breaking news
new rtc buses
-
HYD: 80 కొత్త ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం
ఆర్టీసీ బస్సుల్లో మహిళల రద్దీ పెరిగిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కొత్తగా బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. 30 ఎక్స్ప్రెస్, 30 రాజధాని ఏసీ, 20 లహరి స్లీపర్ కమ్ సీటర్(నాన్ ఏసీ) బస్సులను హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద శనివారం రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నంప్రభాకర్ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలోరవాణా, రహదారి, భవనాలశాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, రవాణాశాఖ కమిషనర్ జ్యోతి బుద్దా ప్రకాశ్తోపాటు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పాల్గొన్నారు. టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ.. ఆర్టీసీలో మెరుగైన ప్రయాణం కోసం కొత్త బస్సులు ప్రారంభించినట్లు తెలిపారు. నేడు 80 బస్సులు ప్రారంభించామని, త్వరలో మరో 1000 ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభిస్తామని చెప్పారు. మే జూన్ కల్ల ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వస్తాయన్నారు. రూ. 400 కోట్లతో ఈ కొత్త బస్సులు తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు. మహిళల కోసం ప్రభుత్వం ఉచిత ప్రయాణం తీసుకొచ్చిందన్న సజ్జనార్.. ఈ 21 రోజుల్లో మహిళ ప్రయాణికుల సంఖ్య పెరిగిందని తెలిపారు. మహాలక్ష్మి పథకం కోసం ఆర్టీసి సిబ్బంది ఎంతో కష్టపడి పని చేస్తున్నారని.. వచ్చే రోజుల్లో ఓపికతో ప్రయాణికులు సిబ్బందికి సహకరించాలని సూచించారు. ఇప్పటికీ ఆరు కోట్ల ఉచిత టికెట్లు విక్రయించినట్లు తెలదిపారు. కండక్టర్, డ్రైవర్లకు ప్రయాణికులు సహకరించాలని తెలిపారు. ఆర్టీసి సిబ్బంది, ఆర్టీసి బస్సులపై దాడులు చేస్తే ఉపేక్షించేది లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మహాలక్ష్మి పథకం అమల్లో ఉన్నందున మహిళ ప్రయాణికుల రద్దీ పెరిగిందని, బస్సులపై ఓవర్ లోడ్ అవుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. వాటిని అధిగమించేoదుకు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పురుష ప్రయాణికుల విషయంలో ప్రత్యేక ఏర్పాట్లకు సంబంధించి చర్యలు తీసుకుంటామన్నారు. సంక్రాంతి బస్సుల చార్జీల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. LIVE : Minister Ponnam Prabhakar Inaugurates 80 New RTC Buses https://t.co/C2TMl4o6rp — Telangana Congress (@INCTelangana) December 30, 2023 రూ. 400 కోట్లతో 1,050 కొత్త బస్సులు ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైనసేవలు అందించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిరంతరం కృషి చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరానికిగాను రూ.400 కోట్ల వ్యయంతో అధునాతనమైన 1,050 కొత్త డీజిల్ బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. వాటిలో 400 ఎక్స్ప్రెస్, 512 పల్లెవెలుగు, 92 లహరి స్లీపర్ కమ్ సీటర్, 56 ఏసీ రాజధాని బస్సులు న్నాయి. వీటికి తోడు పర్యావరణహితమైన ఎలక్ట్రిక్ వాహనాలను హైదరాబాద్ సిటీలో 540, జిల్లాల్లో 500 బస్సులను కూడా అందుబాటులోకి