breaking news
new water system
-
ధర్మగుండంలోకి కొత్తనీరు..
వేములవాడ: శివకల్యాణోత్సవానికి హాజరైన లక్షలాది మంది భక్తులతో ధర్మగుండం నీళ్లు అపరిశుభ్రంగా మారడంతో ఆలయ అధికారులు వాటిని తొలగించి కొత్తనీరు నింపుతున్నారు. ఇందులో భాగంగా గురువారం వరకు ఎల్ఎండీ నుంచి వస్తున్న స్వచ్ఛమైన నీరు ధర్మగుండం కింది మెట్ల వరకు చేరుకున్నాయి. మరో రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో నీళ్లు నింపనున్నట్లు ఈఈ రాజయ్య తెలిపారు. ఈనెల 25న సీతారాముల కల్యాణోత్సవానికి మూడు లక్షల మంది భక్తులు హాజరయ్యే అవకాశాలు ఉండటంతో ముందుస్తుగా చర్యలు చేపట్టారు. దీంతో గురువారం భక్తులు షవర్ల వద్ద స్నానాలు చేశారు. -
కొత్త జల విధానంతో నీటి కొరత తీర్చండి
కేంద్ర మంత్రికి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ లేఖ సాక్షి, న్యూఢిల్లీ: ఎగువన ఉన్న రాష్ట్రాలు తెలంగాణకు నీటి విడుదలలో వివక్ష చూపుతున్నాయని ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఆరోపించారు. నీటి వినియోగంపై కేంద్రం ఒక నూతన విధానాన్ని ప్రవేశపెట్టాలని కోరుతూ కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతికి బుధవారం లేఖ రాశారు. కర్ణాటకలో రిజర్వాయర్లు నిండుగా ఉంటే.. ఏపీ, తెలంగాణలో మాత్రం ఎండిపోతున్నాయన్నారు. ఎగువన ఉన్న రాష్ట్రాలు కేటాయింపుల కంటే అధిక నిష్పత్తిలో నీటిని వినియోగించుకుంటున్నాయని పేర్కొన్నారు. మరోవైపు కేంద్ర మంత్రి హర్షవర్ధన్ను కలసి భువనగిరికి మంజూరైన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్లేషన్ మెడిసిన్ సంస్థ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం 35 ఎకరాలు కేటాయించిన నేపథ్యంలో వెంటనే పనులు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు.