breaking news
no business
-
భారత్తో వాణిజ్యం ఇప్పట్లో లేనట్టే
ఇస్లామాబాద్: ప్రస్తుత పరిస్థితుల్లో భారత్తో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించలేమని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చెప్పారు. భారత్ నుంచి పత్తి, చక్కెర దిగుమతులు చేసుకోవాలంటూ ఎకనామిక్ కోఆర్డినేషన్ కమిటీ(ఈసీసీ) చేసిన సిఫారసుల అమలును వాయిదా వేశారు. కేబినెట్ సహచరులతో చర్చించాక ఇమ్రాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు డాన్ పత్రిక తెలిపింది. భారత్తో ఇప్పట్లో వాణిజ్య సంబంధాలు పెట్టుకోవడం కుదరదని వాణిజ్య శాఖకు, ఆర్థిక బృందానికి ఇమ్రాన్ తెలిపారు. దుస్తులు, చక్కెరను తక్కువ ధరకి దిగుమతి చేసుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను చూడాలన్నారు. పాక్ ఆర్థిక, వాణిజ్య రంగాలను బలోపేతం చేయడానికి కసరత్తు చేస్తున్న ఈసీసీ కొన్ని వేల ప్రతిపాదనలు పరిశీలించాక భారత్ నుంచి పత్తి, దుస్తులు, చక్కెర దిగుమతి చేసుకోవాలంటూ సిఫారసులు చేసింది. ఆ సిఫారసుల్ని ఆమోదించడానికి కేబినెట్కు పంపింది. అయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో అది సాధ్యం కాదంటూ పాకిస్తాన్ కేబినెట్ ఆ సిఫారసుల్ని తోసిపుచ్చింది. జమ్మూకశ్మీర్ స్వతంత్రప్రతిపత్తిని నిర్వీర్యం చేస్తూ 2019లో భారత్ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ఆ దేశంతో ఏ రకమైన సంబంధాలు పునరుద్ధరించబోమని పాక్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషి చెప్పారు. మరోవైపు భారత్ కూడా అంతే గట్టిగా పాక్కు వార్నింగ్లు ఇచ్చింది. పాక్ భూభాగం నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉగ్ర సంస్థల్ని కట్టడి చేసే వరకు తాము కూడా ఎలాంటి బంధాల్ని కొనసాగించమని భారత్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. గత ఏడాది కరోనా సంక్షోభం సమయంలో భారత్ నుంచి దిగుమతయ్యే మందులు, వాటి తయారీలో ఉపయోగించే ముడి పదార్థాలపై ఉన్న ఆంక్షల్ని పాక్ ఎత్తేసింది. -
దసరదా లేదు
సంక్రాంతి, వేసవి, దసరా, దీపావళి వంటివి ఇండస్ట్రీకు చాలా ఇష్టమైన సీజన్లు. ఈ సమయంలో థియేటర్స్ నిండుగా ఉంటాయి. సినిమా ఆడితే లాభాలు మెండుగా ఉంటాయి. పండగలే ఫ్యామిలీలను థియేటర్స్కు కదిలిస్తాయి. అయితే ఈ ఏడాది కోవిడ్ వల్ల సమ్మర్ పోయింది. చాలా గ్యాప్ తర్వాత ఇటీవలే థియేటర్స్ తెరిచారు. కానీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులు థియేటర్స్లో లేరు. దసరాకి కూడా థియేటర్స్ బిజినెస్కు సందడి లేనట్టే. కొత్త సినిమాలేవి? థియేటర్స్కి ప్రేక్షకులు రావాలంటే కొత్త సినిమా ఉండాలి. ప్రేక్షకులు థియేటర్స్కు వస్తున్నట్టు అనిపిస్తేనే కొత్త సినిమా విడుదల చేయగలం అన్నట్లుంది ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ పరిస్థితి. పాత సినిమాలను ప్రదర్శిస్తూ థియేటర్స్ను నడిపిస్తున్నారు. అయితే వస్తున్న ప్రేక్షకుల సంఖ్య వేళ్ల మీద లెక్కెట్టొచ్చు. సాధారణ పరిస్థితుల్లో అయితే ఈజీగా మూడు కొత్త రిలీజ్లు ఉండే సీజన్ దసరా. ఈసారి ఒక్కటీ లేదు. కొత్త సినిమాలు ఎప్పుడు విడుదలకు సిద్ధం అవుతాయో అర్థం కాని పరిస్థితి. సినిమాలన్నీ సంక్రాంతికి సిద్ధం చేసే పనిలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. డిజిటల్ దసరా థియేటర్స్ పరిస్థితి అగమ్యగోచరంగా ఉన్న నేపథ్యంలో ఓటీటీకి బాగా డిమాండ్ పెరిగిన సంగతి తెలిసిందే. థియేటర్స్ ప్రారంభించినప్పటికీ ఓటీటీలో కొత్త సినిమాలు, సిరీస్లు, షోలు విరివిగా విడుదలవుతున్నాయి. బాలకృష్ణ దర్శకత్వంలో ‘నర్తనశాల’ అనే చిత్రం అప్పట్లో ప్రారంభం అయింది. అనుకోని కారణాల వల్ల ఆ సినిమా పూర్తికాలేదు. సౌందర్య, శ్రీహరి ముఖ్య పాత్రల్లో నటించారు. అయితే చిత్రీకరించిన కొంత భాగాన్ని ఓటీటీలో విడుదల చేయాలని నిశ్చయించుకున్నారు. సుహాస్, చాందినీ చౌదరి ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన ప్రేమకథా చిత్రం ‘కలర్ ఫోటో’ ఆహాలో విడుదలయింది. సూపర్హిట్ సిరీస్ ‘మిర్జాపూర్’కి సీక్వెల్గా ‘మిర్జాపూర్ 2’ తాజాగా అమేజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతోంది. టబు, ఇషాన్ కట్టర్ ముఖ్య పాత్రల్లో నటించిన ‘ఎ సూటబుల్ బాయ్’ సిరీస్ నెట్ఫ్లిక్స్లో అందుబాటులోకి వచ్చింది. ఇలా సినిమాలు, సిరీస్లతో డిజిటల్లో దసరా సందడి కనబడుతోంది. సందడి మళ్లీ సంక్రాంతికేనా? దీపావళి, క్రిస్మస్ సీజన్లోనూ కొత్త సినిమాలు విడుదలవుతున్నట్టు అధికారిక ప్రకటన అయితే రాలేదు. ఆల్రెడీ రానా నటించిన ‘అరణ్య’ సినిమాను సంక్రాంతికి తీసుకొస్తున్నట్టు ప్రకటించారు. అలాగే అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ తదితర చిత్రాలు కూడా పండగకి రానున్నాయి. మరి.. కొత్త సినిమాలతో సంక్రాంతికైనా థియేటర్లు కళకళాలాడతాయా? చూడాలి. -
బజారు బేజారు
ధరల మెట్టు దిగిన అపరాలు హాయిగా కొనుక్కెళ్లండని ఆఫర్ ఇస్తున్నాయి. ఉల్లి, కూరగాయలు బెట్టు వీడాయి. ‘రండిబాబూ.. రండి. ధరలు తక్కువండీ’ అని బిగ్గరగా పిలుస్తున్నాయి. అయినా.. వాటివైపు జనం కన్నెత్తి చూడటం లేదు. కొనేవారు లేక చేపలు, పీతలు, ఎండు చేపల వంటివి డీలా పడ్డాయి. పెద్దనోట్ల దెబ్బకు మార్కెట్లు విలవిల్లాడుతున్నాయి. జన జాతరను తలపించే సంతలు వెలవెలబోతున్నాయి. జిల్లాలో ఎక్కడ చూసినా ఇవే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏ వ్యాపారిని కదిపినా నిట్టూర్పులే వినిపిస్తున్నాయి. తాడేపల్లిగూడెం : కొనుగోలుదారులు రాక జిల్లాలోని అన్ని మార్కెట్లు కళ తప్పాయి. పెద్దనోట్ల రద్దు, చిన్న నోట్ల కొరత కారణంగా వ్యాపార లావాదేవీలు స్తంభించిపోయాయి. ఉదయం నుంచి రాత్రి వరకు జనంతో కిటకిటలాడే సంతలు, రైతు బజార్లు వెలవెలబోతున్నాయి. ఆదివారం సంత, అపరాల మార్కెట్లలో వ్యాపారులు తప్ప కొనేవాళ్లు కనిపించలేదు. ధరలు దిగొచ్చినా చేతిలో తగినన్ని చిల్లర నోట్లు లేక కొనుగోలుదారులు వాటివైపు కన్నెత్తి చూడటం లేదు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ధరలు అమాంతం పెరిగిపోతాయని మార్కెట్ వర్గాలు భావిం చగా.. కొనేవారు లేక దిగొచ్చాయి. తమ వద్ద ఉన్న సరుకును తక్కువ ధరకే ఇచ్చి కనీసం పెట్టుబడులైనా దక్కించుకుందామనుకుంటే కొనుగోళ్లు పడిపోయాయని వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో అపరాలు, కూరగాయల మార్కెట్లలో రోజుకు రూ.30 కోట్లకు పైగా నష్టం వాటిల్లుతున్నట్టు అంచనా. ప్రధాన వాణిజ్య కేంద్రంలోనూ ఇలా జిల్లాలో హోల్సేల్ వ్యాపారానికి కేంద్రంగా ఉన్న తాడేపల్లిగూడెం మార్కెట్లో పరిస్థితి దయనీయంగా మారింది. ఇక్కడి మార్కెట్కు ఆదివారం కర్నూలు నుంచి 70 లారీల కొత్త ఉల్లిపాయలు వచ్చాయి. మహారాష్ట్ర నుంచి 4 పాత ఉల్లిపాయల లారీలు వచ్చాయి. అమ్మకాలు లేకపోవడంతో ఎక్కడి సరుకు అక్కడే నిలిచిపోయింది. గడచిన వారం దేశంలోని ఉల్లి మార్కెట్లకు సెలవు ప్రకటించడంతో తెలంగాణ, కృష్ణా జిల్లా వ్యాపారులు ఇక్కడి మార్కెట్కు క్యూ కట్టారు. దాంతో ధరలు కొంతమేర పెరిగాయి. తాజా పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. ఈ ఆదివారం హోల్సేల్ మార్కెట్లో ఉల్లి అమ్మకాలు 40 శాతం పడిపోయాయి. గత వారం 70 లారీల ఉల్లి అమ్ముడుపోగా, ఈ వారం కేవలం 40 లారీల సరుకు మాత్రమే అమ్ముడైంది. ధరలు వారం రోజుల క్రితంతో పోలిస్తే తగ్గాయి. అపరాలదీ అదేదారి అపరాల విషయానికి వస్తే ఇక్కడి హోల్సేల్ మార్కెట్లో ఆదివారం కనీస స్థాయిలో అయినా అమ్మకాలు సాగలేదు. పప్పులు పాత సరుకు అయిపోయి.. కొత్తవి తెచ్చుకోవాల్సిన తరుణమిది. కానీ.. వాటిని మార్కెట్లకు తెచ్చుకునే పరిస్థితి లేకుండాపోయింది. రాజమండ్రి నుంచి మసాలా దినుసులు, మధ్యప్రదేశ్ నుంచి వెల్లుల్లి, మహారాష్ట్ర నుంచి కంది, ఇతర పప్పులు దిగుమతి చేసుకోవాల్సి ఉండగా.. ఒక్క బస్తా కూడా ఇక్కడి మార్కెట్లకు రాలేదు. అలాగని అపరాల దుకాణాల్లో ఉన్న పాత సరుకులు సైతం అమ్ముడుకావడం లేదు. పోనీ.. రద్దయిన నోట్లు తీసుకుని సరుకులు అమ్ముదామంటే దుకాణాల్లో ఉన్న నిల్వలు పట్టుమని పది రోజులుకైనా సరిపోవు. కొత్త సరుకు తెచ్చుకోలేక, మిగిలివున్న పాత సరుకు అమ్ముకోలేక