చిరంజీవి ఇంటికి నోటీసులు!
న్యూఢిల్లీః యూపీఏ-2 ప్రభుత్వంలో కేంద్ర టూరిజం శాఖ మంత్రిగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి తన అధికారిక నివాసాన్ని తక్షణం ఖాళీచేయాలని ఎస్టేట్ డెరైక్టరేట్ అధికారులు అక్బర్ రోడ్డులోని 17వ నెంబరు ఇంటికి నోటీసులు అంటించారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న చిరంజీవి ఇదే నివాసంలో కొనసాగాలని భావించినప్పటికీ, మంత్రులకు కేటాయించాల్సిన ఈ క్వార్టర్ను ఎంపీకి కేటాయించలేమని అధికారులు తేల్చిచెప్పారు.
జూన్ 27వ తేదీ నాటికే గడువు ముగిసిందని గతంలోనే అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇప్పటికీ ఖాళీ చేయకపోవడంతో తక్షణం ఖాళీ చేయాలంటూ ఆ ఇంటికి నోటీసులు అంటించారు.
**