breaking news
No electricity
-
ఎనర్జిటిక్ ఉమెన్
ఉత్తర్ప్రదేశ్లోని మల్లిఖేడ గ్రామం. కరెంట్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని గ్రామాలలో ఇదొకటి. చాలామంది ప్రత్యామ్నాయ ఇంధన వనరుగా డీజిల్ను ఎంచుకునేవారు. అయితే అది చాలా ఖరీదైన వ్యవహారం. ఆమె పేరు సుమన్. భర్త చిన్నపాటి ఉద్యోగమేదో చేస్తాడు. తక్కువ ఆదాయం కారణంగా, కుటుంబాన్ని పోషించడానికి ఒక చిన్నపాటి షాపు నిర్వహిస్తోంది సుమన్. డిజిటల్ బ్యాంకింగ్ లావాదేవీలు, ప్రింటింగ్, ఫొటో కాపీయింగ్, ఆధార్ అనుసంధాన సేవలను అందిస్తోంది. కరెంట్ సమస్య...నెత్తి మీద కత్తి!కరెంట్ సమస్య వల్ల ఆమె షాప్ సరిగ్గా నడిచేది కాదు. రోజూ ఎంతోమంది కస్టమర్లు వచ్చినా, కరెంట్ లేకపోవడంతో వెనక్కి తిరిగి వెళ్లేవారు. అలాంటి రోజుల్లో ఒకరోజు...ఊళ్లో జరిగిన గ్రామసభలో పాల్గొంది సుమన్. ఆ సభలో కరెంట్ కష్టాలను ఏకరువు పెట్టింది. ‘సోలార్ ప్యానళ్లు ఏర్పాటు చేసుకుంటే మీకు ఏ సమస్యా ఉండదు’ అని సూచించారు అధికారులు.స్వయం సహాయక బృందాల నెట్వర్క్ ద్వారా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న తరువాత 1 కిలోవాట్ రూఫ్టాప్ సోలార్ సిస్టమ్ను ఏర్పాటు చేసుకోవడానికి బ్యాంకు లోన్ కోసం దరఖాస్తు చేసుకుంది. అలా సోలార్ సిస్టమ్కు చేరువైంది. ఇప్పుడు ఆమెకు ఎలాంటి కరెంట్ కష్టాలు లేవు. సుమన్కు నెలవారీ ఆదాయం పెరిగింది. ఎలక్ట్రిసిటీ బిల్ భయపెట్టడం లేదు. ఎంతో కొంత డబ్బు పొదుపు చేయగలుగుతోంది.త్రిబుల్ ఫ్రేమ్వర్క్భారతదేశ ఇంధనరంగంలో మహిళల భాగస్వామ్యం 22 శాతమే. అయినప్పటికీ పునరుత్పాదక ఇంధన రంగానికి సంబంధించి ఆశాజనకమైన పరిస్థితి కనిపిస్తోంది. సౌర, పవన ఇంధనంతో పాటు ఇతర ఇంధనాలకు సంబంధించి సాంకేతిక కార్యక్రమాలకు మహిళలు నాయకత్వం వహిస్తున్నారు.‘మన దేశంలో పునరుత్పాదక శక్తి ఇంజినీరింగ్కు సంబంధించి ప్రత్యేక డిగ్రీ కోర్సు లేదు. మనం పూరించాల్సిన లోటు ఇది’ అంటున్నారు లూమినస్ పవర్ టెక్నాలజీ ఎండీ ప్రీతీ బజాజ్.‘మహిళలకు ఇంధనరంగం గురించి అవగాహన కలిగించాలి. ఈ రంగంలో ఉండే అద్భుతమైన కెరీర్ అవకాశాలను గురించి వివరంగా తెలియజేయాలి’ అంటారు హీరో ఫ్యూచర్ ఎనర్జీస్లో సీఎస్ఆర్ విభాగ అధిపతి భావన కృపాల్. ఇంధన రంగంలో మహిళలను ప్రోత్సహించడానికి 3 ఉ ఫ్రేమ్వర్క్ గురించి చెబుతున్నారు ప్రీతి బజాజ్.ఫస్ట్ E–ఎంకరేజర్స్ ( ప్రోత్సాహకులు)నాయకత్వ స్థానాల్లోకి మహిళలు అడుగు పెట్టడానికి ప్రేరేపించే, ప్రోత్సహించే వ్యక్తులు.సెకండ్ E – ఎన్రిచర్స్ (సుసంపన్నం, సారవంతం చేయడం) మహిళల ప్రతిభను గుర్తించి వారి కెరీర్ పురోగతికి మార్గాలు చూపించే సీనియర్లు.థర్డ్ E – ఎంగేజర్స్ (నిమగ్నపరిచేవారు)తమకు ఉన్న విశ్వసనీయతను, ఇన్ఫ్లూయెన్స్ను ఉపయోగించి మహిళలకు మార్గనిర్దేశకత్వం చేస్తూ, వారికి అండగా ఉంటూ, ఉన్నతస్థానాలకు చేర్చడంలో తోడ్పడేవారు.ప్రత్యామ్నాయాల దారిలో...దశాబ్దాల కాలం నుంచి మన ఇంటి వంటకు ఎల్పీజీ వెన్నెముకగా ఉంది. అయితే పెరుగుతున్న ధరలు, సరఫరాకు సంబంధించిన సమస్యలు, పర్యావరణ అవగాహన కారణంగా చాలామంది గృహిణులు ఎల్పీజీకి ప్రత్యామ్నాయాలు అన్వేషించడం ప్రారంభించారు. ఎల్పీజీపై ఆధారపడడాన్ని తగ్గించగల ప్రత్యామ్నాయాల వైపు దృష్టి సారించారు.గృహిణులకు అత్యంత సులభంగా అందుబాటులో ఉండే ప్రత్యామ్నాయాలలో ఎలక్ట్రిక్ ఇండక్షన్ కుక్టాప్ ఒకటి. ఇండక్షన్ స్టవ్లు విద్యుదయస్కాంత శక్తిని ఉపయోగించి పాత్రలను నేరుగా వేడి చేస్తాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేని పట్టణాలలో ఇవి బాగా ఉపయోగపడుతున్నాయి.మోడ్రన్ ఇండక్షన్ కుక్టాప్లు భారతీయ వంటకాల కోసం ముందుగా సెట్ చేసిన మెనూలతో వస్తున్నాయి. దీని వల్ల సాంకేతిక పరిజ్ఞానం అంతగా లేని వారికి కూడా వీటిని ఉపయోగించడం సులభం అవుతుంది. అమెరికా– ఇరాన్ యుద్ధ నేపథ్యంలో పల్లె, పట్టణం అని తేడా లేకుండా ఎల్పీజీకి ప్రత్యామ్నాయంగా ఆధునిక, పురాతన సంప్రదాయ పద్ధతులను ప్రజలు అనుసరించారు.అవసరంలో ఉన్నప్పుడు ఆవిష్కరణ పుడుతుంది అంటారు. నిన్నామొన్నటి ఎల్పీజీ సిలిండర్ల సంక్షోభం నేపథ్యంలో ఆ మాట మరోసారి గుర్తుకు వస్తుంది. యుద్ధం రెండు దేశాల మధ్య జరిగిందా? రెండు దేశాలు కలిసి సామాన్యులపై చేశాయా? అనేది అంతుచిక్కని జవాబు. యుద్ధం వల్ల ఎల్పీజీ సంక్షోభం ఒక కోణం అయితే, ప్రత్యామ్నాయ ఇంధన వనరులు వెదుక్కోవడం, పాత పద్ధతుల్లోకి తిరిగి వెళ్లడం మరో కోణం. ప్రత్నామ్నాయ ఇంధన వనరుల విషయంలో మహిళలు ముందున్నారు. ఎనర్జిటిక్గా ముందుకు వెళుతున్నారు.. -
కాంగ్రెస్ పాలనలో కరెంటు కోతల వల్లే జనాభా పెరిగింది
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ సౌకర్యం లేనందునే, దేశంలో జనాభా పెరిగిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వ్యాఖ్యానించారు. కర్ణాటకలో గురువారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. ‘అధికారంలోకి వస్తే ఉచితంగా కరెంటు ఇస్తామని కాంగ్రెస్ ఇప్పుడు హామీ ఇస్తోంది కానీ, గతంలో ఆ పార్టీ ప్రభుత్వ హయాంలో కరెంటు సరఫరా సరిగా చేయలేకపోయింది, గ్రామాల్లో అస్సలే కరెంటు లేదు. ఫలితంగా జనాభా పెరిగిపోయింది’అని అన్నారు. ప్రధాని మోదీ హయాంలో 24 గంటలూ విద్యుత్ ఉంటోందని చెప్పారు. -
ఆ వంతెన మొత్తం అంధకారం
సాక్షి, బండిఆత్మకూరు(కర్నూలు) : మండల కేంద్రమైన బండిఆత్మకూరు బస్టాండ్ నుంచి గ్రామంలోకి వెళ్లే వంతెనపై అంధకారం అలుముకుంది. కొన్ని రోజులుగా వీధిదీపాలు వెలగక పోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. దీంతో రాత్రి సమయాల్లో వంతెనపై ప్రయాణించడానికి గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. ప్రమాదవశాత్తు బైకు అదుపు తప్పితే వంతెనపై నుంచి కిందికి పడితే ప్రాణాపాయం తప్పదని, అధికారులు స్పందించి విద్యుత్ దీపాలు వెలిగేలా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
దేశమంతా చీకటి.. ఇంటర్నెట్ కట్..
