఆఫీసర్, ఎస్పీవోలకు డ్రాయింగ్ పవర్ ఉన్నప్పటికీ హెచ్డీఎస్ కమిటీ అమోదం తప్పనిసరి. అయితే కనీసం ఈ కమిటీకి ఎంత నిధులు ఖర్చు అయ్యావనే విషయం తెలియని పరిస్థితి. కమిటీలో ఎంఆర్వో, సర్పంచ్, డ్వాక్రా మహిళ, వార్డు మెంబరు, జెడ్పీటీసీ సభ్యుడు, ఎంపీడీవో ఇలా కొంత మంది సభ్యులుంటారు. హెచ్డీఎస్ నిధుల నుంచి ఏయే మందులు కొనుగోలు చేశారు, ఇంకా ఏ పనులకు వాడుతున్నారు అన్నదానిపై ఈ కమిటీ తమ అమోదం తెలపాలి. అయితే కమిటీ అమోదం తెలిపిన దాఖలులు ఎక్కడా లేదు. ఎందుకంటే అసలీ కమిటీ సమావేశాలే జరగవు కనుక. కమిటీ సభ్యులకు ఇవేవి తెలియక తమకేమీ పట్టనట్టు నిమ్మకుండిపోతున్నారు. ఇదే అదునుగా కొంత మంది మెడికల్ ఆఫీసర్లు, ఎస్పీహెచ్వోలు కుమ్మకై మందులు కొనుగోలు చేసినట్టు నకిలీ బిల్లులు పెట్టి నిధులు గోల్మాల్ చేస్తున్నారు. దీంతో బిల్లులో ఉన్న మందులు పీహెచ్సీల్లో ఉండడం లేదు. వసూళ్ల పర్వంతో ఆడిట్ మాయజాలం పీహెచ్సీకి రెండు వేల రూపాయల చొప్పున వసూళ్లు చేయటంతో ఆడిట్లో మాయజాలం చోటుచేసుకుంది. ఈ నెల 19 నుంచి 27వ తేదీ వరకు జరిగిన స్టెటీట్యూటరీ ఆడిట్ అంతా పచ్చనోట్ల వెనకే సాగినట్టు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలే చెబుతున్నాయి. పూర్తిస్థాయిలో ఆడిట్ జరిగితే నిధుల దుర్వినియోగం బయటపడుతుందన్న ఉద్దేశంతో కొంతమంది వసూళ్ల పర్వానికి తేరలేపినట్టు సమాచారం. గతంలో జరిగిన పీహెచ్సీలను విడిచిపెడితే ఈ నెలలో జరిగిన ఆడిట్లో 40 పీహెచ్సీలు, పలాస సీహెచ్సీ, టెక్కలి ఏరియా ఆస్పత్రులు ఉన్నాయి. అయితే చూసీచూడనట్టు ఆడిట్ జరిపినందుకు రూ. 2,000 వసూలు చేశారు. కొన్ని పీహెచ్సీలకైతే అసలు ఆడిట్ చేయకుండా ఉండేందుకు రూ. 2,500 వసూలు చేశారు. కొన్ని పీహెచ్సీల్లో మాత్రమే అవకతవకలు జరుగుతుంటాయని, కాని అన్ని పీహెచ్సీల వారి నుంచి డబ్బులు వసూలు చేయటం ఎంత మాత్రం సరికాదంటూ కొంత మంది వైద్యాధికారులు ఆవేదన చెందుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఎన్.ఆర్.హెచ్.ఎం నిధుల గోల్మాల్ కోట్ల రూపాయల్లో ఉంటుందనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. -
ఎన్ఆర్హెచ్ఎం ఖాతా ఖాళీ!
ఆరు నెలలుగా నిధులు విదల్చని సర్కారు సిబ్బంది వేతనాలకూ కటకట వడ్డీ డబ్బులతో గత నెల వేతనాలు సరిపెట్టుకున్న వైనం ఆందోళనలో రెండువేల మంది ఉద్యోగులు సాక్షి, రంగారెడ్డి జిల్లా : జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (ఎన్ఆర్హెచ్ఎం) ఆరు నెలలుగా నిధులలేమితో సతమతమవుతోంది. బడ్జెట్ కేటాయింపులో సమస్య నెలకొనడంతో చివరకు ఉద్యోగులకు వేతనాలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్యసేవలందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఎన్ఆర్హెచ్ఎం పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ప్రతి పంచాయతీ పరిధిలో ఉపకేం ద్రాలు ఏర్పాటుచేసి అక్కడి ప్రజలకు వైద్యసేవలు అందించడంతోపాటు ప్రజారోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు ఆశ వర్కర్లు, శిశు మరణాలు తగ్గించేందుకు ప్రత్యేకంగా క్లస్టర్ ఆస్పత్రుల్లో శిశు వైద్య యూనిట్లు ఏర్పాటుచేసి సేవలందిస్తున్నారు. వేతన వెతలు.. ప్రస్తుతం ఎన్ఆర్హెచ్ఎం పథకంలో భాగంగా పనిచేస్తున్న సిబ్బందికి కష్టాలు వచ్చాయి. ఎన్ఆర్హెచ్ఎం కింద జిల్లాలో రెండు వేల మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఇందులో ఆశ, ఇతర వర్కర్లు 1,506 మంది కాగా, 483 మంది ఆరోగ్య కార్యకర్తలు, సహాయ ఆరోగ్య కార్యకర్తలు, వైద్యులు కూడా ఉన్నారు. తాజాగా ఈ పథకం కింద విడుదల చేయాల్సిన నిధులపై సర్కారు జాప్యం చేస్తోంది. కొత్తగా ఆర్థిక సంవత్సరం ప్రారంభమై ఐదు నెలలవుతున్నా ఇప్పటికీ పైసా విదిల్చలేదు. గత ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి ఎన్ఆర్హెచ్ఎం ఖాతాలో రూ.రెండు కోట్ల మిగులు డబ్బులున్నాయి. దీంతో ఏప్రిల్ నెలనుంచి ఆ నిధులనుంచి వేతనాలు తీసుకుంటూ వచ్చారు. తాజాగా ఈ ఖాతాలో నిధులు నిండుకోవడంతో సిబ్బందిలో ఆందోళన మొదలైంది.ఈ పథకం అమల్లో పనిచేస్తున్న సిబ్బందికి నెలవారీగా రూ.70లక్షలు వేతనాల రూపంలో చెల్లిస్తున్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నిధుల విడుదలలో కేంద్రం జాప్యం చేసింది. దీంతో మిగులు నిధులతో మూడు నెలలపాటు వేతనాల రూపంలో డ్రా చేశారు. ఫలితంగా నిధులు నిండుకున్నాయి. ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన మూడు నెలల తర్వాత కూడా బడ్జెట్ రాకపోవడంతో మళ్లీ వేతనాల సమస్య తలెత్తింది. అయితే ఎన్ఆర్హెచ్ఎం ఖాతాలోని వడ్డీ నిధులను సైతం వాడుకుని రెండు నెలల వేతనాలు ఇచ్చారు. తాజాగా ఈ ఖాతా ఖాళీ కావడంతో సిబ్బందికి వేతనాలు అందడం కష్టంగా మారింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement