breaking news
nfir
-
జూలై 11 నుంచి కేంద్ర ఉద్యోగుల సమ్మె
సాక్షి, న్యూఢిల్లీ: ఏడో వేతన సంఘం సిఫార్సులను సవరించాలన్న డిమాండ్తో జూలై 11 నుంచి 32 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు నిరవధిక సమ్మె చేస్తారని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేమెన్(ఎన్ఎఫ్ఐఆర్)ప్రధాన కార్యదర్శి ఎం. రాఘవయ్య తెలిపారు. సమ్మెకు జూన్ 9న నోటీసు ఇస్తామన్నారు. -
‘రైల్వే కార్మికులకూ ఓఆర్ఓపీ ఇవ్వాలి’
సాక్షి, న్యూఢిల్లీ: రైల్వే కార్మికులకు వన్ ర్యాంక్-వన్ పెన్షన్ వర్తింపుచేసేలా పథకాన్ని రూపొందించాలని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేమెన్ (ఎన్ఎఫ్ఐఆర్) కేంద్రాన్ని డిమాండ్ చేసింది. కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని కోరింది. ఈ రెండు డిమాండ్లపై ప్రధానికి మోదీకి లేఖను పంపింది. ఎన్ఎఫ్ఐఆర్ ప్రధాన కార్యదర్శి ఎం.రాఘవయ్య విలేకర్లతో మాట్లాడుతూ.. రైల్వే కార్మికులకు కూడా వన్ర్యాంక్-వన్ పెన్షన్ అమలు చేయాలన్నారు. రైల్వేలోని 13.2 లక్షల మంది రైల్వే కార్మికులు సైన్యం తరహాలోనే దేశ సేవ చేస్తున్నారని చెప్పారు.