breaking news
new norms
-
గురుకులంలోకి ప్రవేశం ఇక కఠినం
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యా సంస్థల్లోకి బయటి వ్యక్తుల ప్రవేశం, తరచూ తల్లిదండ్రుల సందర్శనలు..విద్యార్థుల బోధన, అభ్యసన కార్యక్రమాలకు అంతరాయం కలిగిస్తోంది. తల్లిదండ్రులు అసందర్భంగా, అకస్మాత్తుగా రావడం, తమ పిల్లలను ఇంటికి పంపించాలని పట్టుబడుతుండటం గురుకులాల సిబ్బందికి తలనొప్పిగా మారుతోంది. కొన్ని సందర్భాల్లో రాజకీయ జోక్యం కూడా చోటు చేసుకుంటోంది. ఒకట్రెండు చోట్ల ఘర్షణలు సైతం జరిగిన దాఖలాలున్నాయి. ఇలాంటి పరిస్థితులతో పాటు విద్యార్థుల సంరక్షణ, భద్రతపై కూడా ఎస్సీ గురుకుల సొసైటీ దృష్టి సారించింది. ఇకపై నిబంధనలకు అనుగుణంగానే.. ఇకపై ఈ నిబంధనలకు అనుగుణంగానే గురుకుల క్యాంపస్లోకి తల్లిదండ్రులను అనుమతించాలని, విద్యార్థిని ఇంటికి అనుమతించేందుకు నిర్దిష్ట విధానం ఉండాలని ఎస్సీ గురుకుల సొసైటీ స్పష్టం చేసింది. ఇందుకోసం విద్యార్థుల తల్లిదండ్రులు, గార్డియన్లకు సరైన ఆధారాలతో ఫొటో గుర్తింపు కార్డును జారీ చేయనుంది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా 268 గురుకుల పాఠశాలలు, కళాశాలల ప్రిన్సిపాల్స్కు, ఇతర అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు ఉల్లఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. లిఖితపూర్వక అనుమతి ఉండాలి⇒ ప్రిన్సిపాల్ నుంచి ముందస్తు లిఖితపూర్వక అనుమతి ఉన్న వ్యక్తిని మాత్రమే గురుకుల ప్రాంగణంలోకి అనుమతించాలి. ప్రతి గురుకుల విద్యాసంస్థ సంస్థ వద్ద ఈ ప్రాంగణంలోకి అనధికార వ్యక్తులకు ప్రవేశం లేదు..’అనే బోర్డు ఏర్పాటు చేయాలి. ⇒ గురుకుల ప్రాంగణం గేటు దగ్గర విద్యార్థి, అతనితో వచ్చిన తల్లి, తండ్రి/గార్డియన్ సంతకాలు నమోదు చేసే రిజిస్టర్ తప్పనిసరిగా నిర్వహించాలి. గుర్తింపు పరిశీలించిన తర్వాత మాత్రమే లోనికి అనుమతించాలి. ⇒ విద్యార్థిని కలవడానికి వచ్చిన తల్లిదండ్రులు క్యాంపస్లో ఉండటానికి అనుమతి లేదు. సంస్థకు సమరి్పంచిన గుర్తింపు కార్డు చూపిన తల్లిదండ్రులు మాత్రమే కలిసేందుకు అనుమతించాలి. అయితే అది కూడా తరచుగా కాకూడదు. అలాంటి విద్యార్థులపై నిఘా పెట్టాలి ⇒ గురుకుల పాఠశాల/కళాశాలకు అత్యంత సమీపంలో నివాసం ఉన్న విద్యార్థులను గుర్తించాలి. తరచూ కుటుంబ సభ్యులు వచ్చి కలిసే విద్యార్థులపై ప్రిన్సిపాల్/హౌస్ మాస్టర్/మి్రస్టెస్ ప్రత్యేకంగా నిఘా పెట్టాలి. