Nenekkadunna Movie
-
నటీనటులకు భాష అడ్డు కాదు
‘‘తెలుగులో ‘నేనెక్కడున్నా’ సినిమా చేస్తున్నానని మా నాన్నకి (బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి) చెప్పినప్పుడు సంతోషపడ్డారు. ‘భాష రాదని ఆలోచించవద్దు... వంద శాతం నీ బెస్ట్ ఇవ్వు’ అన్నారు. నటీనటులకు భాష అనేది అడ్డు కాదు... కాకూడదని నా అభిప్రాయం’’ అని మిమో చక్రవర్తి తెలిపారు. మిమో చక్రవర్తి, సాషా చెత్రి లీడ్ రోల్స్లో నటించిన చిత్రం ‘నేనెక్కడున్నా’. మాధవ్ కోదాడ దర్శకుడు. కేబీఆర్ సమర్పణలో మారుతి శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ మూవీ ఈ నెల 28న విడుదల కానుంది. ఈ సందర్భంగా మిమో చక్రవర్తి మాట్లాడుతూ–‘‘ఊటీలో మా నాన్నగారికి హోటల్ ఉంది. నేను అక్కడే ఉండటం వల్ల తెలుగు, తమిళ సినిమాలు చూస్తూ పెరిగాను. ఇక మాధవ్ కోదాడగారు ముంబై వచ్చి కథ చెప్పిన వెంటనే ఒప్పుకున్నాను. ఇదొక కంప్లీట్ పాప్కార్న్ ఎంటర్టైనర్. పాటలు, మంచి యాక్షన్ సీక్వెన్సులు, సన్నివేశాలు ఉన్నాయి. తెలుగులో నాకు మంచి లాంచింగ్ మూవీ అవుతుందనుకుంటున్నాను. విలన్ పాత్రలకు నేను పర్ఫెక్ట్ ఫిట్ అని నా ఫీలింగ్. మంచి క్యారెక్టర్లు వస్తే కమెడియన్గా, సపోర్టింగ్ రోల్స్ చేయడానికి కూడా సిద్ధం. నాన్నగారు ప్రస్తుతం ప్రభాస్గారి ‘ఫౌజీ’లో నటిస్తున్నారు. నేను విక్రమ్ భట్ దర్శకత్వంలో ‘హాంటెడ్’కి సీక్వెల్ చేస్తున్నాను. అలాగే నెట్ఫ్లిక్స్ కోసం ‘ఖాకీ’ అనే వెబ్ సిరీస్ సీజన్ 2 చేస్తున్నాను’’ అన్నారు. -
నాన్నగారిలాగే తెలుగులో సినిమా చేయడం హ్యాపీగా ఉంది: మిమో చక్రవర్తి
ప్రముఖ బాలీవుడ్ నటుడు, సీనియర్ హీరో మిథున్ చక్రవర్తి కుమారుడు మిమో చక్రవర్తి(Mimoh Chakraborty), ఎయిర్ టెల్ ఫేం సాషా చెత్రి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘నేనెక్కడున్నా’. కేబీఆర్ సమర్పణలో మారుతి శ్యాం ప్రసాద్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమాతో మాధవ్ కోదాడ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఫిబ్రవరి 28న విడుదల కానుంది. ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక సోమవారం హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా హీరో మిమో చక్రవర్తి మాట్లాడుతూ... ''ఈ ట్రైలర్ అందరికీ నచ్చే ఉంటుంది. అందరూ చాలా గొప్పగా నటించారు. ఈ సినిమాకు మెయిన్ హీరో మాధవ్ గారు. మా నాన్నగారిలా నేను కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో భాగమవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఫిబ్రవరి 28న వస్తున్న ఈ సినిమాను అందరూ థియేటర్లలో చూడాలని కోరుకుంటున్నాను’ అన్నారు.