డమాస్కస్: తరచుగా ఉగ్రదాడులతో సతమతమయ్యే సిరియా తాజాగా మరో సమస్యను ఎదుర్కొంటుంది. ఆ దేశం గురువారం నాడు అంధకారంలో ఉండి పోయిందట. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయి ప్రజలు చాలా ఇబ్బందిపడ్డారని ఓ అధికారిక ప్రకటనలో ఈ వివరాలను అధికారులు వెల్లడించారు. అన్ని గవర్నరేట్లలోనూ పవర్ కట్స్ ఉన్నాయని, ఇంటర్నెట్ సేవలు తాత్కాలికంగా రద్దయ్యాయని వివరించారు. విద్యుత్ శాఖ అధికారులు పవర్ కట్ కారణాలు కనుక్కొవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇది ఎవరైనా కావాలని ప్లాన్ ప్రకారం చేశారా.. లేక సాంకేతిక కారణాల వల్ల ఈ సమస్యలు తలెత్తాయా అనే కోణాల్లో అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. -
ఫ్రీ కరెంట్ అంటే నో కరెంట్ : వెంకయ్యనాయుడు
హైదరాబాద్: ''నా ఉద్దేశంలో ఫ్రీ కరెంట్ అంటే నో కరెంట్'' అని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. రైతులకు కావాల్సింది రుణమాఫీ కాదు, గిట్టుబాటు ధర అని ఆయన చెప్పారు. త్వరలో వ్యవసాయ ఆదాయ బీమా పథకం ప్రవేశపెట్టనున్నట్లు ఆయన చెప్పారు. దిగుమతులు తగ్గి ఉత్పత్తి పెరిగినప్పుడే ఆహార భద్రత సాధ్యమవుతుందని వెంకయ్యనాయుడు అన్నారు. ** -
అంధకారంలో జోగిపేట
జోగిపేట, న్యూస్లైన్: గ్రామ పంచాయతీగా ఉన్న కాలం నాటి నుంచి ట్రాన్స్కో బిల్లులు చెల్లించకపోవడంతో ప్రస్తుతం అవి రూ.2.50 కోట్లు మేర పేరుకుపోయాయి. గతంలోనే ట్రాన్స్కో అధికారులు సరఫరా నిలిపివేసేందుకు సిద్ధమైనా, డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ కలుగజేసుకుని సర్దిచెప్పడంతో ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. ప్రస్తుతం జోగిపేట లోని వీధి దీపాలకు సంబంధించి నగర పంచాయతీ రూ.1.21 కోట్లు, పట్టణానికి సరఫరా చేసే తాగునీటి బోరుమోటార్ల బిల్లులకు సంబంధించి రూ.1.24 కోట్లు బకాయి ఉంది. ప్రతినెల తాగునీటి బోరుమోటార్, వీధి దీపాలకుగాను రూ.15 లక్షల వరకు బిల్లులు వస్తున్నాయి. చాలా కాలంగా సర్కార్ నుంచి నిధులు రాకపోవడంతో నగర పంచాయతీ అధికారులు ఈ బిల్లులు చెల్లిం చడం లేదు. దీంతో తాజాగా ట్రాన్స్కో అధికారులు జోగిపేట, అందోల్ పట్టణాల్లో ఉన్న 32 బ టర్ఫ్లయి లైట్లకు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో రెండు పట్టణాల్లోనూ అంధకారం అలముకుంది. రూ. 30 లక్షలు చెల్లిస్తేనే సరఫరా ప్రస్తుతం నగర పంచాయితీ బకాయి పడి ఉన్న బకాయి బిల్లులో రూ.30 లక్షలు చెల్లిస్తే సరఫరా పునరుద్ధరిస్తాం. ఈ విషయం ఏపీసీపీడీసీఎల్ ఎస్ఈ దృష్టిలో కూడా ఉంది. నగర పంచాయతీ అధికారులు బిల్లు చెల్లింపు వ్యవహారంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. అందువల్లే సరఫరా నిలిపివేశాం. - విజయ్కుమార్, ట్రాన్స్కో డీఈ పంచాయతీ కాలం నాటి బిల్లులవి ప్రస్తుతం ట్రాన్స్కో చెల్లించాల్సిన బకాయిలో ఎక్కువ మొత్తం గ్రామ పంచాయతీ కాలం నాటిది. అప్పటి బకాయి చెల్లించమంటే మాకేం సంబంధం. అయినప్పటికీ రూ.5 లక్షలు సోమవారం చెల్లించేందుకు ఏర్పాట్లు చేశాను. 15 రోజుల్లో ప్రభుత్వం నుంచి నిధులు రాగానే బకాయి చెల్లిస్తాను. -జి.విజయలక్ష్మి, కమిషనర్, జోగిపేట పంచాయతీ