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే విద్యార్థిని కలిసేందుకు అనుమతి ఇవ్వాలి. ⇒ పాఠశాల పని వేళల్లో లేదా వారాంతం/ఇతర సెలవు దినాల్లో ప్రిన్సిపాల్ అనుమతి లేకుండా విద్యార్థిని బయటకు పంపితే, సంబంధిత హౌస్ మాస్టర్/మి్రస్టెస్ వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి ఉంటుంది. ⇒ సెలవుల తర్వాత పునఃప్రారంభం రోజు లేదా ప్రిన్సిపాల్ పేర్కొన్న ఇతర సందర్భాల్లో తప్పనిసరిగా విద్యార్థిని తల్లి/తండ్రి/గార్డియన్ వ్యక్తిగతంగా తీసుకురావాలి. బాలిక తల్లిదండ్రులు లేకుండా వస్తే క్యాంపస్లోకి అనుమతి ఇవ్వకూడదు. దీనికి సంబంధించిన స్పష్టమైన ఆదేశాలను వాచ్మెన్/క్లాస్ టీచర్లు/హౌస్ మాస్టర్లు/ మిస్ట్రెస్లకు ప్రిన్సిపాల్ ఇవ్వాలి. ⇒ పాఠశాల/కాలేజీ పని దినాల్లో లేదా ఆదివారాలు/ప్రభుత్వ సెలవులలో విద్యార్థిని ఇంటికి పంపించరాదు. అయితే అత్యంత సమీప బంధువు మరణం లేదా ఇంటిలో ముఖ్యమైన కార్యక్రమం ఉంటే తల్లిదండ్రుల అభ్యర్థనపై అనుమతించవచ్చు.సెలవులపై ముందుగానే సమాచారం ఇవ్వాలి ⇒ విద్యార్థిని ఎవరి చేత ఇంటికి పంపించారో, వారి పేరు నమోదు.. గుర్తింపు కార్డు సమరి్పంచిన తల్లి/తండ్రి/గార్డియన్ సంతకంతో హౌస్ మాస్టర్/మి్రస్టెస్ రిజిస్టర్ నిర్వహించాలి. ⇒ సెలవులు ప్రారంభం అయ్యే సమయంలో ముందుగానే అందరికీ సమాచారం ఇచ్చి, తల్లిదండ్రులు స్వయంగా తమ పిల్లలను తీసుకెళ్లాలని తెలియజేయాలి. వారు రాలేని పరిస్థితిలో, విద్యార్థి అన్న/అక్క/గార్డియన్తో పంపవచ్చు. అయితే ఆ వ్యక్తి ఫొటో విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ప్రిన్సిపాల్ వద్ద సమర్పించి ఉండాలి. ⇒ ఆదివారాలు, ప్రభుత్వ సెలవు రోజుల్లో ఇద్దరు బోధనా సిబ్బంది రొటేషన్ పద్ధతిలో విధులు నిర్వ హించాలి. ప్రాంగణం గేటు వద్ద భద్రతా వ్యవస్థను సదరు ప్రిన్సిపాల్ మరింత బలోపేతం చేయాలి. -
ఐటీ రిటర్నుల్లో మార్పులు గమనించారా?