తేనుంది. ఇవన్నీ విడతల వారీగా వచ్చే మార్చి నాటికి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చేలా సంస్థ ప్లాన్ చేసింది. లీజుకు ఆర్టీసీ భూములు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని టీఎస్ఆర్టీసీ భూములు లీజుకు ఇచ్చేందుకు టీఎస్ఆర్టీసీ సిద్ధమైంది. ఈ మేరకు ఈ-టెండరు దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానించింది. కాచిగూడలో 4.14 ఎకరాలు, మేడ్చల్లో 2.83 ఎకరాలు, శామీర్పేటలో 3.26 ఎకరాలు, హకీంపేటలో 2.93 ఎకరాలు.. ఇలా మొత్తం 13.16 ఎకరాల భూమిని లీజుకు ఇవ్వనుంది. పూర్తి వివరాలకు https://www.tsrtc.telangana.gov.in/ వెబ్సైట్లో చూడాలని సూచించింది. టెండర్లకు వచ్చే ఏడాది జనవరి 18 చివరి తేదీగా పేర్కొంది. -
కృష్ణా పుష్కరాలకు 300 కొత్త బస్సులు: మంత్రి శిద్ధా
విజయవాడ : కృష్ణా పుష్కరాల కోసం 300 కొత్త బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు వెల్లడించారు. మరో 400 బస్సులు అదనంగా అందుబాటులో ఉంచామని తెలిపారు. శుక్రవారం విజయవాడలో మంత్రి శిద్ధా విలేకర్లతో మాట్లాడుతూ... అక్రమ రిజిస్ట్రేషన్ల ఆరోపణలపై మంగళగిరి ఎంవీఐ నాగేశ్వరరావును సస్పెండ్ చేసినట్లు చెప్పారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అక్రమ రిజిస్ట్రేషన్లు ఆరోపణలపై విచారణ జరుగుతోందన్నారు. -
రూ.50 కోట్లతో కొత్త బస్సులు
► రవాణా మంత్రి మహేందర్రెడ్డి వెల్లడి సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో త్వరలో రూ. 50 కోట్ల వ్యయంతో కొత్త బస్సులను కొనుగోలు చేయనున్నట్లు రవాణా శాఖ మంత్రి పి.మహేందర్రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు తిరగని ప్రాంతాలు ఉండరాదని ఆయన అధికారులను ఆదేశించారు. హకీంపేటలో శుక్రవారం ఆర్టీసీ ఈడీలు, ఆర్ఎంలు, హైదరాబాద్ జోన్ అధికారులతో సమీక్ష సమావేశం జరిగింది. రవాణా శాఖ కమిషనర్ సునీల్శర్మ, ఆర్టీసీ జేఎండీ రమణారావు తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ జోన్లోని రెండు రీజియన్ల పరిధిలో ఉన్న 28 డిపోల స్థితిగతులను మంత్రి మహేందర్రెడ్డి అడిగి తెలుసుకున్నారు. అన్ని డిపోలు కోట్ల రూపాయల నష్టంలో కూరుకుపోవడంపై అధికారులను నిలదీశారు. డీఎంలు, ఆర్ఎంల పనితీరు పట్ల ఆగ్ర హం వ్యక్తం చేశారు. పెరిగిన వేతనాలు, రెగ్యులరైజేషన్తో భారం, నష్టం పెరిగిందని అధికారులు చెప్పగా... ఈ వివరణ పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. బస్సుల నిర్వహణ వ్యయాన్ని తగ్గించుకోవాలని, ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్)ను పెంచుకునేలా చర్యలు చేపట్టాలని సూచించారు. శివారు ప్రాంతాల డిపోల నుంచి దూర ప్రాంతాలకు బస్సులు నడపాలని చెప్పారు. ఇక ఫరూక్నగర్, ముషీరాబాద్-3 డిపోల నిర్మాణాలను త్వరలో పూర్తి చేయనున్నట్లు మంత్రి చెప్పారు. జనవరి నాటికి ఆర్టీసీ రూ. 289 కోట్ల నష్టాల్లో ఉందని, దాన్ని తగ్గించేందుకు అందరి సహకారం అవసరమని పేర్కొన్నారు. నష్టాలు ఎక్కువగా ఉన్న ఆదిలాబాద్, మహబూబ్నగర్, హైదరాబాద్ జోన్ల మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని జేఎండీని ఆదేశించారు. గత ఏడాది కన్నా నష్టం పెరగడంపై ఆర్ఎంలను ఆరా తీశారు. కొత్త డిపోల ఆలోచన లేకున్నా, ఉన్న వాటిని సరిగ్గా ప్రజలకు చేరువ చేయాలని సూచించారు.