-
రష్యా నుంచి తక్షణమే వచ్చేయండి
వాషింగ్టన్: రష్యాలో ఉంటున్న, అక్కడికి ప్రయాణం చేస్తున్న తమ పౌరులు తక్షణమే వెనక్కి వచ్చేయాలని అమెరికా కోరింది. ఉక్రెయిన్తో యుద్ధం నేపథ్యంలో రష్యా అకారణంగా అమెరికా పౌరులను అరెస్ట్ చేసి వేధించే ప్రమాదముందని హెచ్చరించింది. ‘రష్యా భద్రతా సంస్థలు అమెరికా పౌరులపై నిరాధార ఆరోపణలు చేసి, నిర్బంధంలో ఉంచుతున్నాయి. వారికి న్యాయసాయం, అవసరమైన వైద్య చికిత్సలను సైతం అందకుండా చేస్తున్నాయి. రహస్య విచారణలు జరుపుతూ, ఎటువంటి రుజువులు లేకుండా దోషులుగా ప్రకటిస్తున్నాయి. మత ప్రచారకులైన అమెరికా పౌరులపై సైతం గూఢచర్యం కేసులను మోపి, విచారణల పేరుతో వేధిస్తున్నాయి’అని అందులో పేర్కొంది. సైన్యంలోకి రిక్రూట్మెంట్లను ప్రారంభించాలన్న రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉత్తర్వుల నేపథ్యంలో గత ఏడాది సెప్టెంబర్లో అమెరికా తమ పౌరులకు ఇదే విధమైన హెచ్చరికలు చేసింది. -
గాలిలో వైద్యం
సాక్షి, కడప: జిల్లాలో ప్రస్తుతం వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల విరేచనాలతో పాటు జ్వరాలు కూడా విజృంభిస్తున్నాయి. ముఖ్యంగా విషజ్వరాల తీవ్రత అధికంగా ఉంది. ఈ సీజన్లో 237 విషజ్వరాలు, 281 టైఫాయిడ్ కేసులు అధికారికంగా నమోదయ్యాయి. వాస్తవానికి ఈసంఖ్య వేలల్లోనే ఉంది. మొత్తం బాధితుల్లో అధిక శాతం మంది ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. జిల్లాలో 72 పీహెచ్సీలు, 6 ఏరియా ఆస్పత్రులు ఉన్నాయి. 600కుపైగా ప్రైవేటు క్లీనిక్లు ఉన్నాయి. ప్రైవేటు క్లీనిక్లలో రోగులు ఉదయం, సాయంత్రం వేళల్లో భారీ సంఖ్యలో క్యూలో ఉంటున్నారు. ఈ ఏడాది విషజ్వరాలతో ఇద్దరు ప్రాణాలు వదిలినా వైద్య, ఆరోగ్యశాఖ స్పందించడం లేదు. వాస్తవ పరిస్థితి ఇది: జిల్లా వ్యాప్తంగా 24 గంటలూ పనిచేసే ఆస్పత్రులు 34 ఉన్నాయి. పీహెచ్సీల్లో ఉదయం 9-12, మధ్యాహ్నం 2-4 గంటల వరకూ ఓపీ నిర్వహించాలి. అయితే చాలా ఆస్పత్రుల్లో 12 గంటలకే డాక్టర్లు ఓపీ పూర్తి చేసి ఇంటిబాట పడుతున్నారు. పైగా వీరంతా పది తర్వాత ఆస్పత్రులకు వస్తున్నారు. అంటే కేవలం 2గంటలు మాత్రమే విధులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అతి తక్కువ మంది చిత్తశుద్ధిగా విధులు నిర్వహిస్తున్నారు. వీరితో పాటు రోగాలతో అల్లాడుతున్న పల్లెలకు వెళ్లాల్సిన ఏఎన్ఎంలు ఉదయం అలా వెళ్లడం, మధ్యాహ్నం లోపు ఇంటికి వెళుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. సాయంత్రం 4గంటల వరకూ 85 శాతం మంది ఏఎన్ఎంలు ఉండటం లేదని తెలుస్తోంది. పీహెచ్సీలు ఎలా ఉన్నాయంటే: ఉదయం ఆస్పత్రికి వచ్చే రోగులకు సరైన వైద్యపరీక్షలు అందడం లేదు. డాక్టరు రక్తపరీక్షలు రాసిస్తే కచ్చితంగా ప్రైవేటు ల్యాబ్లను ఆశ్రయించాల్సిన పరిస్థితి. పీహెచ్సీలలో సుమారు 15 రకాల పరీక్షలు నిర్వహించాలి. అయితే రక్త, మూత్ర పరీక్ష, మలేరియా లాంటి పరీక్షలు మినహా తక్కిన వాటికి ప్రైవేటుల్యాబ్లకు వెళ్లాల్సిందే! ఇదేంటని ఆరాతీస్తే పూర్తిస్థాయిలో పరీక్షలు చేసేందుకు అవసరమైన కిట్లు లేవని ల్యాబ్అసిస్టెంట్లు చెబుతున్నారు. వీటిని ప్రభుత్వం సరఫరా చేయడం లేదు. నిత్యం వందలాది మంది రోగులు వచ్చే ఆస్పత్రుల్లోని ల్యాబ్లలో షుగర్,హెచ్ఐవీ, పచ్చకామెర్లు, వీడీఆర్ఎల్, వైడల్(టైఫాయిడ్) లాంటి పరీక్షలు చేయడం లేదు. దీంతో రోగులు ప్రైవేటు ఆస్పత్రులను వెళుతున్నారు. ఆస్పత్రికి రోగులు వెళితే ర క్తపరీక్షలు చేయించుకురావాలని చెబుతున్నారు. లేదంటే మందులు ఇవ్వడం, పీహెచ్సీల్లో లేకుంటే రాయించి పంపడం చేస్తున్నారు. అధికశాతం పీహెచ్సీల్లో స్టాఫ్నర్సులే వీటిని చూస్తున్నారు. మధ్యాహ్నం తర్వాత రోగులు ఆస్పత్రికి వస్తే డాక్టర్లు ఉండని పరిస్థితి నెలకొంది. నిధులు ఉన్నా ఫలితం లేదు: పీహెచ్సీల నిర్వహణకు లక్ష, మందులు ఇతర వాటికి 75వేలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తోంది. వీటితో పరీక్షలకు అవసరమైన కి ట్లు కొనుగోలు చేయాలి. ఈ కిట్ల ధర ఎక్కువగా ఉండటం, ఇచ్చే నిధులు తక్కువగా ఉండటంతో కొనుగోలు చేయడం లేదు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఐవోసీ లాభం సగానికి డౌన్
సిగ్గూ ఎగ్గూ లేని తెంపరితనం
సెల్ఫ్–మేడ్ మ్యూజిక్ స్టార్స్
మే డే స్ఫూర్తిని కాపాడుకోవాలి!
ధర పెరిగినా బంగారమే
PrajwalRevannavideo: త్వరలో భారత్కు ప్రజ్వల్ రేవణ్ణ..?
కాంగ్రెస్ ప్రేమ దుకాణాల్లో ఫేక్ వీడియోలు
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!
పార్టీ నుంచి ప్రజ్వల్ సస్పెండ్
‘ఆల్ ఫ్రీ బాబు’ పునరాగమనం
తప్పక చదవండి
- హీరో నవీన్ చంద్రకు ప్రతిష్టాత్మక పురస్కారం
- నా కుమారుడు వరల్డ్కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
- సుల్తాన్పూర్ లోక్సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
- జనసేన నేతలకు అవమానం.. టీడీపీ ప్రచార రథంపై నుంచి గెంటేసి..
- ప్రపంచంలోనే అత్యంత ధనిక ఖైదీ..!
- సీఐ, ఎస్ఐ వేధిస్తున్నారు.. సూసైడ్ లేఖ రాసి..
- బీజేపీలో చేరిన నటి రూపాలీ గంగూలీ
- షుగర్ పేషెంట్స్ పళ్లు తినకూడదా? తింటే ఏవి తినాలి?
- పవన్ కల్యాణ్కి షాక్.. సినిమా నుంచి స్టార్ డైరెక్టర్ తప్పుకొన్నాడా?
- ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఓటరుకు నిరాశే
Advertisement