-
విప్రో గ్లోబల్ ఏఐ హెడ్గా 'బ్రిజేష్ సింగ్' - ఆయన బ్యాగ్రౌండ్ ఇదే!
ప్రముఖ ఐటీ సంస్థ 'విప్రో' (Wipro) తన గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) హెడ్గా భారతీయ ఐటీ దిగ్గజం మాజీ డెలాయిట్ ఎగ్జిక్యూటివ్ 'బ్రిజేష్ సింగ్'ను ఎంపిక చేసింది. కంపెనీ పోర్ట్ఫోలియో అంతటా AI అడాప్షన్ను వేగవంతం చేయడంలో ఆయన ప్రధాన పాత్ర పోషించనున్నారు. బ్రిజేష్ సింగ్ టెక్నాలజీ కన్సల్టింగ్ స్పేస్లో 30 సంవత్సరాల అనుభవం కలిగి ఉన్నాడు. అంతే కాకుండా ఈయన గతంలో డెలాయిట్లో సీనియర్ భాగస్వామిగా, డేటా-లీడ్ ట్రాన్స్ఫర్మేషన్ను నడపడంలో బాధ్యత వహించినట్లు తెలుస్తోంది. లింక్డ్ఇన్ ప్రకారం ఈయన BIT సింద్రీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసినట్లు సమాచారం. ఇదీ చదవండి: నీరు తాగి మనిషి చేతులు కడిగిన చింపాంజీ - ఆనంద్ మహీంద్రా పోస్ట్ వైరల్! ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI)లో కంపెనీ 1 బిలియన్ డాలర్ల పెట్టుబడితో Wipro ai360 ప్రారంభించిన తర్వాత సింగ్ నియామకం జరిగింది. కావున దీని అభివృద్ధికి ఈయన కొత్త వ్యూహాలు రచించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతే కాకూండా ఈ మొత్తం పోర్ట్ఫోలియోను వేగవంతం చేసే సామర్థ్యాలను పెంపొందించడంలో కూడా ఆయన ప్రధాన పోషించాల్సి ఉంది. -
ఐదోవేదం మహాభారతం...
కొత్త శీర్షిక ప్రారంభం : మహాభారతం పాత్రలు వేరువేరుగా ఉన్న చెట్లన్నీ కలసి ‘వనం’ అనే సమష్టి రూపం తీసుకున్నట్టు వేరువేరుగా ఉన్న ప్రజలందరి మనసు సమష్టి రూపం తీసుకుని ‘దేశ మనస్సు’ అవుతుంది. ‘మహాభారతం’ భారతదేశపు మనసు.దీనికి అక్షరరూపం ఇచ్చి చిరాయువును పోసినవాడు వ్యాసుడు. భారతదేశం తన వికసించిన నాగరికతను వాఙ్మయంలో పొందుపరిచి భద్రం చేసింది. ‘వేదం’ భారతదేశపు అతి పురాతన వాఙ్మయం. అది ఒక్కటే అయినా రాబోయే రోజులలో ధారణకు సులువుగా ఉండాలని వ్యాసుడు దానిని నాలుగుగా విభజించి వేదవ్యాసుడయ్యాడు. ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అథర్వణవేదం అంటూ విభజించినా వేదంలోని పరమార్థం అందరికీ తెలియాలనే ఉద్దేశ్యంతో ‘ఐదో వేదం’గా ప్రసిద్ధికెక్కిన మహాభారతాన్ని రాశాడు. మహాభారతాన్ని ‘ఇతిహాసం’అని అంటారు. ‘ఇతి’ అంటే ‘ఇలాగ’, ‘హ’ అంటే ‘ప్రసిద్ధంగా’, ‘ఆస’ అంటే ‘ఉంది’ అని అర్థం. అంటే ఈ మాటకు ‘ఇలా జరిగిందట’ అని అర్థం. భారతీయులు తమ చరిత్రను రాసుకోలేదన్న అపప్రథ ఒకటి ఉంది. అది నిజం కాదు. అసలు చరిత్ర అంటే మునపటివాళ్ల నడతతో కాపుదలనీ సంరక్షణనీ పొందడమని అర్థం. అదే ఇంగ్లిష్లో హిస్టరీ- హిజ్ స్టోరీ, అతగాడి