breaking news
non-core assets
-
రూ.3,000 కోట్ల నాన్-కోర్ ఆస్తులు విక్రయిస్తాం
ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతి భట్టాచార్య న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కీలకం కాని ఆస్తులను విక్రయించడం ద్వారా రూ.3,000 కోట్ల మేర నిధులు సమీకరించనున్నది. మొండి బకాయిలు బాగా పెరిగిపోవడంతో మూలధనం పెంచుకోవడానికి ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని ఎస్బీఐ 2015-16 వార్షిక నివేదిక వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలో పలు సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ, భవిష్యత్ షాక్లను తట్టుకునేలా, భవిష్యత్తులో వృద్ధి జోరు కొనసాగించడానికి తగిన మూలధన నిల్వలున్నాయని ఈ వార్షిక నివేదికలో బ్యాంక్ చైర్పర్సన్ అరుంధతి భట్టాచార్య భరోసానిచ్చారు. ఆర్థిక పరిస్థితులు సవ్యంగా లేకపోవడం, రెండేళ్ల కరువు, కమోడిటీ ధరలు తగ్గడం వంటి కారణాల వల్ల గత ఆర్థిక సంవత్సరంలో రుణ నాణ్యత ఒత్తిడులు మరింతగా పెరిగాయని పేర్కొన్నారు. త్వరలో ఎస్బీఐ సమగ్ర విలీన ప్రతిపాదన: భారత మహిళా బ్యాంకుతోపాటు ఐదు అనుబంధ బ్యాంకులను తనలో కలిపేసుకోవడానికి కేంద్ర కేబినెట్ అనుమతించిన నేపథ్యంలో ఎస్బీఐ తదుపరి ప్రక్రియపై కసరత్తు చేస్తోంది. మొత్తం ఆరు బ్యాంకులతోనూ చర్చలు చేపట్టింది. సమగ్ర విలీన ప్రణాళికను సిద్ధం చేసి రానున్న కొన్ని వారాల్లో తుది అనుమతి కోసం ప్రభుత్వానికి పంపనున్నట్టు బ్యాంకు అధికారి ఒకరు తెలిపారు. మొత్తం విలీన ప్రక్రియ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే పూర్తవుతుందని వెల్లడించారు. -
ఎస్బీఐ నిధుల వేట!
♦ అప్రాధాన్య ఆస్తుల విక్రయం, ♦ అనుబంధ విభాగాల లిస్టింగ్ సన్నాహాలు న్యూఢిల్లీ: తాజా మూలధన పెట్టుబడులు, అంతర్జాతీయ బ్యాంకింగ్ ప్రమాణాలకు సంబంధించి బాసెల్ 3 నిబంధనలను 2019 మార్చి నుంచి అమలుపై బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కీలక వ్యూహ రచన చేస్తోంది. వచ్చే మూడేళ్లలో అనుబంధ విభాగాలను మార్కెట్లో లిస్టింగ్ చేయడం, అప్రాధాన్య ఆస్తుల (నాన్-కోర్ అసెట్స్) విక్రయం వంటివి ఇందులో ఉన్నాయి. బ్యాంక్ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య ఇక్కడ అసోచామ్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఈ విషయాలను వెల్లడించారు. బాసెల్ 3 ప్రమాణాల ప్రకారం... బ్యాంకింగ్కు రూ.1.80 లక్షల కోట్లు అవసరం. ఇందులో రూ.70,000 కోట్లు మాత్రమే ప్రభుత్వం అందిస్తుంది. ఈ నేపథ్యంలో తనకు కావల్సిన మొత్తాలకు సంబంధించి ఎస్బీఐ దారులు వెతుకుతున్నట్లు బట్టాచార్య సంకేతాలు ఇచ్చారు. ముఖ్యాంశాలు చూస్తే... ప్రభుత్వం అందించగా... మిగిలిన మొత్తాలను బ్యాంకులే సమకూర్చుకోవాల్సి ఉంటుంది. లాభాలు, నాన్-కోర్ అసెట్స్ విక్రయాలు ఇందుకు ఒక మార్గం. ఎస్బీఐని తీసుకుంటే నగదుగా మార్చుకోడానికి పలు నాన్-కోర్ అసెట్స్ ఉన్నాయి. అలాగే విజయవంతంగా కార్యకలాపాలు నిర్వహిస్తూ... లిస్టెడ్ కాని అనుబంధ విభాగాలూ ఉన్నాయి. కనుక ఇందుకు సంబంధించి లిస్టింగ్, విక్రయ అంశాలపై బ్యాంక్ దృష్టి పెడుతుంది. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఎస్బీఐ జనరల్ వంటి బీమా వెంచర్లలో 10 శాతం, 23 శాతం చొప్పున తన వాటాల తగ్గింపునకు ప్రణాళికలను ఇప్పటికే బ్యాంక్ ప్రకటించింది. మా తరహాలోనే పలు బ్యాంకులూ మూలధన సమీకరణలకు తమతమ వ్యూహాలను రూపొందించుకుంటున్నాయి. బ్యాంకుల నికర వడ్డీ మార్జిన్లు అధికంగా ఉన్నాయనడంలో నిజం లేదు. డిపాజిట్ రేట్లు ద్రవ్యోల్బణానికి తగిన విధంగా ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో రుణ రేటు తగ్గింపు కష్టం.