వ్యాపారులు దుకాణాలకు తాళాలు వేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడి హోల్సేల్ మార్కెట్లో రోజుకు రూ.1.25 కోట్ల విలువైన అపరాలు అమ్ముడయ్యేవి. ప్రస్తుతం కనీసం రూ.25 లక్షల విలువైన సరుకు కూడా పోవడం లేదు. నూనెల మార్కెట్లో అమ్మకాలు 30 శాతానికి పైగా పడిపోయాయి. ఈ పరిస్థితుల్లో దుకాణాల నిర్వహణ ఖర్చులు, బ్యాంక్లకు ఓవర్ డ్రాఫ్ట్ చెల్లింపులు, సిబ్బంది జీతభత్యాలకు సొమ్మును ఎలా సర్దుబాటు చేసుకోవాలో తెలియక వ్యాపారులు అవస్థ పడుతున్నారు. టోకెన్లు తీసుకునే వారేరి చిల్లర కొరత తీర్చడానికి పౌర సరఫరాల శాఖ వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారా పెద్దనోట్లు తీసుకుని కూరగాయలు, అపరాలు కొనుగోలు చేసేందుకు వీలుగా టోకెన్లు ఇస్తోంది. వీటిని తీసుకునేవారు కనబడటం లేదు. కొందరు తీసుకున్నా సరుకులు కొనడానికి ఆసక్తి చూపడం లేదు. దీంతో కూరగాయలు, అపరాల కౌంటర్లు వెలవెలబోతున్నాయి. సంతలన్నీ నిర్మానుష్యం చిన్న నోట్లు లేకపోవడం.. కొత్తగా విడుదల చేసిన రూ.2 వేల నోటుకు సరిపడా చిల్లర నోట్లు వ్యాపారుల వద్ద లేకపోవడం సంతలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఉల్లిపాయల చిల్లర వర్తకులు వ్యాపారం సాగకపోవడంతో కొనుగోళ్లు నిలిపివేశారు. తాడేపల్లిగూడెం సంతలో ఆదివారం రూ.25 లక్షలకు పైగా వ్యాపారం జరగాల్సి ఉండగా, కనీసం రూ.10 లక్షల వ్యాపారమైనా సాగలేదు. సంతలో దుకాణాలు తెరిచింది మొదలు రాత్రివరకూ ఈగలు తోలుకుంటూ కూర్చోవాల్సి వచ్చిందని కూరగాయల వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు. ఇదిలావుంటే.. ఆదివారం రోజున జోరుగా సాగాల్సిన మాంసాహార విక్రయాలు కనీస స్థాయిలో కూడా జరగలేదు. ఓవైపు కార్తీక మాసం కారణంగా అమ్మకాలు సగానికి పడిపోగా.. పెద్దనోట్ల ప్రభావం వల్ల వాటివైపు ఎవరూ కన్నెత్తి చూడటం లేదు. ఉప్పు చేపల మార్కెట్లో రూ.25 లక్షల మేర అమ్మకాలు జరగాల్సి ఉండగా, కనీసం రూ.లక్ష విలువైన అమ్మకాలు కూడా నమోదు కాలేదు. చేపలు, రొయ్యలు, మాంసం పడిపోయింది. బెల్లం. రవ్వ, చింతపండు, ఎండుమిర్చి వ్యాపారాలపై కూడా పెద్దనోట్ల ప్రభావం భారీగా పడింది. అమ్మకాలు దాదాపుగా 40 శాతం పడిపోయాయి. కేజీ పంచదారకు రూ.2 వేల నోట ఇస్తున్నారు పెద్దనోట్ల రద్దు ప్రభావం అపరాల మార్కెట్పై తీవ్రంగా ఉంది. కిలో పంచదార కొని రూ.2 వేల నోటు ఇస్తున్నారు. చిల్లర ఇవ్వలేక బేరాలు వదులుకుంటున్నాం. మొహమాటానికి పోయి పాతనోట్లు తీసుకున్నా, వాటిని బ్యాంకులో వేసుకోవడం సమస్య. దుకాణాల నిర్వహణ కష్టంగా మారింది. పైనుంచి సరుకులు రావడం లేదు. నిల్వలు అయిపోతే దుకాణాలు మూసుకోవాల్సిందే. – ఎం.మోహనరెడ్డి, అపరాల గుత్త వ్యాపారి