కథ అన్నట్టుగా అనిపిస్తుంది. అయితే, గ్రీకు భాషలో హిస్టోరియా అంటే అడగడం, ప్రశ్నించడం, విచారణ చేయడం అని అర్థాలు చెబుతారు. ఏ చరిత్రనైనా, చదివేవాడికి పనికొచ్చే విధంగా రాయాలి. అందుకే తమ చరిత్రను భారతీయులు పురాణాలుగా, ఇతిహాసాలుగా రాసుకున్నారు. మహాభారతం అలాంటి చారిత్రకమైన కథ. అయితే దాన్ని ఐదో వేదమని ఎందుకంటారు? వేదమంటే ‘జ్ఞానం’ అని అర్థం. ‘మహాభారతం’ మన సత్తా గురించిన జ్ఞానం. మనం ఉన్నా లేకపోయినా మన సత్తా, మన ఉనికీ ఎప్పటికీ ఉంటాయి. తరాలు ఎన్ని గడిచినా ఎప్పటికీ చెక్కుచెదరని మన అస్తిత్వం గురించిన జ్ఞానం మనకు ఆనందం కలిగిస్తుంది. మహాభారత చరిత్ర మన ఉనికి గురించి, అస్తిత్వం గురించి ఎరుక కలిగించి మనకు హాయినిస్తుంది. ‘ఉనికీ’ ‘ఎరుకా’ ‘హాయీ ’అనేవే వరసగా ‘సత్’, ‘చిత్’, ‘ఆనందాలు’. వేదార్థమంటే సచ్చిదానందాల కూడికే గనుక మహాభారత చరిత్ర కూడా ఆ సచ్చిదానందాన్నిచ్చేదై ఉండాలి. కథ కథగా సచ్చిదానందాన్ని ఎలాగ ఇస్తుంది? అంచేత ఆ కథలో ఏదో విలక్షణత ఉండి ఉండాలి. అప్పుడుగానీ మహాభారతం వేదంగా చెలామణీ కాలేదు. పాండవులకు బలమూ నేర్పూ ఎక్కువ. ఎక్కువ మందే ఐనా ధృతరాష్ట్రులకు శక్తీ నేర్పూ తక్కువ. అందుకోసం మోసం చేయాలనే కుట్ర జరిగింది. విషం పెట్టి మట్టుపెడదామని చూశారు. వీలుగాలేదు. ధృతరాష్ట్రుడనే రాజుకి వందమంది కొడుకులు. అతని తమ్ముడు పాండురాజుకి ఐదుగురు కొడుకులు. ఈ అన్నదమ్ముల కొడుకులందరూ జ్ఞాతులు. జ్ఞాతులంటే శత్రువులే. ఒకచోట ఇంతమందీ ఉండటం పడలేదు. తక్కువమందే అయినా పాండవులకు బలమూ నేర్పూ ఎక్కువ. ఎక్కువ మందే ఐనా ధృతరాష్ట్రులకు శక్తీ నేర్పూ తక్కువ. అందుకోసం మోసం చేయాలనే కుట్ర జరిగింది. విషం పెట్టి మట్టుపెడదామని చూశారు. వీలుగాలేదు. లక్క ఇంట్లో పెట్టి కాల్చేద్దామని చూశారు. అదీ అడ్డం తిరిగింది. ఇన్నీ విఫలం కావడంతో మోసపు జూదానికి దిగారు. జూదంలో శకుని మాయతో ఓడించి పన్నెండేళ్లు అరణ్యవాసానికి, ఆ పైన ఒక ఏడాది పాటు అజ్ఞాతవాసానికీ పంపించారు. పందెం ప్రకారం పదమూడేళ్లు కాగానే సజావుగా తిరిగి వచ్చినప్పటికీ రాజ్యాన్ని అప్పగించటానికి వాళ్లకు మనసొప్పలేదు. దానితో ఇక యుద్ధమే శరణ్యమైంది. అటూ ఇటూ చాలామందే చచ్చిపోయారు. ఈ కథను ఇలాగ ‘కట్టె, కొట్టె, తెచ్చె’ అనే తీరుగా చెబితే మనకేం లాభం వస్తుంది? అందుకనే వ్యాసమహర్షి కథను అలాగ పేలవంగా చెప్పలేదు. మధ్యలో మరెన్ని విషయాల్నో చెబుతూ ‘దీని ఉద్దేశాన్ని పట్టుకోండి, ఆకళించుకోండి’ అని పదేపదే చెప్పకుండానే చెప్పాడు. ఉద్దేశాన్ని ఆకళించుకోవాలంటే రచనలో వాడుతున్న ప్రతిమాటా ప్రతిపేరూ మనకు అర్థం కావాలి. ఇది