సాక్షి, ముంబై: ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) 2021–22 అసెస్మెంట్ సంవత్సరానికి సంబంధించి ఆదాయపన్ను రిటర్నుల పత్రాలను (ఐటీఆర్) నోటిఫై చేసింది. సాధారణంగా గడిచిన ఆర్థిక సంవత్సరానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అసెస్మెంట్ సంవత్సరం అవుతుంది. సీబీడీటీ నోటిఫై చేసిన ఐటీఆర్లను పన్ను చెల్లింపుదారులు దాఖలు చేయాల్సి ఉంటుంది. దీనిని ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకుంటున్నామంటే.. పన్ను చెల్లింపుదారులకు ఈ ఏడాది ఐటీఆర్లలో పరిమిత మార్పులనే చేశారు. 2020 బడ్జెట్లో ప్రతిపాదించిన ఆదాయపన్ను చట్టంలోని సవరణల మేరకు మార్పులను పొందుపరిచారు. అదే సమయంలో..గతేడాది కరోనా మహమ్మారి కారణంగా పన్ను చెల్లింపుదారులకు ప్రత్యేకంగా కల్పించిన వెసులుబాట్లను ఐటీఆర్ల నుంచి తొలగించారు. డీఐ షెడ్యూల్ కూడా ఇలా తొలగించిన వాటిల్లో ఒకటి. డీఐ అంటే పన్ను మినహాయింపులను క్లెయిమ్ చేసుకునేందుకు పెట్టుబడులు/డిపాజిట్లు/చెల్లింపుల వివరాలు. 2021-22 అసెస్మెంట్ ఐటీఆర్లలో డీఐ కాలమ్ కనిపించదు. వీటితోపాటు ఐటీఆర్లలో ఏఏ మార్పులు చోటు చేసుకున్నదీ వివరంగా తెలుసుకుంటే.. రిటర్నుల దాఖలు మరింత సులభమవుతుంది. ఐటీఆర్-1కు సంబంధించి చోటు చేసుకున్న మార్పులను గమనిస్తే.. సెక్షన్ 194ఎన్ కింద పన్ను చెల్లింపుదారులు ఎవరికైతే మూలం వద్ద పన్ను మినహాయింపు (టీడీఎస్)అమలవుతుందో.. వారు ఐటీఆర్–1 రూపంలో రిటర్నులు దాఖలు చేయరాదు. సెక్షన్ 194 కింద బ్యాంకులు టీడీఎస్ను అమలు చేయాల్సి ఉంటుంది. కోఆపరేటివ్ సొసైటీలు,పోస్టాఫీసులకూ ఇది వర్తిస్తుంది. మొత్తం మీద ఒక ఆర్థిక సంవత్సరంలో ఖాతాదారు నగదు ఉపసంహరణలు రూ.కోటి దాటితే అప్పుడు 2 శాతం టీడీఎస్ను మినహాయిస్తాయి. ఒకవేళ సదరుఖాతాదారు అంతక్రితం మూడు ఆర్థిక సంవత్సరాల్లోనూ ఐటీఆర్లను దాఖలు చేయనట్టయితే.. అప్పుడు ఒక ఆర్థిక సంవత్సరంలో నగదు ఉపసంహరణలు రూ. 20లక్షలు మించినా 2 శాతంటీడీఎస్ను అమలు చేయాలి. లేదా రూ.కోటి దాటిన నగదు ఉపసంహరణలపై 5 శాతాన్ని అమలు చేయాలి. ఇటీవల పన్ను చట్టంలో చేసిన సవరణల ప్రకారం.. ఉద్యోగులు తమకు సంస్థజారీ చేసిన ఈసాప్లపై (ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్) పన్నును వాయిదా వేయదలుచుకుంటే అప్పుడు ఐటీఆర్1 లేదా ఐటీఆర్2 బదులు.. ఐటీఆర్ 2, 3 దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈసాప్లపై పన్ను వాయిదా ఈసాప్లపై పన్నును వెంటనే చెల్లించాల్సిన పని లేకుండా, వీలునుబట్టి వాయిదా వేసుకునే సౌకర్యాన్ని బడ్జెట్ 2020లో ప్రతిపాదన తీసుకొచ్చారు. ఈసాప్లపై రెండు సార్లు పన్నుపడుతుంది. పనిచేసే సంస్థ నుంచి ఉద్యోగి ఈ సాప్లు అందుకున్నప్పుడు ఒక పర్యాయం, ఉద్యోగి తిరిగి స్టాక్ ఆప్షన్లను విక్రయించినప్పుడు వచ్చిన మూలధన లాభాలపై మరో పర్యాయంపన్ను చెల్లించాల్సి ఉంటుంది. చట్టంలో చేసిన సవరణ ప్రకారం.. అర్హత కలిగిన స్టార్టప్ల ఉద్యోగులు తాము అందుకున్న ఈసాప్లపై పన్నును వాయిదా వేసుకోవచ్చు. స్టాక్ ఆప్షన్లుకేటాయించిన ఆర్థిక సంవత్సరం ముగింపు నుంచి 48 నెలల పాటు అంటే నాలుగేళ్ల వరకు ఇలా పన్నును వాయిదా వేసుకునే సౌకర్యం ఉంది. ఈసాప్లపై ప్రస్తుతం చెల్లిస్తున్న పన్ను,వాయిదా వేసుకుంటున్న పన్నును వివరంగా షెడ్యూల్ టీటీఐ (కంప్యుటేషన్ ఆఫ్ ట్యాక్స్ లయబిలిటీ ఆన్ టోటల్ ఇన్కమ్)లో పేర్కొనాలి. డివిడెండ్ ఆదాయం.. డివిడెండ్ పంపిణీ పన్ను (డీడీటీ)ను ఎత్తేసి.. డివిడెండ్ అందుకున్న వ్యక్తి పన్ను చెల్లించాలన్న సవరణను గతంలో తీసుకొచ్చారు. దీంతో ఐటీఆర్లలో డీడీటీ సెక్షన్ను ఎత్తేసి షెడ్యూల్ ఓఎస్ (ఇతర వనరుల ద్వారా ఆదాయం)ను తాజా సవరణలకు అనుగుణంగా మార్పు చేశారు. అంటే ఇతర వనరుల ద్వారా ఆదాయం కాలమ్లోనే డివిడెండ్ ఆదాయాన్ని చూపించాల్సి ఉంటుంది. డివిడెండ్ ఆదాయానికి సంబంధించి వడ్డీ వ్యయాలు ఏవైనా చేసి ఉంటే (రుణాలు తీసుకుని చెల్లింపులు).. వాటిని సెక్షన్ 57(1) కింద తగ్గించి చూపించుకునేందుకు కొత్తగా ఒక వరుసను ప్రవేశపెట్టారు. భారత్లో కాకుండా ఇతర దేశాల్లో నివసించే భారతీయుల పన్ను చెల్లింపుదారులు అందుకునే డివిడెండ్కు సంబంధించి కొత్త వరుసలను చేర్చారు. సెక్షన్ 115ఏ కింద ప్రవాస భారతీయులు అందుకునే డివిడెండ్పై ప్రత్యేక పన్ను రేటును వసూలు చేయనున్నారు. ఐటీఆర్ 2, 3, 4ను దాఖలు చేసే వారు డివిడెండ్ ఆదాయాన్ని త్రైమాసికాల వారీగా వేరు చేసి చూపించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఐటీఆర్–1 దాఖలు చేసే వారు సైతం డివిడెండ్ ఆదాయాన్ని నాలుగు త్రైమాసికాలుగా వేరు చేసి చూపించాలి. దీంతో అడ్వాన్స్ ట్యాక్స్ (ముందస్తు పన్ను చెల్లింపులు) బాధ్యతను లెక్కించేందుకు పన్ను అధికారులకు సులభంగా ఉంటుంది. రాయితీ పన్ను రేట్లు 2021-22 అసెస్మెంట్ సంవత్సరం నుంచి పన్ను చెల్లింపుదారులు సెక్షన్ 