చిత్ర దర్శకుడు మాధవ్ కోదాడ మాట్లాడుతూ... ''మా తల్లిదండ్రులు జన్మ ఇస్తే, నాకు దర్శకుడిగా పునర్జన్మ ఇచ్చింది కేబీఆర్. మహిళా సాధికారత నేపథ్యంలో ఈ సినిమా తీశాం. నాకు తెలిసిన స్ట్రాంగ్ మహిళ మా అమ్మ. ఆడవాళ్లకు స్వేచ్ఛ ఇస్తే ఆకాశమే హద్దు అనేరీతిలో తమ ప్రతిభ చూపిస్తారు. వాళ్ళ గొప్పదనం చాటి చెప్పేలా జర్నలిజం నేపథ్యంలో సినిమా చేశాం. మిమో త్వైకాండోలో బ్లాక్ బెల్ట్ ఉంది. యాక్షన్ సీన్స్ ఇరగదీశారు. సాషా కూడా బాగా చేశారు. తనికెళ్ళ భరణి గారు చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్తో కంటతడి పెట్టించారు. అందరూ సినిమాను చూసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను'' అని చెప్పారు.తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ... ''ఇందులో నటించిన సషా భారతదేశం మొత్తానికి తెలుసు. 4జీ యాడ్తో ఆమె అందరికీ పరిచయమైంది. ఆ యాడ్తో మారుమూల పల్లెటూళ్లలో కూడా ఆమె మంచి పాపులరిటీని సొంతం చేసుకున్న సషా ఇందులో హీరోయిన్గా నటించింది. ఆడపిల్ల పుట్టిందంటే చాలు ఒకప్పుడు చంపేసేవారు. ఆడపిల్ల సబల కాదు అబల అనుకునేవారు. కానీ పెంపకం చక్కగా ఉంటే, ఆడపిల్ల ఏ స్థాయికైనా వెళుతుందనే నేపథ్యంలో ఈ కథని సిద్ధం చేశారని తెలిసింది. ట్రైలర్ కూడా చాలా బాగుంది. హీరో మిమో చక్రవర్తి కూడా వాళ్ల నాన్న మిథున్ చక్రవర్తిలా తెలుగులోనే మొదటి సినిమా చేస్తున్నారు. ఆయనలానే ఈయన కూడా సక్సెస్ అవ్వాలని, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’ అన్నారు. ఈ కార్యక్రమానికి రిటైర్డ్ ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు గంగాధర్, గోపీనాధ్ రెడ్డితో పాటు టాలీవుడ్ నుంచి పలువురు ప్రముఖులు అతిథులుగా హాజరయ్యారు. వీవీ వినాయక్, బ్రహ్మజీ, ప్రేమ్ రక్షిత్ వీడియో బైట్స్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. -
Nenekkadunna: టాలీవుడ్లోకి బాలీవుడ్ సీనియర్ హీరో కొడుకు
బాలీవుడ్ సీనియర్ హీరో మిథున్ చక్రవర్తి కుమారుడు మిమో చక్రవర్తి టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మాధవ్ కోదాడ దర్శకత్వంలో ‘నేనెక్కడున్నా' అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో ఎయిర్ టెల్ ఫేమ్ సశా ఛెత్రి కథానాయిక. కె.బి.ఆర్ సమర్పణలో మారుతి శ్యాం ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు టైటిల్ వెల్లడించడంతో పాటు పోస్టర్, టీజర్ విడుదల చేశారు. అనంతరం సురేశ్ బాబు మాట్లాడుతూ..‘టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది. కథ బాగుంటే కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలకు, ఇటువంటి కొత్త ప్రయత్నాలకు ప్రేక్షకుల ఆదరణ లభిస్తుంది. సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను. దర్శక, నిర్మాతలకు ఆల్ ది బెస్ట్' అని చెప్పారు. ‘జర్నలిజం, రాజకీయం నేపథ్యంలో వస్తున్న థ్రిల్లర్ చిత్రమిది. ఊహించని మలుపులతో సినిమా సాగుతుంది’అని దర్శకుడు మాధవ్ కోదాడ అన్నారు. ‘సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యింది. ప్రస్తుతం సెన్సార్ సన్నాహాల్లో ఉన్నాం. త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం’అని నిర్మాత మారుతి శ్యాం ప్రసాద్ రెడ్డి అన్నారు.