దృష్టిలో పెట్టుకొనే వ్యాసుడు మహాభారతంలోని ప్రతిమాటనీ ప్రతిపేరునీ విడబరిచి నిర్వచిస్తూ ఉంటాడు. ఆ వరసలో ‘మహాభారతం’ అనే మాటను కూడా నిర్వచించకుండా వదిలిపెట్టలేదు. మహత్త్వమూ మహాభారమూ ఉన్నది గనక ఇది మహాభారతమైంది అని చెబుతాడాయన. భారం- అంటే సవాలక్ష శ్లోకాల వల్ల వచ్చిన గ్రంథభారం కాదు. ఆ సమయంలో మనుషుల భావాల్లో ఉండే క్రూరత్వమూ వాళ్ల చెడుప్రవర్తనా కూడా భారాలై, యుద్ధాల కిందా రోగాల కిందా దారిద్య్రం కిందా పూర్తిగా వినాశనం చేసే భూకంపాల కిందా అటువంటి ఘోరవిపత్తుల కిందా ఫలిస్తాయి. చరిత్రపరంగా మరోలాగ చెబుతారు. భరత పుత్రుల మహాజన్మమే మహాభారతం అని. ఇంతే అయితే వేదార్థం ఎక్కణ్నించి ఊడిపడుతుంది? వ్యాసుడు చెప్పిన నిర్వచన పద్ధతిని కొనసాగిస్తూ మనమూ దాన్ని నిర్వచించుకోడానికి ప్రయత్నం చేయాలి. ‘భా’ అంటే ప్రకాశమూ దీప్తీ కాంతీ అని అర్థం. ఆ మహాప్రకాశంలో రమింపజేసేదే ఈ మహాభారతం. కథను కథలాగే చదివినా విన్నా ప్రకాశంలో మునిగి దాని అసలు ఉద్దేశమేమిటో అర్థం కాదు. కథను రాసే పద్ధతిని పరిశీలిస్తూ ఉంటే ఎంతో కొంత వెలుగు అవుపిస్తుంది. ఈ మహాభారతాన్ని రాయడానికి వేదవ్యాసుడికి దాదాపుగా మూడు సంవత్సరాలు పట్టిందని చెబుతారు. చరిత్రే అయితే అది వట్టి కథే అయితే మూడేళ్లు పట్టవలసిన పనిలేదు. అదీగాక భారతాన్ని వ్యాసుడు గణపతి చేత రాయించాడని ప్రతీతి ఒకటి ఉంది. ఒప్పందం ప్రకారం వ్యాసుడు గణపతి చేతిగంటం ఆగకుండా ఉండేలాగ గడగడా చెబుతూ ఉండాలి. గణపతి కూడా రాసేదాన్ని అర్థం చేసుకోకుండా రాయకూడదు. అందుకోసం గణపతి అంతటి మహానుభావుడిక్కూడా ఠకీమని అర్థంకాని భోగట్టాలు ‘వ్యాసఘట్టాల’నే పేరన కొన్ని మహాభారతంలో ఉన్నాయి. ఈ కారణంగానే మహాభారత రచనకు మూడేళ్లు పట్టిందని చెప్పడం సబబే. ఆ మూడేళ్లూ వ్యాసుడు సర్వదా దాని గురించే ఆలోచిస్తూ ఆ కథలోనే మునిగి ఉంటూ ‘సతతోత్థితుడై’, అంటే ఎప్పుడూ ఆ కథా ఆలోచనలోనే మెలకువగా ఉంటూ దాన్ని పూర్తిచేశాడు. ధర్మేచ, అర్థేచ, కామేచ, మోక్షేచ భరతర్షభ! యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి న తత్ క్వచిత్!! (మహాభారతం, ఆదిపర్వం 62-53) ధర్మమూ అర్థమూ కామమూ మోక్షమూ అనేవి నాలుగు పురుషార్థాలు. ధర్మమంటే సృష్టిని మొత్తమూ ధరించి ఉంచేది. ఆ ధర్మం కోసమే మనం సంపాదించే డబ్బంతా పనికి రావాలి. ఆ ధర్మం కోసమే మనం ఎప్పుడూ కోరుకోవాలి. ఆ ధర్మాన్ని అందుకొందామనే ఇక్కడున్న మాయ నుంచీ మోసం నుంచీ బయటపడాలని ఉబలాటపడుతూ ఉండాలి. ఆ విధంగా నాలుగు సూత్రాలుగా ఉన్నా ఇవన్నీ ఒకే- ధర్మం మాత్రమే. పరమాత్మకు రూపమంటూ ఒకటి ఉంటే అది ధర్మరూపమే. ఈ పురుషార్థాల