breaking news
New textile policy
-
రాష్ట్రానికి భారీగా జౌళి ప్రాజెక్టులు
ముంబై/షోలాపూర్, న్యూస్లైన్: రాష్ట్రానికి రూ. 12 వేల కోట్ల విలువైన 1,331 కొత్త జౌళి ప్రాజెక్టులు వచ్చాయి. ఈ విషయాన్ని రాష్ట్ర జౌళి శాఖ మంత్రి ఆరిఫ్ మహ్మద్ నసీంఖాన్ వెల్లడించారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. నూతన జౌళి విధానం కింద ఈ ప్రాజెక్టులొచ్చాయన్నారు. మరికొన్ని ప్రాజెక్టులు త్వరలో రానున్నాయన్నారు. 10 జౌళి ప్రాజెక్టులకు రూ. 51 కోట్ల మేర సబ్సిడీ ఇచ్చామన్నారు. మరో 50 ప్రాజెక్టులకు వడ్డీలో సబ్సిడీ ఇచ్చామన్నారు. ఐదేళ్ల కాలపరిమితిలో దాదాపు రూ. 40 వేల కోట్ల పెట్టుబడుల లక్ష్యాన్ని చేరగలుగుతామంటూ ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక రంగం కుదేలైనప్పటికీ ఏడాదిన్నర కాలంలో రూ. 12 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, ఈ విషయం తమకు ఎంతో సంతృప్తి కలిగించిందన్నారు. మరికొన్ని ప్రాజెక్టుల ప్రతిపాదనలు వస్తాయని ఆశిస్తున్నట్టు తెలిపారు. పత్తి పంట పండించే విదర్భ, మరాఠ్వాడా, ఉత్తర మహారాష్ట్ర ప్రాంతాల్లో ఏర్పాటుచేసే ప్రాజెక్టులకు పది శాతం రాయితీ ఇస్తామన్నారు. మిగతా ప్రాంతాల్లో స్పిన్నింగ్, జిన్నింగ్, ప్రెస్సింగ్, ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ఏడు శాతం రాయితీ ఇస్తామన్నారు. ఆర్ఎస్ఎస్ ఎజెండానే బీజేపీ విధానం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ఎజెండాను బీజేపీ దేశవ్యాప్తంగా అమలు చేయాలనుకుంటో ందని రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి నసీంఖాన్ అన్నారు. వీరి బారి నుంచి దేశ ఐక్యతను కాపాడుకునేందుకు హిందూ-ముస్లింలు ఏకతాటిపైకి రావాల్సిన అవసరం తెలిపారు. స్థానిక సివిల్ ఆస్పత్రి సమీపంలోని షోలాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎస్ఎంసీ) స్థలంలో ఉర్దూ భవన నిర్మాణానికి కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండేతో కలిసి నసీంఖాన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నసీంఖాన్ మాట్లాడుతూ బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ గుజరాత్లో రక్తంతో హోలీ సంబరాలు జరుపుకున్నారని, ఆయన దేశానికి ప్రధాని కాకుండా జాగ్రత్తపడాలని సూచించారు. ఆయన ప్రధాన మంత్రి పదవి కోసం పగటి కలలు కంటున్నారని, ఆ కలలను సాకారం కాకుండా చూసే బాధ్యత హిందూ-ముస్లింలదేనని పిలుపునిచ్చారు. కేంద్రంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న సుశీల్ కుమార్ షిండేని రాష్ట్ర ప్రజలు ఆదరించాల్సి అవసరముందన్నారు. ఆయనను బలపరచడం ఇక్కడి వారందరి కర్తవ్యమన్నారు. అంతకుముందు సుశీల్ కుమార్ షిండే మాట్లాడుతూ ఉర్దూ మన భాషనేనని, పాకిస్తాన్ దానిని జాతీయ భాషగా మార్చుకోవడం మనకు గర్వకారణమన్నారు. ఈ ఉర్దూ భవనంలో చదువుకునే వారంతా విజ్ఞానవంతులు కావాలని, వారు మానవతా ధృక్పదంతో యువతరాన్ని తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో శాసన సభ్యులు దిలీప్ మానే, ప్రణతి శిందేలతోపాటు ధర్మ బోసుళే, ప్రకాశ్ మల్గుల్వార్, మాజీ మేయర్లు ఉమర్ఖాన్ బెరియా, హరీఫ్ శేఖ్, కార్పోరేటర్ తాపిక్ శేఖ్ తదితరులు పాల్గొన్నారు. -
వస్త్ర పరిశ్రమకు సింగిల్ విండో క్లియరెన్సులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జౌళి పరిశ్రమల స్థాపనకై ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఎదుర్కొంటున్న కష్టాలకు తెర పడనుంది. ప్రస్తుతం కంపెనీ ఏర్పాటు చేయాలంటే అటూఇటూగా 50 అనుమతులు తీసుకోవాల్సి వస్తోంది. వీటన్నిటికీ చెక్ పెడుతూ సింగిల్ విండో క్లియరెన్సుల విధానానికి కేంద్ర జౌళి శాఖ శ్రీకారం చుడుతోంది. ఇందుకోసం సంయుక్త కార్యదర్శి స్థాయిలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర జౌళి శాఖ మంత్రి కావూరి సాంబశివరావు తెలిపారు. మంగళవారమిక్కడ ఫిక్కీ సదస్సులో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. మార్చికల్లా సింగిల్ విండో సదుపాయం అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. టెక్స్టైల్ పాలసీ ఒకట్రెండు నెలల్లో కార్యరూపం దాలుస్తుందని పేర్కొన్నారు. జౌళి పరిశ్రమకు ఇచ్చే రాయితీలు, టెక్నాలజీ అప్గ్రేడేషన్ ఫండ్ తదితర అంశాల విషయంలో పాలసీ స్పష్టతనిస్తుందని అన్నారు. ‘టఫ్’ పథకాన్ని 2017 వరకు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. రూ.11,950 కోట్లు కేటాయించామని చెప్పారు. ఈ నెల 9లోగా నోటిఫికేషన్ విడుదలవుతుందని వివరించారు. 50 శాతం నిధులిస్తాం: పారిశ్రామికవేత్తలు తమకు ప్రభుత్వం నుంచి ఏం కావాలో డిమాండ్లతోపాటే పరిష్కారాలు కూడా చూపాలని సాంబశివరావు సూచించారు. పరిశోధన, అభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తే ప్రభుత్వం 50 శాతం నిధులు సమకూరుస్తుందని హామీ ఇచ్చారు.