breaking news
Newcastle University
-
ఆడ, మగ తేడాలకు.. తండ్రి తోబుట్టువులూ బాధ్యులే!
సాక్షి, హైదరాబాద్: పుట్టబోయే బిడ్డ ఆడా? మగ? అన్నది తండ్రి తోబుట్టువులపై ఆధారపడి ఉంటుం దని చెబుతోంది న్యూక్యాసల్ వర్సిటీ తాజా అధ్య యనం. దాదాపు వెయ్యి కుటుంబాల వివరాలను విశ్లేషించిన తరువాత తామీ అంచనాకు వచ్చామని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త కోరి గెలాట్లీ చెబుతున్నారు. ఈ పరిశోధన ప్రకారం తండ్రికి అన్నదమ్ములు ఎక్కువగా ఉంటే మగ సం తానం కలిగేందుకు, అక్కచెల్లెళ్లు ఎక్కువగా ఉంటే ఆడపిల్ల పుట్టే అవకాశం ఎక్కువ. ఈ పరిశోధన కోసం శాస్త్రవేత్తలు 1600 సంవత్సరం నుంచి అమె రికా, యూరప్లలో కొనసాగుతున్న 927 కుటుం బాలకు చెందిన 5.56 లక్షల మందిని పరిగణనలోకి తీసుకున్నారు. వారి వంశవృక్షాన్ని పరిశీలించినప్పు డు అన్నదమ్ములు ఎక్కువగా ఉన్న వారికి పురుష సంతానం, అక్కచెల్లెళ్లు ఎక్కువగా ఉన్నవారికి ఆడ పిల్లలు పుట్టే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తేలింది. అయితే ఆడపిల్లల విషయానికి వచ్చేసరికి సులు వుగా అంచనా వేయలేమని అధ్యయనం తెలిపింది. పురుషుల వీర్యంలోని క్రోమోజోమ్ ఎక్స్ మహిళ ల్లోని ఎక్స్ క్రోమోజోమ్తో జతకడితే అమ్మాయి ఎక్స్, వైలు తోడైతే అబ్బాయి పుడతారన్నది తెలిసిం దే. అయితే న్యూక్యాసల్ వర్సిటీ శాస్త్రవేత్తల అంచ నా ప్రకారం పురుషుడి వీర్యంలో ఏ క్రోమోజోమ్ ఉండాలన్నది ఇప్పటివరకూ గుర్తించని ఇంకో జన్యువు నిర్ణయిస్తుంది. ఈ జన్యువులో తల్లి, తండ్రి నుంచి అందిన 2 అల్లెల్లేలు ఉంటాయని, వీర్యంలో ఏ క్రోమోజోమ్ ఉండాలో ఇవి నిర్ణయిస్తాయని చెప్పారు. ఎం ఎం అల్లెల్లేలు ఉంటే వై క్రోమోజోమ్ ఎక్కువగా ఉండి అబ్బాయిలు పుట్టే అవకాశం ఎక్కువ అవుతుందని, ఎం అల్లెల్లేకు ఎఫ్ చేరితే ఎక్స్, వై క్రోమోజోమ్లు రెండూ సమానంగా ఉం టాయని తెలిపారు. ఇలాంటి వారికి అబ్బాయిలు, అమ్మాయిలు సమంగా ఉంటారు. ఒకవేళ అల్లెల్లేలు రెండూ ఎఫ్ఎఫ్లు అయితే వారిలో ఎక్స్ క్రోమోజో మ్లు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. ఫలితంగా ఆడపిల్ల పుట్టే అవకాశాలు ఎక్కువవుతాయి! -
ఆరే ఆరు సెకండ్లలో అంతా హ్యాక్!
-
ఆరే ఆరు సెకండ్లలో అంతా హ్యాక్!
హ్యాకింగ్.. హ్యాకింగ్... నెట్ లావాదేవీల్లో ఎక్కడ చూసినా ఇదే లొల్లి. ప్రపంచ ఆన్లైన్ వ్యవస్థను ఇది షేక్ చేసేస్తోంది. దేశాల ఆర్థిక వ్యవస్థలనే ఛిన్నాభిన్నం చేస్తోంది. ఇటీవలే దాదాపు 32 లక్షల బ్యాంక్ డెబిట్ కార్డులను హ్యాకర్లు తమ ఆధీనంలోకి తెచ్చుకుని దేశ బ్యాంకింగ్ వ్యవస్థకే సవాలు విసిరారు. అయితే ఇంత భీభత్సం సృష్టిస్తున్న హ్యాకర్లు.. మన ల్యాప్టాప్లను, ఇంటర్నెట్ కనెక్షన్తో కూడా వీసా క్రెడిట్, డెబిట్ కార్డులను వారి స్వాధీనంలోకి తెచ్చుకోవడానికి ఎంత సమయం వెచ్చిస్తున్నారో తెలిస్తే మాత్రం షాక్. కేవలం ఆరే ఆరు సెకండ్లలో యూజర్ల ల్యాప్టాప్లను, వీసా క్రెడిట్, డెబిట్ కార్డులను హ్యాక్ చేయగలరని ఓ రీసెర్చ్ సంస్థ వెల్లడించింది. ఈ రీసెర్చ్ రిపోర్టును ఐఈఈఎఫ్ సెక్యురిటీ అండ్ ప్రైవసీ ఓ జర్నల్లో ప్రచురించింది. పేమెంట్ కార్డు డేటా హ్యాకర్ల బారిన పడినట్టు ఏ నెట్వర్క్, ఏ బ్యాంకు వెంటనే గుర్తిచంలేదని ఈ జర్నల్ పేర్కొంది. గెస్సింగ్ అటాక్ ద్వారా కేవలం ఆరు సెకన్లలో యూజర్ల కార్డు నెంబర్, గడువు తుది తేదీ, సీవీవీ వివరాలను స్వాధీనం చేసుకుంటారని న్యూకాసిల్ యూనివర్సిటీకి చెందిన పీహెచ్డీ విద్యార్థులు చెప్పారు. ఆన్లైన్ కొనుగోళ్లకు వివిధ వెబ్సైట్లు వివిధ రూపాల్లో కార్డు డేటా నింపే ప్రక్రియను ఆఫర్ చేస్తాయని, దీంతో హ్యాకర్లు కార్డు వివరాలను తేలికగా హ్యాక్ చేయడానికి అవకాశముంటుందని ఆ యూనివర్సిటీకి చెందిన పీహెచ్డీ స్టూడెంట్ మహ్మద్ అలీ చెప్పారు. ప్రస్తుతం ఆన్లైన్ పేమెంట్ సిస్టమ్ వివిధ వెబ్సైట్ల నుంచి వచ్చే మల్టిపుల్ ఇన్వాలిడ్ పేమెంట్ అభ్యర్థనలనూ గుర్తించలేదని తెలిపారు. ఈ మేరకు యూజర్లు అప్రమత్తంగా ఉండాలని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.