విషయంలో మహాభారతంలో లేనిది మరెక్కడా అవుపించదు. అంటే, ఇక్కడ ధర్మం విశ్వరూపంలో అవుపిస్తుందన్నమాట. ఇంతదాకా మనకు చెప్పిన కథలూ మనకు చూపించిన సినిమాలూ మహాభారతాన్ని ఒక కథలాగే ఒక చరిత్రలాగే చెబుతూ ఉన్నాయి, చూపిస్తూ ఉన్నాయి. అంటే మనం అర్థం చేసుకోవడంలో ఏదో ఒక వెలితి ఉందన్నమాట. ఆదిపర్వం మొదటి అధ్యాయంలోనే దుర్యోధనుణ్నీ ధర్మరాజునీ వేరువేరు వృక్షాలుగా వర్ణించారు (ఆదిపర్వం 1-110, 111): దుర్యోధనుడు క్రోధమయమైన పెద్ద చెట్టయితే దాని కాండమే కర్ణుడు; దాని కొమ్మలే శకుని; దాన్నిండా ఉన్న పువ్వులూ పండ్లూ దుశ్శాసనుడు; బుద్ధిలేని గుడ్డి ధృతరాష్ట్రుడే దాని మూలం. ధర్మరాజేమో ధర్మమయమైన పెద్దచెట్టు; దాని కాండమే అర్జునుడు; దాని కొమ్మలే భీముడు; దాన్నిండా ఉన్న పువ్వులూ పండ్లూ నకుల సహదేవులు; కృష్ణుడూ వేదమూ బ్రహ్మాన్నెరిగిన బ్రాహ్మణులూ దాని మూలం. కథలోని పాత్రల్ని చెట్టులోని విడివిడి భాగాలుగా చూస్తూ పోతే కథ పూర్తి అర్థాన్ని పట్టుకోలేము. మరైతే,ఈ ఇతిహాసాన్ని ఎలాగ చదవాలి? ఎలాగ చదివి అర్థం చేసుకొంటే ఇది వేదార్థాన్ని మనముందు గుమ్మరిస్తుంది? వ్యాసుడి పద్ధతిలోనే మనం కథలోని పాత్రల్నీ కథలోని వేరువేరు ఘట్టాల్నీ విశ్లేషించి అర్థం చేసుకోవాలి. ఆ ప్రయత్నమే ఈ వ్యాసాల ముఖ్యోద్దేశం. దీనికోసం మహాభారతంలోని ప్రముఖమైన పాత్రల్ని విడబరుచుకొని అర్థం చేసుకొందాం.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాయ్బరేలీలో రాహుల్కు దినేష్ పోటీనివ్వగలరా?
తెలివైన కోతి : శాస్త్రవేత్తలు సైతం ఫిదా
రాజకీయ ఎంట్రీ? జ్యోతిక సమాధానమిదే!
వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి
అనకాపల్లిలో కలకలం.. బూడి ముత్యాలనాయుడు హత్యకు కుట్ర!
కాంగ్రెస్కు షాక్.. ‘ప్లీజ్ పోటీ చేయలేను’
ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్
రోహిత్ శర్మకు వెన్నునొప్పి.. ఆందోళనలో ఫ్యాన్స్!
ఢిల్లీలో కుమారి ఆంటీ తరహా ఎపిసోడ్
సరైన సమయంలో సరైన పుస్తకం 'మూడు దారులు’!
తప్పక చదవండి
- కాంగ్రెస్కు షాక్.. ‘ప్లీజ్ పోటీ చేయలేను’
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- ఆ రాష్ట్రంలో రెండు రోజులు డ్రై డే!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- మీసాలున్నాయని 80 మందిని తొలగించిన కంపెనీ!
- అగ్ని ప్రమాదం.. చిన్నపాటి ఖర్చుతో మరింత భద్రం!
- Trisha Krishnan : త్రిష పుట్టినరోజు స్పెషల్.. ప్రత్యేకమైన ఫోటోలు వైరల్
- స్టార్క్ దెబ్బకు ఇషాన్ బౌల్డ్.. రితిక రియాక్షన్ వైరల్
- అందుకే ఓడిపోయాం.. అయినా సరే: హార్దిక్ పాండ్యా
Advertisement