breaking news
Non-Gazetted Officers Association
-
మళ్లీ వివాదంలోకి హైదరాబాద్
దేవీప్రసాద్ రావు ఆరోపణ నాంపల్లి: హైదరాబాద్ను సీమాంధ్ర పాలకులు మళ్లీ వివాదంలోకి నెట్టారని టీఎన్జీఓ కేంద్ర సంఘం గౌరవాధ్యక్షుడు దేవీ ప్రసాద్రావు ఆరోపించారు. తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ నాన్ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం ఐదో వార్షికోత్సవాలు బుధవారం నాంపల్లిలోని గగన్ విహార్ భవన సముదాయంలో నిర్వహించారు. ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు వేణుగోపాల్రావు అధ్యక్షతన జరిగిన వేడుకలకు ముఖ్య అతిథిగా దేవీ ప్రసాద్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అభివృద్ధిలో ముందుకు దూసుకువెళ్తున్న తెలంగాణపై ఆంధ్రా ప్రభుత్వం పడగ విప్పేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ కుట్రకు మూలం అక్కడి సీఎం చంద్రబాబేనని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఉద్యోగ విభజన అంశంపై పూర్తిగా విజయం సాధించలేకపోయామని చెప్పారు. దీనికి ఆంధ్రా అధికారులు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని అన్నారు. ఉద్యమ రూపంలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. జోన్ల వ్యవస్థలో మౌలిక మార్పులు తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓ కేంద్ర సంఘ ప్రధాన కార్యదర్శి హమీద్, ఉపాధ్యక్షురాలు రేఛల్, తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వివేక్, తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ గె జిటెడ్ అధికారుల సంఘ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర్లు, తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ నాన్ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు బి.శ్యామ్, టీఎన్జీఓ కార్యనిర్వాహక కార్యదర్శి రామినేని శ్రీనివాసరావు, హైదరాబాద్ నగర అధ్యక్షుడు కస్తూరి వెంకటేశ్వర్లు, కార్యదర్శి లక్ష్మీ నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
టీఎన్జీవో అధ్యక్షుడిగా దేవీప్రసాద్
ప్రధాన కార్యదర్శిగా కె.రవీందర్రెడ్డి ఏకగ్రీవంగా కార్యవర్గం ఎన్నిక హైదరాబాద్: తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం (టీఎన్జీవో) అధ్యక్షుడిగా దేవీప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా కె.రవీందర్రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంఘం ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేయడానికి ఆఖరు తేదీ 14వ తేదీ నాటికి ఒక్కొక్క సెట్ నామినేషన్ మాత్రమే దాఖలు కావడంతో వారు ఏకగ్రీవంగా ఎన్నికయినట్లు ప్రకటించా రు. అనంతరం కార్యవర్గాన్ని కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 2012 జూలై 31న స్వామిగౌడ్ పదవీ విరమణ చేయడంతో దేవీప్రసాద్ టీఎన్జీవోల అధ్యక్షుడిగా తొలిసారి ఎన్నికైన విషయం విదితమే. ఈ ఎన్నికలను ప్రతి మూడేళ్లకోసారి నిర్వహిస్తారు. కాగా ఈ సందర్భంగా దేవీప్రసాద్ ఉద్యోగులను ఉద్దేశించి మా ట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషిం చిన ఉద్యోగులు.. సొంత రాష్ట్రంలో పీఆర్సీ, హెల్త్కార్డులు, సకల జనుల సమ్మె కాలాన్ని ప్రత్యేక సెలవుగా గుర్తించడం తదితర డిమాండ్ల సాధనకు ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలోఉన్న సీమాంధ్ర ఉ ద్యోగులందరినీ వెంటనే బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. టీఎన్జీవో రాష్ట్ర కార్యవర్గం.. అధ్యక్షుడిగా దేవీప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా కారం రవీందర్రెడ్డి, సహాధ్యక్షుడుగా ఎం.రాజేందర్ (మెదక్), ఉపాధ్యక్షులుగా ఎం.ఉపేందర్రెడ్డి, రేచల్, ఎం.జగదీశ్వర్, ఎస్.కె.హస్నుద్దీన్ (వరంగల్), ఆర్.విజయలక్ష్మి, ఈ.వెంకటేశ్వర్లు (వరంగల్), బి.బుచ్చిరెడ్డి, కార్యదర్శులుగా బి.శంకర్, టి.దయానంద్, ఎ.నారాయణరెడ్డి, ఎస్.వెంకటేశ్వర్లు, పి.సత్తెమ్మ, పి.లక్ష్మీనారాయణ, ఎం.హరిబాబు, విజేత, ఆర్.శైలజాదేవి, కోశాధికారిగా వేణుగోపాల్, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా ఆర్.శ్రీనివాసరావు, ఎస్.జీవన్రావు, ప్రచార కార్యదర్శిగా ఆర్.ప్రతాప్, కార్యవర్గ సభ్యులుగా సి.హెచ్.మనోహర, భవానీసింగ్, వి.సుధాకర్, బి.మల్లేష్, జె.నర్సింగరావు, అమృత్కుమార్, కె.యాదయ్య, బి.రాము, ఇ.కొండల్రెడ్డి ఎన్నికయ్యారు. ఈ కార్యవర్గాన్ని ఎన్నికల అధికారులు గురువారం అధికారికంగా ప్రకటించనున్నారు.