115బీఏసీ కింద తక్కువ పన్ను రేట్ల విధానాన్ని ఎంచుకోవచ్చు. దీన్ని ఎంపిక చేసుకుంటే కొన్నిమినహాయింపులు, తగ్గింపులను కోల్పోవాల్సి వస్తుంది. అన్ని ఐటీఆర్లలోనూ పార్ట్–ఏలో పన్ను చెల్లింపుదారులు తాము 11బీఏసీ కింద నూతన పన్ను విధానాన్ని ఎంపికచేసుకుంటున్నట్టు అయితే తెలియజేయాల్సి ఉంటుంది. వ్యాపారం లేదా వృత్తి పరమైన ఆదాయం కలిగిన వారు నూతన విధానాన్ని గడువులోపు 10-ఐఈ దాఖలు చేయడం ద్వారాఎంచుకోవాలి. ఫామ్ 10–ఐఈ దాఖలు చేసిన తేదీ, అక్నాలెడ్జ్మెంట్ నంబర్ను ఐటీఆర్-3లో పొందుపరచాలి. ఐటీఆర్-3లో షెడ్యూల్ డీపీఎం (ప్లాంట్, మెషినరీ విలు వ తరుగుదల), షెడ్యూల్ యూడీ (సర్దుబాటు చే యని తరుగుదల)లకు సంబంధించి మినహాయిం పులను ఇప్పుడు వదులు కోవాల్సి ఉంటుంది. ఎవరు ఏ రిటర్నులు దాఖలు చేయాలి ♦ ఐటీఆర్–1 వేతనం ద్వారా ఆదాయం పొందే వ్యక్తులు (దేశంలో నివసించే వారు) లేదా, మరియు ఒక ఇల్లు కలిగి ఉండి.. వ్యవసాయ ఆదాయం రూ.5,000లోపు కలిగినా, ఇతర ఆదాయం (వడ్డీ ఆదాయం) ఉన్నా.. అంతా కలుపుకుని సంవత్సరాదాయం రూ.50లక్షల్లోపు ఉన్న వారు ఐటీఆర్–1 దాఖలు చేయాల్సి ఉంటుంది. మినహాయింపులు: పైన చెప్పుకున్న వారికి కొన్ని మినహాయింపులు వర్తిస్తాయి. ఎలా అంటే.. రూ.50లక్షల్లోపు ఆదాయం ఉన్న వ్యక్తి ఒకవేళ ఏదైనా కంపెనీ బోర్డ్లో డైరెక్టర్గా ఉన్నా లేదా ఏదేనీ అన్లిస్టెడ్ కంపెనీలో ఇన్వెస్ట్ చేసినా ఐటీఆర్-1 దాఖలు చేయకూడదు. అదే విధంగా సెక్షన్ 194 ఎన్ కింద టీడీఎస్ మినహయించినా లేదా ఈసాప్పై పన్నును వాయిదా వేసుకున్న వారు కూడా ఐటీఆర్–1 దాఖలు చేయడానికి లేదు. ఇంటిపై నష్టాలను క్యారీ ఫార్వార్డ్ చేసుకునే వారు.. ఇతర వనరుల రూపంలో నష్టాన్ని కూడా క్యారీ ఫార్వార్డ్ చేసుకునే వారు సైతం ఐటీఆర్-1 దాఖలు చేయరాదు ♦ ఐటీఆర్-2: ఐటీఆర్-1 దాఖలు చేసే అర్హత లేని వ్యక్తులు (ఎన్ఆర్ఐలు సైతం), హిందూ అవిభాజ్య కుటుంబాలు (హెచ్యూఎఫ్).. వ్యాపారం లేదా వృత్తి రూపంలో ఆదాయం, లాభాలు లేనట్టయితే ఐటీఆర్-2 దాఖలుకు అర్హులు. ♦ ఐటీఆర్-3 :వ్యక్తులు, హెచ్యూఎఫ్లు వ్యాపారం లేదా వృత్తి నుంచి ఆదాయం, లాభాలు కలిగి.. ఇతర రూపాల్లో ఆదాయం లేనట్టయితే అప్పుడు ఐటీఆర్–3 దాఖలు చేయాల్సి ఉంటుంది. ♦ ఐటీఆర్-4 : వృత్తి, వ్యాపార ఆదాయం కలిగిన వ్యక్తులు, సంస్థలు ఐటీఆర్–4ను దాఖలు చేయాలి. సెక్షన్ 44ఏడీ కింద వ్యాపారం లేదా వృత్తిపరమైన ఆదాయంపై ప్రిసంప్టివ్ ట్యాక్స్ను ఎంపిక చేసుకున్న వ్యక్తులు (స్థానిక నివాసులు), హెచ్యూఎఫ్లు, సంస్థలు (ఎల్ఎల్పీ కానివి) రూ.50లక్షల వరకు వార్షికాదాయం కలిగి ఉంటే ఐటీఆర్-4ను దాఖలు చేయాలి. ♦ఐటీఆర్-5/6/7: ప్రత్యేక విభాగం కిందకు వచ్చే వ్యక్తులు (పై విభాగాల్లోకి రాని వారు), ఎల్ఎల్పీలు, సంస్థలు, కంపెనీలకు ఐటీఆర్-5, 6, 7 వర్తిస్తాయి. ♦ ప్రిసంప్టివ్ ట్యాక్స్: వృత్తి నిపుణులు లేదా సంస్థలు వార్షిక టర్నోవర్ రూ.50లక్షల వరకు ఉంటే ప్రిసంప్టివ్ ట్యాక్స్ స్కీమ్ను ఎంచుకుని.. తన టర్నోవర్లో 50% పన్ను వర్తించే ఆదాయం కింద చూపించి పన్ను చెల్లించే సౌలభ్యత ఉంది) -
నగదు డిపాజిట్లపై ఆర్బీఐ యూటర్న్
-
తాజా నిబంధనలను ఎత్తేసిన ఆర్బీఐ
ముంబై : డిపాజిట్దారులకు ఊరట కల్పిస్తూ రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా నిర్ణయం తెలుసుకుంది. రూ.5,000 కంటే ఎక్కువ మొత్తాన్ని ఒక్కసారి మాత్రమే డిపాజిట్ చేయాలంటూ తాజాగా తీసుకొచ్చిన నిబంధనపై ఆర్బీఐ వెనక్కి తగ్గింది. ఈ నిబంధనను ఉపసంహరించుకుంటున్నట్టు ఓ నోటీఫికేషన్ జారీచేసింది. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుండటంతో తాజాగా ఈ ఆంక్షలు ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది. రూ.5000 కంటే ఎక్కువ మొత్తంలో డిపాజిట్ చేస్తే తగిన ఆధారాలు చూపించాంటూ ఈ నెల 19న ఆర్బీఐ ఓ సర్క్యూలర్ జారీచేసిన సంగతి తెలిసిందే. రూ.5000 కంటే ఎక్కువగా డిపాజిట్ చేసే వారు ఇన్ని రోజులు ఎందుకు డిపాజిట్ చేయలేదో ఇప్పుడే ఎందుకు చేస్తున్నారో బ్యాంకులకు తెలపాల్సి ఉంటుంది. డిపాజిట్ దారులు చెప్పే సమాధానాలు బ్యాంకు సిబ్బందిని సంతృప్తి పరిస్తేనే డిపాజిట్ తీసుకుంటారు. ప్రస్తుతం ఈ నిబంధన ఎత్తివేతతో కేవైసీ అకౌంట్లలో డిసెంబర్ 30 వరకు ఎంత మొత్తంలోనైనా డిపాజిట్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. నవంబర్ 8న పాత నోట్లను రద్దుచేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించిన అనంతరం ఆ నోట్లను డిసెంబర్ 30 వరకు డిపాజిట్ చేసుకునే అవకాశం కల్పించింది. అయితే గడువు దగ్గర పడుతుండటంతో డిపాజిట్లపై పరిమితులను ఆర్బీఐ తీసుకొచ్చింది. కానీ బ్యాంకుల వద్ద భారీ క్యూలైన్లతో డిపాజిట్ చేయడానికి ప్రజలు ఇబ్బంది పడుతుంటే, ఆర్బీఐ ఈ కొత్త నిబంధనలు తీసుకురావడమేమిటని దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో తాజా నిబంధనపై ఆర్బీఐ వెనక్కి తగ్గింది.


